English | Telugu

మీకు, అతనికి ముప్పై ఏళ్ళ వయసు తేడా ఉంది.. అయితే తప్పేంటి

Publish Date:Dec 23, 2025

      -అయితే ఏమవుతుంది -ఆషికా రంగనాధ్ ధీటైన జవాబు -రవితేజ, చిరంజీవి తో హంగామా     ఒక్కో హీరోయిన్ కి ఒక్కో టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆమెని ఆపడం ఎవరి తరం కాదు. ఆపాలనే ప్రయత్నాలు చేసినా, సదరు ప్రయత్నాల్నిఆమెకే పాజిటీవ్ గా మారి మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తాయి. సినీ రంగం పుట్టిన దగ్గరనుంచి ఈ సూత్రం అప్లై అవుతు వస్తుంది. ఇప్పుడు అలాంటి టైం 'ఆషికా రంగనాధ్'(Ashika Ranganath)కి రాబోతుందని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె అప్ కమింగ్ సినిమాల లైనప్ కూడా ఆ విధంగానే ఉంది. మెగాస్టార్ 'విశ్వంభర'(Vishwambhara),మాస్ మహారాజ రవితేజ(Raviteja)భర్త మహాశయులకి విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Vignapthi)ఆషికా ఖాతాలో ఉన్నాయి. ఈ రెండిటిలో ముందుగా భర్త మహాశయులకి విజ్ఞప్తి వచ్చే సంక్రాంతికి సందర్భంగా జనవరి 13 న థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆషికా తన కంటే వయసులో ముప్పై సంవత్సరాల వయసు తేడా ఉన్న హీరోల సరసన జత కడుతుందనే చర్చ జరుగుతుంది. కొంత మంది నెటిజెన్స్ అయితే ఏకంగా ట్రోల్ల్స్ కూడా చేస్తున్నారు.     ఇప్పుడు వాటన్నిటి గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆషికా మాట్లాడుతు సినిమాకి సంబంధించి నటిగా నా క్యారక్టర్ కి ఎంతవరకు న్యాయం చేస్తున్నాను అనేదే చూస్తాను. అంతేకాని యంగ్ హీరోనా, సీనియర్ హీరోదా అనేది ముఖ్యం కాదు. పెద్ద నటులతో వర్క్ చెయ్యడం  నా అదృష్టం. సీనియర్ హీరోలతో పనిచేస్తే కెరీర్‌కి సంబంధించి ఎన్నో కొత్త విషయాలని నేర్చుకోవచ్చు. వారి అనుభవం మనకి ఒక లెసన్ లా  పనిచేస్తుంది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా, నటనకు స్కోప్ ఉన్న వాటికే ఓటు వేస్తాను. నాగార్జున గారితో నా సామి రంగలో కూడా చేశాను.  ఆయన సెట్స్‌లో చూపించే ఎనర్జీ, డెడికేషన్ చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. దీంతో ట్రోల్స్ కి సరైన సమాధానం చెప్పిందంటూ అభిమానుల నుంచి కామెంట్స్ వినపడుతున్నాయి.     Also Read:  వాళ్ళ నిజస్వరూపాలు నాకు తెలుసు.. రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు       కన్నడ చిత్ర సీమకి చెందిన ఆషికా 2016 లో క్రేజీ బాయ్ అనే కన్నడ చిత్రం ద్వారా సినీ తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత కన్నడలో సుమారు పది చిత్రాల వరకు చేసిన ఆషిక 2023 లో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ తో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యింది   ప్రస్తుతం తమిళంలో కూడా 'కార్తీ' తో సర్దార్ 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.        

Shambhala Premiere Bookings Open to a Tremendous Response 

Publish Date:Dec 23, 2025

  The countdown has begun for the theatrical release of Aadi Saikumar’s much-awaited mystical thriller, Shambhala, which is set to hit cinemas on December 25th. Directed by Ugandhar Muni and produced by Mahidhar Reddy and Rajashekar Annabhimoju under the Shining Pictures banner, the film has been creating strong buzz.   Shambhala has garnered significant attention thanks to its aggressive promotional campaign and striking promotional content. Adding to the excitement, the film has received tremendous support from the film fraternity, with several prominent stars unveiling its promotional material, and some other taking part in pre-release event.   Meanwhile, advance bookings for premiere shows have opened on ticketing portals and have been met with tremandous response within a short span of time. Strong pre-sales across regions clearly indicate the growing hype surrounding the film. Trade circles predict a solid opening, with Shambhala poised to emerge as the biggest opener of Aadi Saikumar’s career.     Archana Iyer plays the female lead opposite Aadi, while the film also features Swasika, Ravi Varma, Madhunandan, and Siva Karthik in pivotal roles.   The film is backed by a technically accomplished crew, with JK Murthy overseeing art direction, Praveen K Bangari handling cinematography, and Sricharan Pakala composing the music.  

