English | Telugu

తన వంటతో దుగ్గిరాల కుటుంబాన్ని మెప్పించిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-81 లో.. అప్పుని బయట ఒక దగ్గర కళ్యాణ్ రహస్యంగా కలిసి మాట్లాడుతుంటాడు. అనవసరంగా చెయ్యని తప్పుకి కావ్య వదిన  శిక్ష  అనుభవిస్తుంది.. ఎలాగైనా మీ స్వప్న అక్క ఎవరితో లేచిపోయిందో కనుక్కోవాలని కళ్యాణ్ అనగానే.. మీ కుటుంబంలో గొడవలు పెట్టె వాళ్లే ఉన్నారనుకున్నాను.. ఇలా కూడా ఆలోచించేవాళ్ళున్నారా అని అప్పు అంటుంది. ఇక కళ్యాణ్ చెప్పిన దానికి అప్పు సరే అంటుంది. ఎలాగైనా స్వప్నని రెచ్చగొట్టేలా మాట్లాడితే తానే వెళ్ళిపోతుందని కళ్యాణ్ ఐడియా ఇస్తాడు.

ఇంత మంచి భర్తను ఇచ్చినందుకు శివయ్య నీకు ధన్యవాదాలు

శివజ్యోతి రీసెంట్ గా మ్యారేజ్ డే సెలెబ్రేట్ చేసుకుంది. సావిత్రిగా పేరు తెచ్చుకున్న శివ జ్యోతి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. శివజ్యోతి న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఐతే అప్పటివరకు ఎవరికీ తెలియని శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక అందరికీ ఫ్యాన్ ఐపోయింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. అలాంటి శివజ్యోతి చాలా చిన్న వయసులోనే గంగూలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి ఇంట్లో చాలా గొడవలు కూడాయ్యాయని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది. ఐతే పెళ్లి చేసుకున్న సమయంలో తినడానికి తిండి లేక చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడ్డారన్న విషయాన్ని గురించి చెప్పింది. కానీ ఇప్పుడు ఈ జంట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి శివజ్యోతి తన పెళ్లి రోజుని సెలెబ్రేట్ చేసుకుంది..రకరకాల ప్లేసెస్ కి ట్రిప్ కి వెళ్లారు ఈ జంట

నిరుపమ్ ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం

మంజుల-నిరుపమ్ ఈ సీరియల్ యాక్టర్స్ గురించి తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు.  చంద్రముఖి సీరియల్‌తో వీరి ప్రయాణం మొదలైంది. కన్నడ నటి అయిన మంజుల  చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యింది. ఇక ఈ సీరియల్ టైంలోనే  వీరి మధ్య మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. యూట్యూబ్‌లో "మంజుల నిరుపమ్" అనే చానెల్ ద్వారా నిరుపమ్ కి సంబంధించి, తన బాబు గురించి తన పర్సనల్స్ అన్నిటి గురించి వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు అక్షయ తృతీయ సందర్భంగా తమ ఇంట్లో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతీ ఏడాది ఇంట్లో ఈ పారాయణం నిర్వహించుకుంటారని చెప్పారు. ఐతే కోవిడ్ వచ్చిన కారణంగా రెండు మూడేళ్లు ఇంట్లో చేయలేదట కాబట్టి మళ్ళీ ఇప్పుడు

చెల్లికి వైరల్ ఫీవర్... అమ్మమ్మకు స్టమక్ పెయిన్

 "మౌనరాగం" సీరియల్‌తో పరిచయమైన అమ్ములు-అంకిత్‌ గురించి అందరికీ తెలుసు. ఈ జంట చాలా క్యూట్ గా ఉంటూ తెలుగు ఆడియన్స్ ని తమ యాక్టింగ్ తో మెస్మోరైజ్ చేస్తూ ఉంటారు. కొంత కాలం క్రితం వరకు వాళ్ళ అసలు పేర్లు కంటే సీరియల్ పేర్లతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. వాళ్ళ అసలు పేర్లు  ప్రియాంక జైన్-శివ కుమార్. అటు సీరియల్స్ లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఈ జంట ఫుల్ ఫేమస్.. ఒకరిని విడిచి ఒకరు ఎక్కడికి వెళ్ళరు, ఏదీ కొనరు..అలాంటి వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్లారు. ఎందుకు అంటే శివ కుమార్ చెల్లికి ఫీవర్, త్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెను తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు ఈ జంట. వైరల్ ఫీవర్ వచ్చినా , ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా  వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళిపోవాలి..ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పాడు శివ్..ఇక తన చెల్లికి హాస్పిటల్ లో జరిగే ట్రీట్మెంట్ చూస్తే అమ్మకు కూడా కన్నీళ్లు వచేస్తాయట..అందుకే శివ్ తన అమ్మను, అమ్మమ్మను కార్ లోనే ఉంచేసి తాను మాత్రం హాస్పిటల్ కి వెళ్లి వచ్చాడు

