English | Telugu

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

Publish Date:Jan 6, 2026

      -ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సాక్షి వైద్య చెప్పిన నిజం ఏంటి!  -దీంతో ఇక రూమర్స్ కి చెక్ పడినట్లేనా -అసలు సాక్షి వైద్య ఏమంటుంది       సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.       సాక్షి వైద్య రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఉస్తాద్ భగత్ సింగ్ లో కీలకమైన క్యారెక్టర్ ని పోషించే అవకాశం వచ్చింది. రేపే షూటింగ్ ని స్టార్ట్ చేస్తున్నామని యూనిట్ వాళ్ళు  ఫోన్ చేసి చెప్పారు.కానీ మా ఫ్యామిలీలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి కారణంగా వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. దీంతో డేట్స్ సర్దుబాటు లేకపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్  లో ఆఫర్ వదులుకోవాల్సి వచ్చింది. కానీ నా గత  చిత్రాలు ప్లాప్ కావడంతో నన్ను తీసేశారనే వార్తలు చాలానే వచ్చాయి. ప్రేక్షకులు కూడా అదే అనుకున్నారేమో. కానీ నేను మాత్రం అలాంటి వాటిని పట్టించుకోకుండా కెరీర్ లో ముందుకు వెళ్తుంటాను అని సాక్షి వైద్య చెప్పుకొచ్చింది.     సాక్షి వైద్య ఈ నెల 14 న సంక్రాంతి కానుకగా శర్వానంద్ తో కలిసి నారీనారీ నడుమమురారి తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రచార చిత్రాల ద్వారా అయితే సాక్షి వైద్య తన క్యారక్టర్ ద్వారా సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేయబోతోందని తెలుస్తుంది. 2023 లో అఖిల్ అక్కినేని,  సురేంద్ర రెడ్డి ల 'ఏజెంట్' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య వరుణ్ తేజ్ తో గాండీవ దారి అర్జున లో కూడా జత కట్టింది. నారీ నారీ నడుమ మురారి ఆమెకి మూడవ చిత్రం.       

CBI summons Thalapathy Vijay in Karur Stampede Case

Publish Date:Jan 6, 2026

Thalapathy Vijay has been trying to bring in a change in political environment of Tamil Nadu, which is dominated by DMK and AIADMK. He is eyeing to become Chief Minister of the state moving forward with his political party, TVK. But he is currently, in a huge soup with the Karur Stampede Case.  Government has handed over the case to CBI, after Vijay stated that he doesn't belive in TN Government and they have planned security lapses to put him in the pickle. Well, CBI has summoned Vijay to appear before them on 12th January, for the inquiry.  The actor-politician is currently looking at his final movie, Jana Nayagan release this weekend on 9th January. The movie is a remake of Bhagavanth Kesari and it is clashing with The Raja Saab, starring Prabhas. At the moment, except for fans of Vijay, no one is really interested to watch JN, being a remake.  But the one last film of Vijay sentiment might work in favor of it. Mamitha Baiju, Pooja Hegde and Bobby Deol are playing prominent lead roles in the film and H.Vinoth has directed it. It looks like before election, TN will see more drama than ever surrounding Vijay, with this incident.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

ఇళయరాజా వల్లే ఎ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యాడు.. ఎలాగంటే?

