అబద్ధాలకు తెరతీసిన "వేర్పాటు''!

- డా.ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

అబద్దాల నోటికి అరవీసెడు సున్నం కొట్టినా చాలదట! ఊదర ద్వారా ఏ ఉద్యమాలూ నిలవవు; ఊదర వల్ల ఉద్యమాలకు అస్తిత్వం రాదు. ప్రజలకు, దేశానికి, రాష్ట్రాలకు 'అసిత్వం' అనేది సామాజిక, ఆర్థికరంగాలలో పాలనావ్యవస్థలు ప్రజానుకూలమైన, ప్రణాళికాబద్ధమైన, ద్వంద్వప్రమాణాలకు తావులేని పథకాలను ఆచరణలో జయప్రదంగా అమలు జరిపినప్పుడు మాత్రమే స్థిరపడుతుంది. ఆ ప్రగతి ప్రజాతంత్ర విప్లవం ద్వారా మాత్రమే ప్రజాబాహుళ్యం అనుభవంలోకి వస్తుంది. ప్రజలకు సామాజిక, ఆర్థికస్థిరత్వం అప్పుడు మాత్రమే సాధ్యం. అలాంటి స్థిరత్వం ద్వారానే జాతికీ, దేశానికీ, రాష్ట్రాలకూ ఆత్మగౌరవం సిద్ధిస్తుందిగాని పదవీ ప్రయోజనాల కోసం రాజకీయ నిరుద్యోగులు ప్రారంభించే ఊదర ఉద్యమాల వల్ల ఎంతమాత్రం సంప్రాప్తించదు! పరిణామాలకు చెప్పే వక్రభాష్యాలవల్ల, ఆడే అబద్దాలవల్లా ప్రాంతాలకు స్థిరత్వంగానీ, ప్రజలకు ఆత్మగౌరవంగానీ సమకూడదు. ఈ సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని మోతుబరులకూ, చీలికవాదం చాటున, సమైక్యతా వాదం చాటునా దాచుకుంటున్న స్వార్థపరులందరికీ సమంగానే వర్తిస్తుంది.



ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవాలంటే, అటూ యిటూ కూడా కృత్రిమంగా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ పేరుకు మాత్రమే 'మేథావులు'గా చెలామణి కాజూస్తున్న కొందరు కుహనా విద్యాధికులూ పలుకుతున్న అబద్ధాలు! ఈ మోతుబరులు, ఈ విద్యాధికులలో హెచ్సుమంది అటుయిటూ కూడా ప్రాంతాలలోనూ తరతమ భేదాలతో, ఆంధ్రప్రదేశ్ (విశాలాంధ్ర) రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎదిగివచ్చిన నయా (నియోరిచ్) సంపన్న వర్గాలేనని మరచిపోరాదు. వీరిలో ఒక ప్రాంతంలోని మోతుబరులకు దేశానికి స్వాతంత్ర్యం రాక ముందునుంచీ ప్రెసిడెన్సీలో భాగంగా తెలుగుసీమలోని ఒక ప్రాంతం ఉన్నప్పుడే కొంత ఆర్థికస్తోమత సమకూడి ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగువారు వేరై ఆంధ్రప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ సంపన్నవర్గం మరింత బలపడుతూ వచ్చింది. ప్రారిశ్రామికంగానూ, వ్యవసాయకంగానూ. కాని ఈ మోతుబరుల 'బలాన్ని' చూపి ఆంధ్రప్రాంతంలోని నూటికి తొంభైమంది ప్రజాబాహుళ్యం స్థితిగతులన్నీ మెరుగైపోయినట్టు భావించరాదు; జల సమస్యలు ముగింపునకు వచ్చినట్టూ భావించరాదు.

