English | Telugu

నందు పెళ్ళి దగ్గరుండి జరిపిస్తానని మాట ఇచ్చిన మురారి! 

స్టార్ మా టీవీలో  ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -125 లో.. నందుని పెళ్ళిచేసుకోవడానికి భవాని ఇంటికి వచ్చిన అబ్బాయితో మురారి పక్కకి తీసుకెళ్ళి  మాట్లాడుతాడు. ఈ పెళ్లి అంటే మీకు ఇష్టమేనా? ఎవరైనా బలవంతం చేస్తున్నారా? అని మురారి అతడిని అడుగుతాడు. నాకు ఇష్టమే.. ఎవరు నన్ను బలవంతం చెయ్యట్లేదు.. పైగా మీ ఇంటితో సంబంధం కుదుర్చుకోవడం మా వాళ్లకి ఇష్టమని ఆ అబ్బాయి చెప్తాడు. సరే మీరు నందు గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకుంటున్నారంటే దానికి మీకు థాంక్యూ అని చెప్తాడు మురారి. ఇక ఇంతలోనే ఈశ్వర్ వచ్చి మీరు మాట్లాడుకోవడం అయిపోతే కిందకి వెళ్ళండని అబ్బాయిని పంపిస్తాడు. అక్కడికి భవాని, ప్రసాద్ లు వస్తారు. మనం ఎలాగైనా అమెరికా పంపిస్తున్నాం కదా.. అదే పెళ్లి చేసి పంపిద్దామని భవాని అంటుంది. ఈ విషయం కృష్ణకి తెలియొద్దు.. తెలిస్తే నందుకి చెప్తుంది.. దాంతో నందు మారం చేస్తుంది. అందుకే కృష్ణకి తెలియనివ్వద్దు మురారి అని భవాని అంటుంది. ఇంట్లో పెళ్ళి జరిగితే తెలియకుండా ఎలా ఉంటుందని మురారి అంటాడు. ఇంతలో ముకుంద అక్కడికి వచ్చి.. ఆ విషయం నేను చూసుకుంటానని అంటుంది. నందు పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని మాట ఇవ్వమని భవాని అనగానే.. భవాని చేతిలో చెయ్యి వేసి మరీ మాట ఇస్తాడు మురారి

వసుధార మెడలో తాళి లేకపోవడంతో రిషి ఫుల్ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -731 లో.. జగతి జయచంద్రతో.. రిషి, వసుధారల గురించి చెప్తుంది. జయచంద్ర వల్ల రిషి వసుధాలు తమ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో తెలుసుకున్నారు. వసుధారని ఇక బాధ పెట్టలేను భార్యగా అంగీకరిస్తానని రిషి అనుకుంటాడు. మరోవైపు వసుధార కూడా నేను చేసిన పని వల్ల రిషి సార్ బాధ పడ్డాడు.. నన్ను భార్యగా అంగీకరిస్తాడా అంటూ ఆలోచిస్తూ నిద్రపోతుంది వసుధార. జగతి, దేవయాని ఇద్దరు వసుధార మెడలో ఉన్న తాళి గురించి గొడవపడతారు. రిషిని ఉహించుకొని మనస్ఫూర్తిగా తనని భర్తగా అనుకొని వసుధార తన మెడలో తాళి వేసుకుందని జగతి అంటుంది. దారిన పోయే వాళ్ళందరూ ఉహించుకొని మెడలో తాళి వేసుకుంటే భార్య భర్తలు అయిపోతారా అని దేవయాని అంటుంది. ఇక ఇదంతా నిద్రలో కలకంటూ నా తాళిని ఏం చెయ్యొద్దంటూ కలవరిస్తుంది వసుధార. 

