"ఇనుపకచ్చడాల్"
మాయాశీలురు చంచలాత్ములను కంపారశూన్యులాత్మైకకా ర్యాయత్తుల్, సమయానుకూల హృదయ వ్యాపార గోపాయనో పాయజ్ఞుల్ మగవారు ... ... ... ... ... ... ... రామరాజ భూషణుడు. (మాయాదారులు, నిలకడలేదు, దయసున్న, స్వార్ధపరులు, సమయానుకూలంగా హృదయం దాచడంలో ఎర్బాక్ కచ్చడం ఉపాయ మెరిగినవారు.)
మానవస్వభావంలో ఎంత పశుత్వం ఉందో ఈ బొమ్మలే చాటుతాయి. మగవాడు స్వార్ధంకోసం ఇలాంటి గౌరవ వినాశకరమయిన యంత్రాలను తయారుచేశాడు. వీటి నిర్మాణంలో తన తెలివితేటలన్నీ కనబరిచాడు. పాతివ్రత్యాన్ని పోషించాననీ, ప్రపంచాన్ని ఉద్ధరించాననీ, ప్రగల్భాలు పలికాడు. తన ప్రయోజకత్వం చూచి తానే మురిసిపోయాడు.
తన తల్లి స్త్రీ అన్నమాట మరిచిపోయాడు. తన అక్క స్త్రీ అన్నమాట విస్మరించాడు; తన స్త్రీకి ఈ కరారా కచ్చడం కచ్చడాలు కట్టి ఆడుజాతి నంతటినీ అవమానపరిచాడు. తన అజ్ఞానాన్ని చాటి చెప్పుకున్నాడు. స్త్రీ తత్వం అంటే ఏమిటో తనకు తెలియదు. అని తన తెలివి తక్కువను కూడా దిక్కులు ప్రతిధ్వనించేటట్టు ప్రకటించాడు. తన మూర్ఖత్వాన్ని శాశ్వతంగా ప్రదర్శించుకున్నాడు.
అసహ్యకరమైన దుర్భావంలో పుట్టింది ఈ కచ్చడం. తూర్పునుండి పడమటికి వ్యాపించింది. పట్టణాలలో ప్రముఖుల తలలు పట్టింది. ఏ పాపమెరుగని ఇల్లాళ్ళను పట్టి వేధించింది. ప్రపంచమంతటా విజయ యాత్ర జరిపింది. అతి ఉద్రేకానికి పోయి కోర్టులెక్కింది; విచారణలకు తీర్పులకు పాల్పడ్డది. ఎంతో ప్రాధాన్యాన్ని సంపాదించింది. కవుల కలాలనుపట్టి గ్రంధాలలో గట్టి నిలకడ ఏర్పరచుకుంది. మ్యూజియములలో నుంచి ఇప్పటికీ ప్రపంచాన్ని మేల్కొలుపుతూ ఉంది. మగవాడు ఎప్పటికయినా ఇలాంటివాడే సుమా అని మరిచిపోనీయకుండా చేస్తుంది. మగవారిని ఆడువారిని ఒక రీతిని హెచ్చరిస్తోంది.
అయిపోయింది
Cover Page
తాపీధర్మారావు గురించి
వేగుచుక్క గ్రంధమాల సంస్థను స్థాపించారు. ఇంటింటి విజ్ఞానమాల స్థాపికులలో ముఖ్యులు. "కొండెగాడు", "జనవాణి" పత్రికలకు పత్రికాధిపతిగా, సంపాదకులుగా వున్నారు. 1940లో "కాగడా" పత్రికను వెలువరించారు. ఆంధ్ర భాషాభివృద్ధికి వీరు చేసిన కృషిని గుర్తించి శ్రీ శృంగేరి పీఠాధిపతులు "ఆంధ్ర విశారద" బిరుదునిచ్చి గౌరవించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా గ్రాంధిక భాషా వాదిగా గణుతికెక్కినా, గిడుగు రామమూర్తిగారి వ్యావహారిక భాషావాదాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేసి గుర్తింపు కలిగించారు. దిన పత్రికలలోనూ, వార పత్రికలలోనూ తొలిసారిగా వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన గౌరవం శ్రీ తాపీ ధర్మారావుగారే దక్కించుకున్నారు. ఆనాడు వారు వేసిన పునాదులమీదనే నేటి పత్రికా రచన ఎంతో ఎత్తున నిలిచివుంది.
వీరి - దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?, పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు - మూఢనమ్మకాల్ని పటాపంచలు చేసి గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంధాలు. వీరి పాతపాళి, కొత్తపాళి, ఆలిండియా అడుక్కుతినేవాళ్ల మహాసభ, సాహిత్య మొర్మరాలు, రాలూ-రప్పలూ, ఇనుప కచ్చడాలు, విజయ విలాసము - హృదయోల్లాస వ్యాఖ్య తెలుగు పాఠకులకు చిరపరిచితాలే.