చైనా-భారత్ 16 లక్షల మంది మృత్యువాత.. కారణం అదే..?
posted on Dec 3, 2016 @ 10:58AM
పారిశ్రామికంగా మన దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో తెలియదుకానీ.. ఒక్క విషయంలో మాత్రం మన దేశం ఎప్పుడూ ముందుంటుంది. అదేంటనుకుంటున్నారా.. వాయు కాలుష్యంలో. వాయు కాలుష్యంలో మాత్రం మన దేశం టాప్ పదిస్థానాల్లో చోటు సంపాదించుకుంది. ఇక మన దేశంతో పాటు మన పొరుగున ఉన్న దేశం చైనా కూడా ఈ విషయంలో మనతోనే పోటీపడుతుంది. చైనాలో కూడా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వాతావరణ కాలుష్యం వల్ల రెండు దేశాల్లో కలిపి 16 లక్షల మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. గ్రీన్ పీస్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. వాయు కాలుష్యం వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్న తొలి పది దేశాల్లో ఇండియా కూడా ఉందని..భారత్, చైనాల్లో బొగ్గును అత్యధికంగా వినియోగించడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ఈ రెండు దేశల్లో ప్రతి లక్ష మందిలో 115 నుంచి 138 వరకు వాయు కాలుష్యం బారిన పడుతున్నారని తెలిపింది. థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల వల్ల వాయుకాలుష్యం భారీగా పెరుగుతోంది..దీన్ని అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని గ్రీన్ పీస్ సూచించింది. మరి ఇప్పటికైనా దీనిపై చర్యలు తీసుకుంటారో లేదో చూద్దాం.