English | Telugu

గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ 

Publish Date:Dec 20, 2025

      సినిమా పేరు: గుర్రం పాపిరెడ్డి తారాగణం: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు, జీవన్, రాక్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జాన్ విజయ్ తదితరులు  తదితరులు  ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ మ్యూజిక్: కృష్ణ సౌరభ్  రచన, దర్శకత్వం: మురళీ మనోహర్ సినిమాటోగ్రాఫర్: అర్జున్ రాజా బ్యానర్: బురా అండ్ సద్ది క్రియేటివ్ ఆర్ట్స్ ఎల్ ఎల్ పి, ఎంజెఎం మోషన్ పిక్చర్స్   నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్, విడుదల తేదీ: డిసెంబర్ 20 ,2025      మత్తు వదలరా మూవీతో నటుడుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నరేష్ అగస్త్య(Naresh Agastya)హీరోగా మారి ఈ ఏడాది ఇప్పటికే 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' తో వచ్చాడు. ఇప్పుడు మరోసారి గుర్రం పాపిరెడ్డి(Gurram Paapireddy)అనే మూవీతో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తో కలిసి థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న    గుర్రం పాపిరెడ్డి ఏ మేర ఆకట్టుకున్నాడో చూద్దాం.     కథ గుర్రం పాపిరెడ్డి (న‌రేష్ ఆగ‌స్త్య) ఒక మధ్య తరగతి యువకుడు. కొంచం అమాయకత్వాన్ని  కూడా కలగలసిన పాపిరెడ్డికి డబ్బు సంపాదించడమే లక్ష్యం. ఈ క్రమంలో ఒకసారి  బ్యాంకు రాబడికి ప్రయత్నించి విఫలమవుతాడు. సౌదామిని(ఫరియా అబ్దుల్లా)  హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుంది. సౌదామిని కి కూడా గుర్రం పాపిరెడ్డి లాగా డబ్బు సంపాదించడమే ధ్యేయం. ఈ ఇద్దరు శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోని ఒక సమాధిలో ఉన్న శవాన్ని బయటకి తీసి వేరే ఏరియాలో ఉన్న సమాధిలోకి మార్చాలని నిర్ణయించుకుంటారు. అందుకు గొయ్యి (జీవ‌న్), మిల‌ట‌రీ (క‌సిరెడ్డి), చిలిపి (వంశీధ‌ర్ గౌడ్‌) అనే మరో ముగ్గురుకి డబ్బు ఆశ చూపించి తమతో కలుపుకుంటారు. మరో వైపు భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉన్న కళింగ సంస్థాన రాజకుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర) పాపిరెడ్డి కోసం వెతుకుతు ఉంటారు. రాజ కుటుంబీకులు పాపిరెడ్డి కోసం ఎందుకు వెతుకుతున్నారు? డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న పాపిరెడ్డి,  సౌదామిని శ్రీశైలం సమీప ప్రాంతంలో ఉన్న శవాన్ని తీసుకురావడానికి ఎందుకు పూనుకున్నారు? ఆ శవాన్ని ఎక్కడికి మార్చాలి? మార్చితే వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? ఆ ప్రయాణంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా? ఆ శవం వెనక ఉన్న కథ ఏంటి? చివరిగా పాపిరెడ్డి,  సౌదామిని అండ్ బ్యాచ్  కథ ఎలా ముగిసింది? అనేదే పాపిరెడ్డి చిత్రకథ.     