భారీగా పట్టుబడ్డ గంజాయి... పిల్లల ఆట వస్తువుల్లో 180 కేజీల గంజాయి సరఫరా
posted on Jan 10, 2020 @ 9:32AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారింది.పిల్లల బొమ్మల మాటున గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు స్మగ్లర్లు. గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని పక్కా సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు తనిఖీలు చేపట్టారు. 16 గంపల్లో పిల్లల బొమ్మల కింద గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురుని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. బూర్గంపాడు నుంచి కరీంనగర్ కు గంజాయి సరఫరా చేస్తున్నట్టు నిర్ధారించారు.ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సు, ప్రైవేటు వాహనాలు, కార్లు ఇతర వాహన టాటా సుమోల ద్వారా సరఫరా చేస్తే చెక్ పోస్ట్ ల ద్వారా పోలీసులకి పట్టుబడుతున్నామని భావించిన అక్రమార్కులు గంజాయి సరఫరా రవాణా చేసే పద్దతిని దారి మళ్ళించారు. చిన్న పిల్లలు ఆడుకునే ఆటవస్తువుల బుట్టలలో బొమ్మలు పెట్టి ఆ బొమ్మల కింద గంజాయిని పెట్టి ప్యాకింగ్ చేసి సరఫారా చేస్తున్నారు. భద్రాచలం నుంచి కరీంనగర్ కు వెళ్తున్న బస్సులలో 8 బుట్టలలో 180 కేజీలకు పైగా గంజాయిని సరఫరా చేస్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు బుట్టలను తనిఖీ చేసి ఆట వస్తువుల బొమ్మలలో పెట్టి గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అధుపులోకి తీసుకున్నారు.