English | Telugu

ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాదు.. కుమారస్వామిగా మరో హీరో!

Publish Date:Jan 8, 2026

  త్రివిక్రమ్ కు బిగ్ షాక్ 'గాడ్ ఆఫ్ వార్' కథతో మరో భారీ ప్రాజెక్ట్ కుమారస్వామి పాత్రలో ఆ స్టార్ హీరో?  ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఏం చేయనున్నారు?   'గాడ్ ఆఫ్ వార్' కుమారస్వామి కథ ఆధారంగా దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కుమారస్వామిగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడా? అల్లు అర్జున్ నటిస్తాడా? అనే సస్పెన్స్ నెలకొంది. అయితే వీరికంటే ముందు కుమారస్వామిగా మరో హీరో నటించే అవకాశం కనిపిస్తోంది. (God of War)   కుమారస్వామి కథతో తానొక భారీ ప్రాజెక్ట్ ని చేయనున్న విషయాన్ని తాజాగా దర్శకుడు కిషోర్ తిరుమల రివీల్ చేశారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చారు కిషోర్ తిరుమల.   నాలుగేళ్ళ క్రితమే కుమారస్వామి కథ ఆధారంగా 'గౌరీ తనయ' పేరుతో మైథలాజికల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశానని, అన్నీ కుదిరితే త్వరలోనే భారీస్థాయిలో తెరపైకి తీసుకొస్తానని కిషోర్ తిరుమల తెలిపారు.   'గౌరీ తనయ' కథను కిషోర్ ఇప్పటికే హీరో నానికి వినిపించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చేయడానికి నాని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం 'ది ప్యారడైజ్'తో బిజీగా ఉన్న నాని.. ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఇదేననే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే జరిగితే.. త్రివిక్రమ్ కి ఇది బిగ్ షాక్ అని చెప్పవచ్చు.   టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. ఆయనకు పురాణాలపై ఎంతో పట్టుంది. అందుకే తన మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పెద్దగా ఎవరూ టచ్ చేయని కుమారస్వామి కథతో భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఊహించనివిధంగా ఇదే కథతో బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉందని, త్వరలోనే సినిమా చేస్తానని కిషోర్ తిరుమల ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కన్నా ముందు కిషోర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కినా ఆశ్చర్యంలేదు.    

Toxic Teaser: Yash sheds all inhibitions

Publish Date:Jan 8, 2026

Yash, with KGF franchise, became one of the biggest stars of Indian Cinema. He took 4 years to complete his next film, Toxic. The movie is gearing up for a big release on 19th March. Now, the makers have released the special birthday teaser for the film, on the occasion of Yash's birthday.  The teaser showcases him taking on a mob boss family when he is cremating his son's body. While this is a simple situation, the teaser takes a different turn when we see Yash, as Raya, completing a sexual encounter in his car and then proceeding to bomb entire cemetary, with a cigar in his hand.  With such a hyper action representation, the movie makers have given a strong statement about it is going to be a fever dream for all Grown-ups. And it also proves the title, Toxic, as the representation is completely opposite to true heroship that we normally read about.  Nayanthara, Tara Sutaria, Rukmini Vasanth, Kiara Advani, Huma Qureshi are playing leading lady roles in this movie directed by Geethu Mohandas. The movie shoot is completed and post production works are going on at a full pace for the determined release date.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

తన కథలతో అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌!

