రిషి ఇంటికి అతిథిగా జయచంద్ర.. రూమ్ ఖాళీ చేసిన వసుధార!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -726 లో కాలేజీని విజిట్ చేయడానికి జయచంద్ర వస్తున్నాడని ఫణింద్ర వాళ్ళు కావలిసిన ఏర్పాట్లు చేస్తారు. ఇంతలోనే రిషి వచ్చి జయచంద్ర గారికి హోటల్స్ లో ఉండడం ఇష్టముండదంట అని చెప్తాడు. జగతి, మహేంద్ర, ఫణింద్ర, వసుధార లు అక్కడే ఉంటారు. మన కాలేజీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేద్దామా అని మహేంద్ర అనగానే.. సర్ కి అక్కడ ఉండడం ఇష్టం ఉంటుందో ఉండదో అని రిషి అంటాడు.