'సీఎం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా'
posted on Apr 3, 2011 @ 3:58PM
హైదరాబాద్: తెలంగాణ కంటే రాయలసీమ వెనుకపడిందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు అన్నారు. కరీంనగర్ కన్నా చిత్తూరు వెనుకబడి ఉందని చెప్పడం సరికాదని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. విధాన సభలోనే సాక్షాత్తు మంత్రి ఓ శాసనసభ్యునిపై దాడి చేస్తే క్షమాపణలతో సరిపెట్టడం వదిలేశారని ఆరోపించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణపై రహస్య నివేదిక ఇవ్వడం నీచాది నీచం అని వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీని తాము గుర్తించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రహస్య నివేదిక ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. నేతలను ప్రలోభ పెట్టమని ఓ కమిటీ చెప్పడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు హైదరాబాదులో సమావేశం అయి తెలంగాణపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. అనంతరం కేకేమీడియాతో మాట్లాడారు. జూపల్లి కృష్ణారావు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని కేకే కోరారు.