English | Telugu

ఎన్టీఆర్ vs అల్లు అర్జున్.. ఈ సారి ఉత్తమ నటుడు ఎవరు!

Publish Date:Feb 12, 2026

  -రసవత్తరంగా మారిన అవార్డ్స్  -ఎన్టీఆర్, అల్లు అర్జున్ లిస్ట్ లో ఉన్నారు -యాంటీ ఫ్యాన్స్ రెడీ అయ్యిందా! -నిజమైన ఫ్యాన్స్ ఏమంటున్నారు   మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)..నూనూగు మీసాల వయసులోనే సెల్యులాయిడ్ పై సరికొత్త రికార్డులని సృష్టించిన బాక్స్ ఆఫీస్ మొనగాళ్లు. ఆ రికార్డు స్థాయిని పెంచుకోవాలని ఎప్పటికప్పుడు తమని తాము సరికొత్తగా డిజైన్ చేసుకుంటున్న   నిత్య సినీ కృషి వలులు కూడా. అభిమాన ఘనానికి అయితే లెక్కేలేదు. సదరు లెక్క అంతకంత పెరగడమే కానీ తగ్గడం అనేది ఆ ఇద్దరి సినీ డిక్షనరీలో లేదు. రీసెంట్ గా ఈ ఇద్దరు సినీ సర్కిల్స్ ,అభిమానుల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.   ఫిలింఫేర్ అవార్డ్స్.. సౌత్ సినీ పరిశ్రమకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ లో అత్యంత ప్రతిభ కనపరిచే వాళ్ళకి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్. సదరు అవార్డుని అందుకోవాలని సౌత్ సినీ పరిశ్రమకి చెందిన అందరు ఎంతగానో ఆశపడతారు. 70 సంవత్సరాల నుంచి సదరు అవార్డుల కార్యక్రమం జరుగుతుండటమే అందుకు నిదర్శనం. 2026 వ సంవత్సరానికి గాను తెలుగు పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడి కేటగిరిలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ తమ ప్రీవియస్ చిత్రాలు దేవర, పుష్ప పార్ట్ 2 తో పోటీపడుతున్నారు. ఈ ఇద్దరితో పాటు సదరు కేటగిరిలో తెలుగు నుంచే నాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్, తేజ సజ్జ, సిద్దు జొన్నల గడ్డ 2024 లో రిలీజైన తమ చిత్రాల ద్వారా పోటీలో నిలబడ్డారు.  Also read:  యూఫోరియా పై మహేష్ బాబు రివ్యూ.. ధురంధర్ ని మించి అందుకుంటుందా!    కానీ ప్రధాన పోటీ ఎన్టీఆర్,అల్లు అర్జున్ మధ్య ఉండే అవకాశం ఉందనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల ముసుగులో కొంత మంది సినీ విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లో మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని ఫుల్ యాక్టింగ్ తో స్వచ్ఛమైన అభిమానుల మధ్య గొడవలు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్లకి తెలియంది ఏంటంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్  ఆఫ్ ది స్క్రీన్ బావ,బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ విషయం స్వచ్ఛమైన అభిమానులకి తెలుసు  కాబట్టి ఎవరికొచ్చినా హ్యాపీ గా ఫీలవుతారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా సేమ్ మెంటాలిటీ తోనే ఉంటారని తెలిసిందే. ఫిబ్రవరి 21 న అవార్డు వేడుక జరగనుంది.      

Sreeleela sets perfect role model for new generation

Publish Date:Feb 11, 2026

Sreeleela has achieved a rare feat by successfully completing her MBBS, proving that stardom doesn’t have to come at the cost of education. In today’s digital age, where many young girls are increasingly drawn toward the instant fame of Instagram reels and the allure of the glamour world, Sreeleela stands out.  While she climbed the ranks to become one of the most sought-after actresses in the industry, she never treated her medical books as a secondary priority. Her journey sends a powerful message: talent can flourish on screen, but a solid educational foundation provides a different kind of empowerment and security. Balancing late-night shoots with early-morning clinical postings requires a level of discipline that is far more demanding than it looks. By earning her degree, Sreeleela has shown the new generation that while hobbies and creative passions are important, neglecting one's studies for fleeting social media trends is a missed opportunity for long-term growth.  She has effectively bridged the gap between the reel world and the real world, showing that a woman can be a top-tier entertainer and a qualified professional simultaneously. For young girls looking up to her, the takeaway is clear: chase your dreams and capture the spotlight, but never let go of the pen and the books that build your future. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

సినిమా చూడాలంటే బ్రహ్మానందం ఇప్పటికీ వణికిపోతారు.. ఎందుకో తెలుసా?

