రాజకీయ నాయకులకు, ఎన్జీవోల "సమైక్యాంధ్ర'' సభ గుణపాఠాలు!

 

 

 

- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

బొంకరా గురవా అంటే, ఇదే అదననుకున్న సన్నాసి ఒకడు "ఆ గురజాల దోమలు గురిగింజలంత ఉంటాయిరా'' అని కోసేశాడట! భాషాప్రయుక్త ప్రతిపాదికపైన ఒకేజాతి, ఒకేభాషా సంస్కృతుల కుదుళ్ళపైన ఏర్పడిన విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చడం ద్వారానే పార్లమెంటులో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ల తర్వాత అధికసంఖ్యలో [42 స్థానాలు] సభ్యుల బలంతో నెహ్రూ కుటుంబ వారసుడుగా ఈ తరం ప్రతినిథి అయిన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం సాధ్యమని యు.పి.ఎ. అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలైన సోనియాగాంధీ తలపోయడంతో తెలుగు రాష్ట్రం విచ్చిత్తికి బీజాలు నాటింది. అందుకోసం "బోడితలకూ మోకాలికి ముడి''పెట్టి, కుదరని ఆ ప్రక్రియకు కారకులు ఆంధ్రప్రదేశ్ లోని అవకాశవాద రాజకీయ పార్టీల మీదికి తెలివిగా నెట్టి కూర్చుంది. ముందుగా రాష్ట్రవిభజన సమస్యపైన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీలాగా నీళ్ళు నమలకుండా కేంద్రంలో ఒక పాలకశక్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గ నేత్రిగా స్పష్టాతి స్పష్టంగా విభజన అనర్థమని సోనియా చెప్పలేకపోయింది!

 

 

రేపు కొడుకు రాహుల్ ని [ఆ శక్తి ఉన్నా లేకపోయినా] దేశప్రధానిగా గద్దెనెక్కించే తొందరలో తాడూ బొంగరం లేని ఒక ప్రాంతపు స్థానిక పార్టీని స్థాపించుకున్న రాజకీయ నిరుద్యోగ నాయకుడి బెదిరింపులకు లొంగిపోయి కాంగ్రెస్ భవిష్యత్తుకే చేటుతెచ్చి తెలుగుజాతిని చీల్చడానికి వెనుదీయని కాంగ్రెస్ అధినేత్రి రాష్ట్రప్రజలను, రాష్ట్ర భవిష్యత్తును అయోమయ పరిస్థితుల్లోకి నెట్టింది; వలస సామ్రాజ్యపాలనా వ్యవస్థపై తిరగబడిన జాతీయ స్వాతంత్ర్య సమరంతో బొత్తిగా పరిచయంలేని, అవగాహనలేని సోనియాను పార్టీకి అధినేత్రిగా నెత్తికెక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలోని "డూడూ బసవన్నలు'' కేవలం కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రిపదవులను విడిచిపెట్టలేక, తెలుగుజాతిని చీల్చుతున్న అధినేత్రికి ఈ క్షణంలో కూడా కొమ్ముకాయడం తెలుగుజాతికే అవమానకరం.  ప్రపంచబ్యాంకి ప్రజావ్యతిరేక 'సంస్కరణల' చాటున దాగి దేశరాజకీయ, ఆర్థికవ్యవస్థా ప్రయోజనాలకే చేటుతెచ్చి, దేశాన్నే తాకట్టుపెట్టడానికి వెరవని కాంగ్రెస్ అధిష్ఠానం సుమారు 3000 సంవత్సరాల చరిత్ర గలిగిన తెలుగుజాతి సమైక్యతను కూడా పదవీప్రయోజనాల కోసం బలిపెట్టడానికి జంకదు!
 


తాజావార్తలను బట్టి [08-09-2013] చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రస్తుత ప్రధానమంత్రి ప్రజావ్యతిరేక సంస్కరణలకు పురోహితుడైన డాక్టర్ మన్ మోహన్ సింగ్ ను తప్పించి రాహుల్ ను ఆ స్థానంలో కూర్చోపెట్టే వైపుగా పావులు కదులుతున్నాయి. ఇందుకు సాక్ష్యం - ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చడానికి అనుకూలంగా కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీపరంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి కూడా వ్యతిరేకించలేని మన్మోహన్ సింగ్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే గాక, తన ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోగల స్థితిలో లేకపోవటం. అందుకు తగినట్టుగానే తన ఉత్తరాధికారిగా రాహుల్ ప్రధాని కావాలన్న ఆకాంక్షను దాచుకోలేకుండా బయటపెట్టడం - మధ్యయుగాల నాటి రాజరికపు సంస్కృతికే నిదర్శనం.
 



