తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజి మీద రచ్చ చేయబోతున్న దేవిశ్రీ
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి డిఎస్పి వచ్చాడు. దేవి శ్రీప్రసాద్ ఎక్కడ ఉంటే అక్కడ మస్త మజా డాన్సులు, పాటలు ఉంటూనే ఉంటాయి. అలాంటి డిఎస్పి ఇండియన్ ఐడల్ స్టేజి మీదకు వచ్చాడంటే రచ్చ రచ్చ కాకుండా ఎలా ఉంటుంది. ఇక స్టేజి మీదకు కార్తిక్, థమన్, దేవి వచ్చారు ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించారు. "తెలుగు ఇండియన్ ఐడల్ కి మోస్ట్ స్పెషల్ ఎక్సక్లూసివ్ మూమెంట్ ఏమిటి అంటే థమన్, డిఎస్పీ ఈ స్టేజి మీదకు రావడమే..డిఎస్పీ మచ్చా థాంక్యూ సో మచ్" అని చెప్పాడు కార్తిక్. "దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ లో నీకు ఇష్టమైన సాంగ్ ఏమిటి " అని కార్తిక్ థమన్ ని అడిగాడు.