రాజకీయ నాయకులు చచ్చినా నిజం చెప్పరు

 

 

రాజకీయ నాయకులు చచ్చినా నిజం చెప్పరు

రాజకీయ నాయకులు ప్రయాణిస్తున్న బస్సు ఒక అదుపు తప్పి ఒక రైతు పొలంలోకి దూసుకెళ్ళి అతని పంటను నాశనం చేస్తుంది. రైతు కు కోపం వస్తుంది. తన ట్రాక్టర్ నుండి దిగి వెంటనే ఒక గొయ్యి తొవ్వి అందులో రాజకీయనాయకుల్ని పాతేస్తాడు.
కొంత సమయం తర్వాత పోలీసులు వచ్చి బస్సుని చూసి అందులో ప్రయాణించే రాజకీయనాయకులు ఎక్కడ అని అడుగుతారు. రైతు వాళ్ళను గొయ్యి తవ్వి పాతేశాను అని చెప్తాడు.
police: వాళ్ళు చనిపోయారా?
రైతు: అందులో కొందరు తాము చావలేదని చెప్పారు. మీకు తెలుసుకదా రాజకీయనాయకుల సంగతి. వాళ్ళు చచ్చినా నిజం చెప్పరు.