ఈ పూర్వరంగంలో, రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి కేవలం నాయకత్వస్థాయిలోనూ, అదికూడా మూడు, నాలుగు "జక్కాయి బుక్కాయి'' రాజకీయపక్షాల క్యాడర్ కు ప్రధానంగా పరిమితమై "వేర్పాటువాద'' ఉద్యమాన్ని సాగలాగుతున్న ఆ పక్షాల తాలూకు రాజకీయ నాయకుల వల్ల సాధ్యంకాని లక్షలాదిమంది ప్రజాసమీకరణ సమైక్యాంధ్ర ఉద్యమానికి ఏ పార్టీల తోడ్పాటు లేకుండా, విభజనవల్ల మూడు ప్రాంతాలలోని ప్రజలు ఎదుర్కొనబోతున్న సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.వో.లు హైదరాబాద్ లో తలపెట్టిన "సమైక్యాంధ్ర'' మహాసభ (07-09-2013) ఘనంగా విజయవంతమయింది. సంకుచిత మనస్సుతో తెలుగుజాతి ప్రయోజనాలకు హానికల్గించే స్వార్థపూరిత లక్ష్యంతో కొందరు "ప్రత్యేకరాష్ట్ర'' వాదంతో నడుపుతున్న ఉద్యమకారులనుంచి వచ్చిన బెదిరింపులకు లోనుగాకుండా ఎ.పి.ఎన్.జి.వో.ల సమన్వయ సంఘం జరిపిన సదస్సు ఎంత ప్రశాంతంగా, ఎంతటి క్రమశిక్షణతో, ఎవరికీ ఇబ్బంది కల్గించని రీతిలో, ఉద్రేకాలకు లోనుగాకుండా, ప్రజల్ని కించించే తప్పుడు నినాదాలు లేకుండా ఆంధ్ర (తెలుగు)జాతి విడిపోరాదని, విడిపోతే చెడిపోతామన్న స్ఫూర్తితో రాష్ట్రరాజధాని నడిబొడ్డులో అత్యంత జయప్రదంగా ముగిసినసభ - కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకులందరికీ పెద్ద కనువిప్పు కావాలి; గుణపాఠం కావాలి. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా తెలుగుజాతి భవిష్యత్తుకోసం జాతి వికాసం కోసం, కేవలం జాతి మౌలిక ప్రయోజనాల రక్షణ కోసం ఉద్యోగులు బహుళసంఖ్యలో తలపెట్టిన మొట్టమొదటి సభ యిది. తెలంగాణాలో ఇంకా సజీవులుగా ఉన్న ఒకనాటి తెలంగాణా సాయుధ పోరాటయోధులు సహితం స్వాతంత్ర్యోద్యమ కాలంలో మాత్రమే యిలా ఐచ్చికంగా వివిధ వర్గాల ప్రజలు ఎవరికి వారుగా చొరవతో ఇనుమడించిన దేశభక్తితో యిలా పాల్గొన్నారని వ్యాఖ్యానించడం జరిగింది. తెలుగుజాతిని చీల్చడం కోసం రాజకీయ స్వార్థంతో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్, దాని సంకీర్ణ ప్రభుత్వమూ ఉపసంహరించుకునే దాకా - ఎన్నిమాసాలు పట్టినా సరే, జాతికోసం "సమైక్యాంద్ర'' ఉద్యమం విశ్రమించబోదని ఇది జీతాలకోసం కాదు, జాతి జీవితాలకోసం జరుగుతున్న పోరాటమనీ ఉద్యోగులు, సభావారూ ప్రతినబూనటం యావత్తు తెలుగుజాతిలోనూ విశ్వాస సూర్యోదయాలు నింపింది!


 

ప్రజలతో నిమిత్తం లేకుండా, వివిధ ప్రాంతాల్లోని యావత్తు తెలుగుజాతి అభిప్రాయాలు తెలుసుకోడానికి జనవాక్య సేకరణ జరపకుండానే, ఏ పార్టీకి ఆపార్టీ తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పోటాపోటీలమీద తెలుగుజాతిని విభజించే 'నెగెటివ్' ప్రక్రియలో పడిపోయి, ముందుగా ఎలాంటి సొంత ప్రతిపాదన ప్రాతిపదికగా తానుగా కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని ప్రకటించని దశలో  జాతి విధ్వంసకులుగానూ, ప్రజాబాహుళ్యానికి విశ్వసనీయ నాయకత్వం అందించలేని వాజమ్మలుగానూ ప్రధాన ప్రతిపక్షాలు అవతరించడం ఘోరం! మంచి పాలనా శాస్త్రానికి సంబంధించిన "పొలిటికల్ సైన్స్'' పదవికే ఈ ప్రతిపక్షాలు చెడు అర్థాలు, నెగెటివ్ నినాదాలూ, 'నిఘంటువు'ల కెక్కించడానికి తాపత్రయపడ్డాయి!



 

'సమైక్యాంధ్ర' రక్షణనే సభలో ప్రసంగించిన ఉద్యోగానాయకులు పదేపదే కోరుకున్నారుగాని సోదర తెలంగాణా తెలుగుబిడ్డల ప్రయోజనాలు పట్టని కొందరు రాజకీయ నిరుద్యోగుల మాదిరిగా తెలుగువారు తెలుగుప్రాంతంలో తిరగడానికి 'వీసాలు'' పొందాలని కోరలేదు; 'తెలుగువాళ్ళు విడిపోతే చెడిపోతాం'' అన్నారేగాని కొందరిలా "కాళ్ళు విరగ్గొడతాం'' అనలేదు. "అందరం కలిసుందాం, కలిసి ఎదుగుదాం'' అన్నారేగాని "విడిపోతేనే వికాసం'' అనలేదు' ఉభయత్రా ఎదురయ్యే సమస్యలను "చర్చలద్వారా కలిసి పరిష్కరించుకుందాం'' అన్నారేగాని "నోరెత్తితే నాలుకలు కోసేస్తాం'' అనలేదు; రాజధాని హైదరాబాద్ ను "మూడుప్రాంతాల ప్రజల కష్టార్జితమ''న్నారేగాని ఉమ్మడి శ్రమఫలితంగా నిర్మించుకున్న "తెలుగువారి రాజధాని నుంచి తెలుగువారే వెళ్ళిపోవాల''ని ఉద్యోగ వక్తలు కోరుకోలేదు;


