English | Telugu

Krishna Mukunda Murari: లెటర్ ని చింపేసిన ముకుంద.. వాళ్ళిద్దరు భార్యాభర్తలుగానే ఉంటారన్న భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -443 లో.. శ్రీనివాస్ తన ఇంటిని ఒక సేట్ కి అమ్ముతాడు.  ఆ సేట్ వచ్చి.. ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకోవచ్చా అని శ్రీనివాస్ ని అడుగుతాడు. ఊరి చివర వేరే ఇల్లు కొన్నానని శ్రీనివాస్ అంటాడు. పాపం మీ కూతురు చనిపోయింది కదా ఆమెతో ఈ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలున్నాయి కదా అని సేట్ అనగానే.. మీరు ప్రతీసారీ చనిపోయిందని అనకండి అని కోప్పడతాడు శ్రీనివాస్.  నా కూతురే ఎక్కువ గుర్తొస్తుందని, అందుకే ఇల్లుని అమ్మేస్తున్నానని సేట్ తో శ్రీనివాస్ చెప్పేసి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu : మీటింగ్ లో వాళ్ళిద్దరికి షాక్.. అసలు నిజం ఇదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1048 లో... దేవయానికి శైలేంద్ర ఫోన్ చేసి.. ఆ మను గాడు మళ్ళీ కాలేజీకి వస్తున్నాడట అని చెప్తాడు. కాన్ఫరెన్స్ కాల్ లో రాజీవ్ కూడా ఉంటాడు. ఇన్నిరోజులు వేరే ఇప్పుడు వేరే.. వాడి బలహీనత మనకు తెలుసు కదా అని దేవయాని అంటుంది. ఇప్పుడు కాలేజీలో ఏం జరుగుతుందని శైలంద్రని దేవయాని అడుగుతుంది. కాసేపట్లో బోర్డు మీటింగ్ ఉందని శైలేంద్ర చెప్పగానే.. మళ్లీ వాడి చేతికీ గాయం అవుతుందన్న మాట లాస్ట్ టైమ్ కదా నీ మాటలు భరించలేక గాయం చేసుకున్నాడు.. ఇప్పుడు మళ్ళీ చేసుకుంటాడని రాజీవ్ అంటాడు.

ఫ్యామిలీతో టూర్ కి వెళ్లిన రసజ్ఞ రీతూ...

గుప్పెడంత మనసు సీరియల్ లో నటించిన రసజ్ఞ రీతూ రీసెంట్ గా ఫ్యామిలీ ట్రిప్ వేసింది. ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్స్స్ వలన ట్రిప్ కి రావాల్సి వచ్చినట్టు చెప్పింది. అలాగే ఎప్పుడో  12 ఏళ్ళ క్రితం ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ కి వెళ్లినట్టు చెప్పింది.  ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అందరూ కలిసి ట్రిప్ వేసినట్టు చెప్పింది. ఊటీలోని కూనూర్ కి వెళ్ళింది రసజ్ఞ ఫ్యామిలీ . ఇక వాళ్ళ అత్తమ్మ వండిన మునక్కాయ మటన్ కర్రీ రెసిపీ చూపించింది. ఇంతకు విషయం ఏమిటో చెప్పలేదు కానీ ఇప్పుడిప్పుడే కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి బయట పడుతున్నా అంటూ చాలా బాధతో చెప్పింది. ఈ వీడియోని చాలా అన్ ప్రొఫెషనల్ గా చేస్తున్నానని సారీ కూడా చెప్పింది. ఇక కెమెరా తీసుకుని కొండ మీద నుంచి కింద వరకు వచ్చేసింది రసజ్ఞ రీతూ.

Karthika Deepam2 : తన భార్యని వేరొకడితో చూసి షాకైన నరసింహా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -16 లో..  శౌర్యని ఎలా పడితే అలా మాట్లాడకూడదని దీప కోప్పడుతుంది. మరి ఎలా ఉండాలో చెప్పు అమ్మ.. అన్నీ రాసివ్వు బట్టీ పట్టి మాట్లాడతానని శౌర్య అనగానే..‌ ఇదిగో ఇలానే వద్దని దీప ఆంటుంది. పండక్కి నాన్న వస్తాడా అమ్మ అని శౌర్య అడుగగా.. మనమే వెళ్తామని దీప చెప్తుంది. బట్టలు కొనుక్కోవడానికి బయటకెళ్తున్నామని శౌర్యతో దీప చెప్పి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎన్ని ఉన్నాయోనని చూస్తుంది. ఇక డబ్బులు తక్కువగా ఉండటంతో శౌర్యకి ఒక్కదానికే తీసుకుంటానని దీప అనుకుంటుంది. 

