Read more!

వినాయకుడు సర్వసిద్ధి ప్రధాయకుడు

 

వినాయకుడు సర్వసిద్ధి ప్రధాయకుడు

వినాయకుని పుట్టుక గురించి మనకు తెలిసిన కథ ఒకటి ఉన్నా, మనకు తెలియని కథలు చాలా ఉన్నాయి. అసలు ప్రాచీనంలో  గజముఖుడు లేడు. గజముఖం గురించి గణపతి అష్టోత్తరనామాలలోలేదు. గజముఖుడైన వినాయకుని పుట్టుక శివ పురాణాలలో ఉంది. పార్వతీదేవి పిండిబొమ్మకు ప్రాణం పోయడం, శివుడు తల తీసివేయడం వలన  ఏనుగు తలను అతికించడం జరిగిందని కథ. ఈ కథ భారతదేశం అంతటా ప్రచారం పొందిది. తెలుగు కవి నన్నెచోడుడు కుమార సంభవం కావ్యంలో పార్వతీపరమేశ్వరులు లీలావినోదంగా గజరూపంలో పుట్టినవాడు గజముఖుడు అని చెప్పాడు.

వినాయకుడు  ఆకాశం నుండి పుట్టాడని కథ. దేవకామినులను కూడా తన అందంతో కనువిందుచేయడం వలన శివుడు ఏనుగు తలను, కుండ బొజ్జను పెట్టాడని మరొక కథ.  కార్త్యావీర్యార్జునుని చంపిన తర్వాత పరశురామదేవుడు, పార్వతీపరమేశ్వరుల దర్శనార్థం కైలాసం వచ్చాడు. పార్వతీపరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న ఆ సమయంలో ఆది దంపతులను దర్శించడం కుదరదని గణాధిపతి చెప్పాడు. వారి ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో వినాయకుని దంతం విరిగిపోయింది. నాటి నుండి ఏకదంతుడనే పేరు వచ్చింది.

మూషికాసుర సంహార సమయంలో తన దంతాన్నే ఆయుధంగా ఉపయోగించడంతో, ఏకదంతుడిగా మిగిలాడనీ, దేవీ భాగవతం ఏకదంతం ద్వంద్వా తీత స్థితిని తెలుపుతుందని భావన, ద్వాపరయుగం నాటికి విఘ్నేశ్వరుని ఆరాధన స్థిరపడింది. శ్రీకృష్ణుని దివ్య చరిత్రల శ్యమంతకమణి ఉపాఖ్యానం ఉంది. అవతార పురుషులు కూడా వినాయకుని ప్రార్థించవలసిందే. గణపతి వ్యాస భగవానునికి రాయసకాడైనాడు. చేతిలో పక్షి ఈక రాత పరికరం. విదేశాలలో అటువంటి శిల్పాలున్నాయి. దీనినిబట్టి వినాయకుడు విద్యాదాతగా ప్రసిద్ధుడైనాడు. బ్రహ్మచారి అయిన వినాయకునికి సిద్ధి, బుద్ధి అనే భార్యలు ఉన్నారు. లోకకల్యాణ కారకాలయిన ఆ దివ్య శక్తులు ఆయన ఆధీనంలోనివి అని చెప్పడం జరిగింది.