 

వీటన్నింటికిమించి, సమైక్యాంధ్ర మహాసభకు సీమాంధ్రనుంచి, హైదరాబాద్ చుట్టుపట్లనుంచి సమైక్యతాంధ్రను చెదరగొట్టరాదనీ భావించి బారీగా బస్సులలో, ఇతరవాహనాలలో తరలివస్తున్నప్పుడూ, సభను శాంతంగా, జయప్రదంగా ముగించుకుని తిరిగి తమతమ ప్రాంతాలకు వెడుతున్నప్పుడూ, పలుచోట్ల "ముసుగువీరులు'' కొందరిని ప్రేరేపించి ధైర్యంచాలక ఉద్యోగుల వాహనాలపైన రాళ్ళూరప్పలూ వేయించి గాయపరిచినా, సదస్యులు ఎదురుదాడి చేసి 'సీన్లు' సృష్టించలేదు; నిజాంకళాశాలలోని కొందరు విద్యార్థుల్ని సభకు వస్తున్న వారిపై రాళ్ళు రువ్వెందుకు కొందరు రాజకీయ నిరుద్యోగులు అజ్ఞాతంగా ప్రోద్భలపరిచినా, సభకు వచ్చిన ప్రతినిధులు గణనీయమైన సంఖ్యలో ఉన్నా సంయమనం పాటించారన్న ఇటీవల వెలసిన ఒకే ఒక స్థానిక పత్రికతప్ప ఆంగ్లపత్రికలు సహా మిగతా పత్రికలన్నీ పేర్కొన్నాయి! అన్నింటికన్నా విచిత్రమూ, సిగ్గుచేటైన విషయమూ - సభకు వస్తున్న సీమాంధ్ర ప్రతినిధులపైన రాళ్ళు విసురుతూ నిజాంకళాశాల భవనం మీదనుంచి ఒక విద్యార్థి జారిపడిపోయి క్షతగాత్రుడుకాగా, ఆ విద్యార్థిని భవనం మీదనుంచి పోలీసులు కిందకి తోసేశారని ఒక్క స్థానిక పత్రిక తప్ప మరే పత్రిక రాయకపోవటం. మిగతా పత్రికలన్నీ "రాళ్ళు విసిరే హడావుడిలో అతడే జరిపడ్డాడని రాశాయి!

 

అన్ని పత్రికలూ ఎ.పి.ఎన్.జీ.వో.ల "సమైక్యాంధ్ర మహాసభ'' ఘనంగా విజయవంతమైందని పతాకశీర్శికలు వార్త ప్రచురించగా సభనే ఒక "దండయాత్ర''గానూ, "సీమాంధ్రుల దాడిలో గాయపడిన తెలంగాణా'' అని తెలుగుప్రజల మధ్య రాజకీయ నిరుద్యోగులు మరింత విద్వేషాన్ని రగుల్కొల్పారు. మరో విచిత్రమైన అబద్ధం - సమైక్యతను కోరేవారి "గొంతుకలు కోస్తానని'' చాకు చూపించే ఒక వ్యక్తిది మార్ఫింగ్ చేసి ఒక స్థానిక ఛానెల్ చూపడం! ఈ విద్వేష ప్రచారం చాటున ఆ "గుప్పెడు'' రాజకీయ నిరుద్యోగులయిన దొరలు, భూస్వాములయిన పాత జాగిర్దారీ, దేశ్ ముఖ్, పటేల్, పట్వారీల సంతతీ మళ్ళీ తెలంగాణా ప్రజలపైన స్వారీ చేయడానికి, బడుగు బలహీనవర్గాల  బొమికలలో మిగిలిన 'మూల్గుల''ను కూడా పీల్చుకు తినడానికీ అధికారం చేజిక్కించుకోడానికే బలవంతంగా తెలుగుజాతిని చీల్చడానికి ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని తెలుగువారంతా గమనించాలి. ఈ సందర్భంగా, ఇంతకుముందు రాష్ట్రవిభజన విషయంలో కొంత 'పిడివాదం'లోకి జారుకున్నట్టు కన్పించిన మావోయిస్టు సోదరుల ధోరణిలో కూడా తాజాగా కొంత మార్పు కన్పిస్తోంది. "కోస్తాంధ్ర, రాయలసీమ మేధావులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ భారతకమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఒక ప్రకటనను [ 06-09-2013] పత్రికలకు విడుదల చేసింది. రాష్ట్రవిభజన ప్రతిపాదనపైన స్పష్టంగా, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అభిప్రాయాన్ని వెల్లడించకపోయినా భారతమావోయిస్టు పార్టీ కేంద్రీయ, ప్రాంతీయ మండలి తెలుగు "ప్రజలమధ్య ఐక్యత చాలా అవసరమ''ని చాటి చెబుతోంది! ఆ ప్రకటనలో యింకా యిలా ఉంది : "తెలంగాణా రాష్ట్ర ఏర్పాటువల్ల తలెత్తే స్సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకోడానికి ప్రజాసంఘాలు, ఉద్యమసంస్థలు ఒక ప్రజాస్వామిక వాతావరణంలో కలిసి చర్చించుకుని ముందుకుపోవాలి. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టి పాలకవర్గాలు చోద్యం చూస్తున్నాయి. ఆ వలలో (ట్రాప్)పడకుండా సమస్యలను సామరస్యంగా, న్యాయంగా పరిష్కారం చేసుకోవాలి. ప్రజల ప్రజాస్వామిక డిమాండ్ల పట్ల మూడుప్రాంతాల ప్రజలూ చైతన్యయుతంగా మెలగాలి''!



