12 రోజుల్లో లక్షల సంపాదనకు మద్యం వ్యాపారుల ఆరాటం
posted on Jun 18, 2012 @ 10:53AM
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఎం.ఆర్.పి. ధరలకన్నా ఎక్కువకు జరగటంతో ఎసిబి సిండికేట్ లో పాత్రదారులపై విచారణ ప్రారంభించింది. ఈ దశలోనే తమ లైసెన్సులకు 13 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అనంతవ్యాపారులు ఎం.ఆర్.పి. ధరలకు అదనపు రేట్లకు అమ్మకాలు ప్రారంభించారు. ఉపఎన్నికలు ప్రారంభమైన తరువాత రెండు రుజులపాటు ప్రభుత్వం డ్రైడేలు ప్రకటించింది. దీన్ని ఆసరాగా చేసుకుని అనంత మద్యం వ్యాపారులు దొంగచాటు వ్యాపారం చేశారు. అప్పుడు బాటిల్ కు వందరూపాయలు కూడా అదనంగా తీసుకున్నారు. ఈ రెండు రోజుల్లో వచ్చిన ఆదాయం మళ్ళీ మద్యం వ్యాపారుల మనస్సు మార్చింది. ఎసిబి దాడి చేస్తుందన్న భయాన్ని వదిలేశారు. చివరి 13 రోజుల్లో అందినలాడికి దోచుకోవడానికి సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాలో మొత్తం 234 మద్యందుకాణాలున్నాయి. 10 బార్లున్నాయి. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, కళ్ళిచోరదుర్గం, గుత్తి, అనంతపురం రూరల్ మండలాల్లో మద్యం ఎం.ఆర్.పి. కన్నా అదనపు ధరలకు అమ్ముతున్నారు. కనీసం 30-40 రూపాయలు బాటిల్ పై అదనంగా అమ్ముతున్నారు. ఉపేన్న్కల్లో అయితే రూ. 60, 100, 150రూపాయలు కూడా అదనంగా అమ్మేశారు. దీంతో మళ్ళీ ఎం.ఆర్.పి. ధరలకన్నా ఎక్కువగా అమ్ముతున్నారని ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేస్తే స్పందన కరువైంది.