ఎనాలసిస్  సినిమా ప్రారంభం నుంచే ఎంటర్ టైన్ మెంట్ ప్రధాన లక్ష్యంగా డార్క్ కామెడీ తో  గుర్రం పాపిరెడ్డి  తెరకెక్కిందనే విషయం అర్ధమవుతుంది. పైగా శవాల మార్పిడి కాన్సెప్ట్ కూడా కొత్తదే. అందుకోసం పాపిరెడ్డి ముగ్గురు తెలివితక్కువ వాళ్ళ సాయం తీసుకోవ‌డం, దాని వెనుక `కోడి బుర్ర‌` రీజ‌నింగ్ చెప్ప‌డం బాగుంది. కానీ సినిమాలోకి వెళ్లే కొద్దీ సన్నివేశాల్లో పస లోపించింది. పైగా డార్క్ కామెడీలో  ఉండాల్సిన కామెడీ, థ్రిల్స్ కూడా మిస్సయ్యాయి. అదే పాపిరెడ్డి కి మైనస్ గా పరిగణించే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే గోల్డ్ షాప్ దొంగ‌త‌నంతో మూవీ ప్రారంభమయ్యింది. మిగతా     కథ మొత్తానికి రన్నింగ్ కావడానికి కావాల్సిన క్యారక్టర్ లన్నింటినీ గోల్డ్ షాప్ దగ్గరే   పరిచయం చేయడంతో పాటు డైరెక్ట్ గా కథలోకి వెళ్లడం బాగుంది.     దీంతో మనం పాపిరెడ్డి టీం తో ట్రావెల్ అవుతాం. ఈ క్రమంలో వచ్చే సీన్స్ లాజిక్ కి భిన్నంగా ఉన్నా నవ్వుని మాత్రం తెప్పిస్తాయి. ముఖ్యంగా శవాల దొంగ‌త‌నలా సీన్స్ చాలా స‌ర‌దాగా ఉంటాయి. ఆ ప్రాసెస్ లో క్యారెక్టర్స్ మధ్య ఎదురయ్యే గంద‌ర‌గోళం, మిల‌ట్రీని గోతిలో క‌ప్పేయ్య‌డం న‌వ్వులు పంచుతాయి. గొయ్యిని క‌ళింగ వార‌సుడిగా కోర్టు మెట్లు ఎక్కిండం, ఆ తరువాత  అస‌లు క్యారక్టర్ లు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో క‌థ‌నంలో పట్టు  వ‌స్తుంది. ఇంట్ర‌వెల్ ట్విస్ట్ కూడా బాగుండటంతో  పాటుసెకాంఫ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ కలిగించింది. కాకపోతే సెకండ్ హాఫ్ ఆశించినంతగా లేదు. దాదాపుగా కోర్టు డ్రామా చుట్టూనే కథ తిరగడంతో పాటు గొయ్యిని క‌ళింగ వార‌సుడిగా నిరూపించ‌డం చుట్టూనే తిరుగుతుంది.     దీంతో ఫస్ట్ హాఫ్ లో ఉన్న మజా సెకండ్ హాఫ్ లో రాలేదు, కోర్టులో వాదోపవాదనలు అయితే  మ‌రీ సిల్లీగా అనిపిస్తాయి. డీఎన్ఏ టెస్ట్ కోసం జ‌రిగిన ప్ర‌హ‌స‌నం అయితే ఎక్కువ లెంత్ లో ఉంది.  కళింగ సంస్థానానికి చెందిన సీన్స్ తో పాటు పురాణాల్ని కూడా ఆధునిక కథకి లింక్ చేసే సందర్భంగా వచ్చే సీన్స్ లాజిక్ లేని విధంగా ఉన్నాయి.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.     నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు     ఒక్కరిని కాదు మూవీలో చేసిన నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, జీవన్, రాక్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జాన్ విజయ్ తమ క్యారక్టర్ ల పరిధి మేరకు అత్యద్భుతమైన ప్రదర్శన కనపర్చారు. ఇక బ్రహ్మానందం, యోగిబాబు పెర్ఫార్మ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. తమ నటనతో మరోసారి మెప్పించారు. దర్శకుడిగా, రచయితగా మురళి(MUrali Manohar)పెద్దగా మెప్పించలేక పోయాడు. డార్క్ కామెడికి కావాల్సిన పర్ఫెక్ట్ సీన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించలేకపోయాడు. కృష్ణ సౌరభ్  నేపధ్య సంగీతం బాగుంది. అర్జున్ రాజా  ఫోటో గ్రఫీ కూడా పర్లేదు. నిర్మాణ విలువ‌లు నామ మాత్రమే.     ఫైనల్ గా చెప్పాలంటే కంటెంట్ చాలా కొత్తది. అందుకు తగ్గట్టుగా ఎగ్జాయిట్మెంట్ ని  తెప్పించే సన్నివేశాలు రాసుకోవడంలో మేకర్స్ విఫలమయ్యారు. ఫస్ట్ హాఫ్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్ నామమాత్రంగా ఉంది.        rating 2.75/5                                                                                                                    అరుణాచలం                                                                                                                                               

