English | Telugu

సీరియల్స్ ఎందుకు మానేయాల్సి వచ్చిందంటే....?

బుల్లితెర మీద దుర్గ గద్దె వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఐతే ఇప్పుడు ఆమె బుల్లితెర సీరియల్స్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. కానీ ఎందుకు తప్పుకుంది.. కారణమేంటి అంటూ చాలామంది అడుగుతుండేసరికి ఆ విషయాల గురించి ఒక వీడియోలో తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది " నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. ముందు సినిమాల వైపు వెళ్లాను. నేను నటించిన ఫస్ట్ మూవీ అల్లరే  అల్లరి.  బుల్లితెర మీద నటించిన ఫస్ట్ సీరియల్ అపరంజి. అలా ఇండస్ట్రీలోకి వచ్చాక  నేను డబ్బింగ్ కార్డు, ఆర్టిస్ట్ కార్డు కూడా సంపాదించుకున్నాను. ఒక పక్కన చదువుకుంటూనే మరో వైపు వచ్చిన  సీరియల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాను. నా లాస్ట్ ప్రాజెక్ట్స్ సావిత్రమ్మ గారి అబ్బాయి, బంగారు పంజరం.

 స్టైలిష్ లుక్ లో లాస్యప్రియతో కలిసి పాట పాడిన చిత్ర

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ప్రతీ వారం కంటెస్టెంట్స్ మధ్యన  పోటాపోటీగా పాటల సంగ్రామం జరుగుతోంది. ఇక ఇప్పుడు ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో లాస్య ప్రియా ఎలిమినేషన్ నుంచి బయటపడి సేఫ్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ లేటెస్ట్ ప్రోమోలో లాస్యప్రియను స్పెషల్ గా హైలైట్ చేశారు. "జల్లంత కవ్వింత కావాలిలే" అంటూ ఆమె సాంగ్ పాడి మెస్మోరిజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. "నీ ఈ పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది" అన్నాడు జడ్జి కార్తిక్. ఇక ఈ షోకి చిత్ర, ఉప్పెన మూవీ హీరోయిన్ కృతి శెట్టి, శ్రియ వచ్చారు.

రిషి, వసుధారల ఎంగేజ్మెంట్..  శైలేంద్ర ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -759 లో.. సౌజన్యరావు ఇదంతా చేసింది నువ్వేనా అని రిషి అనగానే.. ఒకసారి ఏదో చేసానని అన్ని నేనే చేశానని అంటే ఒప్పుకోనని సౌజన్య రావు అంటాడు. రిషి ఆవేశపడుతూ మాట్లాడుతుండగా.. శైలేంద్ర తనని ఆపి.. నువ్వు వెళ్ళు రిషి నేను మాట్లాడి, మన జోలికి రాకుండా చేస్తాను. నువ్వు వెళ్లి కార్ లో కూర్చోమని అంటాడు శైలేంద్ర. రిషి వెళ్ళగానే శైలేంద్ర నవ్వుతూ.. ఇలానే చేస్తూ ఉండమని అంటాడు. రిషి కార్ లో నుండి చూస్తుండగా.. సౌజన్యరావుకి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడుతాడు. కాసేపటికి సౌజన్య రావు వెళ్ళిపోతాడు.

బ్రహ్మముడి సీరియల్ లో కొత్త మలుపు.. రాజ్ కనిపెట్టేసాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -92 లో... రాజ్ ని కావ్య పక్కకి పిలిచి మాట్లాడుతుంది. అంతమంది ముందు ఇలా పక్కకి పిలిస్తే అందరూ ఏమనుకుంటారని రాజ్ అంటాడు. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి.. మా అక్కని, తన లవర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చని కావ్య అంటుంది‌. ఇప్పుడా.. పూజ జరుగుతుంది కదా.. ఇప్పుడెలా వెళతామని రాజ్ అనగానే.. మీ పెళ్లి ఎందుకు ఆగిపోయింది.. దానివెనుక ఉన్న నిజమేంటో తెలియాలంటే మీరు రావాలి.. లేదంటే నేను మీ ఇంటిదగ్గరే ఉండిపోతానని కావ్య అనగానే సరే అని రాజ్ అంటాడు. ఇద్దరు కలిసి అక్కడ నుండి బయల్దేరతారు.

