ఘనంగా ఆది సాయి కుమార్ నూతన చిత్రం 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' ప్రారంభోత్సవం
యంగ్ హీరో ఆది సాయి కుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'చుట్టాలబ్బాయి' తరువాత దర్శకుడు వీరభద్రం చౌదరితో మరోసారి చేతులు కలిపాడు. విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.