'ఏ మాయ చేసావే' సీక్వెల్ లో రష్మిక!
నాగ చైతన్య, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఏ మాయ చేసావే'. 2010లో విడుదలైన ఈ ప్రేమకథాచిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, చైతన్య-సమంత మధ్య ప్రేమ సన్నివేశాలు కట్టిపడేశాయి. దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుండగా.. అందులో చైతన్య సరసన రష్మిక నటించనుందని తెలుస్తోంది.