English | Telugu

వారెవా వారెవా.. లెనిన్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Publish Date:Jan 5, 2026

  అఖిల్ అక్కినేని(Akhil Akkineni) టాలెంట్ కి తగ్గ సరైన సినిమా ఇంకా పడలేదు అనేది అక్కినేని అభిమానుల అభిప్రాయం. అఖిల్ నెక్స్ట్ మూవీ 'లెనిన్'(Lenin) ఆ లోటుని భర్తీ చేస్తుంది అనేది వారి నమ్మకం.    మనం ఎంట‌ర్‌ప్రైజెస్, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ 'లెనిన్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. త‌మన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ 'వారెవా వారెవా' విడుదలైంది. (Lenin First Single)   'వారెవా వారెవా'(VaareVaa VaareVaa) లిరిక‌ల్ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. "కట్టుకోబోయేటోడికి కళ్ళతో మాట్లాడినా వినపడతాదంట.. ఏంది విన్నావా.. బంగారం" అంటూ అఖిల్ తో భాగ్యశ్రీ చెప్పే మాటతో పాట ప్రారంభమైంది. త‌మన్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ సాంగ్ ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది.    Also Read: రాశికి క్షమాపణలు చెప్పిన అనసూయ.. తప్పంతా వాళ్ళదే..!   "ఇన్నావా ఇన్నావా కన్నెపిల్ల ఏమందో ఇన్నావా" అంటూ అనంత శ్రీరామ్ అందించిన సాహిత్య ఆకట్టుకుంది. ఇక సింగర్స్ శ్వేతా మోహ‌న్‌, జుబిన్ నౌటియాల్ త‌మ వాయిస్‌తో పాట‌కు ఓ ఎమోష‌న‌ల్ ఫీల్‌ను తీసుకొచ్చారు.   శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోన్న 'లెనిన్' సినిమా.. ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. అలాగే ఈ మూవీని సమ్మర్‌లో మే 1న విడుదల చేయనున్నట్లు లిరికల్ వీడియోలో మేకర్స్ రివీల్ చేశారు.    

Akhil Lenin first single is an enchanting melody

Publish Date:Jan 5, 2026

The makers of Lenin have unveiled the melodious romantic track “Vaare Vaa Vaare Vaa”, which is already striking a chord with music lovers. Beautifully rendered by Shweta Mohan and Jubin Nautiyal, the song stands out for its soulful vocals and emotional depth. Lyricist Anantha Sriram adds poetic finesse, enhancing the song’s romantic appeal. Composed by Thaman S, the track beautifully captures the emotional core of the film. The music complements the on-screen chemistry between the lead pair and elevates the narrative mood, further increasing anticipation around the film. With its soothing melody and heartfelt presentation, “Vaare Vaa Vaare Vaa” is being hailed as a standout addition to the album. With nearly 70% of the shoot completed, Lenin is progressing at a brisk pace and is gearing up for a Summer theatrical release. The film is produced by Manam Enterprises LLP and Sithara Entertainments, and presented by Annapurna Studios. Directed by Murali Kishor Abburu, the film stars Akhil Akkineni and Bhagyashri Borse in the lead roles, Lenin is looking for 1st May release.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   

ఇళయరాజా వల్లే ఎ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయ్యాడు.. ఎలాగంటే?

Publish Date:Jan 5, 2026

(జనవరి 6 ఎ.ఆర్‌.రెహమాన్‌ పుట్టినరోజు సందర్భంగా..)   - రెహమాన్‌ను ఇళయరాజా ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు? - ఇళయరాజా, రెహమాన్‌ మధ్య గొడవకు కారణమైన సినిమా ఏది? - మణిరత్నం, ఇళయరాజా కాంబినేషన్‌ బ్రేక్‌ అవ్వడానికి కారణం ఎవరు?   సంగీతాన్ని ఆస్వాదించనివారు ఎవరూ ఉండరు. ఏదో ఒక సందర్భంలో తమకు నచ్చిన సంగీతాన్ని వింటూ సేద తీరుతుంటారు. సినిమా అనేది మొదలైన తర్వాత ఆ సంగీతానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటల పాత్ర ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. వందేళ్లు పైబడిన ఇండియన్‌ సినిమాల్లో ఎంతో మంది మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ తమ సంగీతంతో అలరించారు. దక్షిణ భారత చిత్రాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎంతో మంది టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు ఎప్పటికీ మర్చిపోలేని పాటల్ని అందించారు.    సినీ సంగీతంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన వారిలో ఇళయరాజాను ప్రధానంగా చెప్పుకోవాలి. అప్పటివరకు వస్తున్న సంగీతానికి భిన్నమైన సంగీతాన్ని శ్రోతలకు పరిచయం చేశారు ఇళయరాజా. శ్రోతలకు వీనుల విందైన సంగీతాన్ని అందించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక దశలో సౌత్‌ ఇండియన్‌ సినిమా సంగీతాన్ని శాసించిన ఇళయరాజా.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన తర్వాత అంతటి ప్రభావాన్ని వేసిన సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌. తనకంటూ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకొని ఇళయరాజాను సైతం పక్కన పెట్టే స్థాయికి వెళ్లిపోయాడు.    ఎ.ఆర్‌.రెహమాన్‌ అనే సంగీత దర్శకుడు పరిచయం కావడం వెనుక ఇళయరాజా హస్తం ఉందనే విషయం చాలా మందికి తెలీదు. ఒక విధంగా అతని కాంపౌండ్‌ నుంచి వచ్చినవాడే రెహమాన్‌. సంగీత దర్శకుడు కాక మునుపు కమర్షియల్స్‌కు జింగిల్స్‌, స్టేజ్‌ షోలు చేసేవాడు. ఆ క్రమంలోనే ఇళయరాజా దగ్గర ప్రోగ్రామర్‌గా జాయిన్‌ అయ్యాడు. ఎన్నో సినిమాలకు ఇళయారాజా దగ్గర పనిచేశాడు. అలా ఆయన దగ్గర నుంచి సినిమా సంగీతానికి సంబంధించిన ఎన్నో మెళకువలు తెలుసుకున్నాడు.    నాగార్జున, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నప్పుడు ఒక చిన్న విషయంలో హర్ట్‌ అయిన ఇళయరాజా.. రెహమాన్‌ను తన స్టూడియో నుంచి ఇంటికి పంపించేశారు. డైరెక్టర్‌ మణిరత్నం సమక్షంలోనే ‘జల్లంత కవ్వింత కావాలిలే..’ అనే పాటను కంపోజ్‌ చేస్తున్నారు ఇళయరాజా. ఆ పాట నడకలో కొన్ని మార్పులను తన అభిప్రాయంగా చెప్పాడు రెహమాన్‌. అది ఇళయరాజాకు నచ్చలేదు. దాంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ సమయంలో రెహమాన్‌ చేసిన సూచనలు మణిరత్నంకు బాగా నచ్చాయి.    ఇది జరిగిన కొన్నాళ్లకు తమిళ దర్శకుడు కె.బాలచందర్‌ తన సొంత నిర్మాణ సంస్థలో మణిరత్నం దర్శకత్వంలో ‘రోజా’ చిత్రం చెయ్యాలనుకున్నారు. అప్పటివరకు మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ ఇళయారాజాయే సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ప్రారంభమయ్యే నాటికి లండన్‌లో సింఫనీ చేసే పనిలో ఉన్నారు ఇళయరాజా. అప్పుడు మణిరత్నం మనసులో రెహమాన్‌ కదిలాడు. ఇదే విషయాన్ని కె.బాలచందర్‌కి చెప్పారు. వెంటనే అతన్ని పిలిపించి ఒక పాటకు ట్యూన్‌ చెయ్యమన్నారు. అలా రెహమాన్‌ మొదట ట్యూన్‌ చేసిన పాట ‘చిన్ని చిన్ని ఆశ..’. ఈ ఈ ట్యూన్‌ మణిరత్నంకి, బాలచందర్‌కి బాగా నచ్చింది. అలా ‘రోజా’ చిత్రానికి సంగీతం సమకూర్చే బాధ్యతను రెహమాన్‌కి అప్పగించారు.    ‘రోజా’ సినిమాతో మొదలైన మణిరత్నం, రెహమాన్‌ల సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు 19 సినిమాలు వచ్చాయి. అంతకుముందు ఇళయరాజా కాంబినేషన్‌లో 10 సినిమాలు చేశారు మణిరత్నం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా దళపతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇళయరాజాతో కలిసి సినిమా చెయ్యలేదు మణిరత్నం. అప్పటి నుంచి రెహమాన్‌తోనే కొనసాగుతున్నారు. తన కెరీర్‌లో 29 సినిమాలు డైరెక్ట్‌ చేసిన ఆయన ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్లతో మాత్రమే మ్యూజిక్‌ చేయించుకోవడం విశేషం. 

విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్.. ముగ్గురు పిల్లల విషయంలో కీలక నిర్ణయం 

Publish Date:Jan 5, 2026

        -భారతీయ మీడియా వర్గాల్లో మరో సంచలనం  -16 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏంటి -సోషల్ మీడియా వేదికగా  మహి విజ్ చేసిన పోస్ట్ ఏంటి -మరి ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి!       ఈ మధ్య కాలంలో భార్యా, భర్తలైన సినీ, టీవీ సెలబ్రటీలు పోటాపోటీగా విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినా వాళ్లే కాకుండా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వాళ్ళు సైతం విడాకులు ప్రకటిస్తు ఉండటం అభిమానులని కలవర పరుస్తు ఉంది. రీసెంట్ గా మరో  సెలబ్రటీ కపుల్ డైవర్స్ తో తమ పదహారు సంవత్సరాల వివాహ బంధానికి సెండ్ ఆఫ్ చెప్పి అభిమానులకి కలవర పాటుకి గురి చేసింది.   మహి విజ్, జై భానుషాలి.. బాలీవుడ్ సినీ,టీవీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి తిరుగులేని ఆది పత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. 2011 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా మహి విజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకులపై స్పందిస్తు 'ఇద్దరం విడిపోయినా  కూడా పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మేము వేరు దారుల్లో నడుస్తున్నా విడాకుల  నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ,డ్రామా లేదు. కేవలం ప్రశాంతత కోసమే విడాకుల నిర్ణయాన్ని ఎంచుకున్నాం..స్నేహబంధం కొనసాగుతూనే  ఒకరిని ఒకరం గౌరవించుకునే విషయంలో రాజీ పడం. ఈ సమయంలో అభిమానుల ప్రేమ, గౌరవం, దయ అవసరం అని తెలిపింది.     Also read:  ధురంధర్ తో కొత్త లోక  కలిస్తే.. మీకు ఓకేనా!     పదిహేడు సంవత్సరాల వయసులో మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించిన మహి విజ్ టెలివిజన్   రంగంలో సుమారు 30 సిరీస్ ల వరకు చేసింది. గత ఏడాది డిసెంబర్ 2 నుంచి కలర్స్ టీవీ లో వస్తున్న సెహర్-హోనే కో హై లో చేస్తుంది. సినిమాల విషయానికి వస్తే 2004 లో తెలుగులో ప్రభు దేవా హీరోగా వచ్చిన తపన అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మలయాళంలో, కన్నడంలో ఒక సినిమా చేసింది. ఇక  జై భానుషాలి విషయానికి వస్తే తను కూడా మోడల్ గానే  కెరీర్ స్టార్ట్ చేసి సినీ, టీవీ, వెబ్ సిరీస్  నటుడుగా, అనేక షోస్ కి ప్రెజంటర్ గా చేస్తు తనదైన శైలిలో దూసుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ మార్చిలో అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన బి హ్యాపీ అనే మూవీలో కీలకమైన క్యారక్టర్ లో కనిపించాడు.  