 

అంతేగాదు, ఈ మేరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణా మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన తదితర "సమస్త ప్రజానీకానికి'' మావోయిస్టుపార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శి హోదాలో 'ఆనంద్' పేరిట విడుదలయిన ఈ ప్రకటనలో మూడు ప్రాంతాల ప్రజలమధ్య "ఐక్యత, సంయమనం చాలా అవసరమ''ని మావోయిస్టు పార్టీ ఎందుకు భావిస్తోందో కూడా యిలా పేర్కొంది :
"తెలంగాణా ఏర్పాటు విషయంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల దళారీ (కాంప్రచార్), నిరంకుశాధికార బడాపెట్టుబడిదారీ,భూస్వామ్యవర్గాలు సామ్రాజ్యవాదంతో కుమ్ముక్కయి దోచుకోవడానికి ప్రయత్నిస్తూ తీవ్రంగా అణచివేస్తున్న ఈ తరుణంలో ప్రజలమధ్య ఐక్యత చాలా అవసరం''!

 

సహృదయంతో మావోయిస్టు పార్టీ చేసిన ఈ ప్రకటనలో - ఈ మాత్రపు అవసరాన్ని కూడా ముందుగా గుర్తించకుండా కొందరు రాజకీయ నిరుద్యోగులు తలపెట్టిన స్వార్థపూరిత వేర్పాటు ఉద్యమాన్ని పరోక్షంగా కూడా ఎందుకు ఆ పార్టీ ఎందుకని ఖండించలేకపోయింది? పత్రికావార్తలను బట్టి చూస్తే ఆ పార్టీ పరోక్షంగా కూడా రాజకీయ నిరుద్యోగులు కొందరు బూతులతో, అబద్ధపుప్రచారాలతో, ఇరుప్రాంతాల ప్రజలమధ్య పూడ్చుకోలేనంత విద్వేషా, విషపూరితంగా ఎక్కిస్తున్న దశలో మావోయిస్టుపార్టీ ఈ ఐక్యతా సందేశాన్ని యిచ్చి ఉంటే ప్రజల్ని బాగా ప్రభావితం చేసి ఉండేది! ఒక బడా వేర్పాటు వలసవాద 'దొర' ప్రారంభించిన స్వార్థపూరిత, కేవలం నాయక ప్రయోజన కేంద్రంగా అల్లిన కృత్రిమ ఉద్యమం ఆ నాయకుడుగాని, "మల్టీనేషనల్ కంపెనీ'' స్థాయిలో పెరిగిన అతడి కుటుంబం నుంచి ఎలాంటి త్యాగమూ చేయకుండా బడుగు, బలహీనవర్గాలకు చెందిన తెలుగుబిడ్డల్ని భ్రమలతో ఆత్మహత్యలవైపు నెట్టేశారు!


 

ఈ పరిణామదశలోనే కొన్నాళ్ళక్రితం నేను "సమాచార హక్కు చట్టం'' కింద ఆత్మహత్యల పాలైన బిడ్డల, కుటుంబాలకు చెందిన వివరాలను తెలుగువారి తెలంగాణాలోని పదిజిల్లాల నుంచి తెప్పించుకున్నాను. జిల్లాల పోలీసు ఉన్నతాధికారులనుంచి ఈ నివేదికలు అందాయి. నేనూ, తెలంగాణా మిత్రులు కొందరం వాటిని పరిశీలించడం జరిగింది. మొత్తం నివేదికల్ని పరిశీలించగా తేలిన సత్యం ఏమిటి? ఈ ఆత్మహత్యల్లో నూటికి 90 మందికిపైగా ఎస్.సి., ఎస్.టి., బి.సి. బలహీనవర్గాలకు చెందిన ముద్దుబిడ్డలవేనని రుజువైంది! అన్ని వేళలా, అన్నిత్యాగాలూ వృధా అయినవిగా భావించకూడదు. కాని కొందరు స్వార్థపూరిత లక్ష్యంతో ప్రారంభించే ఉద్యమంలో తప్ప ప్రాంతాల నిజమైన పురోగతి కోసం, సామ్యాజ్యవాద వ్యతిరేక పోరాటంలోకి, విమోచన పోరాటాలలోకి, పెట్టుబడిదారీ, భూస్వామ్యవర్గాల దోపిడీకి నిరసనగా జరిగే ఉద్యమాలలోకి దూకే వీరకిశోరాల త్యాగాలు మాత్రమే బేషరతు త్యాగాలవుతాయి, విలువైన త్యాగాలవుతాయి, కనుకనే అలాంటి త్యాగాల కోసం "అడ్వాన్స్ గ్యారంటీల''తో ఎవరూ ప్రవేశించరు! అలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించరు. కాని తెలుగుజాతిని చీల్చడం కోసం కొందరు రాజకీయ నిరుద్యోగులు జరుపుతూవచ్చిన విభజనోద్యమానికి నాయకుల పదవీస్వార్థం మినహా మరొక లక్ష్యం లేదు. కనుకనే నిజమైన ప్రజాతంత్ర ఉద్యమానికి చుక్కాని పట్టగలిగిన శక్తులు వేరు. అలాటివాళ్ళను వేరుచేసి ముందుగా "శిలువ వేసో, షూట్ చేసో, విషమిచ్చో ధనికవర్గ శక్తులు చంపేస్తాయి. ఈ విషయాలు తెలిసిన మావోయిస్టు పార్టీ ఆలస్యంగానైనా తాజాగా విభజనోద్యమం వెనక ఏ శక్తులు పనిచేస్తున్నాయో, సమైక్యాంధ్ర విశాలాంధ్రగా రూపొంది, పెట్టుబడిదారీ చట్రం అనుమతించిన పరిధుల్లోనే పరిమితుల్లోనే, అంతకుముందు రెండు రకాల పరాయిపాలనలలో (బ్రిటిష్, నిజాముల హయాముల్లో) ఎన్నడూ నోచుకోనంత అభివృద్ధిని సాపేక్షంగా మాత్రమే నమోదు చేస్తున్న సమయంలో ఆ పార్టీ కేంద్రీకరణ, ఈ పరిమిత ప్రగతిని పునాది చేసుకుంటూనే మరిన్ని "జాంబవంతుడి అంగల''తో సమున్నత స్థాయిలో అభివృద్ధిని సాధించగల సామాజిక సమూల పరివర్తనా శకాన్ని ఆవిష్కరించే దిశగా శక్తియుక్తుల్ని వొడ్డవలసి ఉంటుంది!

