పశ్చిమ బెంగాల్.. మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
posted on Apr 21, 2016 @ 11:15AM
పశ్చిమ బెంగాల్ లో కీలకమైన మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్ర 6 గంటల వరకూ ఈ ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ముర్షీదాబాద్, నదియా, వర్థమాన్, ఉత్తర్ కోల్కతాలోని 62 నియోజకవర్గాల్లో 9 గంటల వరకూ 18.29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. కాగా ఎన్నికల్లో 418 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా. వీరిలో 34 మంది మహిళలు కూడా ఉన్నారు. మరోవైపు ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కేంద్ర సాయుధ దళాలకు చెందిన 75వేల మందిని మోహరించింది. మరో 25వేల మంది రాష్ట్ర పోలీసు సిబ్బంది సైతం విధులు నిర్వహిస్తున్నారు. కాగా 1.37కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.