గోదావరిలో వృథాగా కలిసిపోతున్న జలాలను వాడుకుంటామంటే నష్టమేంటి? : సోమిరెడ్డి

  బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్పందించారు. ఏటా 2500 నుంచి 3000 టీఎంసీల గోదావరి జలాలు వరదల రూపంలో వృధాంగా సముద్రంలో కలిసిపోతుండగా, కేవలం 200 టీఎంసీలను బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకోవాలన్న ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ నాయకులు ద్వేషభావంతో వ్యవహరించడం బాధాకరమని  సోమిరెడ్డి అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఏం తప్పు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారు?" అని సోమిరెడ్డి ప్రశ్నించారు. గోదావరి నీటి వాటాలపై స్పష్టత ఉందని, 1540 టీఎంసీల నికర జలాల్లో ఏపీకి 572 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు కలిపి 800 టీఎంసీలను కూడా వినియోగించలేకపోతున్నాయని ఆయన గుర్తు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, నెల్లూరు, పల్నాడు ప్రాంతాల్లో 7.42 లక్షల ఎకరాలకు సాగునీరు, 2.58 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, 80 లక్షల మందికి తాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని అందించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని సోమిరెడ్డి వివరించారు.  "గోదావరి జలాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను మరిచిపోవద్దు. ఒక్క చుక్క నీరు ఇవ్వమని హరీశ్ రావు చెప్పడం బాధాకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 450 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారని, అయినా ఏపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, అలాగే తెలంగాణలో ఇతర ప్రాజెక్టులపైనా వ్యతిరేకత వ్యక్తం చేయలేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. "తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఏపీ ప్రజలను పాకిస్తాన్ ఉగ్రవాదులుగా చూడవద్దు. రాష్ట్రం విడిపోయినా మన మధ్య బేధాలెందుకు?" అని తెలంగాణ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

  ఏపీ మెగా డీఎస్సీ కీ విడుదలైంది. 16,347 టీచర్ల నియామకాల కోసం జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీ విడుదల చేశాక అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాక ఫైనల్ కీ రిలీజ్ చేసినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎం. వి కృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై అభ్యంతరాల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు.  కీ కోసం అభ్యర్థులు ఈ  https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి చెక్ చేసుకోవచ్చును. ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

బాలయ్య ప్రభ నానాటికీ.. వెలుగుతుందేంటి?

  వరుసగా నాలుగు సెంచురీలు. ఆపై మొన్నటికి మొన్నపద్మ అవార్డు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ అవార్డు. ఇప్పుడు చూస్తే ఏకంగా ఆయన చిత్రానికి జాతీయ అవార్డు. ఎటు నుంచి ఎటు చూసినా బాలకృష్ణ ప్రభ నానాటికీ వెలిగిపోతూ కనిపిస్తోంది. ఆ మాటకొస్తే ఆయన పానిండియా స్టార్ కావడానికి పెద్దగా కష్టపడనవసరం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అఖండ- 2 మేకింగ్ లో ఉన్నారు. ఇది చాలు బాలకృష్ణను మరో టాలీవుడ్ టర్న్ డ్ పానిండియా స్టార్ ని చేయడానికని తెలుస్తోంది. కారణమేంటంటే అది ఎలాగూ జాతీయ వ్యాప్తంగా గుర్తు పట్టే పాత్ర. కాబట్టి ఈ దిశగా బాలకృష్ణ ఇమేజీని  పెంచడంలో ఏమంత కష్టం కాదంటున్నారు విశ్లేషకులు. బాలకృష్ణతో సమానంగా అప్పట్లో ఒక వెలుగు వెలిగిన వారెవరని చూస్తే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. ఆ రోజుల్లో చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున ఒక టాలీవుడ్ హీరో సెట్ గా పిలిచేవారు. వీరందరిలోనూ ప్రెజంట్ హైపర్ యాక్టివ్ గా ఉన్నవారెవరని చూస్తే బాలకృష్ణ మెయిన్ గా తెలుస్తోంది.  బాలయ్య బాబు ఏ శుక్రయోగంలో ఉన్నారో తెలీదు గానీ.. ఇటు చూస్తే రాజకీయంగా టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి వరుసగా రెండో ఏడాది కూడా దూసుకెళ్తోంది. ఇటు చూస్తే బాలయ్య బాబు కూడా అన్ని  రకాలుగా విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఆ మాటకొస్తే బాలయ్య బాబు సినిమా బాగా ఆడితే అది పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తుందన్న సెంటిమెంట్లున్నాయ్.  అంతెందుకు ఆయన బాగుంటే అంతా బాగుంటుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది. దీంతో బాలకృష్ణ పరి పరి విధాల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ పరంగా చూసినా ఆయన మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఎందుకంటే తన ఇద్దరు అల్లుళ్లలో ఒకరు ఎమ్మెల్యే- మంత్రి, మరొకరు విశాఖ ఎంపీ. ఇక కుమారుడి తెరంగేట్రం కూడా ఇదే టైంలో జరిగిపోతే.. బాలకృష్ణ సంతసం సంపూర్ణమయ్యేలా తెలుస్తోంది.  