Publish Date:Jan 31, 2026

(ఫిబ్రవరి 1 బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా..)   - తను చేసిన 1250 సినిమాల్లో బ్రహ్మానందం చూసినవి 20 మాత్రమే - చిరంజీవిని చూస్తే బ్రహ్మానందం భయపడతారు.. ఎందుకంటే? - చిన్నతనంలో బ్రహ్మానందంని తండ్రి ఎందుకు కొట్టేవారు?   నీ ఎంకమ్మా.. తీస్కో.. పండగ చేసుకో.. రకరకాలుగా ఉంది మాస్టారూ.. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయ్.. జఫ్ఫా.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా?.. నా పెర్‌ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎస్.ఎం.ఎస్. చేయండి.. నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి రావుగారు.. ఈ పాపులర్ డైలాగులు వింటే చాలు.. అవి చెప్పి మనల్ని నవ్వించిన కమెడియన్ ఎవరో గుర్తొస్తారు. నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని, తీరికలేని కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది హాస్యనటులు వచ్చారు. తమ నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. పాతతరంలో రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు వంటి హాస్యనటులు కొన్ని దశాబ్దాలు హాస్యనట చక్రవర్తులుగా ఇండస్ట్రీని ఏలారు.    ఆ తర్వాత వచ్చిన బ్రహ్మానందం తనదైన మార్క్ కామెడీతో, డైలాగులతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ ఎంటర్‌టైన్ చేశారు. 1980వ దశకంలో ఇండస్ట్రీకి వచ్చిన బ్రహానందం.. కొన్ని దశాబ్దాలపాటు తన హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఒక దశలో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీగా భావించేవారు. ఒకప్ప్పుడు రాజబాబు, రమాప్రభ కాంబినేషన్‌కి ఈ క్రేజ్ ఉండేది.    నలభై ఏళ్ళ తన సినీ కెరీర్‌లో 1250కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా కనిపించిన బ్రహ్మానందంకి సినిమాలంటే ఎంతో భయమట. అందుకే తను చేసిన వందల సినిమాల్లో కేవలం 20 మాత్రమే చూశారు. సినిమా నటుడై ఉండి, తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందంకి సినిమాలంటే ఎందుకు విరక్తి కలిగింది? సినిమాల విషయంలో అతన్ని భయపెట్టింది ఎవరు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.   1956 ఫిబ్రవరి 1న  గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం, చాగంటివారిపాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో ఒకరుగా జన్మించారు కన్నెగంటి బ్రహ్మానందం. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో టెన్త్ వరకు చదువుకున్నారు. పై చదువులకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రికి సన్నిహితుడైన సున్నం ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇం{ర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్‌లో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. ఆ తర్వాత 9 సంవత్సరాలపాటు అత్తిలిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు బ్రహ్మానందం.    చిన్నతనంలో సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. కానీ, తండ్రి సినిమాలకు పంపేవారు కాదు. సంవత్సరానికి ఒక సినిమా చూస్తే గగనం అన్నట్టుగా ఉండేది.  అయితే తండ్రికి తెలియకుండా సోదరులతో కలిసి సెకండ్ షోలకు వెళ్లేవారు. అలా వెళ్లినప్ప్పుడల్లా తండ్రి వారిని చితకబాదేవారు. తన్నులు తిన్నా సినిమాలు చూడడం మానేవారు కాదు. ఆ తర్వాతి కాలంలో సినిమా చూడాలంటే తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొచ్చేవి.    ఇక సినిమాల్లోకి వచ్చి గ్రేట్ కమెడియన్ అనిపించుకున్న తర్వాత కూడా సినిమాలంటే భయం పోలేదు. సినిమాల విషయంలో తండ్రి అతన్ని శిక్షించిన తీరు అలా ఉండేది. తను చేసే సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని నవ్విస్తున్నప్పటికీ తను మాత్రం సినిమాలకు దూరంగానే ఉంటారు. అందుకే ఆయన చూసిన సినిమాలు చాలా తక్కువ. సినిమా అనగానే ఇప్పటికీ చిన్నతనంలో తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొస్తాయని అంటారు. అలాగే చిరంజీవిని చూసినా బ్రహ్మానందం భయపడతారు. దానికి కారణం.. తను సినిమాల్లోకి రాకముందు చిరంజీవి వంటి స్టార్ హీరోని కలిసినపుడు మాట్లాడేందుకు ఎంత భయపడ్డారో ఇప్ప్పుడు కూడా ఆయన కలిసినపుడు పైకి బాగానే మాట్లాడినా మనసులో మాత్రం వణుకు పుడుతుందంటారు బ్రహ్మానందం.

