సప్త చిరంజీవుల జపం చేస్తున్న టాలీవుడ్
హిందూ పురాణాల ప్రకారం ఏడుగురికి మరణం లేదు. వారినే సప్త చిరంజీవులు అని అంటారు. ఆ సప్త చిరంజీవులు ఎవరో కాదు.. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్వాసమహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతోన్న పలు భారీ సినిమాలు సప్త చిరంజీవుల పాత్రల చుట్టూ తిరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.