అల్పసంతోషంలో 'కర్ణాటక' ప్రియులు!

- ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

 

కర్కాటకం 'బింది'స్తే కాటికముండదంటారు! కాని అదే కర్కాటకం 'వర్షిస్తేన'ట కాడీ, మోకూతడవనే తడవదట! ఈ రెండు సామెతలూ ఎందుకుపుట్టాయోగాని కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి, మరో ప్రత్యామ్నాయ దీటైన రాజకీయపక్షం లేని పరిస్థితులలో నిలువెల్లా అవినీతితో దేశావ్యాప్తితంగా భారీ 'గాయాల'తో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ వూపిరి పోసుకున్నట్టు భావిస్తోంది! కాని 'కర్కాటకం వర్షిస్తే కాంగ్రెస్ పాలనలో కాడీ, మోకూతడవవట! అసెంబ్లీలో మెజారిటీ సీట్లు సాధించుకున్నానన్న 'సంబరం'లో సీట్లసంఖ్యకు (122) దీటుగా ప్రజాబాహుళ్యం నుంచి వోట్ల శాతం లేదన్న సత్యాన్ని మభ్యపరచాలని ఆ పార్టీ విశ్వప్రయత్నం చేస్తోంది. కాని కాంగ్రెస్ కు పోలైన వోట్లు కేవలం 37 శాతం కాగా, మిగతా పెద్దా, చిన్నా చితక పార్టీలన్నింటికీ పోలైన మొత్తం వోట్లు 63 శాతం! వీటిలో చిన్నా, చితకా పార్టీలు పోనూ కాంగ్రెస్ కు ప్రధాన పోటీదారు, నిన్నటిదాకా అధికార పక్షంగా ఉన్న భారతీయ జనతాపార్టీ (బి.జె.పి.) గతంకన్నా 70సీట్లు కోల్పోగా, బిజెపితో సమానస్థాయిలో సీట్లు గెలుచుకున్న జనతాదళ్ (సెక్యూలర్)పార్టీకి ఈసారి అదనంగా 12 సీట్లు గుంజుకోగల్గింది.


అయితే అన్నింటికన్నా ఇక్కడ గమనించవలసిన ప్రధాన విషయం, కర్ణాటక వరకు చాలా కాలంగా బరాబరి పోటీలో ఉంటూ వస్తున్నది [కొన్నాళ్ళపాటు దేవగౌడా పార్టీ తప్ప] సెక్యూలర్ వ్యతిరేకి అయిన "హిందూత్వ'' గ్రూపు బిజెపి మాత్రమే! అందువల్ల 'సెక్యూలరిజం' పేరిట మత రాజకీయం చేయడానికి సంకోచించని కాంగ్రెస్, బిజేపిల మధ్య మాత్రమే కర్ణాటక వరకూ ప్రధానమైన పోటీ గమ్మత్తేమంటే, ఈ రెండు పార్టీలను తోసిరాజనగల బలమైన మూడవ రాజకీయశక్తి ఏదీ ఎదిగి రాకపోవడంవల్ల కర్ణాటక మెజారిటీ ప్రజాబాహుళ్యానికి మరొక విశ్వసనీయమైన శక్తి కన్పించనందున ప్రధాన ఎన్నిక కాంగ్రెస్-బిజేపిల మధ్య పోటీకే పరిమితం కావలసివచ్చింది.

 

ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక అంశంపై కేంద్రీకరించింది - "బిజెపి అవినీతి పాలనను అంతం చేయండి'' అన్న నినాదంపైన!  అదే నినాదాన్ని కర్ణాటక కాంగ్రెస్ లంకించుకుంది. అక్కడ పోటీ వరకూ బిజెపి అవినీతిలో కాంగ్రెస్ అవినీతిని ప్రత్యామ్నాయంలేని దశలో వోటర్లు చూడగాలిగినా వోటర్లకు మరో దిక్కులేని పరిస్థితి. కాగా అసలు విషయం - కర్ణాటకలో తక్కువ శాతం వోట్లతో అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ ఫలితాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోని కొందరు 'చంకలు గుద్దు'కుంటూ అల్పసంతోషం వ్యక్తం చేసి, ఆంధ్రప్రదేశ్ లో కూడా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్సే 'పాగా'వేయగలదని భావిస్తున్నారు. "కర్నాట్టకలో బిజెపి పాలన (సోనియా మాటల్లో)అవినీతిమయం'' కాబట్టి అక్కడ బిజెపి వోడిపోయిందని కాంగ్రెస్ వారు భావించటం "గురువింద గింజ తన నలుపెరగదన్న''ట్టుగా దేశవ్యాపితంగా సంఖ్యాతీతమైన కుంభకోణాలతో తీసుకుంటూ 2014లో ప్రజలనుంచి పరాభవం చవిచూడబోతున్నదన్న స్పష్టమైన సంకేతాలను కూడా ఇక్కడి కాంగ్రెస్ పెద్దలూ, ఢిల్లీలోని అధిష్ఠానవర్గమూ గుర్తించలేకపోతున్నారు. ఇది "మేకపోతు గాంభీర్యమై''నా కావాలి, లేదా సుప్రీంకోర్టు కేంద్రంపైన, సిబీఐపైనా పదే పదే పెడుతున్న మొట్టికాయల పట్ల అంతరంగికంగా పెరిగిపోతున్న 'గుబులు' అయినా కావాలి!

 

కర్ణాటకలో "బిజెపి అవినీతికి నిరసనగా''నే అక్కడి ప్రజలు తీర్పు చెప్పిన పక్షంలో అంతకన్నా వందరెట్లు కాంగ్రెస్ పాలనావ్యవస్థలోని వేళ్ళమీద లెక్కించదగిన ఏ కొలదిమందో తప్ప మిగతా రాజకీయాలు, అధికార యంత్రాంగమూ పేకమోయ్యా (ప్రధానమంత్రిసహా) అవినీతి ఆరోపణలతో తీసుకుంటున్న దశలో కాంగ్రెస్ పార్టీ కూడా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని లేదా ఘోర పరాజయాన్ని తప్పించుకోలేదు; తప్పించుకోగల అర్హతను రోజుకొక తీరులో ఎన్ని కొత్త చిట్కాలు పన్నినా కాంగ్రెస్ కోల్పోతుంది. కర్ణాటక "విజయం''పై కాంగ్రెస్ వర్గాల్లోని అల్పసంతోషం 'స్థాయి' ఎలాంటిదో ఫలితాలు వెలువడిన రోజున (8-05-2013) పి.చిదంబరం కాస్సేపు తన ఆర్థికమంత్రి పదవిని పక్కకు నెట్టుకుని "టీవీ రిపోర్టరు''గా అవతారమెత్తి తనకు ఎదురైనా బిజెపి సీనియర్ నాయకుడు మాజీ ఆర్థికమంత్రి జస్వంత్ సింగ్ నోటిముందు మైక్ పెట్టి కర్ణాటక ఫలితాలపై వ్యాఖ్యానించమని వ్యంగ్యం ప్రదర్శించాడు. అందుకు జస్వంత్ యిచ్చిన సమాధానం : "ప్రజలెప్పుడూ సరైన పాలనకే వోటేస్తారు. సరైన పాలన అందించకపోతే నిన్నూ ఓడించేస్తారు'' అన్నాడు! దాంతో పాలుపోని చిదంబరం "చూడండి, ఆయన (జస్వంత్) ఎంత పెద్దమనిషో'' అని మైక్ ను విలేఖరికిచ్చేశాడు!

 

