తెలంగాణ నోట్ క్యాబినెట్ ముందుకు: దిగ్విజయ్
posted on Oct 3, 2013 @ 2:20PM
తెలంగాణ నోట్ క్యాబినెట్ ముందుకు వెలుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గే అవకాశమే లేదని...తెలంగాణకు కట్టుబడి వున్నామని చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటామని తెలంగాణ,సీమాంధ్ర నేతలు హామీ ఇచ్చారని, అందరిని సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. కేబినెట్ నోట్ కు, ఆంటోనీ కమిటీకి సంబంధం లేదన్నారు. ఈ కమిటీ నివేదిక వచ్చే వరకు కేబినెట్ నోట్ ఆగుతుందని తాము చెప్పలేదన్నారు. విభజన అనంతరం సీమాంద్రలో తలెత్తే సమస్యల్ని పరిష్కరించడానికే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి కమిటీ రాష్ట్రానికి వచ్చే వరకు వేచిచూడాలన్నారు.