నిబంధలకు నీళ్ళోదులుతున్న 'తిరుపతి' పార్టీలు?
posted on Jun 9, 2012 @ 2:57PM
పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ పార్టీలు ఎన్నికల కమీషన్ పెట్టిన నిబంధనలకు నీళ్ళోదులుతున్నాయి. డబ్బు తీసుకున్న ఓటరును కూడా జైలుకు పంపిస్తామని ఎన్నికల కమీషన్ హెచ్చరించినా దాన్ని ఓటరు కానీ, అభ్యర్థులు కానీ పరిగణలోకి తీసుకోవటం లేదు. నిన్నటిదాకా నిజాయితీగా ప్రచారంపైనే ఆధారపడిన పార్టీలు నేడు ఓట్లు ఖాయం చేసుకోవాలని ఆతృత పడుతున్నారు. ముందుగా కార్యకర్తలకు డబ్బు పంపిణీ చేసేశారు. వారి ద్వారా బూత్ లు, వార్డులు, వీథుల వారీగా ఓటరుకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసేశారు. తిరుపతి నియోజకవర్గంలో అన్ని ప్రదానపార్తీలు ఇదే తీరులో ప్రచారం సాగిస్తున్నాయి. అయితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నిబంధనలను తుంగలోకి తొక్కటంలో ముందుందని విమర్శలు వ్యాపించాయి. అంతేకాకుండా మిగిలిన పార్టీలు చేసిన సవాల్ కు స్పందించి పోలీసులు ఒక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తనిఖీ చేస్తే పదివేల రూపాయలు పంపిణీ కోసం ఉంచుకున్న డబ్బు బయటపడింది. ఆ కార్యకర్త కె.అనిల్ తనకు పార్టీ నుంచే డబ్బులు వచ్చాయని పోలీసుల ఎదుట అంగీకరించాడు. జిల్లాలో మూడురోజుల పాటు మద్యం డ్రైడేను ప్రకటించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 5గంటల వరకూ డ్రైడే పాటించాలని మద్యం దుకానదారులకు నోటీసులు పంపామని ఎక్సయిజ్ డిసి చంద్రమౌళి అన్నారు. ఇప్పటికే 60 శాతం ఫోటో ఓటరు చీటీలు పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గంలో తొలుత తెలుగుదేశంపార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి బి.ఎస్.ఇన్.ఎల్. ఉద్యోగులను ఓటు అడగటంతో ప్రారంభమైన అపశ్రుతి ఎన్నికల నిబంధలను తుంగలోకి తోక్కెంత వరకూ కొనసాగుతోంది.