ఇట్స్ నాట్ బోల్డ్.. గుర్తుపెట్టుకోండి నేనొక యాక్టర్!

ప్రియాంక సింగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీ. జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు సాయితేజ గా పరిచయం అయ్యాడు. అయితే జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ఎక్కువగా వేసిన సాయితేజ.. కొన్ని రోజులకి ఆపరేషన్ చేయించుకొని.. తనని తాను ట్రాన్స్ జెండర్ గా మార్చుకొని కొత్తగా మారిపోయాడు. ఇప్పుడు ప్రియాంక సింగ్ గా అవతారమెత్తాడు సాయితేజ. ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత తను పడిన కష్టాలను, ఎదుర్కున్న ఇబ్బందులు అన్నింటిని చాలా సార్లు చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్. తను ప్రియాంక సింగ్ గా మారిన తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది.

అందరి అంతరంగాల్ని బయట పెట్టిన ఓపెన్ హార్ట్ విత్ రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇందులో రాంప్రసాద్ మ్యారేజ్ బ్యూరో కంపెనీ పేరుతో ఒక సెగ్మెంట్ చేశారు.  కొంతమంది కుర్రాళ్లకు పెళ్లి చేయడం కోసం రాంప్రసాద్ ఈ బ్యూరోని పెట్టాడు. జెస్సి, మెహబూబ్, ఆదర్శ్, జిత్తు ఇలా కొంత మందిని చూపించారు. "ఒక 5 వేలు ఎక్కువైనా పర్లేదు..మంచి అమ్మాయిని సెట్ చేయండి" అని ఆదర్శ్ అనేసరికి "ఏమనుకుంటున్నావ్ నువ్వు ఇది మ్యారేజ్ బ్యూరో..శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు సెట్ చేస్తారు" అని చెప్పాడు. ఇక ఈ షోకి "వ్యవస్థ" మూవీ నుంచి సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కార్తిక్ రత్నం వచ్చారు. ఈ మ్యారేజ్ బ్యూరోలో  అమ్మాయిలు  కావాలి అనుకుంటే అబ్బాయిలు స్కెటింగ్ షూస్ వేసుకుని వెళ్లి అమ్మాయిలను చేరుకోవాలి అనే టాస్క్ ఇచ్చారు

టైంకి షూట్ స్టార్ట్ చేయండి ప్లీజ్ అనేదే నా డిమాండ్

సుమ అడ్డా షోలో ఈ వారం ఏజెంట్ టీం నుంచి హీరో, హీరోయిన్స్ వచ్చారు. వీళ్ళతో ఎన్నో రకాల ఫన్నీ గేమ్స్ ఆడించింది సుమ. తర్వాత ఎన్నో ప్రశ్నలు కూడా వేసింది. "మీరు నటించిన హీరోయిన్స్ తో డేట్ కి వెళ్లాల్సి వస్తే ఏ హీరోయిన్ తో వెళ్తారు" అనేసరికి "పూజ హెగ్డేతో వెళ్తాను" అని చెప్పాడు అఖిల్. "బాగా ఇష్టమైన హీరో ఎవరు"..."రామ్ చరణ్ ". "ఇండియన్ క్రికెట్ టీంలో ఆడే ఛాన్స్ వస్తే వెళ్ళిపోతారా" అని అడిగింది సుమ.."తెలుగు సినిమా ఇండస్ట్రీని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాను అది సాధ్యమా ? ఈ జన్మకు సాధ్యం కాదు" అని చెప్పాడు "బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు అన్న ప్రశ్నకు  క్రికెట్ ఆడతాను" అన్నాడు .."మీరు చేసిన పనుల్లో నాగార్జునగారికి ఇప్పటికీ తెలియని ఒక పని చెప్పండి" "రాత్రి పూట గోడ దూకేసి బయటికి వెళ్ళిపోయి..రావడం..అదొక అడ్వెంచర్ నాకు. మా ఇంటి గోడ కూడా 25 అడుగుల ఎత్తు ఉంటుంది" అని చెప్పడంతో సుమ షాకయ్యింది.