చిరును వెంటాడిన తమిళ కోర్టు
posted on Jun 21, 2012 9:27AM
ప్రచారంలో పరిథి దాటినా మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అక్టోబరు 2వ తేదీ లోపు బాగుళూరు కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. సినీజీవితం వదిలేసి రాజకీయ జీవితానికి అలవాటు పడేందుకు చిరు బోలెడు ప్రయాస పడుతున్నారు. ముందుగా ప్రజారాజ్యంపార్టీని స్థాపించి ఆ తరువాత దాన్ని కాంగ్రెస్ లో కలిపేశారు. ఇలా కలిపేసిన తరువాత ఎమ్మెల్యేగా ప్రారంభించిన రాజేకీయ జీవితంలో ఓ చిన్న ప్రమోషన్ లభించి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అందరూ ఎంపీ అని పిలిచే ఈ సభ్యత్వంతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, జాతీయనాయకులతో కలిసే సువర్ణావకాశం ఆయనకు లభించింది. అయితే ఈ మధ్యలో ఓ చిన్న అపశ్రుతి దొర్లింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలినాళ్ళ (2011)లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు చిరంజీవి అక్కడికి వెళ్ళారు. అక్కడ చిరు కొంచెం స్పీడుగానే ప్రచారం చేశారు. తొందరగా ప్రచారం ముగించుకుని వచ్చేయాలనే కంగారులో చిరంజీవి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. హోసూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి గోపీనాథ్ తరపున చిరు ప్రచారం చేశారు. ఆయనపై 188, 143 సెక్షన్ల కింద హోసూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కోర్టు వాయిదాలకు కూడా చిరు గైర్హాజరవటంతో హోసూర్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చిరుతో పాటు ఆరుగురిపై 2011లో ఈ కేసు నమోదైంది. సినీ జీవితంలో (ఖైదీ) కోర్తుమెట్లు నటనలో భాగంగా ఎక్కినా చిరు ఇప్పుడు నిజం కోర్టుకు హాజరుకావాలి. అప్పుడు నటుడుగా, ఇప్పుడు రాజకీయ నాయకునిగా ఎదురవురున్న ఈ మార్పులను చిరు తట్టుకోగలరా? లేక తనకు సినీజీవితమే బాగుందని బయటపడిపోతారా? అని అన్నిరాజకీయ పక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.