Eto Vellipoindhi Manasu : చస్తానని మాణిక్యం బ్రతిమాలడంతో‌ వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకున్న సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్- 69లో.. సీతాకాంత్ ఒకతడిని తీసుకొచ్చి నా చెల్లెలు సిరీతో పెళ్ళి చేస్తున్నానని అంటాడు. రామలక్ష్మి నాకు అక్కర్లేదు.. నీ కూతురు ఇంకా నా జీవితంలో ఎందుకుండాలి. అందుకే ఇదిగో తీసుకెళ్ళు అని రామలక్ష్మిని మాణిక్యం వైపు తోసేస్తాడు.‌ దాంతో ఆయన చేసిన తప్పుకి నా కూతురికి శిక్ష వేస్తున్నారేంటని రామలక్ష్మి వాళ్ళ అమ్మ సుజాత అడుగగా.. ఎదుటివాళ్ళ పరిస్థితిని అడ్వాండేజ్ గా తీసుకొని ఆడుకోవాలని చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో  మీ ఆయనకు తెలిసి రావాలని సీతాకాంత్ అంటాడు. 

Krishna Mukunda Murari : మురారి బిడ్డ నా కడుపులో పెరగాలి కృష్ణ.. నీ ఆశ తీరదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-442లో.. ముకుంద, మురారి, కృష్ణ, అదర్శ్ అంతా కలిసి హోలీ జరుపుకుంటారు. ఇక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. ముకుంద అద్దంలో తనని తాను చూసుకుంటు.. మురారికి రంగులు పూసినది గుర్తుకుచేసుకుంటంది. అప్పుడే ముకుంద దగ్గరికి రేవతి వచ్చి.‌. నీ తీరేంటి ఆదర్శ్ తో ఆ చనువేంటని అడుగగా.. మీరు నన్ను అవమానించడం పక్కన పెట్టి.. మొదట భవానీ మేడమ్ తో ఒకసారి ఆదర్శ్, సంగీతల పెళ్ళి గురించి మాట్లాడండి అని చెప్తుంది. ఇక అదే విషయం మాట్లాడటానికి భవాని దగ్గరికి వెళ్ళిన రజినీ.. సంగీత, అదర్శ్ ల పెళ్ళి చేద్దాం వదిన అంటుంది.

Brahmamudi :  ఇంట్లో నుండి వెళ్ళిపోమన్న అత్త.. గడప దాటి వెళితే మళ్ళీ రానని చెప్పిన కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్- 381లో.. శ్వేతతో కలసి కావ్య మాట్లాడుతుంది. గెట్ టూ గెదర్ ప్లాన్ చేస్తే ఆ వెన్నెల ఆచూకీ తెలుస్తుందని కావ్య అనగానే సరేనని శ్వేత అంటుంది. ఆ తర్వాత రాజ్ ని నమ్మి అలా నాటకం ఆడాను నన్ను క్షమించని శ్వేత అనగానే.. అయ్యో అందులో నీ తప్పేం లేదు. నేను అర్థం చేసుకోగలను. స్నేహితుడి కోసం అదంతా చేశావ్.. అంతే కదా.. అదేం పట్టించుకోకు.. ముందు ఈ వెన్నెల గురించి ఆలోచించు.. ఇది తేలితే నువ్వు నా జీవితానికి ఓ దారి చూపించినదానివి అవుతావ్.. నీకు నేను రుణపడిపోతానని కావ్య అంటుంది. అయ్యో అలాంటి మాటలెందుకు.. నువ్వు నన్ను క్షమించావ్ అది చాలని శ్వేత. మొత్తానికి కావ్య, శ్వేతలు మంచి స్నేహితులైపోయారు.