టీటీడీపై మండిపడ్డ జయసుధ
posted on Mar 7, 2014 @ 3:44PM
తిరుమలలో టీటీడీ సిబ్బంది తీరుపై సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ మండిపడ్డారు. తిరుమలలో డిక్లరేషన్ తీసుకోవాలని టీటీడీ సిబ్బంది తనపైన ఒత్తిడి తెచ్చారని, అందుకే డిక్లరేషన్ పైన సంతకం చేశానని అన్నారు. అయితే డిక్లరేషన్ తీసుకోవాలని జయసుధపై ఎలాంటి ఒత్తిడి తెలేదన్న టీటీడీ ఈవో గోపాల్ వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. అసలు తిరుమలలో టీటీడీ ఆఫీసు ఎక్కడ వుందో తనకు తెలియదని, అలాంటిది తాను అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ పై సంతకం ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. నేను తప్ప, మా కుటుంబ సభ్యులంతా హిందువులేనని అన్నారు. అనుమానం రావడానికి తానేమైనా ఉగ్రవాదినా అని జయసుధ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి ఒక రూలు..తమకో రులా అని ఆమె ప్రశ్నించారు. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటామన్న టీటీడీ, ఎందుకు తీసుకోలేదని అడిగారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.