 

పెట్టుబడిదారీ, అర్థ భూస్వామ్య సమాజవ్యవస్థలో రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని ప్రాంతాల మధ్య, ప్రాంతాలలోని వివిధ జిల్లాల మధ్య అనివార్యమయ్యే అంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, దోపిడీవ్యవస్థకు కాపలాదార్లుగా మాత్రమే 'రాణించ'గల రాజకీయ నిరుద్యోగ నాయకులు స్వార్థప్రయోజనాలతో అధికార లాలసతో తలపెట్టే ఉద్యమాలను నిర్ద్వింద్వంగా సకాలంలో ఖండించి, బలంగా నిరసించాల్సిన బాధ్యత పురోగామి శక్తులయిన మిలిటెంట్ శక్తులదే కావాలి. ఇందుకు చిన్న ఉదాహరణ టాంక్ బండ్ పై నెలకొన్న మూడుప్రాంతాలవారి తెలుగు తేజోమూర్తులయిన సంస్కృతీపరుల విగ్రహాలను విధ్వంసం చేసిన తరువాత అందులో పాల్గొన్నవారిని ఆ విధ్వంసకాండకు బాధ్యత వహించిన కొన్ని పార్టీలు ఎవరికివారు ఎదుటివారి మీదకు నెట్టేశారు. అలా నెట్టిన వారిలో "మార్కిస్టు-లెనినిస్టు'' ముద్రలతో చెలామణీ అవుతున్న "సెక్షన్లు'' కూడా ఉన్నాయని గమనించాలి! ఇప్పుడు కూడా "సమైక్యాంధ్ర మహాసభ'' ద్వారా క్రమశిక్షణతో, వేలెత్తి చూపడానికి వీలులేని సంయమనంతో సర్వత్రా శాంతియుతంగా వ్యవహరించిన ఎ.పి.ఎన్.జీ.వో.లను "సీమగూండాలుగా, రౌడీలు''గా ముద్రవేయడానికి కొందరు వేర్పాటువాదులు ప్రయత్నించడాన్ని యిప్పటికైనా మావోయిస్టుమిత్రులు పరిగణనలోకి తీసుకోవాలి!

 

"ఎదురుబొంకు'' సామెతను గుర్తుంచుకోవాలి! అటు సీమాంధ్రను, ఇటు దక్కన్ లోని హైదరాబాద్ సంస్థానాన్ని 300-400 సంవత్సరాలపాటు వలసలుగా మార్చుకుని ఏలిన బ్రిటిష్ సామ్యాజ్యవాదులు, నిజాంపాలకులూ పరస్పరం దొంగచాటు ఒప్పందాల ద్వారా అటు కోస్తాంధ్రను, ఇటు తెలంగాణాను, అటు రాయలసీమనూ ప్రజల సంపదనూ దోచుకుని పొందిన అపారమైన ధనరాశులతో ఇరుపక్షాల రాజ్యాలు కాపాడుకున్నారని మరవరాదు; ఈ పాలకుల మధ్య ఈనాటి మాదిరిగానే ఆనాడూ బ్రిటిష్ వాళ్ళకు ఉత్తరాంధ్రను, మధ్యాంధ్రను, రాయలసీమనూ నిజాం నవాబులు అమ్మి భారీగా సొమ్ము చేసుకున్న సంపదతోనూ, తెలంగాణా ప్రజలను దోచుకున్న సంపదతోనూ హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. అందుకే హైదరాబాద్ యావత్తు తెలుగుజాతికేగాక, అనేక బాధలకు గురైన సామాన్య ముస్లిం ప్రజాబాహుళ్యానికి కూడా రాజధానిగా రూపుదిద్దుకుంది. ఈ వాస్తవాన్ని కూడా మావోయిస్టులు గుర్తించి, వ్యూహాన్ని తెలుగుజాతి సమైక్యతా పరిరక్షణ కోసం ముందడుగు వేయక తప్పదు! ఒక్కసారి తెలంగాణా సాయుధపోరాట యోధుడైన దేవులపల్లి వెంకటేశ్వర్రావు అన్న మాటల్ని మావోయిస్టులు గుర్తుచేసుకోవడం మంచిదికాదా? దేవులపల్లి మాటల్లో "ఒకే భాషా సంస్కృతులకు పునాదిగా ఏర్పరచుకున్న రాష్ట్రంలో యావత్తు తెలుగుజాతికి మాత్రమే స్వయంనిర్ణయహక్కు ఉంటుందిగాని, జాతిలో ఒక భాగానికి ఉండదుగాక, ఉండదు!