కాని ఈ 'అల్ప'సంతోషం' లో చిదంబరం తిరిగి తనకే ఎదురుతిరిగే ప్రశ్నలేన్నింటినో మరిచిపోయాడు! "ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా ప్రజలకు సుపరిపాలన అందించాల్సిందే''నని జస్వంత్ నోటనే పునరుక్తి దోషంతో వల్లెవేసినా, ఇంతకూ దేశంలో అవినీతి రహితమైన "సుపరిపాలన''ను కాంగ్రెస్ అందిస్తున్నదో లేదో నీళ్ళునమలకుండా చెప్పగల స్థితిలో చిదంబరం లేడు, ఆయనే కాదు, యు.పి.ఎ. ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న యావత్తు కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో ఎవరూ లేరనే చెప్పాలి. ఎందుకని? ప్రపంచబ్యాంకు "ప్రజావ్యతిరేక సంస్కరణల''ను ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య పెట్టుబడివ్యవస్థకు, విదేశీ బహుళజాతి గుత్తసంస్థల (మల్టీనేషనల్ కంపెనీల)ను, వారితో మిలాఖత్తయి భారత పేద, మధ్యతరగతి వర్గాలను దోచుకుతినే స్థానిక గుత్తేదారులకు ప్రయోజనం చేకూర్చగల ఆర్థికవ్యవస్థను నిర్మూలించడానికే పాలనావ్యవస్థ కంకణం కట్టుకుంది కాబట్టి - కాంగ్రెస్, బిజెపిలు సుపరిపాలన అందించలేవని రుజువైపోయింది. అందుకే అమెరికాలో మాదిరే ఇక్కడ కూడా ప్రజాప్రయోజనాలకు అనుకూలమైన బలమైన మూడవ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిని పెట్టుబడివ్యవస్థ ఎదగానివ్వదు. ఉన్న వామపక్షాల బలహీనతలను కాంగ్రెస్-బిజెపిలు ఇప్పటికే బాగా కాచివడపోశాయి!
 

ఈ పరిణామక్రమంలో భాగంగా దేశ ఆర్థికవ్యవస్థను కనీసం రాజ్యాంగ చటానికి ప్రాణప్రదంగా ఎంచుకున్న "ప్రియాంబుల్'' (ఉద్దీపన) మౌలికలక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్దేదిపోయి ప్రకటిత సోషలిస్టు తరహా సంక్షేమ రాజ్యనిర్మాణానికి కట్టుబడకపోగా, ప్రజాస్వామ్య భావాలకు సహితం ఎసరు తెచ్చిపెడుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పాలన దోహదం చేయటం 'సుపరిపాలన' ఎలా అవుతుందో చిదంబరం చెప్పాలి! దేశ పారిశ్రామిక, వ్యవసాయక, సంక్షేమ, వస్తూత్పత్తి, సహకార రంగాలన్నిటా ప్రపంచబ్యాంకు "సంస్కరణల''ద్వారా విషమ ఫలితాలకు తలుపులు తెరవడాన్ని 'సుపరిపాలన'గా ఎలా చెప్పగలం? చివరికి కార్మిక చట్టాలను, బహుళజాతి గుత్తసంస్థల ప్రయోజనాలకు, వాటిని దేశంలోకి యధేచ్చగా అనుమతించడానికి వీలుగా సవరించడానికి అనుమతిస్తూ న్యాయవ్యవస్థను కూడా అందుకు అనుగుణంగా మరల్చడానికి గజ్జెకట్టిన కాంగ్రెస్-బిజెపి పాలనావ్యవస్థలను 'సుపరిపాలన'గా ఎలా ప్రజాబాహుళ్యం గుర్తించగలదు? 'సంస్కరణల' పేరిట ప్రభుత్వరంగ విస్తరణను కుంచింపజేసి లాభాల వేటకు అర్రులు చాచిన ప్రయివేట్, కార్పోరేట్ రంగాలను అనేక రాయితీలు కల్పించేందుకు కాంగ్రెస్, బిజెపి పాలనావ్యవస్థలను ప్రపంచబ్యాంకు కేవలం 'బ్రోకర్ ల'పాత్ర ("ఫెసిలిటేటర్'')స్థాయికి ఆదేశాపూర్వకంగా దిగజార్చడాన్ని ఎలా 'సుపరిపాలన'గా భావించగలం?