Publish Date:Jan 5, 2026

(జనవరి 6 ఎ.ఆర్‌.రెహమాన్‌ పుట్టినరోజు సందర్భంగా..)   - రెహమాన్‌ను ఇళయరాజా ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు? - ఇళయరాజా, రెహమాన్‌ మధ్య గొడవకు కారణమైన సినిమా ఏది? - మణిరత్నం, ఇళయరాజా కాంబినేషన్‌ బ్రేక్‌ అవ్వడానికి కారణం ఎవరు?   సంగీతాన్ని ఆస్వాదించనివారు ఎవరూ ఉండరు. ఏదో ఒక సందర్భంలో తమకు నచ్చిన సంగీతాన్ని వింటూ సేద తీరుతుంటారు. సినిమా అనేది మొదలైన తర్వాత ఆ సంగీతానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటల పాత్ర ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. వందేళ్లు పైబడిన ఇండియన్‌ సినిమాల్లో ఎంతో మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ తమ సంగీతంతో అలరించారు. దక్షిణ భారత చిత్రాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎంతో మంది టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు ఎప్పటికీ మర్చిపోలేని పాటల్ని అందించారు.    సినీ సంగీతంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన వారిలో ఇళయరాజాను ప్రధానంగా చెప్పుకోవాలి. అప్పటివరకు వస్తున్న సంగీతానికి భిన్నమైన సంగీతాన్ని శ్రోతలకు పరిచయం చేశారు ఇళయరాజా. శ్రోతలకు వీనుల విందైన సంగీతాన్ని అందించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక దశలో సౌత్‌ ఇండియన్‌ సినిమా సంగీతాన్ని శాసించిన ఇళయరాజా.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన తర్వాత అంతటి ప్రభావాన్ని వేసిన సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌. తనకంటూ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకొని ఇళయరాజాను సైతం పక్కన పెట్టే స్థాయికి వెళ్లిపోయాడు.    ఎ.ఆర్‌.రెహమాన్‌ అనే సంగీత దర్శకుడు పరిచయం కావడం వెనుక ఇళయరాజా హస్తం ఉందనే విషయం చాలా మందికి తెలీదు. ఒక విధంగా అతని కాంపౌండ్‌ నుంచి వచ్చినవాడే రెహమాన్‌. సంగీత దర్శకుడు కాక మునుపు కమర్షియల్స్‌కు జింగిల్స్‌, స్టేజ్‌ షోలు చేసేవాడు. ఆ క్రమంలోనే ఇళయరాజా దగ్గర ప్రోగ్రామర్‌గా జాయిన్‌ అయ్యాడు. ఎన్నో సినిమాలకు ఇళయారాజా దగ్గర పనిచేశాడు. అలా ఆయన దగ్గర నుంచి సినిమా సంగీతానికి సంబంధించిన ఎన్నో మెళకువలు తెలుసుకున్నాడు.    నాగార్జున, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నప్పుడు ఒక చిన్న విషయంలో హర్ట్‌ అయిన ఇళయరాజా.. రెహమాన్‌ను తన స్టూడియో నుంచి ఇంటికి పంపించేశారు. డైరెక్టర్‌ మణిరత్నం సమక్షంలోనే ‘జల్లంత కవ్వింత కావాలిలే..’ అనే పాటను కంపోజ్‌ చేస్తున్నారు ఇళయరాజా. ఆ పాట నడకలో కొన్ని మార్పులను తన అభిప్రాయంగా చెప్పాడు రెహమాన్‌. అది ఇళయరాజాకు నచ్చలేదు. దాంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ సమయంలో రెహమాన్‌ చేసిన సూచనలు మణిరత్నంకు బాగా నచ్చాయి.    ఇది జరిగిన కొన్నాళ్లకు తమిళ దర్శకుడు కె.బాలచందర్‌ తన సొంత నిర్మాణ సంస్థలో మణిరత్నం దర్శకత్వంలో ‘రోజా’ చిత్రం చెయ్యాలనుకున్నారు. అప్పటివరకు మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ ఇళయారాజాయే సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ప్రారంభమయ్యే నాటికి లండన్‌లో సింఫనీ చేసే పనిలో ఉన్నారు ఇళయరాజా. అప్పుడు మణిరత్నం మనసులో రెహమాన్‌ కదిలాడు. ఇదే విషయాన్ని కె.బాలచందర్‌కి చెప్పారు. వెంటనే అతన్ని పిలిపించి ఒక పాటకు ట్యూన్‌ చెయ్యమన్నారు. అలా రెహమాన్‌ మొదట ట్యూన్‌ చేసిన పాట ‘చిన్ని చిన్ని ఆశ..’. ఈ ఈ ట్యూన్‌ మణిరత్నంకి, బాలచందర్‌కి బాగా నచ్చింది. అలా ‘రోజా’ చిత్రానికి సంగీతం సమకూర్చే బాధ్యతను రెహమాన్‌కి అప్పగించారు.    ‘రోజా’ సినిమాతో మొదలైన మణిరత్నం, రెహమాన్‌ల సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 19 సినిమాలు వచ్చాయి. అంతకుముందు ఇళయరాజా కాంబినేషన్‌లో 10 సినిమాలు చేశారు మణిరత్నం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా దళపతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇళయరాజాతో కలిసి సినిమా చెయ్యలేదు మణిరత్నం. అప్పటి నుంచి రెహమాన్‌తోనే కొనసాగుతున్నారు. తన కెరీర్‌లో 29 సినిమాలు డైరెక్ట్‌ చేసిన ఆయన ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్లతో మాత్రమే మ్యూజిక్‌ చేయించుకోవడం విశేషం. 

విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్.. ముగ్గురు పిల్లల విషయంలో కీలక నిర్ణయం 

Publish Date:Jan 5, 2026

        -భారతీయ మీడియా వర్గాల్లో మరో సంచలనం  -16 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏంటి -సోషల్ మీడియా వేదికగా  మహి విజ్ చేసిన పోస్ట్ ఏంటి -మరి ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి!       ఈ మధ్య కాలంలో భార్యా, భర్తలైన సినీ, టీవీ సెలబ్రటీలు పోటాపోటీగా విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినా వాళ్లే కాకుండా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వాళ్ళు సైతం విడాకులు ప్రకటిస్తు ఉండటం అభిమానులని కలవర పరుస్తు ఉంది. రీసెంట్ గా మరో  సెలబ్రటీ కపుల్ డైవర్స్ తో తమ పదహారు సంవత్సరాల వివాహ బంధానికి సెండ్ ఆఫ్ చెప్పి అభిమానులకి కలవర పాటుకి గురి చేసింది.   మహి విజ్, జై భానుషాలి.. బాలీవుడ్ సినీ,టీవీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి తిరుగులేని ఆది పత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. 2011 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా మహి విజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకులపై స్పందిస్తు 'ఇద్దరం విడిపోయినా  కూడా పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మేము వేరు దారుల్లో నడుస్తున్నా విడాకుల  నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ,డ్రామా లేదు. కేవలం ప్రశాంతత కోసమే విడాకుల నిర్ణయాన్ని ఎంచుకున్నాం..స్నేహబంధం కొనసాగుతూనే  ఒకరిని ఒకరం గౌరవించుకునే విషయంలో రాజీ పడం. ఈ సమయంలో అభిమానుల ప్రేమ, గౌరవం, దయ అవసరం అని తెలిపింది.     Also read:  ధురంధర్ తో కొత్త లోక  కలిస్తే.. మీకు ఓకేనా!     పదిహేడు సంవత్సరాల వయసులో మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించిన మహి విజ్ టెలివిజన్   రంగంలో సుమారు 30 సిరీస్ ల వరకు చేసింది. గత ఏడాది డిసెంబర్ 2 నుంచి కలర్స్ టీవీ లో వస్తున్న సెహర్-హోనే కో హై లో చేస్తుంది. సినిమాల విషయానికి వస్తే 2004 లో తెలుగులో ప్రభు దేవా హీరోగా వచ్చిన తపన అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మలయాళంలో, కన్నడంలో ఒక సినిమా చేసింది. ఇక  జై భానుషాలి విషయానికి వస్తే తను కూడా మోడల్ గానే  కెరీర్ స్టార్ట్ చేసి సినీ, టీవీ, వెబ్ సిరీస్  నటుడుగా, అనేక షోస్ కి ప్రెజంటర్ గా చేస్తు తనదైన శైలిలో దూసుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ మార్చిలో అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన బి హ్యాపీ అనే మూవీలో కీలకమైన క్యారక్టర్ లో కనిపించాడు.  