 


అలాగే బ్రిటిష్ వలసపాలకుల అండతో హైదరాబాద్ కేంద్రంగా నిజామాంధ్రలోని తెలుగుప్రజలపైన దారుణమైన నిరంకుశ పాలనను సాగిస్తూ తెలుగుప్రజల్ని తెలుగు పాఠశాలలు పెట్టుకోనివ్వకుండా ఉర్దూను మాత్రమే పాలనా భాషగానూ రుద్ది, స్వభాషా సంస్కృతులకు దూరంచేసి, దొరల, జాగిర్దార్ల, దేశ్ ముఖ్ ల దౌర్జన్యాలను అనుమతించడం ద్వారా నిజాంసర్కార్లు [ఒక్క కుతుబ్ షాహీ మినహా] ప్రజల్ని వెట్టిచాకిరీకి తాకట్టుగా మార్చాయి! ఆ పరిస్థితుల్లో అక్కడ నిజాంకు తాబ్ దార్లుగా మారిన ఏ కొలదిమంది దొరలూ, జాగిర్దార్లూ మాత్రమే సంపన్నులుగా చెలామణీ అయ్యారు. కాని, మెజారిటీ తెలంగాణా తెలుగుప్రజలను నిజాముతోపాటు తెలుగుదొరలూ, తెలుగు జాగిర్దార్లూ, తెలుగు పటేల్, పత్వారీలూ దారుణ దోపిడీ ద్వారా పీల్చుకుతిని పిప్పిచేసి 'నీ బాన్చని దొరా, నీ కాల్మొక్తా' అన్న బానిసవ్యవస్థకు బందీలు చేసి వదిలారు. ఒక్క తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం [ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సాహస నాయకత్వంలో] మాత్రమే ఏకభాషా సంస్కృతులు ఆధారంగా ఉభయ ప్రాంతాలలోని తెలుగువారినందరినీ ఏకోన్ముఖం చేసి విశాలాంధ్ర ఏర్పాటుకు భౌతిక, మానసిక పునాదుల్ని పటిష్టం చేసింది. అయితే అంతకుముందు ఆంధ్రరాష్ట్రావతరణ తర్వాత ''నియోరిచ్'' కోస్తాంధ్రలో ఎలా తలెత్తిందో, ఇటు విశాలాంధ్ర అవతరణ తర్వాత మన తెలంగాణా ప్రాంతంనుంచి కూడా "నయాసంపన్నవర్గం'' తలెత్తింది. అంతకుముందెన్నడూ లేని స్థాయిలో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి విద్యా, వ్యాపారరంగాల నుంచి ఎలా గణనీయమైన సంఖ్యలో "విదేశీ భారతీయులు''గా (ఎన్.ఐ.ఆర్.లు) ఎదుగుతూ వచ్చారా, అలాగే మన తెలంగాణానుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతనే ఎన్.ఐ.ఆర్.ల సంఖ్యా నానాటికీ పెరుగుతూ వచ్చింది. ఈ పరిణామం ప్రధానంగా పరాయిపాలన నుంచి విడివడి, ఉభయప్రాంతాలలోని తెలుగువారంతా 'విశాలాంధ్ర' (ఆంధ్రప్రదేశ్)గా ఏర్పడిన తరువాతనే జరిగిందని మరచిపోరాదు!


 