 

రూ 5 1/2లక్షలకోట్ల ప్రజాధనం బడా వర్గాలనుంచి రుణాల రూపేణా రిజర్వుబ్యాంకికి మొండిబకాయిలుగా మారడాన్ని అవి ఎగవేతలుగా మారడాన్ని 'గుడ్లు అప్పగిస్తూ' కూచునే పాలనావ్యవస్థల్ని 'సుపరిపాలన'గా ఎలా పరిగణించగలం? ఆ మాటకొస్తే స్విస్ బ్యాంకుల్లో ఏళ్ళూ వూళ్ళుగా మూలుగుతున్న భారతీయ బడావర్గాల సామూహిక నల్లధనం (బ్లాక్ మనీ)రూ.24 లక్షల కోట్లను ముట్టుకోడానికి సాహసించలేకపోయిన పాలనా వ్యవతలు 'సుపరిపాలన' కింద ఎలా జమకట్టగలం? దేశ సహజసంపదైన రేడియో తరంగాలను తమ హక్కు భుక్తం చేసుకుని దేశీయ టెలికాం వ్యవస్థను ప్రజల వినియోగానికి అందుబాటులో లేని 'మూల్యం' వసూలు చేయడానికి వీలుగా 122 లైసెన్సులను విదేశీ, స్వదేశీ గుత్త సంస్థలకు బదలాయించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ లైసెన్సులను రద్దుచేసే దాకా 'నాలిముచ్చుగా' మౌనముద్ర నటించే పాలనా వ్యవస్థను 'సుపరిపాలన'గా ఎలా నమోదవుతుందో జస్వంత్, చిదంబరంలే సమాధానం చెప్పగలరా?
 

పైన తెల్పిన బకాయిలు, గుప్తధనం సహా దేశంలో సుమారు మరో పదిలక్షల కోట్ల రూపాయల దాకా చెలామణిలో ఉన్న దొంగడబ్బును వెలికి తీయడానికి [పదేళ్ళనాదే రిజర్వుబ్యాంకు ముందు అఫిడవిట్ లో కేంద్రం, దేశంలో చెలామణిలో ఉన్న పోటీ ఆర్థిక వ్యవస్థ విలువ రూ.5 లక్షల కోట్లని వెల్లడించింది] ముందడుగు వేయడంలో విఫలమైన పాలనా వ్యవస్థ 'సుపరిపాలన', ఆదర్శ పరిపాలన ఎలా కాగల్గుతుంది?
 

దేశీయ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో భాగస్వాములు కావలసిన చిన్న చిన్న రిటైల్ వర్తక వ్యాపారసంస్థలను సహితం మింగివేసే వాల్ మార్ట్ లాంటి బడా మల్టీనేషనల్ కంపెనీలకు 'ఎర' చేయడానికి దారులు తెరిచిన పాలనావ్యవస్థను 'సుపరిపాలన' కింద జనం ఎలా పరిగణిస్తారు? చివరికి ఇప్పటికే దేశ పేద, మధ్యతరగతి అసంఖ్యాక ప్రజాబాహుళ్యం మూల్గుల్ని పీల్చడంలో అగ్రస్థాయి కార్పోరేట్ సంస్థలకు ప్రభుత్వం పన్నులు, సబ్సిడీల రూపంలో ఎన్ని రకాలుగానో రాయితీలు కల్పిస్తున్నా చాలవన్నట్టు, మరిన్ని రాయితీల కోసం వత్తిడి చేస్తూ "రాయితీలు అడిగిన మేరకు కల్పించకపొతే విదేశీ గుత్త పెట్టుబడులను రానిచ్చేది లేద''ని విదేశీ కార్పొరేట్లు అవే రాయితీలను 'మాకూ' కల్పించాలని దేశీయ కార్పోరేట్లూ అలిగి, భీష్మించుకుకొని కూర్చుంటే వాటి వైఖరిని దుమ్ముదులిపేది పోయి 'దువ్వి' దగ్గరకు తీస్తున్న పాలనావ్యవస్థ 'సుపరిపాలన' ఎలా అందివ్వగలదు? ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలలోని 23 బ్యాంకులూ, భీమా కంపెనీలూ 'హవాలా' ధనంతో లావాదేవీలు మాదకద్రవ్య వ్యాపారాలు సాగించడానికి వీలు కల్పించిన సంస్కరణలను తలకెత్తుకున్న పాలనావ్యవస్థ ప్రజలకు ఎలాంటి 'సుపరిపాలన'ను అందించగలదో ప్రజలు తెలుసుకోగోరుతున్నారు?!

 

ఇటీవలనే ఒక బడా "ఈక్విటీస్'' సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలోని 54 బడాసంస్థల వద్ద నగదు రూపంలోకి మార్చుకోగల రూ.4,30,000 కోట్ల కిమ్మతుగల క్యాషు, దానికి సమానమైన ద్రవ్య మాధ్యమ పత్రాలు [వీటిని "పేపర్ ఇన్ స్ట్రుమెంట్స్'' అంటారు. వీటిని తేలిగ్గా నగదుగా మార్చుకోవచ్చు] ఉన్నాయని వెల్లడయింది! అంటే, దేశప్రయోజనాలకు వినియోగపడగల ఉత్పత్తి రంగానికి చెందిన ఉత్పాదక కార్యకలాపాలలో పెట్టుబడులుగా పెట్టే బదులు అనుత్పాదక రంగాలకు మరలిపోతోంది. ఇలా మరలి తరలిపోయే పెట్టుబడి దేశ స్థూల జాతీయోత్పత్తుల [జి.డి.పి.] విలువలో 4.3 శాతం ఉందని సాధికార అంచనా! ఈ తరలింపును అడ్డుకోకుండా పేదసాదలపైన, మధ్యతరగతిపైన మోయలేని భారాన్ని మోపి, నియంత్రణ వ్యవస్థలోనూ, అక్కౌంటింగ్, న్యాయవాద వ్యవస్థల్లోనూ విదేశీసంస్థల జోక్యానికి బీజాలు నాటిన పాలనావ్యవస్థ నిర్వాహకుల్ని 'సుపరిపలకులు'గా ఎలా గుర్తించగలమో కర్ణాటక ఫలితంపై 'జబ్బలు' చరుచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు గుండెలమీద చేయి వేసుకుని చెప్పగలగాలి! ఇది దేశవ్యాపిత దృశ్యం! కర్నాటకం, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిఫలించదనుకోవడం భ్రమ!

తిరుమలలో రోజా రాజకీయ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు?

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం. తిరుమల పవిత్రతను కాపాడడానికీ, అలాగే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికీ టీటీడీ ఈ నిబంధనను అమలు చేస్తున్నది. కోట్లాది మంది భక్తులు కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే వారిలో సామాన్యుల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారిలో ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా.. తిరుమల కొండపై అందరూ శ్రీవారి భక్తులుగా మాత్రమే మెలగాలన్న ఉద్దేశంతో తిరుమల గిరిపై రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిషేధం విధించారు.   టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విషయాన్ని  స్పష్టంగా పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది.  తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.  అయితే మాజీ మంత్రి   రోజా ఆ నిబంధనలనూ, ఆంక్షలనూ తోసి రాజని తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు.  జగనన్న మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు దర్శనానంతరం మీడియాతో చెప్పారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై రోజా తన రాజకీయ ఆకాంక్షను మీడియా ముందు వ్యక్తపరచడం నిబంధనల ఉల్లంఘనేననీ, ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటి సారి కాదంటున్నారు. గతంలో అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తొలి రోజులలోనే తిరుమల కొండపై ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని ఇష్టారీతిగా వ్యవహరించినా అడిగేవారు లేరన్న రీతిలో ఆమె తీరు ఉందని అంటున్నారు. టీటీడీ కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

కేసీఆర్ ఆస్త్రసన్యాసమేనా?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రసన్యాసం చేసేశారా? ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాల హాజరు ఇక ముగిసిపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో గళమెత్తేందుకు అధికారాలు అప్పగిస్తూ ఆయన చేపట్టిన నియామకాలను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ నియమించారు. అంతే కాదు.. అసెంబ్లీ, మండలిలో   పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు  సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని  దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.  అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.   సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చలలో పాల్గొంటారు. ఇక శాసనమండలిలో ఎల్. రమణ,  పి. సతీష్ రెడ్డిలను ఉప నేతలుగా నియమించారు. పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. కేటీఆర్ కు ఎటువంటి బాధ్యతలూ అప్పగించకపోవడంపై పార్టీలోనే కాదు, రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపలా, బయటా కూడా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో కేటీఆర్ వైఫల్యాల కారణంగానే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అది పక్కన పెడితే.. కేసీఆర్ ఇక ఈ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు లేవనడానికి ఈ నియామకాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు నియామకం

  అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ని నియమించారు.  విప్ బాధ్యతలు సభలో సభ్యుల హాజరు, అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలను సమీక్షించడం, పార్టీ విధానాలను అమలు చేయడం వంటి కీలక అంశాలను కవర్ చేయనున్నారు. కేసీఆర్ తన అసెంబ్లీ నాయకత్వానికి మద్దతుగా మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు. శాసన పభ సమావేశాల్లో పార్టీ తొలి ప్రతినిధిగా మధుసూదనాచారీని కొనసాగించడం ద్వారా పార్టీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల అమల్లో కీలకంగా మారనుంది.  

తెలంగాణ మునిసి‘పోల్స్’ షెడ్యూల్ ఎప్పుడో తెలుసా?

తెలంగాణలో మునిసిల్  ఎన్నికలకు రేవంత్ సర్కార్ దాదాపుగా ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ఇప్పట్ల కాదని విస్పష్టంగా చెప్పేశారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల తరువాత జడ్పీఎన్నికలు ఉంటాయని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.  పరిషత్ ఎన్నికల కంటే ముందే ముమునిసిపోల్స్ పూర్తి చేయడానికి రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఎన్నికల ఏర్పాట్లను కూడా వేగవంవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే  రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల తయారీ , ప్రచురణకు సంబంధించి  షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్తగా ఖరారు చేసిన వార్డుల ప్రకారం ఓటర్ల జాబితాలను జనవరి పదో తేదీలోపు ఖరారు చేసి ప్రకటించేదిశగా అడుగులు వేస్తున్నది.  పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో  వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ఆధారంగా ఈ విభజన ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ,తుది జాబితా ప్రచురణ జనవరి పదో తేదీకి పూర్తి  కానున్నది.  ముందుగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి, స్థానిక ప్రజల నుంచి సలహాలు, సూచనలు ,అభ్యంతరాలను స్వీకరిచిన తరువాత,  మార్పులు చేర్పులు చేసి నిర్దేశిత   గడువులోగా తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా ప్రదర్శిస్తారు. వార్డుల విభజన , రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా దీనికి సమాంతరంగా సాగుతోంది. ముఖ్యంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా వార్డుల పునర్విభజన చేపట్టి, ఆ తర్వాతే ఓటర్లను ఆయా వార్డులకు కేటాయించనున్నారు. ఇక పాత విధానంలోనే రిజర్వేషన్ల అమలు ఉండనుంది.    

జ‌గ‌న్ కార్య‌క‌ర్త‌ల చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు

రప్పారప్పా అన్న వారిని రఫ్పాడిస్తున్న పోలీసులు వైసీపీ కార్యకర్తల మెడకు రప్పారప్పా కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. ఇష్టారీతిగా రప్పరప్పా అంటూ దౌర్జన్యాలకు పాల్పడతామంటూ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా, రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీలకు మూగజావాలను బలి ఇచ్చి రక్తాభిషేకాలు రెచ్చిపోయిన కార్యకర్తలు, జగన్ అభిమానులు ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు.   ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు  సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు. ఇప్పుడు ఆ విషయంలోనే వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  ఔను ఎక్కడెక్కడ ఎక్క‌డ ర‌ప్పా ర‌ప్పా అంటూ  ఈ జంతు బ‌లులు ఇచ్చారో అక్కడక్కడ అలా రక్తతర్పఫాలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు, కార్యర్తలపై కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ కార‌ణంగా జైళ్ల‌కు పోయి వ‌చ్చిన లీడ‌ర్ల‌ సంఖ్య విప‌రీతంగా ఉంటే ఇప్పుడది కార్యకర్తల వరకూ పాకింది.  అంటే జ‌గ‌న్ ప్రాపకం కోసం కార్యకర్తలు చేసిన అతి వారిని కేసుల్లో ఇరుక్కునేలా చేసింది. అయినా రప్పారప్పా పోస్టర్లను, జంతు బలులను, రక్తాభిషూకాలు, రక్తతర్పణాలను అడ్డుకుని, అందుకు పాల్పడిన వారిని మందలించాల్సింది పోయి, జగన్ వారిని ప్రోత్సహించడం వల్లే పరిస్థితి ఇంత వరకూ వచ్చిందని ఇప్పుడు వైసీపీ క్యాడరే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. జగన్ తన కార్యకర్తలను కూడా క్రిమినల్స్ గానే తీర్చిదిద్దాలన్న భావనలో ఉన్నారు కనుకనే  ఎంతగా రెచ్చిపోతే అంతగా ప్రోత్సాహం అన్నట్లుగా వారిని రెచ్చగొడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జ‌గ‌న్  పై కేసులు ఉన్నాయి.. అయితే ఆయన లీగల్ టీమ్ ను కోట్లు చెల్లించి మరీ పోషిస్తున్నారు. అయితే.. సామాన్య కార్యకర్తకు ఆ వెసులుబాటు ఉండదు. కేసుల్లో ఇరుక్కుంటే పార్టీ నుంచి ఇసుమంతైనా సాయం అందదు. దీంతో వారు జైళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా జగన్  కార్యకర్తలను క్రిమినల్ కార్యకలాపాలవైపు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే..  జ‌గ‌న్ త‌న హయాంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో  కార్యకర్తలను పట్టించుకున్న పానాన పోలేదు. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కోసం ఇంత చేస్తే తమకు జైళ్లు, కేసులూ బహుమతా అంటూ ఫ్రస్ట్రేషన్ కు గురౌతున్న పరిస్థితి.   

అజ్ణాతంలో వల్లభనేని వంశీ .. గాలిస్తున్న పోలీసులు?

చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదంటారు. చేసిన పాపం ఊరికే పోదని కూడా నానుడి. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 204 వరకూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాడు చేసిన తప్పులన్నీ ఇప్పుడు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి. ఒకరు ఇద్దరే అని కాదు గత వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలంతా ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు అరెస్టై జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరి కొందరు అరెస్టై ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యారు. ఇంకా కొందరు అరెస్టు అవుతామన్న భయంతో వణికి పోతున్నారు. కొందరైతే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అలాంటి నేతలలో వల్లభనేని వంశీ ఒకరు.  వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ చేసిన తప్పిదాలకు సంబంధించి పలు కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో నమోదైన అభియోగాలపై ఆయన ఇప్పటికే అరెస్టై.. నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్న వల్ల భనేని వంశీ కొద్ది కాలం కిందట బెయిలుపై విడుదలయ్యారు.  బెయిలుపై విడుదలైనా ఆయన రాజకీయాలకు దూరంగా దాదాపుగా ఏకాంత వాసం అనుభవిస్తున్నట్లుగా మెలుగుతున్నారు.  అయితే తాజాగా ఇప్పుడు ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయినట్లు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.  కొత్తగా తనపై నమోదైన కేసులో అరెస్టు భయంతోనే ఆయన అజ్ణాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సునీల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై తాజాగా కొత్త కేసు నమోదైంది.  జూన్ 2024లో  వంశీ తన అనుచరులతో సునీల్ ను హత్య చేయడానికి కుట్రపన్నారన్నది ఆ కేసు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ వంశీ  హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాల్సిందిగా పోలీసులు వంశీకి నోటీసులు అందించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అరెస్టు భయంతో ఆయన అజ్ణాతంలోకి వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఇప్పటికే వల్లభనేని వంధీ కిడ్నాప్, బెదరింపులు, ఎస్సీఎస్టీ అట్రాసిటీస్, తెలుగుదేశం గన్నవరం కార్యాలపంపై దాడి తదితర కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ కేసులలో అరెస్టై బెయిలపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా కేసులో అరెస్టు భయంతో  వల్లభనేని వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