చెల్లికి వైరల్ ఫీవర్... అమ్మమ్మకు స్టమక్ పెయిన్
"మౌనరాగం" సీరియల్తో పరిచయమైన అమ్ములు-అంకిత్ గురించి అందరికీ తెలుసు. ఈ జంట చాలా క్యూట్ గా ఉంటూ తెలుగు ఆడియన్స్ ని తమ యాక్టింగ్ తో మెస్మోరైజ్ చేస్తూ ఉంటారు. కొంత కాలం క్రితం వరకు వాళ్ళ అసలు పేర్లు కంటే సీరియల్ పేర్లతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. వాళ్ళ అసలు పేర్లు ప్రియాంక జైన్-శివ కుమార్. అటు సీరియల్స్ లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఈ జంట ఫుల్ ఫేమస్.. ఒకరిని విడిచి ఒకరు ఎక్కడికి వెళ్ళరు, ఏదీ కొనరు..అలాంటి వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లారు. ఎందుకు అంటే శివ కుమార్ చెల్లికి ఫీవర్, త్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెను తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు ఈ జంట. వైరల్ ఫీవర్ వచ్చినా , ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళిపోవాలి..ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పాడు శివ్..ఇక తన చెల్లికి హాస్పిటల్ లో జరిగే ట్రీట్మెంట్ చూస్తే అమ్మకు కూడా కన్నీళ్లు వచేస్తాయట..అందుకే శివ్ తన అమ్మను, అమ్మమ్మను కార్ లోనే ఉంచేసి తాను మాత్రం హాస్పిటల్ కి వెళ్లి వచ్చాడు