కవితను నియంత్రిస్తేనే కేసీఆర్ ఎంట్రీ క్లిక్!?

తెలంగాణ సెంటిమెంట్ రాజేయడం వినా తమ పార్టీ పుంజుకోవడానికి మరో మార్గం లేదని బీఆర్ఎస్ భావిస్తోంది. అది కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రియాశీలంగా మారి.. గతంలోలా తన మాటల మాయాజాలం ప్రయోగిస్తేనే పార్టీ  ఉనికి, భవిష్యత్ ఉంటాయనీ, లేకుంటే నానానిటీ తీసికట్టు అన్నట్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దిగజారడం ఖాయమన్న భావన బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. అంతే కాదు కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కావడానికి ఇదే మంచి తరుణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఈ నేపథ్యంలోనే.. కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి  తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.  నీటి కేటాయింపులు, హక్కులను  ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.  అయినా కూడా పరిశీలకులలో కేసీఆర్ గతంలోలా తన మాటలతో మాయ చేయగలరా? ఆయన ప్రవేశంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందా? అన్న సంశయాలను వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికీ మించి కేసీఆర్ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమంటూ జరిగితే.. ఆయన తొలుత తన విమర్శల గళమెత్తాల్సింది తన తనయ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితపైనే. పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత కల్వకుంట్ల కవిత.. ప్రణాళికా బద్ధంగా బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లను లక్ష్యంగా చేసుకుని ఆమె ఆరంభించిన విమర్శల దాడి క్రమక్రమంగా విస్తరిస్తూ వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో అవినీతిపై ఆమె చేస్తున్న విమర్శలకు జనం నుంచి స్పందన వస్తుండటంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. ఒకరిద్దరు నేతలు కవితపై ప్రతి విమర్శలు చేస్తున్నప్పటికీ కల్వకుంట్ల కుటుంబం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రంగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి.   ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ వెనుకబడటంతో కేసీఆర్ రంగంలోకి దిగక తప్పని అనివార్య పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. అయితే కేసీఆర్ ఇప్పుడు తన కుమార్తె విమర్శలకు దీటుగా సమాధానం చెప్పకుండా నీటి సమస్యలు, సెంటిమెంట్ అంటూ మాట్లాడితే జనం వినే అవకాశాలు అంతంత మాత్రమేనన్నది పరిశీలకుల విశ్లేషణ.  కేసీఆర్ రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా ఆమె కవిత విమర్శల ధాటిని ఆపగలిగేలా విమర్శనాస్త్రాలు సంధించాల్సి ఉంటుంది. అది కేసీఆర్ చేస్తారా? సొంత కుమార్తెపైనే  మాటల దాడికి దిగుతారా అన్నది వేచి చూడాల్సిందే. 

బ్యాలెట్ బీజేపీకి కలిసిరాదా?