Sampoornesh Babu shocks with his look from The Paradise

Publish Date:Dec 19, 2025

The anticipation surrounding Natural Star Nani’s upcoming period action epic, The Paradise, has reached a fever pitch. Directed by Srikanth Odela, this high-budget entertainer promises a visceral blend of raw emotion and high-octane action.  Following the viral success of Nani’s initial posters, the production team has now unveiled a striking new look featuring Sampoornesh Babu. In a departure from his usual screen persona, Sampoornesh Babu appears completely unrecognizable in the role of Biryani. Tasked with portraying the epitome of loyalty, Biryani is the most trusted confidant of Nani’s character, Jadal.  To meet Odela’s specific creative vision, the actor underwent a significant physical transformation, losing considerable weight to inhabit this "massy" and rugged avatar. Produced by Sudhakar Cherukuri, this Pan-India spectacle is set for a grand multi-language release on March 26, 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

సూర్యకాంతం మరణం.. పట్టించుకోని టాలీవుడ్‌ ప్రముఖులు.. ఎందుకని?

Publish Date:Dec 18, 2025

(డిసెంబర్‌ 18 నటి సూర్యకాంతం వర్థంతి సందర్భంగా..) కొందరు నటీనటులు కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా రకరకాల క్యారెక్టర్స్‌ చేసేందుకు ఇష్టపడతారు. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చెయ్యాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే అలా చేస్తే రొటీన్‌ అయిపోతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఒకే తరహా పాత్రను మళ్లీ మళ్లీ చేసి మెప్పించడం సూర్యకాంతం వల్లే సాధ్యమైంది. గయ్యాళి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సూర్యకాంతం.. 200 సినిమాల్లో ఆ పాత్రను పోషించి ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా చెయ్యగలిగారు.   సాధారణంగా సినిమాల్లో గయ్యాళి పాత్ర రాగానే ఆ పాత్ర పట్ల ప్రేక్షకులకు కోపం వస్తుంది. అయితే సూర్యకాంతం చేసే పాత్రలపై వారికి కోపం ఉంటూనే జాలి కూడా కలుగుతుంది. అలా ఆ పాత్రను సూర్యకాంతం తనదైన శైలిలో పోషించి మెప్పించారు. ఆమె చేసిన పాత్రల ప్రభావం ఎంతలా ఉండేదంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టుకోవడం కూడా మానేసే అంతగా. అంతకుముందు సూర్యకాంతం పేరు చాలా మందికి ఉండేది. ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారెవరూ తమ పిల్లలకు ఆ పేరు పెట్టే సాహసం చెయ్యలేదు.    సినిమాల్లో అంత గయ్యాళిగా కనిపించే సూర్యకాంతం ప్రవర్తన నిజజీవితంలో దానికి పూర్తి విరుద్ధంగా ఉండేది. ఎంతో సౌమ్యం, మరెందో దయ, దానగుణంతో అందరికీ ప్రేమను పంచేవారు. అప్పటి హీరోలకు, మిగతా నటీనటులకు సూర్యకాంతం అంటే ఎంతో అభిమానం. ఆమె షూటింగ్‌లో ఉన్నారంటే యూనిట్‌ సభ్యులకు పండగే. ఎందుకంటే.. తను షూటింగ్‌కి వచ్చేటప్పుడు 20 మందికి సరిపడా భోజనాలు, పిండి వంటలు ఆమె వెంట వచ్చేవి. అందరితో కలిసి కూర్చొని ఆమె భోజనం చేసేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు.    