అనిల్‌ అంబానీకి బిగ్ షాక్..లుకౌట్‌ నోటీసులు జారీ

  ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 5న విచారణకు హాజరుకాకుండా ఆయన విదేశాలకు వెళ్లిపోతారనే అనుమానాల నేపథ్యంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. రూ. 17 వేల కోట్ల రుణాల మోసాలకు సంబంధించిన కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా వెలుగొందిన అనిల్ అంబానీకి వరుస షాకులు తగులుతున్నాయి.  రుణ మోసానికి సంబంధించిన కేసులో గతవారం అనిల్‌ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రైడ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబయిలోని 35 ప్రాంగణాల్లో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పలు కీలక దస్త్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు ఈడీ సమన్లు, లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి.

ఇకపై పాఠశాలల్లో రాజకీయాలకు నో ఎంట్రీ

  ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదని నిర్ణయించింది. అంతేకాదు రాజకీయ పార్టీల గుర్తులు, వస్తువుల ప్రదర్శనను నిషేధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి పేరెంట్స్ కమీటీలు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఉత్తర్వులు ముఖ్యంగా విద్యార్థులను రాజకీయ వివాదాలకు దూరంగా ఉంచి, వారి చదువుపై దృష్టి పెట్టడానికి, మరియు పాఠశాల ప్రాంగణంలో రాజకీయ వాతావరణాన్ని నివారించడానికి ఉద్దేశించబడ్డాయిని తెలుస్తోంది

కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌పై కమిటీ వేసిన ప్రభుత్వం

  కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు సమర్పించారు. నివేదికలోని ముఖ్య అంశాలను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్‌కు కమిటీ అందజేయనున్నారు. ఆ తర్వాత ఈ నివేదికను శాసన సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమీటీలో నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు లీకేజీ అయ్యాయి. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోతో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలు, కాంట్రాక్టర్లకు పనుల అప్పగించిన తీరు, చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు తీరుఉల్లంఘనలతోపాటు వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించారా లేదా? వంటి అంశాలపై విచారణ కోసం ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది

దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏపీనే : చంద్రబాబు

  వైసీపీ అధినేత జగన్‌‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పర్యటనల పేరుతో మంచిగా తిరిగితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మభ్యపెట్టి ప్రజలను అసౌకర్యం కల్పిస్తే ఊరుకోమని హెచ్చరించారు. వైఎస్ఆర్ కడప  జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు .ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి తొక తిప్పితే, దానిని కట్ చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు.  తొక తిప్పిన నేతలపై నేరుగా కేసులు పెడతామని స్పష్టం చేశారు. తమ పార్టీలో అయిన సరే నేతలు తప్పు చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆమె పెద్దకుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత మగ్గాన్నిముఖ్యమంత్రి పరిశీలించారు. 1వ తరగతి చదవుతున్న తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్థన్‌కు తల్లికి వందనం కింద లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ సీఎంకు తెలిపారు.  అనంతరం అలివేలమ్మ చిన్నకుమారుడు, ఆటోడ్రైవర్ జగదీష్‌తో మాట్లాడారు. అదే ఆటోలో సీఎం చంద్రబాబు వేదిక వరకు ప్రయాణించిన ముఖ్యమంత్రి వారి కుటుంబ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే ఆంధప్రదేశ్ అని సీఎం తెలిపారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామని చెప్పారు. పింఛన్ల విషయంలో మన తర్వాత తెలంగాణ, కేరళ ఉన్నాయన్నారు. పేదలకు సాయం చేస్తే కలిగే తృప్తి మరిదేంట్లోనూ రాదని ముఖ్యమంత్రి అన్నారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రసన్నని జగన్‌ పరామర్శించడం ఏంటనీ ధ్వజమెత్తారు.  పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి.. ఖండించాలని హితవు పలికారు. నల్లపురెడ్డిని మందలించాల్సింది పోయి.. జగన్ ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలపై ఇంకా విరుచుకుపడాలనే ధోరణిలోనే జగన్‌ వైఖరి ఉందని మండిపడ్డారు. నాయకుడే రెచ్చగొడితే కిందిస్థాయి నేతలు ఇష్టానుసారం మాట్లాడరా? అని నిలదీశారు. ఎన్టీఆర్‌ ఆలోచనతోనే రాయలసీమకు  నీళ్ళు వచ్చాయని సీఎం తెలిపారు. ఆయన సాగునీటి ప్రాజెక్టుల చంద్రబాబు గుర్తుచేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని చెప్పుకొచ్చారు.  త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తిచేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరవు అనేదే ఉండదని సీఎం స్పష్టం చేశారు, వివరించారు. రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. త్వరలోనే కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. 2028 డిసెంబర్‌ నాటికి స్టీల్‌ప్లాంట్‌ తొలిదశ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రేపు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కుటమి సర్కార్  రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు ఇవ్వబోతున్నాయని స్పష్టం చేశారు. మొత్తంగా రైతులకు రూ.20 వేలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌పై సీఎం రేవంత్ చర్చ

  సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రి ఉత్త‌మ్, సీఎస్ రామ‌కృష్ణ సమావేశం అయ్యారు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ నివేదిక‌ను ముఖ్యమంత్రికి సీఎస్ అందించారు.  ప్ర‌స్తుతం నివేదిక‌లోని కీల‌క అంశాల‌పై చ‌ర్చిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. పీసీ ఘోష్ క‌మిష‌న్ త‌మ నిదేదిక‌ను నిన్న‌నే అధికారుల‌కు అంద‌జేసింది.  కాళేశ్వ‌రం రిపోర్ట్  అందిన త‌ర‌వాత ఉన్న‌తాధికారుల‌తో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మీక్షించారు.  ఇక నేడు కొద్దిసేప‌టి క్రితం నివేదిక‌తో సీఎంను కలిసి ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతిక లోపాలతోపాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోతో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలు, కాంట్రాక్టర్లకు పనుల అప్పగించిన తీరు, చేసుకున్న ఒప్పందాలు, వాటి అమలు తీరుఉల్లంఘనలతోపాటు వాటి అమల్లో ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించారా లేదా? వంటి అంశాలపై విచారణ కోసం ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ అంశాలు, నిర్మాణ సంస్థలుకాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖల నిర్లక్ష్యం, ఇతర అవకతవకతలపై విచారణ జరపాలని కోరింది.   వచ్చే కేబినెట్ భేటీలో ఈ నివేదికపై చర్చించి.. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది.

విజయసాయి కుమార్తెకు రూ. 17.46 కోట్ల జరిమానా

వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేసి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయమే వ్యాపకంగా బతుకుతున్నానని ఎంతగా చెప్పుకున్నా.. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు ఆయనను ఇప్పటికీ వెన్నాడుతూనే ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ఆయన నిందితుడిగా ఉన్నారు.   విజయసాయి పాపాలు ఆయననే కాకుండా ఆయన సన్నిహితులనూ వెన్నాడుతున్నాయి. తాజాగా  భిమిలీ బీచ్ లో భూ కబ్జాలకు సంబంధించి విజయసాయి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టు 17 కోట్ల 46 లక్షల రూపాయల జరిమానా విధించింది.  ఈ భీమిలి బీజ్ లో భూమి కబ్జా 2021లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. అప్పట్లో విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక వ్యక్తిగా ఉన్నారు.  అప్పట్లో భమిలీ బీచ్ లో కొంత భాగాన్ని ఆక్రమించి నేహారెడ్డి భారీ నిర్మాణాలకు ఉపక్రమించారు. ప్రహారీగోడ నిర్మించారు.  దీనిపై కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో నేహారెడ్డి బీచ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు తేలింది. దీంతో ఆ నిర్మాణాలను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేయడం కూడా జరిగింది.   నేహా రెడ్డి నిషేధిత ప్రాంతాలలో నిర్మాణం చేపట్టారని  ఖచ్చితమైన ఆధారాలు లభించడంతో.. ఆగస్టు 1 నుండి బీచ్ స్థలం ఆమె ఆక్రమణలో ఉన్నన్ని రోజులూ రోజుకు  1.2 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా  భీమిలి పరిరక్షణ కోసం నియమించబడిన 16.9 చదరపు మీటర్ల నిషిద్ధ స్థలంలో జరిగిన అక్రమ నిర్మాణాలను పునాదులతో సహా క్లియర్ చేయాలని ఆదేశించింది.  

గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల స్కామ్

  తెలంగాణలో సంచలన సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించి 200కు పైగా బ్యాంకు ఖాతాలకు చెందిన పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.  ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌లోనూ ఈ బ్యాంక్‌ ఖాతాలను ఉపయోగించారు. 31సెల్‌ఫోన్లు, 20 సిమ్‌కార్డులు సీజ్‌ చేశాం. ఏడు జిల్లాల్లో రూ.253.93కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్‌ నివేదికలో ఉంది. 33 జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్‌ వ్యక్తులు తమ సొంతఖాతాల్లోకి మళ్లించారు’అని ఈడీ తెలిపింది.   

ఆటోలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలలో మమేకం అయ్యే విషయంలో అన్నిహద్దలూ చెరిపేస్తున్నారు. గతానికి భిన్నంగా ఆయన క్షేత్ర స్థాయిలో జనంతో మమేకం అవుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాటి పరిస్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన శుక్రవారం జమ్మలమడుగులో పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన జమ్మలమడుగులో ఆటోలో ప్రయాణించారు. జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి ఆయన ఆటోలోనే వెళ్లారు.  ఆటోలో ఆయన ప్రయాణిస్తున్నంత సేపూ ఆ ఆటోవాలాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ ఆటో వాలా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఆ ఆటోవాలను అధికారిక వద్దకు తీసుకువెళ్లి అతడి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు.  చంద్రబాబు ఆటోలో ప్రయాణిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఆటో ఎక్కడంతో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జర్నలిజంలో విశ్వసనీయత, విలువలు లేవు : సీఎం రేవంత్ రెడ్డి

  ప్రస్తుతం జర్నలిజం విలువలు విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఓ దినపత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు తమ సంపాదను కాపాడుకోవడానికి తప్పులు కప్పిపుచ్చుకనేందుకు పనిచేస్తున్నాయిని పేర్కొన్నారు. జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. అ.ఆ.లు, ABCD లు రాని వారు కూడా సోషల్ మీడియా జర్నిలిస్టులంటూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఓనమాలు కూడా రానివాళ్లు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టుగా చలామణి అవుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.  అలాంటి వారిని సీనియర్లు జర్నలిస్టులు పక్కన పెట్టాలని.. కనీసం పక్కన కూడా కూర్చొబెట్టుకోవద్దని అన్నారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ.. అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్టు అని చెప్పుకోవడం సోచనీమని పేర్కొన్నారు. 2004లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనదిన అన్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తాలన్నా.. అధికారంలో ఉన్నోళ్లను గద్దె దింపడానికైనా కమ్యునిస్టులు ఉపయోగపడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం రాజకీయ నేతల విశ్వసనీయత దెబ్బతిన్నట్లుగానే.. జర్నలిస్టుల విశ్వసనీయత క్రమంగా తగ్గుతూ వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వీరభద్రం చేసిన పాదయాత్రలు, పోరాటాలు కారణం కావొచ్చు. ప్రజా పాలనను కొనసాగించడానికి కూడా మీ సహకారం కావాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ  కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డి, సీపీఎం సీనియర్‌ నేతలు రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి భూ కేటాయింపుల్లో తప్పేంటి?

ఏపీలో పెట్టుబడి దారుల‌ సందేహాలన్నీ దాదాపు నివృత్తి అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపుతున్న పెట్టుబడి దారులకు ఇంత కాలం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటన్న సందేహం ఉండేది. ఇప్ప‌టి వ‌ర‌కు కొంద‌రు పెట్టుబ‌డి దారులు.. విప‌క్షాలు స‌హా.. ఇత‌ర ఉద్య‌మకారుల విష‌యంలో సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం త‌మ‌కు క‌ల్పించే మౌలిక వ‌స‌ తుల‌పై.. యాగీ చేస్తార‌ని.. ముఖ్యంగా భూములు.. ఇత‌ర‌త్రా కీల‌క విష‌యాల పై త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌ని అనుమానించారు. ఆ సందేహాలు, అనుమానాలూ మరింత బలపడే తీరుగానే గత ఏడాది కాలంగా వైసీపీ వ్యవహరిస్తూ వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులకు మోకాలడ్డే విధంగా కోర్టు కేసులు, ఆయా కంపెనీలకు ఈ మెయిల్స్ పంపుతూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించింది. అయితే తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో పెట్టుబడి దారుల సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో తమ వ్యాపారాలకు ఎలాంటి అవరోధాలు ఉండవన్న నమ్మకం చిక్కింది. ఇంతకీ విషయమేంటంటే.. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కు భూమిని కేటాయించిన వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందులో విశాఖలో తక్కువ ధరకు భూములు ఇవ్వడాన్ని పిటిషనర్లు తప్పుపడుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్ విచారణ సందర్బంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.   పెట్టుబ‌డి దారుల‌కు ఇచ్చే భూముల కేటాయింపు విషయంలో సందేహాలు ఎందుకని పిటిషనర్లను ప్రశ్నించింది. ఏపీలో అభివృద్ధి ఆరంభ దశలో ఉ:ది.. ఏమీ ఇవ్వకుండా ఇన్వెస్టర్లు ఎలా వస్తారని హైకోర్టు నిలదీసింది.   హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాలు అభివృద్ధి చెందడానికి గ‌తంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్టుబ‌డి దారుల‌కు భూములు కేటాయించి.. వ‌న‌రులు క‌ల్పించారనీ, అందుకే ఆ నగరాలు అభివృద్ధి చెందాయనీ హైకోర్టు పేర్కొంది. హైకోర్టు వ్యాఖ్యలతో  దీంతో స‌ర్కారుకు భారీ ఊరట దక్కడమే కాకుండా ఇన్వెస్టర్లలో ధైర్యం, విశ్వాసం పెరిగాయి.  విశాఖ‌లో టీసీఎస్ స‌హా లులు మ‌ల్టీ చైన్ కంపెనీల‌కు భూములు కేటాయించారు. అలాగే ఉమ్మ‌డి ప్రకాశం జిల్లాక‌ర్రేడు గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంటుకు భూములు ఇచ్చారు. విజ‌య‌వాడ‌లోని పాత బ‌స్టాండ్‌ను లులు మాల్‌కు కేటాయించ‌నున్నారు. ఇప్పుడు వీటి విష‌యంలో ప్ర‌భుత్వం ధైర్యంగా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. వీటిపై రేపు న్యాయ‌ప‌ర‌మైన వివాదాలు త‌లెత్తినా.. హైకోర్టు ఉత్త‌ర్వులు ప్ర‌భుత్వానికి క‌లిసి రానున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఇన్వెస్టర్లు కూడా ధైర్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి కోర్టు వ్యాఖ్యలు దోహదపడతాయనడంలో సందేహం లేదు. 

తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ కు ఊరట

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.  ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై నమోదైన కేసు విచారణను నిలుపదల చేయాలని కోరుతూ రేవంత్ ను క్వాష్ చేయాలంటూ రేవంత్ దాఖలు చేసుకున్న పిటిషన్  విచారించిన తెలంగాణ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.  ఇంతకీ కేసేంటంటే..  గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు, కేసు విచారణను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కూడా కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు సమర్పించారు. ఈ దశలో ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు అనుకూలంగా నేడు తీర్పు వెలువడింది.

లైంగిక దాడి కేసులో దోషిగా మాజీ ఎంపీ

  అత్యాచారం కేసులో జనతాదళ్ సెక్యులర్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. రేపు శిక్షణను ఖరారు చేస్తామని వెల్లడించింది. రేవణ్ణ మైసూరులోని తన ఇంట్లో పని చేస్తున్న మహిళను రేప్ చేసి వీడియో తీశారని కేసు నమోదైంది. డిసెంబర్ 31 2024 నుంచి దర్యాప్త్య మొదలైంది.  హసన్ జిల్లా హోలినరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. జూలై 18న ఈ కేసులో విచారణ పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. శిక్షాకాలాన్ని ఆగస్టు 2న ప్రకటించనుంది. పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వెలుగుచూడటం సంచలనమైంది.  దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్ ఫ్యామిలీకి చెందిన ఫామ్ హౌస్‌లో పనిచేసే మహిళ 2024 ఏప్రిల్‌లో మొదటగా ఆయనపై ఫిర్యాదు చేసింది. 2021 నుంచి పదేపదే తనపై లైంగిక దాడి చేశారని, బయటకు చెబితే వీడియోలు విడుదల చేస్తామని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేశారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది.  

కాళేశ్వ‌రానికి.. ఫిరాయింపు నిరోధ‌క చ‌ట్టానికి లింకు వేస్తున్నారా? సార్

బేసిగ్గా కేసీఆర్ ఐడియాలు మీర‌ది చేస్తే..  మేమిది చేస్తాం అన్న‌ట్టుగా ఉంటాయి. ఆయన పొలిటికల్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది.  ఉదాహ‌ర‌ణ‌కు మీరు మా క‌విత‌ను లిక్క‌ర్ కేసులో అరెస్టు చేస్తే.. మేం ఏకంగా తెలంగాణ రాష్ట్ర స‌మితిని కాస్తా భార‌త రాష్ట్ర స‌మితిగా మార్చి.. దాన్ని ఢిల్లీ స్థాయిలో విస్త‌రింప  చేసి.. ఆపై మీ కంట్లో న‌లుసుగా మారుతాం. బీజేపీ చేసే దానికి బీఆర్ఎస్ చేసేదానికి - బీఆర్ఎస్ చెల్లుకు చెల్లు అన్న‌ట్టుగా గతంలో ఆయన వ్యవహరించిన తీరు చెప్పుకోవచ్చు.   ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత ఆయ‌న‌తో పాటు కేటీఆర్, హ‌రీష్‌, క‌విత త‌దిత‌రులు ఏదో ఒక కేసులో చిక్కి నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో వారికి కాంగ్రెస్ ని క‌ల‌వ‌ర పెట్ట‌డానికి క‌ల‌సి వ‌చ్చిన ఏకైక అస్త్రం పార్టీ ఫిరాయింపులు.  నిజానికి ఈ పార్టీ ఫిరాయింపులు ఇప్ప‌టిక‌న్నా బీఆర్ఎస్ హ‌యాంలోనే ఎక్కువ‌గా జరిగాయి. అయితే అక్క‌డ చేసింది ఇక్క‌డ చేయ‌లేనిదీ ఒక‌టే. అక్క‌డ ఏకంగా పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఇటు క‌ల‌సి పోవ‌డం వ‌ల్ల పార్టీయే మెర్జ్ అయిన ప‌రిస్థితి కనిపించింది. అదే ఇప్ప‌డు గెలిచిన వాళ్ల‌లో కేవ‌లం ప‌ది మందే వెళ్లి క‌లిసారు. వీరు కాంగ్రెస్ కి అద‌నం అవుతారు త‌ప్పించి.. వీరు లేకపోతే వారికి వచ్చే నష్టమంటూ ఏదీ లేదు.   ఒక వేళ ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా స‌గానికి స‌గం మంది  గెలిచే ఛాన్సుంది కాబ‌ట్టి కాంగ్రెస్ బేఫిక‌ర్. ఇక్క‌డ మ‌రో లింకు ఏంటంటే స్పీక‌ర్ కి అధికారం ఇవ్వ‌డం. దీంతో స్పీక‌ర్ వ‌ర్సెస్ న్యాయ‌మూర్తి అనే స‌మ‌స్య త‌లెత్తుతుంది.  ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ చ‌ట్టానికి న్యాయానికి మ‌ధ్య‌ జ‌రిగిన స‌మ‌రంలో అన్ని వేళ‌లా స్పీక‌రే గెలిచారు. స్పీక‌ర్ ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన న్యాయ‌మూర్తి. అదే కోర్టు న్యాయ‌మూర్తిది ప‌రోక్ష ఎంపిక‌. దీంతో ఈ విష‌యంలోనూ బీఆర్ఎస్ ప‌ప్పులు ఉడికేలా లేవు. గ‌తంలో సుప్రీంకోర్టుకెక్కిన రోజా.. అసెంబ్లీకి త‌నను రానివ్వాలంటూ తీర్పు తెచ్చుకున్నారు. కానీ ఆనాటి స్పీక‌ర్ కోడెల ఆ జ‌డ్జికంటే మోస్ట్ ప‌వ‌ర్ఫుల్ ఈ జ‌డ్జి..  అంటే స్పీక‌ర్ అంటూ ఆ తీర్పును అమ‌లు చేయ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ అనుకున్న విధంగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్ట‌డం సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. సో బీఆర్ఎస్ పెట్టిన చెక్  నుంచి త‌ప్పించుకోడానికి కాంగ్రెస్ ముందు చాలానే దారులున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.  బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ గేమ్ లో.. త‌ర్వాతి  స్టెప్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.