అయితే అటూ, యిటూ కూడా సామాన్య ప్రజాబాహుళ్యానికి సమష్టిగా దక్కవలసిన రాష్ట్ర సహజవనరులు అందుబాటులోకి వచ్చాయని కలలో కూడా భావించకూడదు! ఈ సహజవనరులపై పెత్తనం కోసం ఉభయప్రాంతాలలోని మోతుబరుల మధ్య పెరుగుతూ వచ్చిన స్ఫర్ధలే, ప్రజాబాహుళ్య ప్రయోజనాలతో సంబంధంలేని వ్యర్థ ఉద్యమాల రూపంలో దఫదఫాలుగా తలెత్తుతూ రాష్ట్ర ప్రజల మూల్గులను పీల్చి వేస్తున్నాయి, ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమయంలో వామపక్షాలు సహితం ప్రజలకు నాయకత్వం వహించి వాస్తవాలను బోధించి సమీకరించడంలో విఫలమవడం ప్రజలపాలిట 'శాపం'గా మారి, మోతుబరులకు, వారి పాలకశక్తులకూ పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ అండదండలు అందించినట్టయింది! ఇందుకు ప్రధాన కారణం - విభేదించే విధానాలు చెప్పుకోదగినవి లేకపోయినా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలుబాటలలో యింకా ప్రయానిస్తూండటమే! ప్రజల్ని సరైన పంథాలో చైతన్యవంతుల్ని చేయడంలో తరచుగా విఫలమావుతూండటంవల్లనే ప్రజాతంత్ర ఐక్యసంఘటిన నిర్మాణంలో కూడా క్రియాశీల పాత్ర వహించలేకపోతున్నారు; ఐక్యప్రజాతంత్ర ఉద్యమాలు నిర్మించుకోడానికి ముందు ఉభయకమ్యూనిస్టు పార్టీలు [సి.పి.ఐ.-సి.పి.ఎం.] ఏకమై తిరిగి ఒక పార్టీగా అవతరించడం అవశ్యం జరగాల్సినపని. తెలంగాణా ఏర్పాటువాదం తలెత్తడానికి, ఎలాంటి శాస్త్రీయలక్ష్య నిర్వచనా లేకుండా కొందరు రాజకీయ నిరుద్యోగులు తలపెట్టిన ఉద్యమానికి కమ్యూనిస్టుపార్టీల ఉదాసీనత, నిర్వ్యాపార స్థితియే కారణం. అందువల్లనే రకరకాల అబద్ధాలకు వేర్పాటు ఉద్యమకారులు గజ్జెకడుతున్నారు; ఉభయప్రాంతాలలోని స్వార్థపర సంపన్నులూ, రాజకీయ నిరుద్యోగులూ భిన్నకోణాల నుంచి తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికైనా సిద్ధమేగాని పరాయి పాలకులనుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న 'విభజించి-పాలించే' సూత్రాన్ని వదులుకోడానికి మాత్రం వదులుకోడానికి సిద్ధంకావటంలేదు!



 