సినిమాల ద్వారానే కాకుండా రకరకాల వ్యాపారాలు కూడా చేసి డబ్బు సంపాదించేవారు సూర్యకాంతం. అప్పట్లోనే పాత కార్లను కొని వాటికి మరమ్మతులు చేయించి తిరిగి అమ్మే వ్యాపారం చేసేవారు. నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఎలర్జీ వస్తోందని గ్రహించిన ఆమె.. విదేశాల నుంచి మేకప్‌ కిట్స్‌ తెప్పించి, వాటిని హీరోయిన్లకు అమ్మేవారు. ఇవి కాకుండా ఫైనాన్స్‌ కూడా చేసేవారు. ఎంతో మంది నిర్మాతలు తమ సినిమాల కోసం సూర్యకాంతం దగ్గర ఫైనాన్స్‌ తీసుకునేవారు. ఇక బాపు, రమణ చేసిన సినిమాలన్నింటికీ ఆమే ఫైనాన్సియర్‌. అది కూడా ఎంతో న్యాయబద్ధంగా చేసేవారు. దానికి ఉదాహరణగా ఒక సంఘటనను చెప్పుకోవచ్చు.   ఒక సినిమాకి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ ఆమె దగ్గర కొంత అప్పు తీసుకున్నారు. దాన్ని నెలనెలా చెల్లించేవారు. అలా ఒక నెల తమ మేనేజర్‌తో డబ్బు పంపించారు రమణ. అయితే ఆమె ఆ డబ్బు తీసుకోలేదు. అంతకుముందు నెలతోనే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ అయిపోయాయని చెప్పారు. వడ్డీ ఎక్కువ చెబితే ఆ భయంతో డబ్బు  కరెక్ట్‌గా కడతారని భావించి డబ్బు ఇచ్చే ముందు ఎక్కువ వడ్డీ చెప్పానని, దానికి సాధారణ వడ్డీ మాత్రమే వేశానని అన్నారు. అలా లెక్కేస్తే మిగిలిన డబ్బు చెల్లించక్కర్లేదు అని చెప్పి ఆ డబ్బును వెనక్కి పంపించేశారు సూర్యకాంతం.   తన చివరి శ్వాస వరకూ నటించాలనుకునేవారు సూర్యకాంతం. ఆమె నటించిన చివరి సినిమా 1994లో చిరంజీవి, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ఎస్‌.పి.పరశురాం. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అదే సంవత్సరం డిసెంబర్‌ 18న తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. చెన్నయ్‌లో జరుగుతున్న ఫారిన్‌ డెలిగేట్స్‌తో సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకొని ఆ మీటింగ్‌ను గంటపాటు వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి ఆమెకు నివాళులర్పించి తిరిగి వెళ్లి మీటింగ్‌ను కొనసాగించారు. ఒక నటి కోసం ఎంతో ముఖ్యమైన ఆ మీటింగ్‌ నుంచి ఒక ముఖ్యమంత్రి హడావిడిగా వెళ్ళిపోవడం ఆమె పి.ఎ.కి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించినపుడు ఆమె చెప్పిన సమాధానం విని షాక్‌ అయ్యారు.   ‘షూటింగ్‌లో ఎంతో మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ సూర్యకాంతంగారు. ఆమె పెట్టిన భోజనం ఎన్నోసార్లు తిన్నాను. కొన్నిసార్లు ఆమె ఏ షూటింగ్‌లో ఉందో తెలుసుకొని లంచ్‌ టైమ్‌కి అక్కడికి వెళ్లేదాన్ని. ఆమె వంటలంటే నాకు అంత ఇష్టం. ఆమె చేతి వంట తిన్న విశ్వాసం ఉండాలి కదా. ఈ మీటింగ్‌ కంటే సూర్యకాంతంగారిని కడసారి చూసి నివాళులు అర్పించడమే నాకు ముఖ్యం’ అన్నారు జయలలిత.   ఇదిలా ఉంటే.. సూర్యకాంతం మరణ వార్త తెలిసిన వెంటనే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఆమె నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కానీ, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో నామమాత్రంగా హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వంటి వారు హాజరు కాలేదు. అర్థరాత్రి చనిపోయారు కాబట్టి మరుసటి రోజు అందరూ వస్తారని మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలు జరిపించారు. ఒక మహానటికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.    సూర్యకాంతం చనిపోవడానికి ఆరు నెలల ముందు ప్రముఖ దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. దానిలో చాలా తక్కువ శాతం మంది సూర్యకాంతం చనిపోయినపుడు ఆమెను చూసేందుకు వెళ్లారు. సూర్యకాంతం అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నటీమణి. ఆమె జీవించి ఉన్నప్పుడు ఎంతో మంది ఆమె నుంచి సాయం అందుకున్నారు. మరెంతో మందికి అన్నపూర్ణలా ఆమె అన్నం పెట్టారు. కానీ, ఆమె చనిపోయిన తర్వాత వీడ్కోలు పలికేందుకు మాత్రం మనుషులు కరువయ్యారు. 

