అమరావతిలో చంద్రబాబు ఇంటికి శంకు స్థాపన 

ఎపి రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత ఇల్లు శంఖు స్థాపన కార్యక్రమం  బుధవారం (ఏప్రిల్ 9) జరుగనుంది. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వెలగపూడి సచివాలయం సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నిర్మించుకోవడంతో  పలువురు హర్షం వెలిబుచ్చారు. అమరావతిలో చంద్రబాబు నివాసం చేసుకోవడంతో ఈ ప్రాంత అభివృద్ది పనులు వేగవంతమయ్యే అవకాశముందని వారు భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిపై దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు తన స్వంతింటిని పూర్తిగా నిర్లక్యం చేశారు. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి నుంచే పాలన సాగిస్తున్న చంద్రబాబు దేశంలోనే పేరొందిన రాజధాని నిర్మించేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. నిలిచి పోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నారు. అమరావతిని రాజధాని చేయకుండా గత ప్రభుత్వం చేసిన కుట్రలను చంద్రబాబు  ఎప్పటికప్పుడు తిప్పికొట్టారు. చంద్రబాబు నూతన ఇల్లుతో అమరావతికి కొత్త శోభ వస్తుందనడంలో సందేహం లేదు. 

Teluguone gnews banner