కనుకనే అనేక అబద్ధాలను ప్రచారంలో పెట్టడానికి వీరిలో కొందరు వెరవడం లేదు. ఉదాహరణకు తెలంగాణాలో ఒక మోతుబరి ఇటీవల కాలంలో నెలకొల్పిన ఒక స్థానిక దినపత్రిక - కేంద్రప్రభుత్వం లేదా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం రాష్ట్ర విభజన సమస్యపై యింకా ఎలాంటి అవకాశవాద నిర్ణయానికి సిద్ధం కాకపోయినా, "వీర తెలంగాణా'' బదులు వేరు తెలంగాణాను ప్రమోట్ చేయడానికి, రాణి 'విజయాని'కి వచ్చినట్టుగా రంగుపులిమి "జజ్జనకర జనారే - తెలంగాణా ఖరారే'' అంటూ పతాకశీర్షిక పెట్టేసింది. అలా పెట్టడంలో ఉద్దేశ్యం, దాదాపు 800-900 మంది తెలంగాణా ఎస్.సి., ఎస్.టి., బి.సి. తదితర బడుగుబలహీన వర్గాల బిడ్డల్ని తమ రాజకీయ స్వార్థం కోసం బలిపశువుల్ని చేసి ఆత్మహత్యలవైపు పురిగొల్పిన పాపాన్ని మరోరూపంలో కడిగేసుకోడానికి చేస్తున్న తెలంగాణా ప్రయత్నం తప్ప మరొకటి కాదు. తెలంగాణా ''ఖరారే'' అన్నప్పుడు, ప్రత్యేకరాష్ట్రం ఆచరణలో నిర్ణయాత్మకంగా ఖరారైన తరువాత మాత్రమే వాడవలసిన పదం. అంతేగాని, "ఖరారు'' కాకుండానే వాచా 'విజయోత్సవం' జరపడం కనీవినీ ఎరగని పోకడ! కాని పత్రికాధిపతి ఆత్మ‘విశ్వాసం’తో మాత్రమే ‘ఖరార’యిన ‘విజయం’ ఎలాంటిది? అదే స్థాయి పత్రిక మాటల్లో ‘‘హస్తిన (ఢిల్లీ)లో కసరత్‌ ముమ్మరం’’ ఎలా అంటే? కోర్‌ కమిటీ నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి, అక్కడి నుండి కేంద్రమంత్రివర్గానికి ఆ పిమ్మట రాష్ట్రపతిని నివేదన, ఆదరిమిలా రాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి నిర్ణయం చేయకుండా చర్చకు పరిమితం కావటం, ఆ తరువాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, రాజ్యాంగ సవరణకు మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం కాబట్టి, బిల్లు ‘నామ్‌కేవాస్తే’గా రూపొండం.. ఇలా ఎన్నో ‘సంకేతాల’ట! ఇలా ఊహాగానాలనే తెలంగాణా రాష్ట్రం వచ్చేసిందన్న ‘సంకేతాలు’గా మార్చడానికి జరిగిన ప్రయత్నం! ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తెచ్చి, తెలిసో తెలియకో తెలిసినట్టు నటించడం ద్వారా మరో అబద్ధానికి తెర ఎత్తుతోంది ఆ పత్రిక ఎలా?. ''ఆంధ్రప్రదేశ్‌ విభజన అనివార్యం! తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తథ్యం! వరుస పరిణామాలు ఇస్తున్న విసృష్ట సంకేతాలివి!



 

మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడే సమయంలో ముఖ్యమంత్రిగా వుండి, విభజన ఆనుపానులు తెలిసిన నేత దిగ్విజయ్‌సింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించడం మొదలు... స్వరం మార్చుకున్న కరడుగట్టిన తెలంగాణా వ్యతిరేకులు..!! ఇలా అబద్ధాల బిఠా ఆ పత్రిక వర్ణించింది. అంతగారు, అంతకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన గులామ్‌ నబీ అజాద్‌ స్థానంలో దిగ్విజయ్‌సింగ్‌ ‘‘నియామకమే తొలి అడుగ’’ని మహా ‘విశ్వసం’తో రాసేసింది. కాని రాష్ట్ర పర్యాటనలో ఇటు దిగ్విజయ్‌సింగ్‌గాని, అటు అజాద్‌గాని పలు ప్రకనల మధ్యనే విభజన ‘అనుభవాల’గురించి ఏమి చెప్పాలోమాత్రం ఆ పత్రిక వెల్లడిరచకుండా దాచిపెట్టింటి! బిజెపి`ఎన్‌డిఎ పరివార్‌ కేంద్ర ప్రభుత్వం మాధ్యప్రదేశ్‌ను బలవంతంగా విచ్చిన్నం చేసి ఛత్తీస్‌ఖడ్‌ రాష్ట్రాన్ని ఏర్పరచడం వల్ల తామెన్ని కష్టనష్టాలకు గురయ్యామో దిగ్విజయ్‌సింగ్‌ మన రాష్ట్ర పర్యటనలోనే మనకు గుర్తు చేయాల్సివచ్చింది! ‘యథాతథంగా  సమైక్యరాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించినా అందుకు రాష్ట్రనాయకులంతా కట్టుబడి ఉండాల్సిందే’’నని కూడా ఆయన హెచ్చరించి పోయాడు! అంతేగాదు ‘‘రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైదీ, బాధాకరమైనదీ, ఆ బాధేమిటో నేను స్వయంగా అనుభవించాను. అందువల్ల రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ వ్యవహారం కాదు సుమా! మధ్యప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు విద్యుత్‌ ప్రాజెక్టులన్నీ ఛత్తీస్‌గఢ్‌లో ఉంటే, వాడకందార్లందరూ మధ్య ప్రదేశ్‌లో ఉండిపోయారు...’’ అన్నారు దిగ్విజయ్‌సింగ్‌!