శివుడిని ధ్యానిస్తూ ఆవుకు అరటిపళ్ళు తినిపిస్తున్న గుప్పెడంత మనసు జగతి మేడం

Publish Date:Jan 4, 2026

  జ్యోతి పూర్వాజ్ గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అందులో రిషి రోల్ కి తల్లిగా జగతి మేడంగా బాగా పేరు తెచ్చుకుంది. హాట్ ఫొటోస్ తో ఆడియన్స్ ముందు కనిపించే జ్యోతి రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఇంటరెస్టింగ్ అండ్ డివైన్ ఫొటోస్ తో కనిపించింది.    శివాలయానికి వెళ్లిన జ్యోతి శివుడిని ఆరాధిస్తూ ఆయన ధ్యానంలో మునిగితేలుతోంది. అలాగే అక్కడే ఉన్న గోశాలలో ఆవులకు అరటిపళ్ళు తినిపిస్తూ ఉన్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.    ఇక నెటిజన్స్ ఆమె పెట్టె ప్రతీ పోస్ట్ కి నెగటివ్ గా కామెంట్స్ చేసేవాళ్ళు కానీ ఈ పిక్స్ దగ్గర మాత్రం ఎలాంటి బాడ్ కామెంట్స్ పెట్టలేదు. "బాహ్యప్రపంచానికి దూరంగా, మనస్సుకు దగ్గరగా..హ్యాపీ జనవరి మేడం గారు..ఇదే అసలైన నువ్వు" అంటూ కొంతమంది కామెంట్స్ పెట్టారు.    ప్రస్తుతానికి జ్యోతి పూర్వాజ్ బుల్లితెర బ్రేక్ ఇచ్చింది. "కిల్లర్" అనే మూవీలో ఆమె ఒక ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతోంది. గుప్పెడంత మనసు సీరియల్ తో ఆమె నటనకు మంచి మార్క్స్ పడ్డాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇక్కడ తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన నటీమణుల్లో ఈమె కూడా ఒకరు.   https://www.instagram.com/p/DTCqX-MgSeP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==  

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Is Allu Arjun and Lokesh movie Irumbukai Mayavi?

Publish Date:Jan 5, 2026

Allu Arjun revealed in his previous interviews that he always has been intended to grow his market in Tamil Nadu. He stated that he was born in Chennai and brought up there till they moved to Hyderabad, hence, he wanted to debut in Tamil language. Now, he is working with Atlee, on a Pan-India film, in Sun Pictures production.  His next film is said to be directed by Lokesh Kanagaraj while there is a huge amount of confusion, if he would work with Trivikram Srinivas on God of War or not. The actor is known to take one film at a time but he announced his next big projects before Pushpa and then scrapped most of them.  Now, he might wait for Atlee's movie to finish shoot and then decide on his next project. Or he might look at the reception and decide on his future project, if it should be Pushpa 3 or not. For now, the gossips are strong about Lokesh directing Allu Arjun and it would be Irumbukai Mayavi.  Lokesh earlier stated that he used most of the scenes and plot points from his IM script that he wanted to do with Suriya. He also stated that many want him to go back to that script but he is writing fresh ideas. Aamir Khan has expressed his frustration about his cameo in Rajinikanth's Coolie.  So, Lokesh Kanagaraj is forced to scrap his potential project with Aamir. He did talk about taking LCU forward with Kaithi 2 but the project is not moving forward as anticipated due to his fees and budget disputes. There is all chance for Allu Arjun to act in Lokesh's direction but will it start immediately?  Even close circles of the actor and director cannot say, it for sure. Currently, Allu Arjun could be concentrating only on delivering another big grosser after Pushpa 2 with Atlee's film to grow his market and solidify it. So, the discussion about story with Lokesh might not have started yet as some reports suggest.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969