భార‌త్ పై 25 శాతం సుంకాల మోత‌.. ఎవ‌రికి లాభం ఎవ‌రికి న‌ష్టం?

ట్రంప్ భారత్ అంటేనే మండి ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా మోడీ అంటేనే ఆయ‌న‌కు అస్స‌లు గిట్ట‌డ్డం లేదు. ఒక స‌మ‌యంలో ట్రంప్ విజయం కోసం ప్ర‌చారం చేసిన మోడీ.. ట్రంప్ రెండో సారి గెలిచాక త‌న త‌ప్పిపోయిన సొంత సోద‌రుడ్ని క‌లిసినంత సంబ‌రంగా ఫీలయ్యారు. అయినా కూడా మోడీ  పొడ ట్రంప్ కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు.  ఏమైందో తెలీదుగానీ..  భారత్ పై పాతిక శాతం టారీఫ్ ల‌తో విరుచుకుప‌డ్డం మాత్ర‌మే కాదు.. భార‌తీయులంటేనే ఉద్యోగాలివ్వ‌ద‌ని అంటున్నారు ట్రంప్. పాకిస్థాన్ లో ప్ర‌స్తుతం పెట్రోలు త‌వ్వ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టింది అమెరికా.  వ‌చ్చే రోజుల్లో భార‌త్ కే ఇంధ‌నం అమ్మొచ్చ‌ని అంటారు ట్రంప్. మోడీ పాకిస్థాన్ పాల‌సీని ఫాలో కావ‌డం లేదు. కొత్త రూట్ మ్యాప్ ఫాలో అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే అమెరికా, చైనాల‌తో పాటు దీటైన దేశంగా అన్ని రంగాల్లో రాణించేదిశగా దూసుకెడుతోంది. ఆయుధ  సంప‌త్తి సైతం పెంచుకుంటోంది.  గ్లోబ్ సౌత్ కి నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి మోడీ మొన్న చాలా దేశాల్లో  ప‌ర్య‌టించారు. అంతే కాదు.. బ్రిక్స్ ద్వారా గ్గోబ్ సౌత్ లీడ‌ర్షిప్ కి ప్లానేస్తున్నారు. దీంతో ట్రంప్ కి మోడీ అంటే అస్స‌లు ప‌డడం లేదు అంటున్నారు విశ్లేషకులు. అవ‌స‌ర‌మైతే చైనా, ఆఫ్రికా దేశాల‌తో కొత్త జ‌ట్టు క‌ట్ట‌డానికి కూడా సిద్ధ ప‌డుతున్నారు మోడీ.  దీంతో మోడీ ని చూసి చికాకు ప‌డుతోంది ట్రంప్ నాయ‌క‌త్వంలోని అమెరికా. నిజ‌మే పాతిక  శాతం సుంకాల ద్వారా భార‌త్ లో కొన్ని   రంగాల‌కు తీవ్ర‌మైన ఇబ్బంది క‌ల‌గొచ్చు. ఇందులో పాడి, వ్య‌వ‌సాయ రైతుల‌కు, ఎన్నో చిన్న మ‌ధ్య‌త‌ర‌హా ఎంఎస్ఎంఈల‌కు న‌ష్టం వాటిల్ల వ‌చ్చు.  అంతే కాదు.. ఎంపీ లావు పార్ల‌మెంటులో చెప్పిన‌ట్టు.. ఏపీ ఆక్వాకు భారీ న‌ష్టం కలగొచ్చు. ఎందుకంటే మ‌న స‌ముద్ర ఉత్ప‌త్తుల్లో 33 శాతం అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఆ మాట‌కొస్తే మొన్న‌టి మామిడి రైతుల క‌డ‌గండ్ల‌కు కార‌ణం కూడా ఇలాంటి ప‌రిస్థితులే. కొంద‌రేమంటారంటే మోడీ ఒక్క మాట మాట్లాడితే ఇలాంటి స‌మ‌స్య‌లు స‌మ‌సిపోతాయి. పాతిక శాతం కాస్తా 15 నుంచి 20 శాతానికి దిగి వస్తుందంటారు.  బేసిగ్గా ఇప్ప‌టి వ‌ర‌కూ ఇరు ప‌క్షాలు వ‌చ్చే కొన్నేళ్ల‌లో ద్వైపాక్షిక వ్యాపారం 500 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచాల‌న్న యోచ‌న‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో సానుకూలంగా స్పందిస్తే స‌రిపోతుంది. కానీ, మోడీ ఇందుకు స‌మ్మ‌తంగా ఉన్న‌ట్టు లేరు. పైపెచ్చు అమెరికా క‌న్నా చైనాను న‌మ్మ‌డ‌మే మేల‌ని భావిస్తున్నారు. ఈ మ‌ధ్య చైనా టూరిస్టుల‌కు వీసా అనుమ‌తులివ్వ‌డం ఇందులో భాగంగానే భావిస్తున్నారు.  