కనకం కన్నీటి పర్యంతం.. కిచెన్ లో కావ్య చేసిన మొదటి వంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-80 లో.. కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని రాజ్ ఫ్యామిలీ వాళ్ళు అవమానిస్తుండగా.. మధ్యలో ఇందిరాదేవి కల్పించుకొని.. ఎంత శత్రువులైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా అవమానపరచడం ఎప్పుడు జరుగలేదని అంటుంది. ఆ తర్వాత ఇందిరాదేవి ముందుకు కనకం వచ్చి.. మా వల్లనే ఈ ఫంక్షన్ అంతా ఇలా అవడం మాకు చాలా బాధగా ఉందని చెప్పి.. అక్కడ నుండి స్వప్నని తీసుకొని వెళ్ళిపోగా, అప్పు కృష్ణమూర్తిని తీసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళు అలా వెళ్ళడం చూసిన కావ్య బాధపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

అఖిల్ ని వరించిన బెస్ట్ పాపులర్ టీవీ ఆర్టిస్ట్ అవార్డ్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్నా ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.  అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్, మోనల్ గజ్జర్ తో‌ జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి‌. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు.

భాషతో సంబంధం లేదు...నాకు నటన అంటే ఇష్టం.

తేజస్విని గౌడ మోడల్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత  నటిగా మారింది.  "కోయిలమ్మ" సీరియల్ లో చిన్నీగా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం కేరాఫ్ అనసూయ సీరియల్ లో నటిస్తోంది. తేజస్విని గౌడ సీరియల్ నటుడు అమరదీప్ ని వివాహం చేసుకుంది. ఈమె సీరియల్స్ లో నటిస్తోంది అప్పుడప్పుడు ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. "హాయ్ వదిన...అమర్ అన్న ఎలా ఉన్నాడు, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది" అని అడిగేసరికి "మేము చాలా బాగున్నాం హ్యాపీగా ఉన్నాం అని చెప్తూ ఒక ఫోటోని పోస్ట్ చేసింది" తేజు. "విష్ణు అక్క గురించి ఒక మాటలో చెప్పు" అనేసరికి " సోల్ సిస్టర్" అని చెప్పింది. "మీరు అమర్ అన్న కలిసి ఒక లవ్ వెబ్ సిరీస్ చేయొచ్చు కదా" అని అడిగేసరికి "ఏమో చూద్దాం" అని చెప్పింది.

నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ లో శ్రీకర్ కృష్ణ ?

సీరియల్ యాక్టర్ శ్రీకర్ కృష్ణ అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ స్టార్ మాలో ప్రసారమవుతున్న "బ్రహ్మముడి" సీరియల్ లో రాహుల్ అంటే అందరికీ తెలిసిపోతుంది. శ్రీకర్  యాంకర్ గా, మెజీషియన్ గా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యాడు. అలాంటి శ్రీకర్ కృష్ణ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఒక అనౌన్స్మెంట్ చేసాడు. తన ఫాన్స్ ని క్వశ్చన్స్ అడగమని చెప్పాడు. "బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో మేమంతా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం" అని ఒక ఫ్యాన్ అడిగేసరికి "చూద్దాం ఎలా జరుగుతుందో" అని ఆన్సర్ ఇచ్చాడు. "బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ క్యారెక్టర్ చాలా బాగుంది..నేను మీకు పెద్ద ఫ్యాన్" అనేసరికి "థ్యాంక్యూ" అని చెప్పాడు.