ఆహార కల్తీకి పాల్పడితే కేసులే : సీపీ సజ్జనార్

 

హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా కల్తీ ఆహారాన్ని తయారుచేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

కల్తీ నిరోధానికి పోలీస్‌ శాఖ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కఠినంగా ఎస్‌వోపీ అమలు చేస్తామని తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి కల్తీకి పాల్పడే వ్యాపారులపై లైసెన్సులు రద్దు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య రక్షణే తమ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.


 

టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పవన్‌కళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకకూ ఎవరూ అందుకోనటువంటి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సాంప్రదాయ జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కన్రికై ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఐదవ డాన్‌ను ప్రదానం చేసింది. అంతే కాకుండా ఆయనను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సత్కరించింది. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తన హ్యాండిల్ లో అధికారికంగా పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ అనే పేరుతో ఒక వీడియోను షేర్ చేస్తూ.. పవన్ అసలు మార్షల్ ఆర్ట్స్ ఎలా మొదలుపెట్టారు .. ఎక్కడెక్కడ నేర్చుకున్నారు.. ఎలా ఎదిగారు లాంటివన్నీ ఆ వీడియోలో పొందుపరిచారు.  డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వీడియోకు వాయిస్ అందించారు. మార్షల్ ఆర్ట్స్ ని జనాల మధ్యకు తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి గుర్తింపుగా గత ఏడాది డిసెంబర్ 30న ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. భారత దేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిఖీ మహ్మద్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు  అందుకున్నారు. ఇలాంటి ఒక బిరుదును అందుకున్న మొట్ట మొదటి భారతీయుడు పవన్ కళ్యాణ్.  . సోగో బుడో కన్రికై సంస్థ ద్వారా ఐదవ డాన్ గౌరవాన్ని సోకే మరమత్సు సెన్సై నేతృత్వంలో టకెడా షింగ్ క్లాన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ కి స్థానం కల్పించారు.  ఈ వార్త తెలియడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తొలి వన్డేలో భారత్ టార్గెట్ ఎంతంటే?

  భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్  నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు కాన్వే (56), నికోల్స్ (62) రన్స్ చేశారు.  డారిల్ మిచెల్ (84) అద్భుత ఇన్నింగ్స్‌ అందించాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.  ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఓపెనర్లు కాన్వే, నికోల్స్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో భారత్ కష్టాల్లో పడినట్లు కనిపించినా, బౌలర్లు పుంజుకొని వరుస విరామాల్లో వికెట్లు తీశారు. సెంచరీ భాగస్వామ్యం తర్వాత హెన్రీ నికోల్స్‌ను హర్షిత్ రాణా ఔట్ చేయగా, కాసేపటికే కాన్వే కూడా పెవిలియన్ చేరాడు.

సినిమా టికెట్ల రేట్లు పెంపు సీపీఐ నారాయణ ఫైర్

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ,   హోం మంత్రి అమిత్ షా ప్రశంసల కోసమే పవన్ సనాతన ధర్మం అంటూ వేషం మార్చారని విమర్శించారు. వ్యక్తిగతంగా పవన్ సనాతన ధర్మం వ్యతిరేకి. సనాతన ధర్మంలో విడాకులు ఉండవు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే పవన్ డిప్యూటీ సీఎంగా ఉండటం మన దురదృష్టమని  నారాయణ ఆరొపణలు చేశారు. మరోవైపు సినిమా టికెట్ ధరల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ మాఫియా, ప్రభుత్వాలు ప్రజలను లూటీ చేస్తున్నాయి.  సినిమా వాళ్లు సిగ్గులేకుండా టికెట్ ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ది లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయి. వందల కోట్లు ఖర్చుపెట్టి ఎవరు సినిమాలు తీయమన్నారు.  మూవీ చూసేందుకు ప్రజలు వెళ్తే వాటర్ బాటిల్, బిస్కెట్లు కూడా తీసుకెళ్లనివ్వరు అని ఆరోపించారు. ఇదిలా ఉంటే కొత్త సినిమాల విడుదలకు ముందు బెనిఫిట్ షోలతో పాటు పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో టికెట్ ధరలు అయితే వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ధరలు పెంచవద్దని తెలుగు రాష్ట్రాలకు నారాయణ విజ్ఞప్తి చేశారు.  

విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు

  విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్‌లో ఓ వ్యక్తి దాడి చేసి, దుర్భాషలాడినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు... ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది.  సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి, వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా,  కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు.  అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. విశాఖలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్‌లోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

జగన్‌కు రైతుల స్ట్రాంగ్ కౌంటర్

  వైసీపీ అధ్యక్షుడ జగన్‌పై ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ స్ట్రాంగ్ ఇచ్చారు. అమరావతి నిర్మాణంపై జగన్.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ధి పనులు జరుగున్నాయని స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్ అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు.  ఇప్పుడు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని జగన్ అనడం సమంజసమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం (11-1-26) ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అమరావతి స్మశానం, ఎడారి అన్నారని.. అందుకనే ఆ పార్టీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారనన్నారు.  రాజ్యంగానికి భిన్నంగా జగన్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నందుకు జగన్‌పై వెంటనే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారణం కూడా అమరావతి ఉద్యమమేనని స్పష్టం చేశారు. జగన్ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని చెప్పుకొచ్చారు. జగన్‌కు ధైర్యం ఉంటే 11 మందితో కలిసి అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అధికార పక్షం తప్పులుంటే జగన్ అండ్ కో ఎత్తి చూపాలని సూచించారు.  గత ఐదేళ్లు జగన్ ఎక్కడ ఉండి పరిపాలన చేశారని నిలదీశారు. జగన్ ఇల్లు అమరావతిలోనే ఉందని ప్రస్తావించారు. 2015లోనే అమరావతిపై గ్రీన్ ట్రైబ్యునల్‌లో జగన్ కేసు వేయించారని గుర్తు చేశారు. అమరావతికి గ్రీన్ ట్రిబ్యునల్ క్లీన్‌చిట్ ఇచ్చిందని తెలిపారు. అమరావతిలో రెండో ల్యాండ్ పూలింగ్‌పై తమకు వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కూడా అమరావతిలోనే ఉంటున్నారని ప్రస్తావించారు.  జగన్ ఇలానే నడుచుకుంటే రాజకీయ సమాధి కట్టడానికి రాజధాని మహిళలు సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు. జగన్‌ని మోసపు రెడ్డి అని అనొచ్చని ఎద్దేవా చేశారు. జగన్ బటన్ నొక్కడమే పరిపాలన అనుకున్నారని విమర్శించారు. జగన్ సగం సగం మాట్లాడతారని, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతారని సెటైర్లు గుప్పించారు. సో కాల్డ్ అనే పదం జగన్ మానుకోవాలని.. లేదంటే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమరావతి పేరు చెప్పడానికే కూడా జగన్ ఇష్టపడడం లేదని వారు మండిపడ్డారు.  

బెజవాడ నడిబొడ్డులో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ

  విజయవాడ లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, హీరో జయ కృష్ణ, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, బుద్ధ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు.  తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు.  కృష్ణని చూస్తే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంటారని,  విజయవాడ నడిబొడ్డులో కృష్ణ విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు కృష్ణ పేరు నిలిచి ఉంటుందన్నారు. కృష్ణతో ప్రతి ఒక్క హీరోకి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. మూవీ పోస్టర్‌ను చూసి ఆయా సినిమాలకు వెళ్లామంటే అది ఒక కృష్ణకే దక్కుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. హీరో కృష్ణను మించిన సూపర్ స్టార్ మరొకరు ఉండరని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.  అతి తక్కువ కాలంలో 350 సినిమాలు చేసిన గొప్ప నటుడు కృష్ణ అని ప్రశంసించారు. మూడో తరం వారసుడిగా రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ వస్తున్నారని తెలిపారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ బ్యానర్‌లో జై కృష్ణ నటించడం చాలా సంతోషంగా ఉందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. కృష్ణకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నటుడు మహేశ్‌బాబు లాగే.. కృష్ణ మనువడు జై కృష్ణ కూడా సూపర్ స్టార్ తరహాలో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. ఈనాడు సినిమా ఇక్కడే షూటింగ్ జరిగిందని గుర్తుచేశారు. ఈనాడు సినిమా ద్వారా కృష్ణ రాష్ట్ర రాజకీయాల చరిత్రనే మార్చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.  

అమరావతిపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

  రాజధాని అమరావతిపై మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. కేంద్రం, రాష్ట్రంతో పాటు అందరం కలిసి రాజధానిగా  అమరావతిని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.  ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో మాజీ రాష్ట్రపతి పాల్గొన్నారు. అమరావతి అంటే గుంటూరు, గన్నవరం, విజయవాడ, తాడికొండలు మాత్రమే కాదు...ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతి రూపం అన్నారు. రాజధాని విషయంలో సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు. ఈ విషయంలో అనవసర వివాదాలను సృష్టించొద్దని తెలిపారు.  పాలిటిక్స్‌లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని తెలిపారు. అందువల్లే రాజకీయాల్లోకి తన కుమారుడు, కుమార్తెను రానివ్వలేదని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రాదాయాలను కాపాడాలని తన పిల్లలకు చెప్పానని, అదే తాను ఇచ్చే సంపద అని వెంకయ్య నాయుడు అన్నారు. ఏది మారినా మన సంస్కృతి సంప్రదాయాలు మూలలు మారకూడదని మాజీ ఉపరాష్ట్రపతి తెలిపారు.  ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇంటికి చేరే సమయంలో సంక్రాంతి పండగ నిర్వహించుకుంటామని, ఈ మధ్య వాతవరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రకృతితోనే మన పండగలన్నీ ముడిపడి ఉన్నాయన్నారు. ప్రకృతి బాగుంటేనే భవిష్యత్ సైతం బాగుంటుందని వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లా అమరావతి కూడా అభివృద్ధి చెందాలని తెలిపారు.  

బాబా వంగా జోస్యం నిజమవుతుందా?... మూడో ప్రపంచ యుద్దం తప్పదా?

  బల్గేరియా జ్యోతిష్యురాలు బాబా వంగా చెప్పింది నిజమవుతోందా? 2026లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా? ఈ ఏడాది ప్రారంభంలోనే జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది. బాబా వంగా చెప్పింది నిజమయ్యే అవకాశాలున్నాయనే భయాందోళనలు కూడా మొదలయ్యాయి. 9/11 దాడులు, కోవిడ్-19 వంటి పరిణామాలను ముందే ఊహించిన బాబా వంగా 2026ను యుద్ధం, విధ్వంసం జరిగే సంవత్సరంగా అభివర్ణించారు.  వెనిజులాపై అమెరికా సైనిక దాడి, రష్యా – ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు, రష్యా చమురు నౌకలపై అమెరికా దాడులు, ఇరాన్‌లో పెరుగుతున్న అంతర్గత తిరుగుబాటు, తైవాన్‌పై చైనా సైనిక చర్యకు సిద్ధమవుతోందనే వార్తలు.. ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలతో కయ్యానికి సిద్ధమవుతున్నారు.  కొలంబియా, మెక్సికో, క్యూబా వంటి దేశాలపై కూడా ట్రంప్ చర్యలకు సిద్ధమవుతున్నారు. లాటిన్ అమెరికా నుంచి యూరప్ వరకు సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు బాబా వంగా చెప్పినట్టుగా మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తాయని చాలా మంది భయపడుతున్నారు . అమెరికా వాణిజ్య యుద్ధాలు, చమురు రాజకీయాలు, సరిహద్దు వివాదాలు, అంతర్గత తిరుగుబాట్లు ప్రపంచాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. మరి, ఈ పరిస్థితులు సద్దుమణిగి శాంతి నెలకొంటుందా? లేదా బాబా వంగా చెప్పినట్టు ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.  

వడోదరలో చోటా కోహ్లీ

  టీమిండియా-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేడు ప్రారంభం అయింది. ఇందులో తొలి మ్యాచ్ వడోదర వేదికగా జరిగింది. అయితే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేలు ఆడుతుండటంతో ఈ మ్యాచులపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాటో కోహ్లీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు.  ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ చిన్నారుల్లో ఒక పిల్లాడు.. అచ్చు చిన్ననాటి కోహ్లీలాగే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కోహ్లీ కూడా ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇస్తూ.. చిరునవ్వు చిందిచడం అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. ‘వీడేంటి నా లాగే ఉన్నాడు..’ అని కోహ్లీ అనుకుని ఉంటాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్‌ వస్తున్నాయి.

కేంద్ర మంత్రి రామ్మోహన్ చొరవతో మయన్నార్ బాధితులు స్వదేశానికి

  ఉద్యోగుల కోసమని మయన్మార్ వెళ్లి మోసపోయి అక్కడే చిక్కుకుపోయిన పది మందిని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యక చొరవతో స్వదేశానికి వచ్చేలా చేశారు. భాధితుల ఇబ్బందులను వారి కుటుంబ సభ్యులు ఇటీవల రామ్మోహన్‌నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌రే లేఖ రాసి రక్షించమని కోరారు.  దాంతో యాంగోన్‌లోని భారత రాయబా కార్యాలయం అధికారులు అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చించి 10 మందిని ఢిల్లీకి తరలించారు. బాధితులను ఏపీ భవన్ అధికారులు వారి స్వస్థలాలైన విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, హైదరాబాద్, జగిత్యాల జిల్లాలకు తరలించాు. మయన్నార్‌లో 80 మందికి పైగా భారతీయులు సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకున్నారని, వారందర్నీ వెనక్కు రప్పించే ప్రయత్నం చేయాలని రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రి జైశంకర్‌ను కోరారు.