English | Telugu

నాకు పెళ్లి వద్దు..కానీ బ్రిట్టో లాంటి అబ్బాయి కావాలి

నీతోనే డాన్స్ 2 .0 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బ్రిట్టో-సంధ్య పెర్ఫార్మెన్స్ అద్దిరిపోయింది. వీళ్ళ డాన్స్ స్టైల్ కి జడ్జెస్ ఫిదా ఐపోయారు. బాహుబలి మూవీ నుంచి "ధీవర" అనే సాంగ్ కి కొత్త స్టైల్ లో వీళ్ళు డాన్స్ చేసి అందరినీ మెప్పించారు. ఇక బ్రిట్టో చేసిన డాన్స్ కి శుభశ్రీ ఫుల్ ఖుషీ ఐపోయింది. "చాలా బ్యూటిఫుల్ గా ఉంది డాన్స్..నా లైఫ్ లో కూడా ఒక బ్రిట్టో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా" అని అనేసరికి "ఓ మై గాడ్" అని శ్రీముఖి, జడ్జెస్ అంతా షాకైపోయారు. "బ్రిట్టో లాంటి హజ్బెండ్ కావాలని కోరుకుతున్నావన్నమాట" అని శ్రీముఖి అడిగేసరికి "హజ్బెండ్ కాదు అబ్బాయి..పెళ్ళొద్దు నాకు" అని చెప్పేసింది శుభశ్రీ.

Eto Vellipoyindhi Manasu : శ్రీలత పెట్టిన పరీక్షల్లో వాళ్ళిద్దరు బయటపడ్డారా.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -57  లో.. సీతాకాంత్ , రామలక్ష్మి ఇద్దరు గుమ్మం దగ్గరికి రాగానే.. శ్రీలత చూసి శ్రీవల్లిని పిలుస్తుంది. ఆ తర్వాత తనకి హారతి ఇవ్వమని శ్రీలత అనగానే.. అందరు షాక్ అవుతారు. నిన్నటి వరకు పుట్టెడు కోపంగా ఉన్న అత్తయ్య ఇప్పుడేంటి ఇలా మారిపోయిందని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. నువ్వు అంటే నాకు కోపం లేదు కానీ మీ నాన్న చేసిన మోసాన్ని మాత్రం క్షమించలేనంటూ రామలక్ష్మితో ప్రేమ గా ఉన్నట్టు నటిస్తుంది శ్రీలత.

అడవి శేష్ సింగల్ అని ఎవరు చెప్పారు...అతను మల్టిపుల్

చెఫ్ మంత్ర సీజన్ 3 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి రాహుల్ రవీంద్రన్, అడివి శేష్ ఇద్దరూ వచ్చారు. రాగానే నిహారిక శేష్ మీద ఒక రెండు లైన్స్ చెప్పింది "ఎయిట్ తర్వాత వస్తుంది నైన్ ...మా శేష్ సింగల్ కాబట్టి అమ్మాయిలు వేసుకోవచ్చు లైన్" అనేసరికి రాహుల్ రవీంద్రన్ అసలు విషయం బయటపెట్టేసాడు. "శేష్ సింగల్ అని ఎవరు చెప్పారు. శేష్ యాక్చ్యువల్లి మల్టిపుల్..." అని చెప్పేసరికి శేష్ షాకైపోయాడు. ఇంతలో యాదమ్మ రాజు అక్కడికి వచ్చాడు ఒక కెమెరా పట్టుకుని. యాదమ్మ రాజును చూసాక ఎవడీడు అని శేష్ అడిగాడు "నా పేరు జూ పార్క్ రాజు" అని చెప్పాడు. "జూ పార్క్ ఏంట్రా" అని నిహారికా అడిగింది.