 

అలాగే అజాద్‌ కూడా లడఖ్‌ విభజన వల్ల మూడు జిల్లాలుగా కాంగ్రెస్‌ అన్ని సీట్లు గెలుస్తుందనుకుని విభజించనా కాంగ్రెస్‌ పూర్తిగా వోడిపోయిందని వాపోయాడు! వేర్పాటు వాదులకు అదీ ‘పరగడపై’పోయింది! ఇక పంజాబ్‌ విభజనవల్ల పంజాబ్‌ హర్యానా ప్రజలు ఇరువర్గాలూ ఘోరమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ప్రసిద్ధ పాత్రికేయుడు కులదీప్‌నయ్యర్‌ మాటనూ ఆ పత్రిక మరిచిపోయి అబద్ధాలు అల్లడం విచారకరం! 'వేర్పాటు’వాదం చేసే రాజకీయ నిరుద్యోగుల్లో ఒకరు ఇప్పటిదాకా కేంద్రం ప్రకటన ఎందుకు రాలేదన్న పశ్నకు సమాధానంగా ‘ఎబ్బే‌, రాబోయే 122 రోజుల్లో వస్తుంద’ని చెప్పగా, ‘కాదు, కాదు 145 రోజుల్లోనే (ఇంకా అయిదు నెలలకట, అంటే డిసెంబర్‌నాటికి, అంటే 2014 ఎన్నికలకు మరో ‘గాలం’) ప్రకటన రాబోతోంద’ని మరొకరూ, ఇదీ అదీగారు, రానున్న 215 రోజుల్లోనే అంటే అంటే 2014 ఫిబ్రవరికల్లా (అంటే ఇదీ 2014 ఎన్నికలకు వేసిన గాలమే) ప్రత్యేకరాష్ట్ర ప్రకటన వెలువడుతుందని ఇంకొకరూ ఎవరికితోచిన ‘బుద్ధి’తో వారు ఉబుసుపోని ప్రకటనలు చేస్తూ యువకుల ఆత్మహత్యలకు బాధ్యత నుంచి తప్పించుకునే నానారకాల ‘పారుమాటలూ’చెబుతున్నారు!


 

అయితే ఇదే సందర్భంలో తెలంగాణాను ‘సీమాంధ్రులంతా దోచుకు తింటున్నార’ని బాహాటంగా మొత్తం ప్రజల్ని దోపిడీ దార్లుగా చిత్రించుతూ తెలంగాణా నుంచీ, హైదరాబాద్‌ నుంచీ టోకుగా ‘బంగీ కట్టి, కోస్తాంధ్రకు తోలేస్తామ’ని విషప్రచారాన్ని గత అయిదేళ్లుగా నిర్వహించిన తెలంగాణాలోని ‘బొబ్బిలి’వలసదారు నడమంత్రపు సిరిదారుడైన కె.సి.ఆర్‌, అతనికి అండగా నిలచిన ఆచార్యకోదండరామిరెడ్డి ఇప్పుడు గొంతులు మార్చారు! ఎందుకు? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై వారికి అనుమానం వచ్చే బహుశా, గొంతులు మార్చారు. తమ‘పోరాటం’ తెలంగాణాను దోచుకునే ‘సీమాంధ్ర పెట్టుబడి దారులపైన’నే గాని సీమాంధ్ర ప్రజలపై కాదనీ, ‘‘సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్ర రాజకీయ పెత్తందార్ల పేరిట కృత్రిమ కుట్రల ఉద్యమం’అనీ వీరు గొంతు సవరించుకునే పరిస్థితి ఏర్పడిరది. ఇప్పటికైనా గొంతుకు తెచ్చుకున్న ‘సవరణ’మంచిదేగాని, అసలు ఒక్కటిగా ఉన్న తెలుగు జాతి ఎందుకు విడిపోవాలో వీరు సూటిగా సమాధానం ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు! తెలంగాణా ప్రజల్ని కోస్తాంధ్రుల న్యూనపరుస్తున్నారనీ, తెలంగాణా సాహిత్యాన్ని ‘దూషిస్తూ’న్నారనీ తెలంగాణా  సంస్కుతిని భ్రష్టు పట్టిస్తున్నారనీ తెలంగాణాను దోచుకోవడం ద్వారా కోస్తాంధ్రులు తెలంగాణాను ‘బికారి’గా మార్చారనీ, ‘అభివృద్ధి’ని కుంటుపర్చారనీ - ఇలా గణాంకాలతో, భౌతిక వాస్తవాలతో నిమిత్తంలేని వాదనలు చేస్తూ వచ్చారు.

