తెలంగాణ ముసాయిదా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం!
posted on Feb 10, 2014 @ 10:40AM
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విభజన బిల్లుకు ఆమోద ముద్ర వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర పర్యటనలో వున్న ఆయన వద్దకు కేంద్రం బిల్లు పంపించగా...ఆయన వెంటనే ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. మంగళవారమే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్దం చేసినట్లు సమాచారం. అదే విధంగా బిజెపి దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలోనే రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంటు ఆమోద ముద్ర పడే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్ర విభజన బిల్లుకు శుక్రవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే, దానిని ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది.