Read more!

బాబు ఆదేసిస్తే పరిటాల శ్రీరామ్ పోటి

 

 

 

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటి చేస్తాడని పరిటాల సునీత పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర ఎనిమిదో వర్ధంతి సంధర్బంగా వెంకటాపురంలోని ఆయన సమాధి వద్ద కుటుంబసభ్యులు ఘనంగానివాళులర్పించారు. అటు టీడీపీ జిల్లా కార్యాలయంలో నేతలు పరిటాల రవికి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా పరిటాల రవి సతీమణి ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే 2014 ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెడతానన్నారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీరామ్‌ను కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్ని కేసులో ఇరికించారని సునీత ఆరోపించారు.