Publish Date:Jan 7, 2026

(జనవరి 7 కె.భాగ్యరాజా పుట్టినరోజు సందర్భంగా..) ప్రస్తుతం హీరోలను బట్టి కథలు తయారు చేస్తున్నారు. ఒక హీరోకి ఎంత మార్కెట్‌ ఉంది, ఎలాంటి ఇమేజ్‌ ఉంది అనేది ప్రధానంగా చూస్తున్నారు. కానీ, కానీ,  పాత రోజుల్లో మొదట కథ అనుకొని దాన్ని పూరిస్థాయిలో సిద్ధం చేసిన తర్వాత ఆ కథకు ఏ హీరో అయితే సూట్‌ అవుతాడు అనేది ఆలోచించేవారు. 1980కి ముందు సినిమాలు ఈ విధంగానే రూపొందేవి. ఆ తర్వాత హీరోని బట్టి కథలు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో కూడా కథను నమ్ముకొని సినిమాలు చేసిన దర్శకనిర్మాతలు ఉన్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు కె.భాగ్యరాజా.    ఎన్నో అద్భుతమైన సినిమాలకు రూపొందించి భారతదేశంలోనే అత్యుత్తమ కథా రచయితగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కె.భాగ్యరాజ్‌. ఆయన తన సినిమాల్లోని కథకు, కథనానికి ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. తమిళ్‌లో ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్‌ అయ్యాయి. ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ శాతం కుటుంబకథా చిత్రాలే కావడం విశేషం.    1953 జనవరి 7న తమిళనాడులోని వెల్లన్‌ కోయిల్‌లో కృష్ణస్వామి, అమరావతియమ్మ దంపతులకు జన్మించారు కృష్ణస్వామి భాగ్యరాజ్‌. చిన్న తనం నుంచి సినిమాలపైన ఆసక్తి పెంచుకున్న భాగ్యరాజ్‌ తను చూసిన సినిమాల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషించేవారు. అంతకంటే బాగా కథ ఎలా రాయాలో స్నేహితుల దగ్గర డిస్కస్‌ చేసేవారు. సినిమాల్లో పనిచేయాలనే ఆసక్తి ఆయనకు బాగా ఉండేది. అలా గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట భారతీరాజా దగ్గర సహాయకుడిగా పనిచేశారు. భారతీరాజా రూపొందించిన అనేక సినిమాలకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. 1979లో వచ్చిన సువరిల్లధ చిత్తిరంగళ్‌ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా నటించారు. స్వీయ దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగులో రీమేక్‌ అయ్యాయి.    1980 నుంచి 1990 వరకు భాగ్యరాజ్‌ చేసిన సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఆయన సినిమాల్లోని కథ, కథనాలు వారిని ఆకట్టుకునేవి. ఒక దశలో కె.భాగ్యరాజ్‌ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికి 1981లో ప్రవీణ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే 1983లో ఆమెకు కామెర్ల వ్యాధి సోకి మరణించారు. ఆ తర్వాత తన సహనటి పూర్ణిమా జయరామ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు శంతను భాగ్యరాజ్‌, కుమార్తె శరణ్య భాగ్యరాజ్‌ ఉన్నారు. వీరు కూడా కొన్ని సినిమాల్లో నటించారు. భాగ్యరాజ్‌ సినిమాలు విలక్షణమైన కథలతో ఉంటాయి. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. అతని స్క్రీన్‌ప్లేకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. దానితోనే ఆయన ఎక్కువ విజయాలు సాధించారు.   1987లో తమిళ్‌లో రూపొందిన ఎంగ చిన్న రాసా చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత అదే సినిమాను చిన్నరాజా పేరుతో తెలుగులో డబ్‌ చేసి విడుదల చేశారు. 1992లో ఎంగ చిన్నరాసా చిత్రాన్ని హిందీలో బేటా పేరుతో రీమేక్‌ చేశారు. 1993లో అబ్బాయిగారు పేరుతో ఆ సినిమాను ఇ.వి.వి.సత్యనారాయణ రీమేక్‌ చేశారు. ఇలా ఆయన చేసిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్‌ అయ్యాయి. అలా ఎక్కువ రీమేక్‌ అయిన సినిమాలు భాగ్యరాజ్‌వి కావడం విశేషం. తను డైరెక్ట్‌ చేసిన సినిమాల్లోనే కాక ఇతర దర్శకులు రూపొందించిన సినిమాల్లోనే భాగ్యరాజ్‌ ఎక్కువగా నటించారు. ఇటీవలి కాలంలో అడపా దడపా కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. తమిళ టీవీ ఛానల్స్‌ నిర్వహించే పలు షోలకు, సీరియల్స్‌కు స్క్రిప్ట్‌ అందించడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు కె.భాగ్యరాజ్‌.

విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్.. ముగ్గురు పిల్లల విషయంలో కీలక నిర్ణయం 

Publish Date:Jan 5, 2026

        -భారతీయ మీడియా వర్గాల్లో మరో సంచలనం  -16 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏంటి -సోషల్ మీడియా వేదికగా  మహి విజ్ చేసిన పోస్ట్ ఏంటి -మరి ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి!       ఈ మధ్య కాలంలో భార్యా, భర్తలైన సినీ, టీవీ సెలబ్రటీలు పోటాపోటీగా విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినా వాళ్లే కాకుండా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వాళ్ళు సైతం విడాకులు ప్రకటిస్తు ఉండటం అభిమానులని కలవర పరుస్తు ఉంది. రీసెంట్ గా మరో  సెలబ్రటీ కపుల్ డైవర్స్ తో తమ పదహారు సంవత్సరాల వివాహ బంధానికి సెండ్ ఆఫ్ చెప్పి అభిమానులకి కలవర పాటుకి గురి చేసింది.   మహి విజ్, జై భానుషాలి.. బాలీవుడ్ సినీ,టీవీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి తిరుగులేని ఆది పత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. 2011 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా మహి విజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకులపై స్పందిస్తు 'ఇద్దరం విడిపోయినా  కూడా పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మేము వేరు దారుల్లో నడుస్తున్నా విడాకుల  నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ,డ్రామా లేదు. కేవలం ప్రశాంతత కోసమే విడాకుల నిర్ణయాన్ని ఎంచుకున్నాం..స్నేహబంధం కొనసాగుతూనే  ఒకరిని ఒకరం గౌరవించుకునే విషయంలో రాజీ పడం. ఈ సమయంలో అభిమానుల ప్రేమ, గౌరవం, దయ అవసరం అని తెలిపింది.     Also read:  ధురంధర్ తో కొత్త లోక  కలిస్తే.. మీకు ఓకేనా!     పదిహేడు సంవత్సరాల వయసులో మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించిన మహి విజ్ టెలివిజన్   రంగంలో సుమారు 30 సిరీస్ ల వరకు చేసింది. గత ఏడాది డిసెంబర్ 2 నుంచి కలర్స్ టీవీ లో వస్తున్న సెహర్-హోనే కో హై లో చేస్తుంది. సినిమాల విషయానికి వస్తే 2004 లో తెలుగులో ప్రభు దేవా హీరోగా వచ్చిన తపన అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మలయాళంలో, కన్నడంలో ఒక సినిమా చేసింది. ఇక  జై భానుషాలి విషయానికి వస్తే తను కూడా మోడల్ గానే  కెరీర్ స్టార్ట్ చేసి సినీ, టీవీ, వెబ్ సిరీస్  నటుడుగా, అనేక షోస్ కి ప్రెజంటర్ గా చేస్తు తనదైన శైలిలో దూసుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ మార్చిలో అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన బి హ్యాపీ అనే మూవీలో కీలకమైన క్యారక్టర్ లో కనిపించాడు.  