Dhurandhar OTT: కళ్ళు చెదిరేలా 'ధురంధర్' ఓటీటీ డీల్.. పుష్ప-2 రికార్డ్ అవుట్!

Publish Date:Dec 18, 2025

  బాలీవుడ్ ఫిల్మ్ 'ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి, ఇప్పటికే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డీల్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   'ధురంధర్' ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.285 కోట్లకు సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది. గతంలో 'ధురంధర్' ఓటీటీ రైట్స్ రూ.130 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.285 కోట్ల డీల్ తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఈ వార్త నిజమైతే.. ఇండియన్ సినీ హిస్టరీలో ఇదే బిగ్ ఓటీటీ డీల్ అవుతుంది. గతంలో 'పుష్ప-2' రైట్స్ ని రూ.275 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డుని 'ధురంధర్' బ్రేక్ చేసినట్లు అయింది. (Dhurandhar OTT)   ఓటీటీ రిలీజ్ విషయానికొస్తే.. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తరువాతే 'ధురంధర్' స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశముంది. జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.   Also Read: తెలుగునాట అవతార్-3 ప్రభావం.. వంద కోట్లు కష్టమేనా..?   కాగా, 'ధురంధర్'కి సీక్వెల్ కూడా ఉంది. రెండో భాగం 2026 మార్చి 19న విడుదల కానుంది. మరి ఈ రెండు భాగాలకు కలిపి ఓటీటీ డీల్ జరిగిందా? లేక ఒక్క భాగానికే రూ.285 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధపడిందా? అనేది తెలియాల్సి ఉంది.  

Bigg Boss 9 Winner Kalyan Padala: బిగ్ బాస్ సీజన్-9 విన్నర్ కళ్యాణ్ పడాల!

Publish Date:Dec 20, 2025

బిగ్ బాస్ సీజన్-9 మొదలై వంద రోజులు పూర్తయింది. నిన్నటి నూట నాలుగవ ఎపిసోడ్ లో సంజన , కళ్యాణ్ పడాల జర్నీ వీడియోలతో ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్ కి అందింది. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అసాధారణ ఆటతీరుతో విశేష ప్రేక్షకాదరణ పొందాడు. నిన్నటి వరకు సాగిన ఓటింగ్ లో కళ్యాణ్ మొదటి స్థానంలో ఉండగా‌‌..తనూజ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు. నాల్గవ స్థానంలో డీమాన్ పవన్ ఉండగా సంజన అయిదో స్థానంలో ఉంది. అయితే కొన్ని ఓటింగ్ పోల్స్ లో  మూడో స్థానంలో డీమాన్ పవన్ ఉన్నాడు. కానీ మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ అంటేనే ట్విస్ట్ లు టర్న్ లు.. అలాంటిది ఏది ముందే చెప్పలేం. కాబట్టి ఆదివారం రాత్రి వరకు సాగే ఈ ఫినాలే కోసం వెయిట్ చేయాల్సిందే. కళ్యాణ్ పడాల ఓ సైనికుడు.. అన్నింటికి మించి సామాన్యుడు. అతడికి హౌస్ లో ఎంట్రీ అయిన నుండే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. అయితే అమ్మాయిలని హగ్ చేసుకుంటాడు అనే రమ్య మోక్ష అన్నప్పుడు కుడా తను అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. డీమాన్ పవన్ , కళ్యాణ్ మధ్య సాగిన ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో.. బ్యాక్ పెయిన్ తో డీమాన్ పడిపోయాడు. అప్పుడు కూడా కళ్యాణ్ గేమ్ ఆడలేదు.. ఎందుకంటే అపోజిట్ లో ఉన్న డీమాన్ పవన్ లేచి ఆడతాడేమోనని వెయిట్ చేశాడు.  ఇది ఒక్కటి చాలు.. ఒక గేమర్ ఎలా ఉండాలో తెలియజేయడానికి. ఇమ్మాన్యుయేల్ తరుపున ఆడినప్పుడు ఓడిపోయాడు దాంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు కళ్యాణ్. ఒక నిజమైన ఎమోషన్ ని కళ్యాణ్ లో ప్రతీ ఒక్క ఆడియన్ చూశాడు. అందుకే అతడికి ఓటింగ్ భారీగా పడింది. తనూజకి కళ్యాణ్ కి మధ్య ఇరవై శాతం ఓటింగ్ తేడా ఉందంటే అతను ఎంతమంది ప్రేక్షకులని గెలిచాడో అర్థం చేసుకోవచ్చు. తనూజ వర్సెస్ కళ్యాణ్ మధ్య సాగిన పోటీలో ఎవరు గెలిచారనేది తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.