తెలంగాణ‌లో  ఎనిమిది ఎంపీ సీట్లున్న బీజేపీకి క‌నీసం 800 పంచాయితీలు కూడా ఎందుకు గెల‌వ‌లేక పోయింది?  ఇదీ ప్ర‌స్తుతం పొలిటికల్ సర్కిల్స్, సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న చర్చ.   బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ  ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు.   మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం దేశం కోసం కాకుండా,   మోడీ కోసం పని చేస్తోందా అన్న సందేహాలనూ వ్యక్తం చేస్తున్నారు.    తెలంగాణలో మూడు విడ‌త‌లుగా జరిగిన పంచాయితీ  ఎన్నిక‌ల్లో కాంగ్రెస్- 7, 093 పంచాయితీల‌ను కైవ‌సం  చేసుకోగా, బీఆర్ఎస్- 3488, బీజేపీ- 699, సీపీఐ- 79, సీపీఎం- 75, ఇత‌రులు- 1264 పంచాయితీలను గెలిచాయి.  ఈ లెక్క‌న చూస్తే బీజేపీ 10 స్ట్రైక్ రేట్ కనీసం పది శాతం కూడా లేదని తేటతెల్లమౌతోంది.  మ‌రి ఇదే  బీజేపీ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో  ఎనిమిది స్థానాలలో ఎలా గెలవగలిగింది అని ప్రశ్నిస్తున్నారు.  బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు అంటే ఇట్స్ నాటే జోక్. కార‌ణం ఇక్క‌డున్న‌వే  17 సీట్లు. వీటిలో 8 గెల‌వ‌డం అంటే స‌గానికి స‌గం.. గెల‌వ‌డంతో స‌మానం. అలాంటిది ప‌ది శాతం పంచాయితీలు కూడా ఎందుకు రాలేద‌ని అడిగే వారికి తెలియాల్సింది ఏంటంటే.. బీజేపీని ఓట‌ర్లు ఎంపిక చేయ‌డంలో అర్ధం.. ప్రెజంట్ సిట్యువేష‌న్ ప్ర‌కారం.. ఈ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్క‌డి నుంచి ఎంపీల‌ను పంపిస్తే.. వారు రాష్ట్రానికి ఏదైనా సాదించి తీస్కొస్తార‌ని. ఇక్క‌డ వాస్త‌వ  ప‌రిస్థితి ఏంటి అన్న‌ది  అటుంచితే.. ఓట‌ర్ల అభిమ‌తం అయితే అదీ.  ఇక కాంగ్రెస్ కూడా బీజేపీకి మ‌ల్లే  జాతీయ పార్టీ. మ‌రి  ఆ  పార్టీకి  ఏడు వేల పైచిలుకు పంచాయితీలు రావ‌డానికి గ‌ల కార‌ణాలేంటి? అని చూస్తే రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ  అధికారంలో ఉన్నా.. ఆ పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావ‌డం త‌ర‌త‌రాలుగా జ‌రుగుతూ వ‌స్తున్న‌దే. ఇందులో ఎలాంటి విచిత్రం ఏమీ లేదు. గ‌తంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌పుడు కూడా ఇక్క‌డా పార్టీ స‌రిగ్గా ఇలాంటి ఫ‌లితాల‌నే చ‌వి చూసింది. బీఆర్ఎస్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడే వ‌ర‌కూ కూడా ఒక‌టీ అరా  త‌ప్పించి.. అన్ని  ర‌కాల  ఎన్నిక‌ల్లోనూ విజ‌య ఢంకా  మోగిస్తూనే వ‌చ్చింది. కేర‌ళ‌లోని ట్రివేండ్రం లోక‌ల్ బాడీ  ఎలక్ష‌న్స్ లో బీజేపీ  విజ‌య దుందుభి మోగించింది. ఈ కార్పొరేష‌న్లో అధికారం చేప‌ట్టింది.  ఇన్నాళ్ల పాటు ఇక్క‌డ హిందుత్వం గానీ ఆర్ఎస్ఎస్ వాదుల‌కుగానీ పెద్ద గొప్ప ఆస్కార‌ముండేది  కాదు.  ఆద‌ర‌ణ ల‌భించేది కాదు. పైపెచ్చు క‌మ్యూనిస్టుల చేతుల్లో ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ హ‌త్యాకాండ సైతం  న‌డిచేది. ఇక్క‌డ క‌మ్యూనిస్టుల‌దే రాజ్యం. కానీ ఇప్పుడ‌క్క‌డ సురేష్ గోపీ  రూపంలో ఒక ఎంపీ గెల‌వ‌డం  మాత్ర‌మే కాకుండా.. స్థానికంగానూ స‌త్తా చాటింది బీజేపీ. అక్క‌డా బ్యాలెట్ ఓటింగే  జ‌రిగి ఉంటుంది. మ‌రి  అక్క‌డి గెలుపును వీరంతా  ఎందుకు ఒక ప్రామాణికంగా  తీస్కోరు? అన్న  ప్ర‌శ్న  వినిపిస్తోంది. నిజంగా కాంగ్రెస్ చెప్పిన‌ట్టు ఓట్ చోరీయే జ‌రిగి ఉంటే, స‌ర్ రూపంలో ల‌క్ష‌లాది ఓట్లు పోయి ఉన్న మాట నిజ‌మైతే.. ప్ర‌జ‌లు ఈ ప్ర‌చారాన్ని ఓట‌ర్లు ఎందుకు న‌మ్మ‌డం లేదు? అన్న‌దొక ప్ర‌శ్న‌. రాహుల్ మీడియా ప్రెజంటేష‌న్లు ఇచ్చి.. ఇంత నెత్తీ  నోరు బాదుకున్నా.. జ‌నం  న‌మ్మ‌లేదంటే దాన్నెలా అర్ధం చేసుకోవాలి? ఆలోచించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇదే బ్యాలెట్ల  రూపంలోనే ఇక్క‌డ త‌క్కువ వ‌చ్చిన బీజేపీ, కేర‌ళ‌లో విజ‌య ఢంకా మోగించిన‌దాన్ని ఎందుకు మ‌రుస్తున్నారు? అన్నది కూడా మ‌న‌మంతా ప‌రిశీలించాల్సి ఉందంటారు విశ్లేష‌కులు.

