విజయమ్మ పరకాల ప్రచారం,పోలీస్ కేసులు నమోదు
posted on Jun 9, 2012 @ 9:52AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై వరంగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా పరకాలలో రోడ్ షో నిర్వహించారని వైఎస్ విజయమ్మ, షర్మిల, కొండాసురేఖపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు మీద బహిరంగ సభ నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభ వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడతారని భావించి విజయమ్మ తో పాటు షర్మిల, కొండాసురేఖ పై ఐపిసి 341,188 సెక్షన్లతో పాటు 127ఆర్ పి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. అనుమతులు లేని వాహనాల వినియోగం పై కూడ పరకాల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందిన 15 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రోడ్ పై కుర్చోని పోలీసులు కేసులు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై కావాలనే వివక్షపూరితంగా వ్యవహరిస్తునారని ఆరోపించారు.