20 ఏళ్లలో 600 సినిమాలు చేసిన జయమాలిని.. ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పడానికి రీజన్‌ ఇదే!

Publish Date:Dec 22, 2025

(డిసెంబర్‌ 22 జయమాలిని పుట్టినరోజు సందర్భంగా..) ‘సన్నజాజులోయ్‌.. కన్నె మోజులోయ్‌..’, ‘గుడివాడ వెళ్లాను.. గుంటూరు పొయ్యాను..’, ‘నీ ఇల్లు బంగారంగానూ..’, ‘గు గు గుడిసుంది..’, ‘పుట్టింటోళ్లు తరిమేశారు...’ 1970వ దశకంలో వచ్చిన ఇలాంటి పాటలు అప్పటి కుర్రకారుకి పిచ్చెక్కించాయి. ఈ ఐటమ్‌ సాంగ్స్‌లో జయమాలిని డాన్స్‌, అందాలు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి మళ్లీ మళ్లీ రప్పించాయి. అప్పట్లో స్టార్‌ హీరోల సినిమాల్లో జయమాలిని ఐటమ్‌ సాంగ్‌ కంపల్సరీగా ఉండాల్సిందే. అక్క జ్యోతిలక్ష్మీ అప్పటికే తన డాన్స్‌తో యూత్‌ని తనవైపు తిప్పుకున్నారు. ఆ సమయంలో వచ్చిన చెల్లెలు జయమాలిని.. ఐటమ్‌ సాంగ్స్‌తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు.    1958 డిసెంబర్‌ 22న మద్రాస్‌లో జన్మించారు జయమాలిని. ఆమె అసలు పేరు అలమేలు మంగ. 8 మందిలో జ్యోతిలక్ష్మీ మొదటి సంతానం కాగా, అలమేలు మంగ చివరి సంతానం. ఈ ఇద్దరికీ 10 సంవత్సరాల గ్యాప్‌ ఉంది. తల్లికి చెల్లెలైన ధనలక్ష్మీకి పిల్లలు లేకపోవడం వల్ల జ్యోతిలక్ష్మీని దత్తత తీసుకున్నారు. అలా ఆమె దగ్గరే జ్యోతిలక్ష్మీ పెరిగారు. అక్క డాన్స్‌ నేర్చుకుంటూ ఉండగా దగ్గరే ఉండి చూసేవారు అలమేలు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డాన్స్‌ నేర్చుకున్నారు.    అలమేలు మేనమామ టి.ఆర్‌.రామన్న ప్రముఖ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో రవిచంద్రన్‌, లత  జంటగా రూపొందుతున్న ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ సినిమాలో లత స్నేహితురాలిగా అలమేలును చిత్ర రంగానికి పరిచయం చేశారు. అప్పటికి అలమేలు వయసు 12 సంవత్సరాలు. ఆ తర్వాత దర్శకుడు బి.విఠలాచార్య చేస్తున్న ‘ఆడదాని అదృష్టం’ చిత్రంలోని ఒక ఐటమ్‌ సాంగ్‌ ద్వారా తెలుగులో పరిచయం చేశారు. ఆమెకు జయమాలిని అని పేరు పెట్టింది కూడా ఆయనే.   అదే సంవత్సరం అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించారు జయమాలిని. దాంతో ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అయితే పెర్‌ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ క్యారెక్టర్స్‌ కంటే ఐటమ్స్‌తోనే జయమాలిని ఎక్కువ పాపులర్‌ అయ్యారు. 1977లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన యమగోల చిత్రంలోని ‘గుడివాడ వెళ్లాను, గుంటూరు పొయ్యాను..’ పాటతో ఒక్కసారి ఇండస్ట్రీని షేక్‌ చేశారు జయమాలిని.  ఆ తర్వాత ఎన్టీఆర్‌ సినిమాల్లో వరసగా ఐటమ్‌ సాంగ్స్‌ చేశారు. అందరు టాప్‌ హీరోల సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసినప్పటికీ ఎన్టీఆర్‌ సినిమాలతోనే ఆమెకు స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందనేది వాస్తవం.    1980వ దశకం వచ్చేసరికి జ్యోతిలక్ష్మీ హవా తగ్గింది. జయమాలిని జోరు పెరిగింది. ఆ తర్వాత సిల్క్‌ స్మిత వచ్చినప్పటికీ జయమాలిని ఇమేజ్‌ మాత్రం తగ్గలేదు. దాదాపు 20 సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఆమె కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 600కి పైగా సినిమాల్లో నటించారు.    ఐటమ్‌ సాంగ్స్‌తోపాటు విఠలాచార్య డైరెక్షన్‌లో వచ్చిన జగన్మోహిని, గంధర్వకన్య వంటి సినిమాలు జయమాలినికి నటిగా, డాన్సర్‌గా మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా జగన్మోహిని రిలీజ్‌ అయిన టైమ్‌కే ఎన్టీఆర్‌ సింహబలుడు, కృష్ణ సింహగర్జన సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ రెండు సినిమాల కంటే జగన్మోహిని చిత్రానికి ఎక్కువ కలెక్షన్లు రావడం అందర్నీ ఆశ్చర్యపరచింది.    నటిగా బిజీగా ఉన్న సమయంలోనే 1994 జూలై 19న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అయిన పార్తీబన్‌ను వివాహం చేసుకున్నారు జయమాలిని. వీరి కుమార్తెకు చిన్నతనం నుంచే డాన్స్‌ నేర్పిస్తున్నప్పటికీ ఆమెను సినిమా రంగానికి మాత్రం తీసుకొచ్చే ఆలోచన లేదని చెప్పారు జయమాలిని. పెళ్లి తర్వాత ఆమె ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం విశేషం. అంతేకాదు, మీడియాకు కూడా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఈమధ్యకాలంలోనే అక్కడక్కడా జయమాలిని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.    జయమాలినిది ఒక విభిన్నమైన మనస్తత్వం. సినిమాల్లో కనిపించే జయమాలినికి, బయట కనిపించే జయమాలినికి అసలు పొంతనే ఉండదు. తెరపై ఐటమ్‌ గళ్‌గా కనిపించే ఆమె నిజజీవితంలో ఒక సాధారణ మహిళ అనిపిస్తుంది. మితభాషి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన కెరీర్‌ని ఎంతో వైవిధ్యంగా కొనసాగించారు. ఒక సాధారణ గృహిణిగా జీవితాన్ని గడపాలనుకున్నానని, అందుకే సినిమాలకు స్వస్తి పలికానని చెబుతారామె. ఏది ఏమైనా తన ఐటమ్‌ సాంగ్స్‌తో 20 సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలిగిన జయమాలిని అందరి మనసులు గెలుచుకున్నారు.     

