English | Telugu

కొత్తింట్లోకి ఉదయభాను..పిల్లల స్కూల్ కి దగ్గరలోకి షిఫ్ట్

ఉదయభాను ఒకప్పటి టాప్ యాంకర్స్ లో ఒకరు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే బుల్లితెరను ఏలిన యాంకర్స్ లో ఉదయభాను చాలా స్పెషల్. ఉదయభాను యాంకరింగ్ చేసిన షోస్  ‘సాహసం చేయరా డింభకా’, ఒన్స్ మోర్ ప్లీజ్, జాణవులే నెరజాణవులే అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. బుల్లితెర శ్రీదేవి అని ఆడియన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకుని బుల్లితెరకి దూరమయ్యింది. మ్యారేజ్ లైఫ్ లో సెటిల్ ఐపోయింది. ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చి ఇంటి పనుల్లో బిజీ ఐపోయింది. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుండడంతో టీవీ షోస్ లో మళ్ళీ కనిపించడం స్టార్ట్ చేసింది ఉదయభాను. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే పేరు సంపాదించుకోవడానికి ట్రై చేస్తోంది. ప్రెజంట్ ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది అందులోఇంటరెస్టింగ్  వీడియోస్ ని అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా తన హోమ్ టూర్ వీడియోని పోస్ట్ చేసింది. ఇంటి పనులు ఇంకా పూర్తి కాకపోయేసరికి సింపుల్ గా  భర్త పిల్లలతో కలిసి గృహప్రవేశం చేసేసింది  ఉదయభాను.

మొదటిసారి ఆపరేషన్ చేస్తోన్న కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -131లో.. కృష్ణ, మురారి ఇద్దరు కలిసి కిందకి వస్తుంటే కృష్ణ కాలుజారి పడిపోతుండగా మురారి పట్టుకుంటాడు. అదంతా చూస్తున్న ముకుంద తనే కృష్ణని నెట్టివేసినట్లు ఉహించుకొని.. నేనేంటి ఇంత గోరంగా ఆలోచిస్తున్నాను. అయినా కృష్ణ గురించి నాకేంటి.. నాకు కావాల్సింది మురారి అని ముకుంద అనుకుంటుంది. కిందకి వచ్చిన మురారితో.. మనం బయటకు వెళ్ళాలని ముకుంద అంటుంది. పక్కనే ఉన్న కృష్ణ.. బయటకు ఎందుకుని అనగానే.. పెద్దత్తయ్య వెళ్ళమని చెప్పారని ముకుంద అంటుంది. అవునా పెద్ద అత్తయ్య చెప్తే వెళ్ళండని కృష్ణ అంటుంది. ముకుంద, మురారి ఇద్దరు వెళ్ళిపోగానే.. నేనేంటి పర్మినెంట్ పెళ్ళాన్ని అయినట్లు బిహేవ్ చేస్తున్నానని కృష్ణ అనుకుంటుంది... 

రాజ్ కి మర్దన చేస్తోన్న కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ‌ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-70లో.. కనకం ఇంటికి సేట్ జీ వస్తాడు. స్వప్న పెళ్ళి కోసం సేట్ జీ దగ్గర కనకం వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు‌ తీసుకుంటుంది. ఆ డబ్బుల తాలూకా వడ్డీ తీసుకోడానికి సేట్ జీ రాగా.. సేట్ జీని ఎవరికంటా పడకుండా కనకం పక్కకి తీసుకుని వెళ్ళి సేట్ జీ తో వడ్డీ కట్టేస్తానని మాట్లాడి పంపించేస్తుంది. అలా అతడిని పంపించేముందు కృష్ణమూర్తి చూస్తాడు. ఏంటి కనకం అల్లుడు వచ్చాడని మళ్ళీ అప్పు చేస్తున్నావా అని అడుగగా.. అదేం లేదండీ.. అల్లుడు గారిని చూడటానికి వచ్చాడని చెప్తుంది కనకం.

గుండెలకు హత్తుకున్న జగతి ప్రేమ.. తన బాధని చెప్పుకున్న రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -737 లో.. రిషి జరిగిందంతా మహేంద్ర, ఫణీంద్రలకి చెప్తాడు. ఇప్పటికైనా వాళ్ళపై యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారని రిషితో ఫణీంద్ర అంటాడు. "వాళ్ళని వదిలి పెట్టొద్దు డాడ్.. ఒక పత్రికా ప్రకటన ఇద్దాం... మళ్ళీ కాలేజీ జోలికి రావొద్దు.. పోలీస్ వాళ్ళ సహాయంతో మిమ్మల్ని పట్టుకుంటాం. అప్పుడు మీ కాలేజీ పరువు పోతుంది. ఒకవేళ మీరు ఎవరో తెలిస్తే సరైన గుణపాఠం చెబుదామంటూ ఒక నోట్ వేయించి అన్ని పేపర్స్ లో వచ్చేలా చేద్దాం" అని రిషి అంటాడు. మంచి ఆలోచన రిషి అని ఫణీంద్ర అంటాడు.

