Read more!

Sambarasura

 

ప్రద్యుమ్నుని ప్రత్యర్థి శంబరాసురుడు

Sambarasura

 

శంబరాసురుడు జటాసురుని కుమారుడు. శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని చేతిలో తన మరణం ఉన్నదని తెలుసుకున్న శంబరాసురుడు ప్రద్యుమ్నుడు పుట్టిన ఎనిమిదవ రోజునే అతనిని అపహరించి నీళ్ళలో పడేస్తాడు. నీళ్ళలో అతడిని ఒక చేప మింగగా, ఆ చేప తిరిగి శంబరాసురుని కుమార్తెకు దొరుకుతుంది. ఆ చేప కడుపులో దొరికిన ప్రద్యుమ్నుని శంబరాసురుని కుమార్తె పెంచి పెద్ద వాడిని చేస్తుండగా, శంబరాసురునికి విషయం తెలిసి, ప్రద్యుమ్నుని హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. ఆ యుద్ధంలో ప్రద్యుమ్నుడే శంబరాసురుడిని హతమారుస్తాడు.