English | Telugu

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి బాలయ్య ఎంట్రీ!

'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ టాలీవుడ్ సినీ చరిత్రలోనే మొదటిసారి సినిమాటిక్ యూనివర్స్ కి తెరదీశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఎనిమిది సూపర్ హీరో ఫిల్మ్ లు రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మొదటి సినిమా 'హనుమాన్' 2024 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే రెండో సినిమాగా 'అధీర'ను ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా భాగం కానున్నారని తెలుస్తోంది.