ఆకట్టుకుంటున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ లేటెస్ట్ ప్రోమో!

స్టార్ మా టీవీలో ప్రతీ ఆదివారం ప్రసారమవుతున్న సరికొత్త షో.. 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'. ఈ షోలో సీరియల్ యాక్టర్స్, మూవీ ఆర్టిస్ట్స్, కామెడీయన్స్ ని ఇలా ఫేమస్ సెలబ్రిటీలను అందరిని తీసుకొస్తూ వారితో సరదాగా గేమ్స్ ఆడిస్తూ  ప్రేక్షకులను వినోదాన్ని పంచుతుంది. ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. ఫైమా, ముక్కు అవినాష్, పటాస్ హరి వచ్చిన గెస్ట్ లతో సరదాగా కాసేపు ఆడుకుంటూ ఈ షోని మరింత వినోదభరితం చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ షోకి సంబంధించిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రోమోని చూస్తుంటే ప్రతీవారం లాగే ఈ వారం కూడా స్పెషల్ గెస్ట్ లతో, సరికొత్త జోడీలతో ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

నందు, గౌతమ్‌ల పెళ్ళిళ్ళు.. మురారికి మొదలైన టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి  ఎపిసోడ్ -129 లో.. మురారి తన గదిలో ఆలోచిస్తుంటాడు. "ఓ వైపు నందు పెళ్లి.. మరోవైపు గౌతమ్ పెళ్లి చేస్తానని కృష్ణకి మాట ఇచ్చాను. ఇద్దరిది ఆదివారమే.. నాకు పెద్ద పరీక్షలాగా అనిపిస్తుంది" అని మురారి అనుకుంటాడు. "పెద్దమ్మని నందు పెళ్లి ఏ టైం కి ఫిక్స్ చేసారో అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ మార్నింగ్ నందు పెళ్లి అయితే గౌతమ్ ది సాయంత్రం చెయ్యొచ్చు. ఒకవేళ నందుది సాయంత్రం అయితే గౌతమ్ ది మార్నింగ్ చెయ్యొచ్చు" అని భవాని దగ్గరికి వెళ్తుండగా కృష్ణ వస్తుంది. అనుకోకుండా మురారి కి కృష్ణ తగిలి కింద పడిపోతుంది. కింద పడ్డ కృష్ణ ని ఏమైందని అడుగగా.. దయ్యం పట్టిన దానిలాగా యాక్టింగ్ చేస్తుంది కృష్ణ. తను యాక్టింగ్ చేస్తుందని గుర్తించి‌న మురారి సరే అని ఆటపట్టిస్తాడు.

జానపద పాటలకి కేరాఫ్ గా కనకవ్వ.. అరవై దాటాక వెలుగులోకి!

జీ తెలుగు మహిళల కోసం నిర్వహిస్తున్న షో 'సూపర్ క్వీన్'. ఈ షో మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకొని.. తాజాగా సీజన్-2 ని స్టార్ట్ చేసింది. దీనికి ప్రదీప్ యాంకర్ గా చేస్తుండగా, గెస్ట్ గా టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ వచ్చింది. ఈ సీజన్ పదిమంది కంటెస్టెంట్స్ తో గ్రాండ్ గా మొదలైంది. ఈ కంటెస్టెంట్స్ లలో కొందరు యాక్టింగ్, కొందరు సింగింగ్, మరికొందరు కామెడీకి సంబంధించిన వాళ్ళు.. ఇలా ఎక్కడెక్కడో ఉన్న వీర మహిళలని, ఇన్సిపిరేషన్ గా నిలిచిన మహిళలని తీసుకొచ్చి.. వారు వారి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, నష్టాలను అన్నింటిని ఈ షో వెలుగులోకి తెస్తుండంటంతో అత్యధిక వీక్షకాధరణ పొందుతోంది

వసుధార ఒంటరి పోరాటం... జగతి ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -734 లో.. వసుధార ఎక్కడుందో వెతుక్కుంటూ రిషి వెళ్తాడు. వసు లొకేషన్ షేర్ చెయ్యను.. మీరే గెస్ చేసి రండని అంటుంది. దాంతో రిషి ఆలోచనలో పడతాడు. వసు ఎక్కడ ఉంటుందో నాకు తెలుసని వెళ్తాడు. వసు బస్తీ పిల్లలతో గోళీలు ఆడుకుంటూ ఉండగా రిషి చూసి తన దగ్గరికి వెళ్తాడు. నేను సాయం చేయనా అంటూ రిషి అనగానే.. వసుధార అక్కడ రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అక్కడున్న పిల్లలకు  బైబై చెప్పి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. సర్ నా ఫోన్ లో జీపీఎస్  ట్రాకర్ పెట్టారా అని వసుధార అనగానే.. లేదు నీ హార్ట్ బీట్ ఫ్రీక్వెన్సీని బట్టి నా హార్ట్ ఫాలో అయిందని రిషి అంటాడు.