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

Publish Date:Jan 8, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు. ఎవడ్రా నిన్ను పెళ్లి చేసుకునేదంటూ నోటికి వచ్చినట్లు మహా తిడుతుంది. భూషణ్ కి కార్ సౌండ్ వినిపిస్తుంది. ఎక్కడున్నావని అతను అడుగగా ఎక్కడుంటే ఏంటి రాగాల్లో తేలుతున్నానని ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే భూషణ్ ఆదికి ఫోన్ చేసి మీ చెల్లి నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతుంది అసలు తను ఇంట్లో లేదని చెప్తాడు. వెళ్లి చూసి నాకు ఫోన్ చెయ్ అని భూషణ్ చెప్పగానే ఆది, హారిక ఇద్దరు కలిసి మహా దగ్గరికి వెళ్తారు. వెళ్లి చూస్తే అక్కడ మహా ఉండదు. ఆది ఇంట్లో అంత వెతుక్కుంటూ ఉంటాడు. వాళ్ల అమ్మనాన్నని నిద్ర లేపుతాడు. హారికకి మహా గదిలో లెటర్ దొరుకుతుంది. అది చదివి హారిక షాక్ అవుతుంది. వెంటనే అ లెటర్ తీసుకొని వెళ్లి ఆదికి ఇస్తుంది. ఆ తర్వాత ప్రతాప్ ఆ లెటర్ తీసుకొని చదివి.. లేదు అలా ఎప్పటికి మహా చెయ్యదని తనే స్వయంగా మహా గదిలో వెతుకుతాడు కానీ ఉండదు. ఆ తర్వాత భూషణ్ ఫోన్ చేస్తుంటే ఆది లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత ఆది సీసీటీవీ చూస్తే .. అది ఆఫ్ లో ఉంటుంది. ఇంటిముందుకి వెళ్లి డ్రైవర్ చక్రి ఉన్నాడేమో చూస్తాడు కానీ చక్రి కూడా ఉండకపోయేసరికి ఆది ఇంట్లోకి వచ్చి ప్రతాప్ కి చెప్తాడు. తరువాయి భాగంలో మహా, చక్రిలని వెతకడానికి ప్రతాప్ రౌడీలతో మాట్లాడతాడు. చక్రి, మహా కార్ కి అడ్డుగా రౌడీలు వస్తారు . ఒకవైపు ప్రతాప్, ఆది, భూషణ్ వస్తుంటారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Tiger Shroff to be part of Allu Arjun and Atlee film?

Publish Date:Jan 6, 2026

Allu Arjun has delivered a massive blockbuster with Pushpa 2 The Rule and his market in North India is huge. Taking that into consideration, Sun Pictures have accepted to give Atlee, a free hand to make his sci-fi fantasy drama on a never-seen-before scale with Hollywood VFX Studios, Action Co-ordinators collaborating on it.  Now, the reports suggest that the movie could be spilt into two parts and both will be shot at one go. The movie team won't be going back to shoot the second part but rather they would be spending 6-8 months on VFX and scale of the second part, if the reports are true.  Currently, the reports suggest that Tiger Shroff is in talks and he even joined the film for a crucial part. Will he be playing an antagonist or supporting protagonist is yet to be known. Vijay Sethupathi is said to be a part of the film. Already, Deepika Padukone is part of the film and she completed two schedules.  Mrunal Thakur and Janhvi Kapoor are said to be part of the project as there will be a triple role for Allu Arjun with connection between past lives and future. We have to wait and see, how many of these reports will emerge to be true. Atlee is currently working on meeting a Hollywood Studio to distribute the film, state reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969