దృశ్యం3కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది

Publish Date:Dec 22, 2025

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సిరీస్ వ‌చ్చాయి. వాటిలో దృశ్యం సిరీస్‌కి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటూనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు భాగాలు రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రానికి సంబంధించిన రెండు పార్టులు మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన మూడో భాగం మాత్రం మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. ఇటీవ‌లికాలంలో హిందీలో మంచి విజ‌యాన్ని సాధించిన సిరీస్ ఇదే కావ‌డం విశేషం. ప్రస్తుతం మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్ల‌కు సంబంధించిన షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, హిందీ వెర్ష‌న్‌ను అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్నారు.    ఇదిలా ఉంటే.. దృశ్యం3 హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో న‌డిచే ఈ వీడియోలో దృశ్యం 3 ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మూడో భాగంతో దృశ్యం క‌థ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని బాలీవుడ్ ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

Podharillu: మహాని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన భూషణ్!

Publish Date:Dec 23, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -11 లో....మహా దృష్టిలో పడడానికి చక్రి చాలా కష్టపడుతాడు. అన్ని రకాల షర్ట్స్ వేసుకొని వచ్చి మరి ఇంప్రెస్ చెయ్యాలని చూస్తే కనీసం తన వంక చూడను కూడా చూడదు మహా. హారిక ఒక చీర సెలక్ట్ చేస్తే రెడ్ కలర్ అంటే నచ్చదు వాడికి అని భూషణ్ వాళ్ళ అమ్మ అనగానే మంచి పాయింట్ దొరికిందని వెళ్లి నాకు ఈ రెడ్ కలర్ చీర బాగా నచ్చిందని మహా అంటుంది. ఇది మా వాడికి నచ్చదని వాళ్ళ అమ్మ అంటుంది. పర్లేదులే అమ్మ కట్టుకునేది తనే కదా.. తన ఇష్టం అనగానే మహా షాక్ అవుతుంది. మరొకవైపు మాధవ మేస్త్రి పనికి వెళ్తాడు. అక్కడ అందరు నీ పెళ్లి ఫిక్స్ అయిందా అని అడుగుతుంటే మాధవ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు వాళ్ళ చెల్లి, అన్న దగ్గరికి నారాయణ వెళ్తాడు. నా కొడుకుకి వచ్చిన సంబంధం కాన్సిల్ చేస్తారా అని గొడవకి దిగుతాడు. మాధవకి విషయం తెలిసి వెళ్లి నారాయణని తీసుకొని వస్తాడు. ఆ తర్వాత నిన్నటి నుండి పెళ్లి అంటున్నారు ఎవరికి అని ఆదిని చక్రి అడుగుతాడు. నా చెల్లికి అని ఆది చెప్తాడు. హారిక అనుకొని కంగ్రాట్స్ చెప్తాడు. అయ్యో నాకు పెళ్లి అయింది. ఆయనే నా భర్త అని హారిక చెప్తుంది. మహాని చూపించి తనే నా చెల్లి.. ఈ పెళ్లి తనకే అని అనగానే చక్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత భూషణ్ తో నువ్వు మాట్లాడమని మహాకి చెప్తుంది హారిక. భూషణ్ దగ్గరికి ఆది వెళ్లి బావ మీరు ఇద్దరు అలా బయటకు వెళ్లి ప్రశాంతంగా మాట్లాడుకొండి అని చెప్తాడు. మహా, భూషణ్ ని చక్రి బయటకు తీసుకొని వెళ్తాడు. నాకు జాబ్ చెయ్యాలని ఉందని తన డ్రీమ్స్ అన్ని మహా చెప్తుంటే.. అవసరం లేదు నాకు నచ్చింది చేస్తూ ఇంట్లో ఉంటే చాలని భూషణ్ కోప్పడతాడు. తరువాయి భాగంలో వీసాకీ అప్లై చెయ్యాలంటే మహాని ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని భూషణ్ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