ఇక ఫైన‌ల్ గా ర‌ష్యాను వ‌దులుకోవ‌డం. ఎందుకంటే ప్ర‌పంచ‌మంతా ఉక్రెయిన్ లోన మార‌ణ‌కాండ ఆపాల‌ని ఎదురు చూస్తుంటే..  మోడీ,  భార‌త్ మాత్రం ర‌ష్యా నుంచి చ‌మురుతో స‌హా ఎన్నో ఆయుధ స‌హాయ స‌హ‌కారాల‌ను పొందుతున్నార‌ని ఆరోపిస్తారు ట్రంప్. నిజ‌మే ఇదే ర‌ష్యా నుంచి భార‌త్ చ‌మురు కొన‌కుంటే జ‌రిగే విప‌త్తు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌ల్ బ్యార‌ళ్ల ధ‌ర‌లు అమాంతం పెరుగుతాయి. మొన్న ఆప‌రేష‌న్ సిందూర్ లో ర‌ష్యాన్ ఎస్ 400 ద్వారా మ‌న‌మెంతో విజ‌యం సాధించాం. అదే అమెరికాను దాని ఎఫ్ 16ల‌ను న‌మ్ముకున్న పాక్ ప‌రిస్థితి ఎలా ఉందో చూశాం. చైనా ఇచ్చిన పీఎల్ 15లు, ఇత‌ర వాయు ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా నిర్వీర్య‌మైన ప‌రిస్థితులు. మ‌నం కూడా అలాంటి ఫలితాల‌నే పొంద‌డానికి సిద్ధంగా లేమంటారు మోడీ ఆయ‌న ప‌రివారం. కాబ‌ట్టి ట్రంప్ ని ఫాలో కావ‌డం అయ్యే ప‌ని కాదని తెగేసి చెబుతారు. ఒక వేళ మోడీ మ‌న వాళ్ల‌కు ఉద్యోగాలివ్వొద్దంటే న‌ష్ట‌పోయేది అమెరికాయే. కార‌ణం మ‌న మేధ‌స్సు అక్క‌డ ట్రిలియ‌న్ డాల‌ర్ల వృద్ధి చూపుతోంది. త‌ద్వారా అమెరికాకు ఎంతో మేలు జ‌రుగుతోంది. ఎన్నో ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. ఆ మాట‌కొస్తే మ‌స్క్ ని కూడా ఇలాగే దూరం చేసుకుంటున్నారు ట్రంప్. ఆయ‌న వ‌ల్ల ఎంతో ల‌బ్ధి చేకూరుతున్నా.. కావాల‌ని మ‌స్క్ ఆదాయ వ‌న‌రుల‌ను గండి కొట్టేలా బిగ్ బిల్ వంటి బిల్లులు పాస్ చేయిస్తున్నారు. దీని వ‌ల్ల అంతిమ న‌ష్టం అమెరికాకే అన్న‌ది నిపుణుల అంచ‌నా.  ఇప్ప‌టికే ప‌క్క‌నే ఉన్న మెక్సికో, కెనాడా వంటి  దేశాలతో స‌ఖ్యంగా లేక పోవ‌డం వ‌ల్ల‌.. కెన‌డియ‌న్లు అమెరిక‌న్ టూర్ లు  మానేస్తున్నారు. దీని వ‌ల్ల ఎంతో లాస్. ఎందుకంటే ఒక కెన‌డియ‌న్ అలా యూఎస్ టూర్ వ‌స్తే పెట్టే ఖ‌ర్చు మినిమంలో మినిమం 4 వేల డాల‌ర్లు. ఇక‌ మెక్సిక‌న్లు అమెరికాలోకి చొర‌బ‌డకుంటే అక్క‌డ పాచిప‌ని, వంటప‌ని, మ్యూజిక్ వంటి రంగాల్లో ఆ వెలితి తీర్చ‌లేనిది. ఇక భార‌త్ ని కాద‌నుకుంటే స్పేస్, మెడిసిన్, లా, సాఫ్ట్ వేర్ రంగాల్లో భారీ వెలితి ఏర్ప‌డుతుంది. చైనాను కాద‌నుకుంటే ఏకంగా అన్ని చౌక వ‌స్తువుల‌ను అత్య‌ధిక ధ‌ర‌లు వెచ్చించి కొనాల్సి వ‌స్తుంది. ఎటు నుంచి ఎటు చూసినా ఈ సుంకాల వ్యూహంలో చిక్కింది అమెరికాయే త‌ప్ప‌.. భార‌త్, చైనా కాదంటారు  వాణిజ్య‌ నిపుణులు.  మ‌రి  చూడాలి.. ట్రంప్ తెంప‌రి త‌నం ఇక్క‌డితో ఆగుతుందా? లేక ఆయ‌న ఒంటి చేత్తో కొత్త ప్ర‌పంచం సృష్టిస్తారా.. కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.

