భారత్ కు ఊరట.. మార్షల్స్ ఐలాండ్స్ కేసు తిరస్కరణ
posted on Oct 5, 2016 @ 6:07PM
భారత్ కు ఐరాస కోర్టులో ఊరట లభించింది. మార్షల్స్ ఐలాండ్స్ కేసును ఐరాస కోర్టు తోసిపుచ్చింది. 1968 నాటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి భారత్, పాక్, బ్రిటన్ తూట్లు పొడుస్తున్నాయని ఆరోపిస్తూ, దాదాపు 50 వేల మంది మార్షల్స్ ద్వీప వాసులు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారణకు స్వీకరించేందుకు ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసు విచారణ ఐరాస పరిధిలో లేదంటూ భారత్ లేవనెత్తిన అభ్యంతరాల ఆధారంగా, కేసులో ముందుకు సాగలేమని జస్టిస్ రోనీ అబ్రహాం 'హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానాని'కి స్పష్టం చేశారు. ఇక ఇదే కేసులో ప్రతివాదులుగా ఉన్న పాకిస్థాన్, ఇంగ్లండ్ ల విషయంలోనూ న్యాయస్థానం ఎలా వ్యవహరిస్తుందన్నది వేచి చూడాలి. కాగా 1946 నుంచి 1958 మధ్య కాలంలో అమెరికా 67 అణు బాంబులను మార్షల్స్ దీవుల్లో పరీక్షించేందుకు నిర్ణయించి, దీవుల్లోని ప్రజలందరినీ ఇతర ప్రాంతాలకు తరలించింది. 1954లో 'బ్రావో' పేరిట తయారైన హైడ్రోజన్ బాంబును ఇక్కడ పరీక్షించి చూసింది.