దేశం కోసం అమ‌రుడైన తెలంగాణ వీరుడిగా సల్మాన్.. సినిమా రిలీజ్ అవుతుందా?

Publish Date:Feb 9, 2026

కొందరు హీరోలు, దర్శకనిర్మాతలు రొటీన్ సినిమాలకు భిన్నంగా తమ సినిమాలు ఉండాలని భావిస్తారు. దాని కోసం విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు వారు ఎంపిక చేసుకున్న కథాంశం వల్ల సినిమా రిలీజ్‌కి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఇప్పటివరకు అలా సెన్సార్‌లో చిక్కుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించి కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని సినిమాలు ఇప్పటికీ రిలీజ్‌కి నోచుకోలేదు. తాజాగా అలాంటి సమస్య సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ సినిమాకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.    2020 జూన్ 15న లడాక్‌లో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కల్నల్ సంతోష్‌బాబు నాయకత్వంలో జరిగిన ఈ పోరాటంలో ఆయన అమరవీరుడయ్యారు. మరణం తర్వాత సంతోష్‌కు పరమవీర చక్ర పురస్కారం లభించింది. ఈ యుద్ధంలో చైనాకు చెందిన సైనికులు కూడా చనిపోయారు. ఈ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన సినిమాయే ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’. కల్నల్ సంతోష్‌బాబు పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటించారు. అపూర్వ లాఖియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ ద్వారా ప్రకటించింది చిత్ర యూనిట్.   ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ చిత్రం రిలీజ్ అవ్వడం అంత సులభం కాదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది. థియేటర్లలో సినిమాను విడుదల చేసుకోవచ్చు. కానీ, ఆ సినిమా వల్ల సమాజానికి, దేశ భద్రతకు నష్టం వాటిల్లుతుందని సెన్సార్ భావిస్తే క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చెయ్యదు. అలాంటి సమయంలో ఆ చిత్ర నిర్మాతలు కోర్టు పరిధికి వెళ్లి క్లియరెన్స్ తెచ్చుకుంటారు. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ విషయానికి వస్తే.. ఇందులో రక్షణ శాఖ కూడా ఇన్‌వాల్వ్ అవనుందని తెలుస్తోంది.    ఇప్పటికే ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ చిత్రంపై చైనాలోని సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తోంది. వాస్తవాలను తారుమారు చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారని తమ నిరసన వ్యక్తం చేస్తోంది. ఇండియాలోని సోషల్ మీడియాలో కూడా సినిమాపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ అవ్వడం అంత ఈజీ కాదు అనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్‌తోపాటు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది.    గతంలో యుద్ధ నేపథ్యం ఉన్న సినిమాలు చాలా వచ్చాయి. మరి ఈ సినిమా ఎందుకంత ప్రత్యేకం అంటే.. గాల్వానా లోయలో జరిగన ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత సైన్యంపై చైనా జవాన్లు మెరుపు దాడికి దిగడంతో భారత సైనికులు ప్రతి దాడికి దిగి వారిపై వీరోచితంగా పోరాడారు. అందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబుతోపాటు 20 మంది భారత సైనికులు చనిపోయారు. ఈ పోరాటంలో చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. గతంలో భారత్, చైనా మధ్య సత్సంబంధాలు లేకపోయినా.. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది. అయినప్పటికీ రక్షణ శాఖ క్లియరెన్స్ ఇస్తేనే ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన’ చిత్రం రిలీజ్‌కి మార్గం సుగమం అవుతుంది. 