షాకింగ్.. రాజమౌళి లాస్ట్ మూవీ వారణాసి..!

Publish Date:Dec 21, 2025

  దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో 'వారణాసి'(Varanasi) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చే చివరి సినిమా 'వారణాసి'నే అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. 'వారణాసి' తర్వాత ఆయన మహాభారతం ప్రాజెక్ట్ పై వర్క్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే దీనిని సినిమాలా కాకుండా సిరీస్ లా చేసే ఆలోచనలో ఉన్నారట. 'గేమ్ ఆఫ్ త్రోన్స్' తరహాలో వివిధ దేశాల ప్రేక్షకులకు చేరువయ్యేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందించాలని చూస్తున్నారట. (Mahabharata)   మహాభారతం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. పలు సీజన్లుగా తెరకెక్కించవచ్చు. ఒక్కో సీజన్ కి రెండు మూడేళ్లు పడుతుంది. ఈ లెక్కన అన్ని సీజన్లకు కలిపి కనీసం పది, పదిహేనేళ్ళు పట్టే అవకాశముంది. అందుకే 'వారణాసి' తర్వాత ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజమౌళి తన ఫోకస్ ని మహాభారత్ ప్రాజెక్ట్ పై పెట్టనున్నారని న్యూస్ వినిపిస్తోంది.   Also Read: ఎన్టీఆర్ సినిమాలో రజనీకాంత్.. స్క్రీన్స్ తగలబడతాయి!   అయితే ఇండస్ట్రీ సర్కిల్స్ మరో మాట కూడా వినిపిస్తోంది. 'వారణాసి' తర్వాత ఎన్టీఆర్ తో రాజమౌళి ఒక సినిమా చేస్తారని, ఆ తర్వాత మహాభారత ప్రాజెక్ట్ పైకి వెళ్తారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.  

Is Suriya's Karuppu looking to compete with Dhurandhar 2?

Publish Date:Dec 20, 2025

Suriya starrer Karuppu being directed by RJ Balaji has been struggling with financial issues even though movie is 95% complete. A song and few scenes needs to be shot and the makers are planning to complete the shoot in January. Now, the makers are planning to release on 19th March 2026.  Already, the movie has been facing huge troubles with low asking price from OTT platforms which makers are not happy with. Suriya has been facing huge downtime in his career, so he is expecting Karuppu to be his major comeback at the box office. Meanwhile, he moved on to his next Suriya46 with Venky Atluri.  Sithara Entertainments is producing the film and Mamitha Baiju is playing a leading role in it. The makers have wrapped up shoot completely and they have started post-production works locking May date. Hence, Karuppu cannot go for a further date than Atluri's film.  Meanwhile, Jithu Madhavan's cop film with Suriya will complete shoot by May and the actor, who is producing it himself, doesn't want to take it to 2027, unless works are pending or slowed down it seems.   So, Karuppu makers need to lock March date and so, despite competition with Dhurandhar and Yash's Toxic, they might for the date, say sources. With Dhurandhar being such a massive hit, Part-2 will shatter all box office records in opening weekend for sure. Going against it would be a suicide but makers have no choice, it seems. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969