English | Telugu

నీ అందం మా మతి పోగొడుతోంది అంటూ డాన్స్ చేసిన బాలయ్య

ఇండియన్ ఐడల్ సీజన్ 2  చాలా గ్రాండ్ ఇంకెంతో కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది.   బాలకృష్ణ స్టైలిష్ లుక్ లో సాలిడ్ గా ఎంట్రీ  ఇచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒక్కో సింగర్ కంటెస్టెంట్ ని తనదైన స్టయిల్లో పాట పాడి మరీ వాళ్ళను మెస్మోరైజ్ చేసి వాళ్ళను స్టేజి మీద ఆహ్వానిస్తున్నారు. ఇక ఇప్పుడు శృతి వంతు వచ్చింది. న్యూ జెర్సీలో పుట్టిన పిల్ల...తన రూటే సెపరేటు మళ్ళా..శృతి ఓ శృతి..నీ అందం పోగొట్టే మా మతి.." అంటూ ఆమెను బాలయ్య స్టేజి మీదకు పిలిచేసరికి ఆమె కూడా మంచి ఎనెర్జీతో రెడ్ కలర్ డ్రెస్ లో డాన్స్ చేస్తూ వచ్చేసింది. "హాయి హాయి హాయే హాయి" అనే సాంగ్ ని చాలా స్టైలిష్ గా మంచి ఎనెర్జీతో  పాడి వినిపించింది.

కృష్ణ ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు శిక్ష వేసిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-105 లో.. కృష్ణ కోసం మురారి తీసుకొచ్చిన చీరని ముకుంద తనకి తెలియకుండా తీసుకుంటుంది. కాసేపటి తర్వాత ఆ చీర‌ని ముకుంద కట్టుకొని.. మురారి ముందుకి వస్తుంది. అప్పుడు మురారి ఆ చీరను చూసి షాక్ అవుతాడు. "ఏంటి మురారి ఈ రోజు నీ బర్త్ డే కాదు, నా బర్త్ డే కాదు.. ఎందుకు మరి ఈ రోజు నాకు చీర తీసుకొచ్చావ్.  నీ నుండి నేను ఈ ప్రేమనే కోరుకున్నానని ముకుంద అంటుంది. ఇప్పుడు ఈ చీర ముకుంద కోసం కాదు కృష్ణ కోసం అంటే లేనిపోని గొడవ అవుతుందని మురారి తన మనసులో అనుకొని సైలెంట్ గా ఉంటాడు. ఇంతలో మురారిని భవానీ పిలవడంతో మురారి తన దగ్గరికి వెళ్తాడు.

శ్రద్దాను లవ్ చేస్తున్నట్లు చెప్పిన లిఖిత్..మందు గ్లాసుతో పండు

ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం ఉగాది పండగ రోజు ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇందులో లిఖిత్ అనే కుర్రాడు "జలజలపాతం నువ్వు" సాంగ్ కి  బాగా డాన్స్ చేసాడు. దానికి శేఖర్ మాస్టర్ ఫిదా ఐపోయి "లిఖిత ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేసావా" అని అడిగేసరికి "శ్రద్దా మేడంని లవ్ చేశా అని చెప్పాడు". నేను సముద్రాన్ని చూద్దామనుకుంటే మీరు సునామీనే చూపించారు" అని చెప్పింది శ్రద్దా. "టీం బి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి టీం ఏ వాళ్ళు  బాగా చేయాలనీ కోరుకుంటున్నా" అని పండు అనేసరికి "శోభితా ఏమిటిది..ఏ టీం వాళ్ళను అంటున్నాడు" అని శేఖర్ మాస్టర్ అనడంతో  శోభిత ఫుల్ సీరియస్ లుక్ ఇచ్చింది పండు వైపు.

కళ్ళు తిరిగిపడిపోయిన కావ్య.. రాక్షసత్వంగా బిహేవ్ చేసిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-44 లో.. కావ్యని భోజనానికి తీసుకొని వస్తుంది రాజ్యలక్ష్మి . కావ్యని చూసిన అపర్ణ.. శాంత నువ్వు రాజ్ కి భోజనం వడ్డించమని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలాగే కావ్య వైపు రాజ్ కోపంగా చూస్తుంటాడు. కూర్చోండి వదిన అని కళ్యాణ్ అనగానే.. నాకు ఇక్కడ కూర్చుని భోజనం చెయ్యాలో? వెళ్ళిపోవాలో? అర్థం కావట్లేదని కావ్య అంటుంది. నాక్కూడా అర్థం కావట్లేదని చెప్పి రాజ్ తన ప్లేట్ లో చెయ్యి కడిగేసి వెళ్ళిపోతాడు. ప్లేట్ లో రాజ్ వదిలేసిన అన్నం తిని వెళ్ళు.. మీరు అలాంటి భోజనం పండగలకి వండుకుంటారు కదా అని కావ్యని రేఖ అంటుంది. "అవును మేం పండగలకి వండుకొని కడుపునిండా తింటాం.. అయినా రాజ్ కి నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నాననే కోపం ఉంది. మరి నీకు నాకు ఏం గొడవలు లేదు కదా.. నేను అంటే నీకు ఎందుకంత కోపమని కావ్య అంటుంది.