ఈ సంక్రాంతికి ప్రదీప్ - సుధీర్ పెళ్లిళ్ల మీద పందేలు!

Publish Date:Jan 6, 2026

ఇంకొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతోంది. బుల్లితెరలో సందడి మొదలయ్యింది. రకరకాల షోస్ ని పండగ సందర్భంగా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఇక జీ తెలుగులో సంక్రాంతి అల్లుళ్ళు పండగకు వస్తున్నారు" పేరుతో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒక షో ప్రసారం కాబోతోంది. దీనికి జడ్జెస్ గా ప్రదీప్-సుధీర్ ఉన్నారు.  "ప్రదీప్ ని సంక్రాంతికి అల్లుడిని చేసే బాధ్యత నాది" అంటూ హీరోయిన్ రోజా చెప్పింది. "సుధీర్ ని సంక్రాంతికి అల్లుడిని చేసే బాధ్యత నాది" అంటూ శేఖర్ మాష్టర్ చెప్పాడు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అనుకున్నారు. ఇక పెళ్లి కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ప్రదీప్ - సుధీర్ ఇద్దరూ వచ్చి "పందేలేదో కోళ్ల మీద వేసుకోవాలి కానీ మా పెళ్లిళ్ల మీద వేసుకుంటారేమిటి" అంటూ ఇద్దరూ అడిగేసారు.  ఇక ఈ ఈవెంట్ కి కూడా జీ లిటిల్ చాంప్స్ షోలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా ఉండే లిటిల్ సింగర్ వరుణవి కూడా వచ్చేసింది. దాంతో సుధీర్ వచ్చి "పండగ ఈవెంట్ లో కూడా అడుగు పెట్టేశావా" అని అన్నాడు. వెంటనే ఆ చిన్నారి "మనం అడుగు పెట్టాకే కదా పండగ మొదలయ్యేది" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ షోకి మాస్ మహారాజ రవితేజ, కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు బుల్లితెర మీద కనిపించేవాళ్లంతా ఈ ఈవెంట్ కి వచ్చారు. "అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి" అంటూ రవితేజ గురించి ఇంట్రడక్షన్ ని సుధీర్ ఇస్తూండేసరికి "మళ్ళీ మొదలు పెట్టాడురా బాబోయ్" అంటూ రవితేజ కామెడీగా అసహనం వ్యక్తం చేశారు. ఇక నెటిజన్స్ ఐతే సుధీర్ - ప్రదీప్ కాంబో చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. బెస్ట్ ఎంటర్టైనర్స్ అంతా కలిసి వచ్చారు. అబ్బా సూపర్ సుధీర్ ఉంటే చాలు. ఇంకా తోడుగా ప్రదీప్ రచ్చ రచ్చే..బొమ్మ అదుర్స్ కదు..టిఆర్పి పగిలిపోద్ది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Tiger Shroff to be part of Allu Arjun and Atlee film?

Publish Date:Jan 6, 2026

Allu Arjun has delivered a massive blockbuster with Pushpa 2 The Rule and his market in North India is huge. Taking that into consideration, Sun Pictures have accepted to give Atlee, a free hand to make his sci-fi fantasy drama on a never-seen-before scale with Hollywood VFX Studios, Action Co-ordinators collaborating on it.  Now, the reports suggest that the movie could be spilt into two parts and both will be shot at one go. The movie team won't be going back to shoot the second part but rather they would be spending 6-8 months on VFX and scale of the second part, if the reports are true.  Currently, the reports suggest that Tiger Shroff is in talks and he even joined the film for a crucial part. Will he be playing an antagonist or supporting protagonist is yet to be known. Vijay Sethupathi is said to be a part of the film. Already, Deepika Padukone is part of the film and she completed two schedules.  Mrunal Thakur and Janhvi Kapoor are said to be part of the project as there will be a triple role for Allu Arjun with connection between past lives and future. We have to wait and see, how many of these reports will emerge to be true. Atlee is currently working on meeting a Hollywood Studio to distribute the film, state reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969