The Raja Saab: కామెడీ లేని రాజా సాబ్.. షాకిచ్చిన మారుతీ!

Publish Date:Dec 17, 2025

  రాజా సాబ్ గురించి ఊహించని న్యూస్ కామెడీ తక్కువ.. ఎమోషన్స్ ఎక్కువ మారుతీ మ్యాజిక్ చేస్తాడా?   ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటిస్తున్న మొదటి హారర్ ఫిల్మ్ ఇది.    'రాజా సాబ్' మూవీ హారర్ కామెడీ జానర్ లో రూపొందుతోందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ తో పాటు, ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. దీంతో సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల విందు ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.   అయితే 'రాజా సాబ్' సినిమాలో కామెడీ పెద్దగా ఉండదని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మారుతీ సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. పైగా హారర్ కామెడీ అంటే.. మారుతీ మరింతగా నవ్విస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, 'రాజా సాబ్'లో కామెడీ కంటే ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారట.   Also Read: వారణాసి సెట్స్ కి జేమ్స్ కామెరూన్.. టైగర్ తో షూట్!   'రాజా సాబ్'లో కామెడీ సీన్స్ తక్కువేనట. ప్రభాస్ పాత్ర మాత్రమే సరదాగా ఉంటూ.. వన్ లైనర్స్ తో అక్కడక్కడా నవ్విస్తుందట. సినిమా మొత్తం ఓ ఎమోషనల్ జర్నీలా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కి పెద్ద పీట వేశారట. ఇక పతాక సన్నివేశాలు కంటతడి పెట్టించడం ఖాయమని చెబుతున్నారు.   మారుతీ ఎమోషనల్ ఫిల్మ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకాలం కామెడీ తన బలం అని నిరూపించుకున్న మారుతీ.. ఇప్పుడు ఎమోషన్స్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇందులో ఎమోషన్స్ వర్కౌట్ అయితే మాత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్ 'రాజా సాబ్' చూడటానికి క్యూ కడతారు అనడంలో సందేహం లేదు.  

Rajamouli to finish Varanasi shoot by next year end

Publish Date:Dec 17, 2025

SS Rajamouli has been more silent than ever about his next movie, Varanasi. He normally tends to give updates from time to time indirectly about his films but in case of Varanasi, Priyanka Chopra did share a lot before he officially announced the title with a grand teaser.  Now, he is again maintaining silence but he clearly gave an update when Hollywood legend James Cameron asked him about the film. Recently, he watched the film Avatar: Fire and Ash and interacted with Cameron to promote the film in India. Rajamouli revealed that he liked the visual spectacle that the director managed to pull off.  During their conversation, he revealed that there is 9 months more shoot to finish and one year of it is completed. Also, he stated that he would be happy to welcome the director to his sets anytime. Jokingly, Cameron stated that he would be wishing to visit the sets if Rajamouli is working with tigers or animals.  Well, Mahesh Babu finished the shoot for Ramayana portions and he is currently preparing for a huge action sequence to be shot in specially erected sets. Once that scene shoot is over, there is talkie portion that is planned to be completed at a faster pace than a regular Rajamouli film aiming to complete shoot by next year end.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969