ట్రంప్ టారిఫ్ ల కొరడా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న టారిఫ్‌ల కొరడా ఝులిపించారు. తాజాగా పలు దేశాలపై కొత్త సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 70కిపైగా దేశాలపై 10 నుంచి 41 శాతం మధ్య టారిఫ్‌లను విధిస్తూ   ఉత్తర్వులపై సంతకం చేశారు. వాణిజ్య లోటు కారణంగా టారిఫ్‌లు పెంచుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందాల మేరకు కొన్ని దేశాలపై సుంకాల్లో మార్పులు చేసినట్టు వివరించారు. అయితే ఆ దిశగా భారత్‌తో ఏకాభిప్రాయం అంత త్వరగా సాధ్యం కాదని అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వాణిజ్యంతో పాటు అనేక భౌగోళిక రాజకీయ అంశాలు ఈ చర్చలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. కొత్త టారిఫ్స్‌లో భాగంగా భారత్‌పై ట్రంప్ పాతిక శాతం  సుంకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కెనడాపై సుంకాన్ని 25 నుంచి 35 శాతానికి పెంచారు. ఔషధాల అక్రమ దందాకు కెనడా అడ్డుకట్టవేయలేకపోవడం, అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగడం తదితర కారణాలతో కెనడాపై సుంకాన్ని పెంచినట్టు తెలిపారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సుంకాల పెంపుపై అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే.. ఈ పెంపు మరో వారం తరువాత అమల్లోకి రానుంది. ఇక పెంపునకు సంబంధించి అమెరికా ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఆగస్టు 7 లోపు వాణిజ్య నౌకల్లోకి చేర్చిన వస్తువులు ఆక్టోబర్ 5లోపు అమెరికాకు చేరితే కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆ తరువాత దిగుమతి అయ్యే వస్తువులపై కొత్త సుంకాలు అమలవుతాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరాల్సి ఉంది. అయితే, పూర్తిస్థాయి ఒప్పందానికి కొంత సమయం పడుతుందని, ట్రంప్ ఆమోదముద్ర కూడా వేయాల్సి ఉందని శ్వేతసౌధం వెల్లడించింది. చైనాపై సుంకాల విధింపునకు అమెరికా ఆగస్టు 12వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈ వారం స్టాక్‌హోం వేదికగా జరిగిన చర్చల్లో చైనా డిమాండ్స్‌ను అమెరికా గట్టిగా వ్యతిరేకించినట్టు సమాచారం

ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘంఈ  ఎన్నికకు షెడ్యూల్ ను శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతను ప్రకటిస్తారు. ఇక ఈ ఎన్నికకు నోటిఫికేషన్ ఆగస్టు 7న వెలువడుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ దాఖలుకు తుది గడువు ఆగస్టు 21.   అదే నెల 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఆగస్టు 25 కాగా సెప్టెంబర్ 9న  ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం పది గంటల నుంచి 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు  కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెలువరిస్తారు.