జయచంద్ర సూపర్ స్పీచ్.. ఒకరికొకరు గెలిపించుకున్నారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -730 లో పెళ్లి గురించి రిషి, వసుధారలు మాట్లాడిన దానిపై జయచంద్ర  స్టూడెంట్స్ తో పాటుగా ఫాకల్టీకి పోల్ పెడతాడు. వసుధార, రిషిలకి కూడా మీలో ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ పేరులోని మొదటి అక్షరాన్ని పేపర్ మీద రాయమని జయచంద్ర చెప్తాడు. అందరు తమ ఒపినియన్ ని పేపర్ పై రాసి బౌల్ లో వేస్తారు. "రిషి సర్ కరెక్ట్. నేను నా వైపు నుండే అలోచించి.. ఇన్ని రోజులు బాధ పెట్టాను" అని వసుధార అనుకొని రిషి పేరు రాస్తుంది. అలాగే రిషి కూడా "వసుధార అలా చెయ్యలేకపోతే నాకు దక్కేదే కాదు కదా.. తను చేసిందే కరెక్ట్" అని రిషి అనుకొని వసుధార పేరుని రాస్తాడు. ఇద్దరు బౌల్ లో వేస్తుండగా.. మీరు ఇద్దరు ఆ పేపర్లు నాకు ఇవ్వమని జయచంద్ర తీసుకుంటాడు.

వసుధారని రిషి ముద్దుపెట్టుకున్నాడా.. జయచంద్రకి పెరిగిన అనుమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -728 లో.. ఇద్దరు వేర్వేరు గదుల్లో ఉంటే జయచంద్రకి అనుమానం వస్తుందని రిషి, వసుధార గది దగ్గరికి వెళ్తాడు. సర్ మీరు మళ్ళీ వచ్చారా అని అడుగుతుంది వసుధార. ఏ రాకూడదా అని రిషి అంటాడు. వసుధారకి దగ్గరగా రిషి వెళ్తుంటే.. ముద్దు పెట్టడానికి వస్తున్నాడేమో అనుకొని.. వసుధార కళ్ళు మూసుకుంటుంది. కానీ రిషి వసుధార పక్కన ఉన్న దిండుని తీసుకుంటాడు. ఇంతలోనే ధరణి వచ్చి రిషి నువ్వు ఇక్కడే పడుకుంటావా అని అడుగుతుంది. లేదు వదిన.. నా రూమ్ లో గాలి రావట్లేదు. అందుకే చల్లగాలి కోసం పైకి వెళ్తున్నానని రిషి చెప్పేసి అక్కడ నుండి వెళ్తాడు.

గీతు, ఆదిరెడ్డి మధ్య క్లాషెస్ వచ్చాయా?

బిగ్ బాస్ సీజన్-6 తో ఫేమ్ సంపాదించుకున్న వారిలో గీతు రాయల్ ఒకరు. బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఒక రివ్యూయర్ గా ఉండి తనకు నచ్చిన వీడియోలని యూట్యూబ్ లో అప్లోడ్ చేసే ఒక సాధారణ యూట్యూబర్. అలా బిగ్ బాస్ సీజన్-5కి రివ్యూ చేసి.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-6 లో ఛాన్స్ కొట్టేసింది గీతు.‌ బిగ్ బాస్ లో‌కి అడుగుపెట్టినప్పటి నుండి తన యాటిట్యూడ్ తో హౌస్ మేట్స్ తో గొడవలు పెట్టుకుంటూ, తనదే నెగ్గాలన్న వైఖరితో  ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. దాంతో ఎక్కువ ఫ్యాన్ బేస్ సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత అనుకోకుండా ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది గీతు.

మురారిని ఇంకా క్షమించని కృష్ణ.. సంతోషంలో ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -121లో.. మురారి తనని క్షమించమని కృష్ణని అడుగుతాడు. అయినా కృష్ణ క్షమించకుండా నందు రూమ్ లోకి వెళ్తుండగా.. "మరి నేనేం చెయ్యాలి కృష్ణ.. చచ్చిపోనా" అని మురారి అనేసరికి కృష్ణకి గుండె ఆగినంత పని అవుతుంది. "ఏసీపి సర్.. ఏంటా మాటలు" అని కంటతడి పెట్టుకొని వెనక్కి వచ్చి మురారితో మాట్లాడుతుంది. అవును కృష్ణ నువ్వు నన్ను క్షమించకపోతే ఏదోలా ఉందని మురారి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణ గురించే ఆలోచిస్తూ మురారి హాల్లోనే పడుకుంటాడు. కృష్ణ కూడా మురారితో గడిపిన జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది.