నిఖిత హత్య కేసులో సంచలన విషయాలు

 

అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎలికాట్ సిటీలో జరిగిన ఈ హత్య వెనుక డాలర్ల అప్పు లావాదేవీలు ఉన్నట్టు తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిఖితను హత్య చేసిన వ్యక్తి ఆమె స్నేహితుడు అర్జున్ శర్మేనని హోవార్డ్ కౌంటీ పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. అర్జున్ శర్మ నిఖిత వద్ద 4,500 డాలర్లు అప్పుగా తీసుకున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని నిఖిత కజిన్ సరస్వతి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో వెల్లడించారు. అప్పు తీసుకున్న అర్జున్ శర్మ అందులో 3,500 డాలర్లు మాత్రమే తిరిగి ఇచ్చి, మిగిలిన 1,000 డాలర్లు ఇవ్వకుండా ఆలస్యం చేశాడని తెలుస్తోంది. ఈ విషయమై నిఖిత అతడిని పదే పదే డబ్బులు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం.

పోలీసుల విచారణలో మరో షాకింగ్ అంశం బయట పడింది. నిఖిత ఖాతా నుంచి 3,500 డాలర్లు అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న అర్జున్ శర్మ, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదమే ఈ దారుణానికి దారి తీసిందని ప్రాథమికంగా తేలింది.డిసెంబర్ 31న డబ్బులు ఇస్తానని చెప్పి నిఖితను తన అపార్ట్‌ మెంట్‌కు పిలిపించిన అర్జున్ శర్మ, అక్కడే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన వెంటనే అర్జున్ శర్మ అమెరికా నుంచి పారిపోయి భారత్‌కు వచ్చినట్టు గుర్తించారు.ఈ ఘటనపై నిఖిత తండ్రి ఆనంద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“అర్జున్ శర్మ మా అమ్మాయి స్నేహితుడు మాత్రమే. మాజీ ప్రియుడు అని మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఖిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తానని పిలిపించి మా కూతురిని అతని అపార్ట్‌మెంట్‌లో హత్య చేశాడు. ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు,” అని ఆయన కన్నీళ్లతో చెప్పారు.డిసెంబర్ 31న నిఖిత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ తెలిపిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హోవార్డ్ కౌంటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. జనవరి 2న నిఖిత ఆచూకీని గుర్తించినట్టు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు.

అర్జున్ శర్మ కొలంబియా ప్రాంతం లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్టు విచారణలో తేలింది.హత్య అనంతరం భారత్‌కు పారిపోయిన అర్జున్ శర్మను తమిళనాడులో అదుపులోకి తీసుకు న్నట్టు సమాచారం. ఈ కేసులో అమెరికా, భారత అధికారుల మధ్య సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయి. నిఖిత హత్య జరిగిన విషయాన్ని భారత రాయబారి కార్యాలయం కుటుంబ సభ్యులకు అధికారికంగా తెలియ జేసింది. నిఖిత మృతదేహాన్ని త్వరితగతిన హైదరాబాద్‌కు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తండ్రి ఆనంద్ విజ్ఞప్తి చేశారు. నిఖిత హత్యకు పాల్పడిన అర్జున్ శర్మకు అమెరికా ప్రభుత్వం కఠినమైన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రవాస భారతీయులను తీవ్రంగా కలచివేసింది.

రాజ్‌కోట్‌లో రికార్డు సృష్టించిన యువ బ్యాటర్ రాహుల్

  అంతర్జాతీయ క్రికెట్లో భారత్ యువ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రాహుల్(112*) సెంచరీతో అజేయంగా నిలిచాడు. అయితే రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.  దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో శతక్కొట్టి.. అరుదైన ఘనతను సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(56), కేఎల్ రాహుల్(112*) అజేయ శతకంతో చెలరేగి ఆడారు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా నిరాశపర్చారు. 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రాహుల్ ఆఖరి వరకు పోరాడాడు. దీంతో భారత జట్టు ఆ మోస్తరు స్కోరు అయినా చేయగలిగింది.  ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 96 వ్యక్తిగత స్కోర్ వద్ద జెమీసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా రాహుల్‌కి ఇది వన్డేల్లో 8వ సెంచరీ. ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు కూడా ఇతడిదే. ఈ క్రమంలో అతను 11 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2015లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మైదానంలో 108 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఇదే హయ్యెస్ట్ వన్డే వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో రాహుల్ దీన్ని అధిగమించాడు. ఈ మైదానంలో కేఎల్ రాహుల్(112 నాటౌట్), క్వింటన్ డికాక్(108), స్టీవ్ స్మిత్(98), శిఖర్ ధావన్(96), మిచెల్ మార్ష్(96) టాప్-5 స్కోరర్లుగా కొనసాగుతున్నారు

నారావారిపల్లిలో ఘనంగా సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ కులదైవం నాగాలమ్మకు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తండ్రి ఖర్జూరనాయుడు, తమ్ముడు రామ్మూర్తి సమాధుల వద్ద నివాళులు అర్పించారు.అలానే ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించనున్నారు. వారిరి స్మరించుకున్నారు. గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేశారు.  పండుగ వాతావరణంలో సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ వారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి, వినతులు ఇవ్వడానికి పెద్దఎత్తున ప్రజలు నారావారిపల్లికు చేరుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రి నారా లోకేష్, భువనేశ్వరి, నారా రోహిత్, నందమూరి రామకృష్ణ, ఎంపీ భరత్  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఉండవల్లికి చేరుకుంటారు.

ట్రేడింగ్ పేరుతో సినీ దర్శకుడి కుమారుడికి భారీ మోసం

  హైదరాబాద్‌లో ట్రేడింగ్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్‌ తేజను అధిక లాభాల ఆశ చూపి హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతులు నిలువునా ముంచేసి ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయని నమ్మించి మొత్తం రూ.63 లక్షలు కాజేసినట్లు ఆరోపణలు చేస్తూ దంపతులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమితవ్‌ తేజ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.  గత ఏడాది 2025 ఏప్రిల్‌లో మోతీ నగర్‌కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్‌ దంపతులతో అమితవ్‌ తేజకు పరిచయం ఏర్ప డింది. ఆ పరిచయాన్ని అవకాశంగా మలుచుకున్న దంపతులు ట్రేడింగ్‌లో పెట్టు బడి పెడితే భారీ లాభాలు వస్తాయని, ఒకవేళ నష్టం వస్తే తాముంటున్న అపార్ట్‌ మెంట్‌ ఫ్లాట్‌ను అప్పగిస్తా మని హామీ ఇచ్చారు. దంపతుల మాటలు నిజమని నమ్మిన అమితవ్‌ తేజ తొలుత కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టారు. వారం రోజులకే రూ.9 లక్షలు లాభం వచ్చిందంటూ నిందితులు కొన్ని నకిలీ పత్రాలు, స్టేట్‌ మెంట్లు చూపించి అమితవ్‌ తేజ నమ్మించారు.  వాటిని చూసి నిజమని భావించిన అమితవ్‌ తేజ క్రమంగా విడతల వారీగా మరిన్ని పెట్టుబడులు పెట్టాడు.ఇలా మొత్తం రూ.63 లక్షలు దంపతులకు అందజేశారు. అయితే రోజులు గడుస్తున్నా కూడా ఎటువంటి లాభాలు రావడంతో పాటు పెట్టిన అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది.. దంపతులను ప్రశ్నించగా మాట తప్పించ డంతో మోసపోయినట్టు గ్రహించిన అమితవ్‌ తేజ చివరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.  బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రేడింగ్ పేరుతో నకిలీ పత్రాలు చూపించి డబ్బులు కాజేసిన ఘటనపై సైబర్ కోణంలోనూ విచారణ చేపట్టే అవకాశముందని పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడుల పేరుతో ఉపయోగించిన ఖాతాలు, ఇతర బాధితులు ఉన్నారా అనే అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం...ట్రేడింగ్, పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద ఆఫర్లు వస్తే ముందుగా పూర్తిగా పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.  

నారావారిపల్లెలో చంద్ర‘క్రాంతి’.. జనంలో, జనంతో బాబు కుటుంబం వేడుకలు

రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ చంద్ర‌బాబు అత్యంత ప్ర‌ముఖుడు. సంప్రదాయాలను ఆచరించడంలో, ప్రజలలో మమేకం కావడంలో, అందులో కుటుంబాన్ని భాగస్వామ్యం చేయడంలో ఆయన స్టైలే వేరు. ప్రతి సంక్రాంతి పండుగను స్వస్థలంలో ప్రజల మధ్య జరుపుకుంటారు. ఆయ‌న స్వ‌స్థలం నారావారిప‌ల్లె. ఈ ప‌ల్లె అదృష్టం ఎలాంటిదంటే ప్ర‌తి సంక్రాంతి స‌మ‌యంలో ఈ ప‌ల్లె పేరు మారు మోగుతుంది. అంతే కాదు.. నారావారి పల్లెలో జ‌రిపే సంక్రాంతి వేడుక‌ల్లో నారా, నంద‌మూరి కుటుంబసభ్యులందరూ క‌ల‌సి  పాల్గొంటారు. దీంతో ఈ ఊరు క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. ఊరు ఊరంతా  జాత‌రలాంటి వాతావ‌ర‌ణం ఏర్పడుతుంది. సంక్రాంతి సందర్భంగా   ఒకే సారి నారా వారి కుటుంబానికి చెందిన మూడు త‌రాల‌ వారిని చూసి నారావారి పల్లె పులకించి పోతుంది. ఔను నారాచంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు, వారి వారసుడు దేవాన్ష్ లు సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లెలో  చేసే సందడే సందడి. గ్రామస్తులతో మమేకమై పండుగ జరుపుకుంటారు. దీంతో తాతా, తండ్రి, మనవడు ముగ్గురినీ ఒకే ఫ్రేమ్ లో ఒకే సారి కనిపించే అరుదైన, అపురూపమైన దృశ్యం నారావారి పల్లె వాసులకు దక్కుతుంది.   ఇక ఈ ఏడాది నారావారి పల్లె సంక్రాంతి సంబరాల్లో  నారా దేవాంశ్ ఆట పాట‌ల‌తో దేవాన్ష్ తల్లిదండ్రులు, తాతా నానమ్మలు మురిసిపోయారు. వారి మురిపెం చూసి నారావారిపల్లె పులకరించిపోయింది. అదలా ఉంటే  వైయ‌స్ స్వ‌స్త‌లం  పులివెందుల‌, ఇక కేసీఆర్ స్వ‌స్థలం చింత‌ మ‌డ‌క ఇంకా ఎంద‌రో నాయ‌కుల స్వ‌స్థలాలు ఉన్నాయి. అయితే అక్కడెక్కడా కనిపించని సంక్రాంతి సందడి, శోభ  ఒక్క నారావారి ప‌ల్లెలో మాత్ర‌మే క‌నిపిస్తుంది. దీంతో ఈ ఊరి భాగ్య‌మే భాగ్యం క‌దా? అనిపిస్తుంది. ఈ ఏడాది నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ రాలేదు కానీ,  కానీ ఆయ‌న స‌తీమ‌ణి, కుమార్తె తెజస్విని, అల్లుడు, ఎంపీ శ్రీభరత్ వచ్చారు.   ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేంటంటే.. నారావారి పల్లెలో చంద్రబాబు సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం అధికారంలో ఉన్న‌పుడు మాత్ర‌మే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా జరుపుకుంటారు. స్వగ్రామంలో ప్రజలలో మమేకమై పండుగ జరుపుకోవడం ఆయన ఎప్పటి నుంచో పాటిస్తున్న ఆచారం. ఆనవాయితీ.     జ‌ననీ జ‌న్మ‌భూమిశ్చ స్వ‌ర్గాద‌పీ గ‌రీయ‌సీ   అంటారు.  అలా సొంతూరికి ఇంత‌టి పేరు ప్ర‌ఖ్యాతులు తీసుకురావ‌డం కూడా ఒక ఘ‌న‌తే. అలాంటి ఘ‌న‌త సాధించిన చంద్ర‌బాబు  స్వ‌స్థ‌లం నారావారిప‌ల్లె అదృష్ట‌మే అదృష్టం క‌దా? అన్న మాట వినిపిస్తోంది.

శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పులకించిన భక్త జనం

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బుధవారం ( జనవరి 14) సాయంత్రం మకరజ్యోతి దర్శనం కనువిందు చేసంది. అశేష భక్తజన సందోహం మధ్య అయ్యప్ప భక్తులు ప్రత్యక్షంగా మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శన మిచ్చింది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తజనం స్వామియే శరణం అయ్యప్ప అంటూ తన్మయత్వంలో మునిగిపోయారు.  అంతకుముందు.. పందళం రాజప్రాసాదం నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన తిరువాభరణాలను అయ్యప్ప స్వామికి  అలంకరించారు. అనంతరం, ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక దీపా రాధన నిర్వహించారు. ఆ వెంటనే పొన్నాంబలమేడు కొండపై దివ్యజ్యోతి కనిపించడంతో శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోయాయి. అయ్యప్ప భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.  మకరజ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రావెన్‌కోర్‌ దేవస్ధానం  బోర్డు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది.  

పండుగ వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆనందహేల

సంక్రాంతి పండుగ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డబుల్ ఆనందం తీసుకువచ్చింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వోద్యుగులు, పెన్షనర్స డీఏ, డీఆర్ బకాయిలను వారి ఖాతాలో జమ చేసింది. వీరితో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించింది. ఇందు కోసం 26 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 5.7 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వారి వారి ఖాతాలలో జమచేయడం వల్ల ఒక్కొక్కరి ఖాతాలో 30 నుంచి 60 వేల వరకూ జమ అయ్యాయి. ప్రభుత్వం ఈ బకాయిలను సరిగ్గా భోగి పండుగ రోజున విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలలో  సంక్రాంతి సంతోషం రెట్టింపైంది.   దాదాపు ఆరేళ్ల తరువాత ఈ బకాయిలు విడుదలయ్యాయి.    అలాగే పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డీఏ ఎరియర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. న  పండగ పూట బకాయిలు జమ కావడంతో ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 

మహిళలను కించపరచడం అమానుషం : సీపీ సజ్జనార్

  ప్రజా జీవితంలో మహిళలను కించపరచడం అమానుషమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. మహిళలపై వ్యక్తిగత దాడులు, చరిత్ర హననం, అసభ్య వ్యాఖ్యలు సమాజ పురోగతికి గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ ఉద్యోగి అయినా, గృహిణి అయినా మహిళ గౌరవం అపరిమితం అని ఎక్స్ వేదికగా సీపీ పేర్కొన్నారు.  టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, వార్త కథనాల పేరుతో మహిళలపై దూషణలు ఖండించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా దెబ్బతీయడం, ప్రతిష్ఠను నాశనం చేయడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని తెలిపారు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తును కోల్పోతుందని పేర్కొన్నారు. మహిళలపై అవమానం, వివక్ష, చరిత్ర హననం ఇక సహించమని సజ్జనార్ హెచ్చరించారు.  మన పురాతన ధర్మం "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" (ఎక్కడ మహిళలు పూజించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అని చెబుతోంది. కానీ నేటి కాలంలో మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న వ్యక్తిత్వ హననం  మన నాగరికతనే ప్రశ్నిస్తోందన్నారు. ది ఫ్యూచర్ ఈజ్ ఫీమేల్ అని భవిష్యత్ అంతా మహిళలదే అని సీపీ సజ్జనార్ తెలిపారు. ఐఏఎస్ అధికారిణిపై అవాస్తవాలను ప్రచారం చేసిన కేసులో తెలంగాణలో వరుస అరెస్టులు జరగడం సంచలనంగా మారింది.

ములుగు జిల్లా రద్దు కాదు...మంత్రి సీతక్క క్లారిటీ

  జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ములుగు జిల్లా రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు. జిల్లా కోసం పోరాడి ఇప్పుడు ఎందుకు రద్దు చేస్తామన్నారు. కొత్త జిల్లాలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిందని, శాస్త్రీయ పద్దతిలో స్వల్ప మార్పులు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోందని ప్రజలు ఆందోళన పడొద్దని సీతక్క సూచించారు.  పలు యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా జిల్లాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లేందుకే ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లాలో ఒక మండలం ఉంటుంది.. అందులోని ఐదు గ్రామాలు పక్కన భూపాలపల్లి జిల్లాలో ఉంటాయిని మంత్రి తెలిపారు. అలాంటప్పుడు ప్రజలకు పాలనా ఫలాలు ఎలా అందుతాయి... రెవిన్యూ, పోలీసు సరిహద్దులు ఒకే లాగా ఉండాలని తెలిపారు. దీంతో జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు రెండు జిల్లాల కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది .అందుకే శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దు విషయంలో స్వల్ప మార్పులు ఉంటాయని సీఎం చెప్పారని ఆమె తెలిపారు. 

మహిళ ఐఏఎస్‌లపై అసత్య కథనాలు...పలువురిపై కేసు నమోదు

  ఒక మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేసిన ఘటనలో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్  పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిసిఎస్ పోలీసులు ఇప్పటికే కీలక అరెస్టులు చేశారు. ఓ న్యూస్ ఛానల్‌కు చెందిన ఇన్‌పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ ఐఏఎస్ అధికారిని వ్యక్తిగ తంగా కించపరిచే విధంగా, ఆమె ప్రతిష్టకు భంగం కలిగిం చేలా అసత్యాలు, అవమా నకర వ్యాఖ్యలతో కూడిన కథనాలను ఉద్దేశపూర్వ కంగా ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది కేవలం మీడియా నైతికత ఉల్లంఘన మాత్రమే కాకుండా, చట్టపరమైన నేరంగా కూడా పరిగణిం చబడుతుందని సిసిఎస్ అధికారులు స్పష్టం చేశారు. 44 యూట్యూబ్ చానల్స్‌పై కేసులు ఈ వ్యవహారంలో టెలివిజన్ ఛానల్స్‌తో పాటు 44 యూట్యూబ్ చానల్స్ కూడా మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా వీడి యోలు, చర్చలు, అభ్యంత రకర కంటెంట్ ప్రసారం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆయా యూట్యూబ్ చానల్స్‌ పై చట్టపరమైన చర్యలకు సిసిఎస్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.సోషల్ మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం, దుష్ప్ర చారం చేయడం ద్వారా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... అధికారిని అవమా నించే ప్రయత్నం చేసిన వారి ని గుర్తించే పనిలో  నిమగ్న మయ్యారు. ఇప్పటికే పలు వురు యూట్యూబ్ చానల్స్ నిర్వాహకులను గుర్తించి నట్లు అధికారులు వెల్లడించారు.  సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా యూట్యూబ్ చానల్స్ నిర్వాహకుల వివరాలను సేకరించే పనిలో పడ్డ సిసిఎస్ పోలీసులు, వారిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశముందని స్పష్టం వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పటిష్టంగా ఉన్నాయని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చ రించారు. ఈ ఘటనపై సిసిఎస్ పోలీసుల దూకు డుతో పలువురు యూట్యూబ్ చానల్స్ నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కొందరు వీడియోలను తొలగించగా, మరికొందరు తమ చానల్స్‌ను తాత్కా లికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. అయితే డిలీట్ చేసిన కంటెంట్ కూడా డిజిటల్ ఆధారాల రూపంలో తమ వద్ద ఉందని పోలీ సులు చెబుతున్నారు. మీడియాకు సిసిఎస్ హెచ్చరిక ఈ సందర్భంగా సిసిఎస్ పోలీసులు మీడియా సంస్థ లకు కీలక హెచ్చరికలు చేశారు. వ్యక్తుల గౌరవం, ముఖ్యంగా మహిళా అధి కారుల ప్రతిష్టను దెబ్బ తీసేలా అసత్య కథనాలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛ పేరుతో చట్టాలను ఉల్లంఘిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జర్నలిస్టుల అక్రమ అరెస్టును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఖండించారు.జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన సుచించారు.జర్నలిస్టుల అరెస్ట్‌ను వెంటనే ఆపాలంటూ సీపీ సజ్జనార్, డీజీపీ శివధర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మహిళా ఐఏఎస్ అధికారిపై అసభ్యకర కథనాలు ప్రసారం చేసిన కేసులో ఓ వార్తా సంస్థ ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు జర్నలిస్టులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  మరోవైపు ప్రముఖ న్యూస్ ఛానల్‌పై  సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆఫీసులో సర్వర్లు లాగేసి, కంప్యూటర్లు సీజ్ చేశారు.