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

Publish Date:Feb 12, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది. అవన్నీ నాకు ఇష్టం లేవు.. అయినా చేస్తుందంటే ఏమన్నట్లు అని శకుంతల అంటుంది. అప్పుడే ఒకతను కొంతమంది పిల్లలని తీసుకొని వస్తాడు. రుద్ర గారు మీ వల్ల.. ఇప్పుడు మేం చాలా హ్యాపీగా ఉన్నాం.. భాను ప్రతాప్ గారి పేరు మీద మాకు కావల్సిన సదుపాయం కల్పించారు.. అందుకే ఒకసారి భాను గారి ఫోటో చూద్దామని వచ్చామని అతను అనగానే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. పిల్లలు భాను గురించి, రుద్ర గురించి గొప్పగా మాట్లాడుతుంటే శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్ర సర్.. భాను గురించి ఎంత బాధపడుతున్నాడో తెలియజేయడానికి వాళ్ళని రప్పించానని గంగ అంటుంది. ఆ పిల్లలు భాను ఫోటో దగ్గరికి వెళ్లి మొక్కుకొని వెళ్తారు. వాళ్ళకి రుద్ర ఒక చెక్ ఇచ్చి పంపిస్తాడు. రుద్ర చేసిన పనికి శకుంతల హ్యాపీ ఫీల్ అయి తన దగ్గరికి వచ్చి తన తలపై చెయ్ వేస్తుంది. ఆ తర్వాత చూసావా బ్రో శకుంతల అత్తయ్య రుద్ర బావకి పాజిటివ్ అయిందని వీరుతో ఇషిక అంటుంది. గంగ ఇదంతా ఆస్తి కోసం అనుకున్నాను కానీ కాదు గంగకి రుద్ర అంటే ఇష్టం. రుద్రకి కూడా గంగ అంటే ఇష్టం మొదలైతే మనం అనుకున్నది జరగదని ఇషికతో వీరు అంటాడు. మరొకవైపు గంగకి రుద్ర థాంక్స్ చెప్తాడు. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. రాబోయే బాక్సింగ్ కి మనం ఇద్దరం కలిసి ఒకరిని పోటీకి పంపించాలి అనుకున్నాం కదా అని పారు అంటుంది. అవును గంగ నువ్వు పోటీ చెయ్ అని రుద్ర అనగానే పారు షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మెగా ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ మారుతి!

Publish Date:Feb 11, 2026

  డైరెక్టర్ మారుతికి హీరో దొరికేశాడా? మారుతితో సినిమాకి సై అంటున్న మెగా హీరో ఎవరు?   'ఈ రోజుల్లో', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' వంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ మారుతి(Maruthi). అలాంటి మారుతికి 'ది రాజా సాబ్'(The Raja Saab) రూపంలో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశమొచ్చింది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రాజాసాబ్ దారుణంగా నిరాశపరిచింది. దీంతో మారుతి నెక్స్ట్ మూవీ ఏ హీరోతో ఉంటుందనే ఆసక్తి నెలకొంది.   'ది రాజా సాబ్' హిట్ అయ్యుంటే.. ప్రభాస్ బాటలోనే పయనించి వేరే స్టార్లు కూడా మారుతికి అవకాశం ఇచ్చి ఉండేవారేమో. కానీ రిజల్ట్ తేడా కొట్టడంతో మళ్ళీ మారుతి మీడియం రేంజ్ సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే యంగ్ హీరోలకు సరిపోయేలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఈ కథను మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)ను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నట్లు తెలుస్తోంది. సాయి తేజ్ సైతం మారుతితో సినిమా చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.   సాయి ధరమ్ తేజ్, మారుతి కాంబినేషన్ లో గతంలో 'ప్రతిరోజూ పండగే' వంటి హిట్ ఫిల్మ్ వచ్చింది. మరోసారి అలాంటి ఎంటర్టైనర్ తో మంచి హిట్ కొట్టి సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని మారుతి చూస్తున్నాడట.   ప్రస్తుతం సాయి తేజ్ 'సంబరాల ఏటిగట్టు' అనే పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. దీని తర్వాత మారుతి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.   Also Read: 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాకి A సర్టిఫికెట్.. ఎందుకో తెలుసా?    

Does Allu Arjun put forth unrealistic demands?

Publish Date:Feb 10, 2026

Allu Arjun has become one of the biggest stars of Indian Cinema, with Pushpa 2. Now, he is facing allegations of putting forth unrealistic demands in front of brands whenver he goes to shoot. A brand strategist Kaveri, in a podcast, stated that she met Allu Arjun for an endorsement and his team put forth 42 do's and dont's.  According to her, Allu Arjun has a team of managers with manager upon another manager as an hierarchy. Also, she stated that people should not look directly into his eyes, should not shake his hands, should not look directly talk to him. And she stated that he had a huge amount of entourage and they are all very strict.  As the video has gone viral, Allu Arjun fans started picking up other parts trying to disprove what Kaveri stated. Many started talking about encounters with the star and his grounded, down-to-earth behavior. While stars do carry a team and many people to manage their personal and professional schedules.  We cannot determine if all of these rules are real or not, but there will be preferences and personal level points that actors like to put forth. While these demands do seem unrealistic, Allu Arjun got a name in beginning of his career as easy to approach actor who is ready for good scripts.  Now, if these stories about his demands are true, it looks like star status did change him. If not, or if there is any sort of over protective nature shown by team members of Allu Arjun, then the actor should work towards changing that perception. In any case, currently, he is busy with Atlee's project AA22*A6.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Om Shanti Shanti Shantihi

Publish Date:Dec 31, 1969

Nari Nari Naduma Murari

Publish Date:Dec 31, 1969

Anaganaga Oka Raju

Publish Date:Dec 31, 1969