English | Telugu

క్లాస్, మాస్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న అషు రెడ్డి!

అషు రెడ్డి.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు అషు పెద్దగా పరిచయం లేని పేరు. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ తో పాటు తనకంటూ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆర్జీవీతో అషురెడ్డి కలిసి చేసిన ఒక వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో ఈ వీడియో గురించి నెటిజన్ల నెగటివ్ కామెంట్స్ తో పెద్ద డిబేటే జరిగింది. అంతేకాకుండా మరోసారి ఒక కాఫీ షాప్ లో అషురెడ్డి పొట్టి డ్రెస్ లో కూర్చొని ఉండగా.. ఆర్జీవీ తన థైస్ ని బాగున్నాయని అనగా, ఆమె చెంపమీద కొట్టడంతో ఆ ఇంటర్వ్యూ  కూడా అప్పట్లో వైరల్ అయింది.

సీరియల్స్ ఎందుకు మానేయాల్సి వచ్చిందంటే....?

బుల్లితెర మీద దుర్గ గద్దె వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఐతే ఇప్పుడు ఆమె బుల్లితెర సీరియల్స్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. కానీ ఎందుకు తప్పుకుంది.. కారణమేంటి అంటూ చాలామంది అడుగుతుండేసరికి ఆ విషయాల గురించి ఒక వీడియోలో తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది " నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. ముందు సినిమాల వైపు వెళ్లాను. నేను నటించిన ఫస్ట్ మూవీ అల్లరే  అల్లరి.  బుల్లితెర మీద నటించిన ఫస్ట్ సీరియల్ అపరంజి. అలా ఇండస్ట్రీలోకి వచ్చాక  నేను డబ్బింగ్ కార్డు, ఆర్టిస్ట్ కార్డు కూడా సంపాదించుకున్నాను. ఒక పక్కన చదువుకుంటూనే మరో వైపు వచ్చిన  సీరియల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాను. నా లాస్ట్ ప్రాజెక్ట్స్ సావిత్రమ్మ గారి అబ్బాయి, బంగారు పంజరం.

 స్టైలిష్ లుక్ లో లాస్యప్రియతో కలిసి పాట పాడిన చిత్ర

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ప్రతీ వారం కంటెస్టెంట్స్ మధ్యన  పోటాపోటీగా పాటల సంగ్రామం జరుగుతోంది. ఇక ఇప్పుడు ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో లాస్య ప్రియా ఎలిమినేషన్ నుంచి బయటపడి సేఫ్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ లేటెస్ట్ ప్రోమోలో లాస్యప్రియను స్పెషల్ గా హైలైట్ చేశారు. "జల్లంత కవ్వింత కావాలిలే" అంటూ ఆమె సాంగ్ పాడి మెస్మోరిజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. "నీ ఈ పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది" అన్నాడు జడ్జి కార్తిక్. ఇక ఈ షోకి చిత్ర, ఉప్పెన మూవీ హీరోయిన్ కృతి శెట్టి, శ్రియ వచ్చారు.

రిషి, వసుధారల ఎంగేజ్మెంట్..  శైలేంద్ర ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -759 లో.. సౌజన్యరావు ఇదంతా చేసింది నువ్వేనా అని రిషి అనగానే.. ఒకసారి ఏదో చేసానని అన్ని నేనే చేశానని అంటే ఒప్పుకోనని సౌజన్య రావు అంటాడు. రిషి ఆవేశపడుతూ మాట్లాడుతుండగా.. శైలేంద్ర తనని ఆపి.. నువ్వు వెళ్ళు రిషి నేను మాట్లాడి, మన జోలికి రాకుండా చేస్తాను. నువ్వు వెళ్లి కార్ లో కూర్చోమని అంటాడు శైలేంద్ర. రిషి వెళ్ళగానే శైలేంద్ర నవ్వుతూ.. ఇలానే చేస్తూ ఉండమని అంటాడు. రిషి కార్ లో నుండి చూస్తుండగా.. సౌజన్యరావుకి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడుతాడు. కాసేపటికి సౌజన్య రావు వెళ్ళిపోతాడు.

బ్రహ్మముడి సీరియల్ లో కొత్త మలుపు.. రాజ్ కనిపెట్టేసాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -92 లో... రాజ్ ని కావ్య పక్కకి పిలిచి మాట్లాడుతుంది. అంతమంది ముందు ఇలా పక్కకి పిలిస్తే అందరూ ఏమనుకుంటారని రాజ్ అంటాడు. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి.. మా అక్కని, తన లవర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చని కావ్య అంటుంది‌. ఇప్పుడా.. పూజ జరుగుతుంది కదా.. ఇప్పుడెలా వెళతామని రాజ్ అనగానే.. మీ పెళ్లి ఎందుకు ఆగిపోయింది.. దానివెనుక ఉన్న నిజమేంటో తెలియాలంటే మీరు రావాలి.. లేదంటే నేను మీ ఇంటిదగ్గరే ఉండిపోతానని కావ్య అనగానే సరే అని రాజ్ అంటాడు. ఇద్దరు కలిసి అక్కడ నుండి బయల్దేరతారు.