 

సోదర తెలంగాణా ప్రజల్ని ఇంతకాలం న్యూనపరుస్తూ వచ్చిన ‘ఉద్యమ’నాయకులపై రాజకీయ నిరుద్యోగులే, గతంలోనూ ఇప్పుడూ మంత్రిపదవుల్లో ఉన్న తెలంగాణా నాయకుల్ని ‘దద్దమ్మలు, బలహీనుల’’నీ బహాటంగా ఆడిపోసుకుంటూ వచ్చింది కె.సి.ఆర్‌ ప్రభృతులే, చివరకు కాంగ్రెస్‌కు ఉద్యమాన్ని తాకట్టుపెట్టి, తానుగా ఆ ‘బలహీనుల’ జాబితాలో చేరిందీ కె.సి.ఆర్‌కి తెలంగాణా మిత్రులు కొందరు, తెలంగాణా  రాష్ట్ర ఏర్పాటును అభిలషిస్తున్న మిత్రులూ కొలది రోజుల నాడు ఏ సీమాంధ్ర పత్రికలోనూ కాదు, స్థానిక పెట్టుబడిదారుడైన రాజాం అధిపతిగా ఉన్న ‘నమస్తే తెలంగాణా’లో ప్రచురించిన వ్యాసంలో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత మన తెలంగాణాలో జరిగిన అభివృద్ధి గురించి రాసిన మాటలు సహృదయంతో పరిశీలించండి. సిక్కిం సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న తెలంగాణా మిత్రులు డాక్టర్‌ ఓం ప్రసాద్‌గద్దె ఆ పత్రికలో ‘విభజన.. వ్యతిరేకుల వితండవాదాలు’’ అన్న మకుటం కింద తెలంగాణాలో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి జరిగిన యిలా పేర్కొన్నారు.

 

‘తెలంగాణాలోని మారుమూల పల్లెలు సైతం ప్రభుత్వ పథకాలతో అభివృద్ధిబాటన నడుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నది. అలాగే, తెలంగాణాలో పట్టు సాధించిన నక్సలైట్లను నిర్మూలించేందుకు ప్రభుత్వమూ, పోలీసులూ తీసుకున్న ప్రత్యేక చర్యలతో మావోయిస్టులు ప్రభావం కోల్పోయారు. ఒకప్పుడు నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న తెలంగాణా పల్లెలు ఇప్పుడు అలాగే లేవు. ఇప్పుడు తెలంగాణా గ్రామీణ ప్రాంతం స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పటి జమిందారీ విదానం, దొరల దోపిడీ పీడనలు, భూస్వాముల ఆగడాలు లేవు. కాబట్టి ఇప్పుడు మళ్లీ మావోయిస్టులు తెలంగాణాలో పట్టుసాధిస్తారనడం ఆసమంజసం. (‘నమస్తే తెలంగాణా’’: 20`7`013)!
 


(ఇదిలా ఉండగా, ఈనెల (జూలై) 2వ తేదీన తెలంగాణా సమస్యపై ‘కాంగ్రెస్‌పైన వత్తిడిని పెంచే పేరిట అయిదు వామపక్షాల (సి.పి.ఎం. మినహా) ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర సదస్సు జరుపుతారట. ఈ వామపక్షాలలో ఒకటయిన ‘న్యూఢమోక్రసీ’ (మార్క్సిస్టు... లెనినిస్టు) పార్టీ రాష్ట్ర నాయకుడైన డి.వి.కృష్ణా ఒక ప్రకటన చేస్తూ చెప్పిన మాటలు అందరూ పరిశీలించదగినవిగా ఉన్నాయి.



"రాష్ట్ర విభజన జరిగితే నక్సలైట్ల సమస్య పెరుగుతుందనడం, తెలంగాణా ఏర్పడకుండా ఉంటే నక్సలైట్లు నిజంగానే పెరుగుతారనుకోవడం అనే రెండు వాదనలూ సరైనవికావు. తెలంగాణా ఏర్పడినంత మాత్రాన సమసమాజ వ్యవస్థ నెలకొంటుందని భావించలేము. ఇప్పటిమాదిరిగానే అప్పుడు కూడా ప్రజలు అణచివేతలకు దోపిడీకి గురి అవుతూనే ఉంటారు.'' అయినప్పడు (తెలంగాణా రాష్ట్రం ఏర్పడినాగాని సమసమాజ వ్యవస్థ నెలకొన్నప్పుడు తెలుగు జాతి అనుపమానమైన త్యాగాల ద్వారా సాధించుకున్న ఆంధ్రప్రదేశ్‌ను సమసమాజ వ్యవస్థ ఏర్పడకుండానే బలవంతంగా రాజకీయ నిరుద్యోగుల పాక్షిక పదవీ ప్రయోజనాలకోసం బలిపెట్టవలసిన అవసరందేనికొస్తోంది? విభజన కేవలం ‘విభజన’కోసమా? ‘సమసమాజ వ్యవస్థ’ నెలకొనాల్సిన అవసరం ఒక్క తెలంగాణా ప్రాంతానికే పరిమితమా, లేక యావత్తు తెలుగుజాతి కలలపంటైన యావత్తు విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్‌) ప్రజలకూ, రాష్ట్రానికీ అవసరం లేదా? యావత్తు రాష్ట్రంలోనూ అలాంటి ఉత్తమోత్తమ వ్యవస్థ అవసరాన్ని మనసారా అభిలషించే అభ్యుదయ వాది ఎవడైనా ఒక ప్రాంతం అభ్యుదయాన్ని మాత్రమే కోరుకోవడం సోషలిజం ప్రాధమిక లక్ష్యానికే విరుద్ధం కాదా? సోషలిజం మాట పెరుమాళ్లకెరుక, ఒకనాటి సోషలిస్టు సోవియట్ యూనియన్ రాజ్యాంగరీత్యా విడిపోయే హక్కును దాని సమాఖ్య సభ్యజాతులకు యిచ్చి కూడా సమాఖ్య రూపురేఖలు ఎందుకని చెల్లాచెదరైపోవలసి వచ్చింది?
 


యూనియన్‌ నుంచి విడిపోయిన రిపబ్లిక్కులకు కొన్ని అమెరికా.... పెట్టుబడి పాలనా వ్యవస్థకు ‘జోహామీం’ అనవలసి వస్తోంది? ఆ మాటకొస్తే యూరప్‌లోని కొన్నిదేశాలో కొన్ని రాష్ట్రాలు (ఒకే జాతీయులు) విడిపోయి మళ్లీ కలుసుకోవడానికి దారితీసిన పరిణామాలేమిటి? సహజవనరులు, నీటి పంపిణీ, వాటి నిర్వహణ తాలూకూ తలెత్తిన సమస్యలూ, తలనొప్పులూ ‘వామపక్షు’లకు తెలియవా? నిన్నగాకమొన్న నైయినదీజలాల పంపిణీ ఈజిప్టు దాని ఇరుగు పొరుగుల మధ్య ఎంతటి తీవ్రతితీవ్రమైన ఘర్షణలకు దారి తీశాయో వామపక్షులకు తెలియదా?! ఈ మధ్యనే విడిపోయిన ఐక్యసూడాన్‌ (ఉత్తర ` దక్షణ సూడాకలుగా) రెండుభాగాలూ మళ్లీ ఎందుకు పునరేకీకరణకోసం తహతహలాడుతూ ‘సంప్రతింపుల అధ్యాయాన్ని తెరవవలసి వచ్చింది? ఒకే సైద్ధాంతిక పునాదిమీద ఏర్పడిన, మార్క్సిను భావజాలకుల మధ్య అనైక్యత కూడా ఒకే జాతిప్రజల మధ్య విభజనకు కృత్రిమ పునాదులు లేపుతోంది! ఇప్పటికైనా ‘వామపక్షులు’ తెలుగు ప్రజల, తెలుగు సమాజం పరిపూర్ణ ప్రయోజనాల దృష్ట్యా పునరాలోచన చేసుకుని, రెండు రకాల పరాయి పాలనలవల్ల చెల్లా చెదరై శతాబ్దాల పాటు పరాయి పంచలలో బతుకులాడిస్తున్న తెలుగువారందరినీ ఒక్క గూడికి చేర్చిన తెలంగాణా సాయూధ పోరాట స్ఫూర్తిని మరొక్కసారి పొంది చరితార్ధులు కాగలరని మనసారా కోరుకుందాం!!

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? రేపో మాపో రేవంత్ కెబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ హస్తిన పర్యటకు బయలుదేరనున్నారు. శనివారం (డిసెంబర్ 28) హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు. ఈ భేటీ ప్రధాన అజెండా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణే అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలూ నాయక్ లూ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కేవలం కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ ను కోరనున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మార్పులు, చేర్పులతో కేబినెట్ ను పున్వ్యవస్థీకరించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

జగన్ విపక్ష నేత కావడం కల్ల.. రఘురామకృష్ణం రాజు

తనపై మూడు కేసులున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనదైన శైలిలో ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఆరోపణలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ కేసులకు సంబంధించి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో తన కార్యాలయంలో    మీడియాతో మాట్లాడిన ఆయన తనపై ఆరోపణలు వస్తున్న కేసులో ఎలాంటి ఛార్జిషీటు దాఖలు చేయలేదన్నారు.   తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన..  11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.    తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తుల గురించి తాను మాట్లాడనని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తన కేసుపై తాను పోరాటం చేస్తానని, ఇందులో ఎవరి మద్దతు అవసరం లేదన్నారు.   తాను ఏ తప్పూ చేయలేలదన్న ఆయన  తనకు పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం  జరుగుతోందని ఆరోపించారు.  అలాగే ఏపీ మాజీ సీఎం తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు.  ఆయన తన తీరు మార్చుకోకుండా ఎప్పటికీ కనీసం ప్రతిపక్ష నేత కూడా కాలేరని అన్నారు.జగన్ తన ప్రవర్తన మార్చుకుంటే.. వచ్చే ఎన్నికలలోనైనా ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో గెలుపొంది ప్రతిపక్ష నాయకుడు అవుతారని తాను భావించాననీ, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ అవకాశం లేదనిపిస్తోందన్నా. 2020 నుంచే జగన్ తనపై బురద జల్లుతున్నారనీ, తనను హత్య చేయాలని కూడా చూశారన్న రఘురామకృష్ణం రాజు అయినా తాను భయపడకుండా పోరాడానన్నారు.