సుధీర్ కంపెనీగా ఉంటే చాలా బాగుంటుంది అన్న రష్మీ
సిక్స్త్ సెన్స్ సీజన్ 5 నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక రాబోయే వారం షో మంచి ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది. ఇందులో బ్రహ్మాజీ, రష్మీ, సింగర్స్ రేవంత్, శ్రీరామచంద్ర ఎంట్రీ ఇచ్చారు. ఇక వీళ్ళ కామెడీ మాములుగా లేదు. బ్రహ్మాజీ పంచులు అదిరిపోయాయి. ఇక బ్రహ్మాజీ, రష్మీ కామెడీ పీక్స్ ఈ షోలో. "డ్రై ఫ్రూప్ట్స్ ఎప్పుడు తినాలి" అని బ్రహ్మాజిని అడిగింది రష్మీ. "డ్రై గా ఉన్నప్పుడు తినాలి" అని ఆన్సర్ ఇవ్వడంతో..."కాదు ఎవరూ లేనప్పుడు తినాలి" అని కామెడీగా చెప్పింది రష్మీ.."జింక ముక్కు పక్కకు ఉంటుంది. పొడుగ్గా ఉండే జంతువు పేరేంటి" అని అడిగింది. రైనోసారస్...నీళ్ల ఎలుక" అని ఆన్సర్ ఇచ్చింది. దానికి బ్రహ్మాజీ రష్మీ చేతిని నిమిరాడు. "ఇది చేస్తే నవ్వెక్కడ వస్తది. నా ఆట నేను ఆడుకుంటా" అని చెప్పి స్టేజి మీదకు వెళ్ళిపోయి "ఊ అంటావా మావా" అనే సాంగ్ కి డాన్స్ చేసింది.