రేవంత్ రెండేళ్ల పాలనకు పాస్ మార్కులే!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత దాదాపు దశాబ్దకాలం బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పాలన సాగింది.  2023 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  రేవంత్ సీఎంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయ్యింది.  ఈ రెండేళ్ల కాలంలో   సంక్షేమం, అభివృద్ధితో పాటుగా అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేయడం వంటి అనేక చర్యలతో  రేవంత్ ప్రభుత్వం మంచి మార్కులే సంపాదించింది.     రేవంత్ సర్కార్‌ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన  ఆరు గ్యారెంటీలను అమలుకు చర్యలు చేపట్టింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి  కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ  మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు.  దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.  ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం పట్టణ, గ్రామీణ అన్న తేడా లేకుండా మహిళాలోకం యావత్తూ హర్షం వ్యక్తం చేస్తున్నది. పరిపాలనలో పారదర్శకత, అవినీతిపై కఠిన వైఖరి కారణంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం పెరిగిందన్నది కూడా జనాభిప్రాయంగా వ్యక్తం అవుతోంది. ఈ సానుకూలతే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి సునాయాస విజయానికి కారణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే అంత మాత్రాన రేవంత్ సర్కార్ పట్ల జనంలో ఆల్ ఈజ్ వెల్ భావన ఉందని కాదు. ఆయన పాలన పట్ల సానుకూలత, వ్యతిరేకత కూడా సమపాళ్లలో వ్యక్తం అవుతున్నాయి. అంటే కొంచం ఇష్టం, కొంచం కష్టం అన్నట్లుగా ప్రజలు రేవంత్ రెండేళ్ల పాలనను అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రగతి, పురోగతికి ఆర్థిక సవాళ్లు ప్రతిబంధకంగా మారాయి. అయితే ఈ పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం కారణంగా వారసత్వంగా వచ్చిందని చెప్పాలి. ఈ అప్పుల భారం కారణంగానే  సంక్షేమ పథకాల పథకాల అమలు, అభివృద్ధి పనుల కోసం నిధుల సమీకరణ కష్ట సాధ్యంగా మారింది. పథకాల అమలు కోసం నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అప్పులు తేవడం, అలాగే భూములు అమ్మడం వంటి నిర్ణయాలు అనివార్యంగా తీసుకోవలసి వస్తున్నది. ఈ క్రమంలోనే  ప్రభుత్వం ఆదాయ సమీకరణ కోసం చేపట్టిన కంచన్‌బాగ్‌ భూముల విక్రయం, ‘హిల్ట్ పాలసీ  వంటి వాటిపై ప్రతిపక్షం నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇక పోతే రేవంత్ ఎన్నికలకు ముందు చెప్పిన ఆరు గ్యారంటీలలో భాగమైన  సామాజిక పింఛన్ల పెంపు,  తులం బంగారం హామీ వంటివి అమలు కాకపోవడం కూడా రేవంత్ సర్కార్ పై విమర్శలకు కారణమయ్యాయని చెప్పారు.   మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, డిసెంబర్‌ 8, 9తేదీల్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమిట్‌ ల పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్నా, వాటి ఫలితాలు ఇప్పుడే అంచనా వేయడం కష్టం.    ఇక పల్లెలలో రేవంత్ పాలనపై, మరీ ముఖ్యంగా రైతాంగంలో ఒకింత తక్కువ సానుకూలత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా విద్యుత్ కోతలు రైతాంగంలో రేవంత్ సర్కార్ పట్ల వ్యతిరేకతకు కారణమౌతున్నాయని అంటున్నారు.   సీఎంగా రేవంత్ రెడ్డి రెండేళ్ల  పాలనలో ఆర్థిక సవాళ్లు, రాజకీయ పరిమితులు  ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ప్రజలకు చేరువ అయ్యిందనే చెప్పాలి. రైతంగంలో ఉన్న వ్యతిరేకతను మినహాయిస్తే రేవంత్ రెండేళ్ల పాలనకు మంచి మార్కులే పడతాయని పరిశీలకులు అంటున్నారు.  అయితే.. రేవంత్ సర్కార్ బ్రహ్మాండం, అద్భుతం అన్న ఫీలింగ్ కూడా వ్యక్తం కావడం లేదు. రానున్న మూడేళ్ల కాలంలో రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి ఎజెండాతో ఎలా ముందుకు సాగుతారు అన్నది చూడాల్సి ఉంది.  

తెలంగాణ భవన్ కు కేసీఆర్.. పంచాయతీ ఫలితాల ప్రభావమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ వీడి క్రియాశీల రాజకీయాలలోకి మళ్లీ ప్రవేశిస్తున్నారా? అంటే ఆ పార్టీ శ్రేణులు ఔననే అంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్.. ఈ తరువాత వరుసగా రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ పంచాయతీ ఎన్నికలు రెండు దశలు పూర్తయిన తరువాత రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. రెండు దశలలోనూ కూడా ఆ పార్టీకి ఎటువంటి సానుకూలతా లభించలేదు. రెండు దశలలోనూ కూడా అధికార కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులే సర్పంచ్ లుగానూ, వార్డు సభ్యులుగానూ అత్యధిక సంఖ్యలో విజయం సాధించారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ బలహీనతలు ప్రస్ఫుటంగా ఈ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ప్రధానంగా నాయకత్వ లోపం, గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేసి, ప్రజలతో మమేకమయ్యే నేత లేకపోవడం, అన్నిటికీ మించి కేడర్ కు స్ఫూర్తిని నింపే పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ వైరాగ్యమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.  పంచాయతీ ఎన్నికల రెండో దశ ఫలితాలనే తీసుకుంటే ఎన్నికలు జరిగిన దాదాపు 4,000 గ్రామ పంచాయతీలలో..  కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు దాదాపు సగం చోట్ల స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు.  మొదటి దశలో చతికిల పడిన తరువాత  బీఆర్ఎస్ రెండో దశలోనైనా పుంజుకుంటుందని తిరిగి పుంజుకుంటుందని బీఆర్ఎస్ విశ్వాసంగా ఉంది. పరిశీలకులు సైతం బీఆర్ఎస్ పుంజుకుంటుందనే భావించారు. అయితే అందుకు భిన్నంగా తొలి దశకంటే దారుణంగా ఫలితాలు ఉండటం బీఆర్ఎస్ కు గ్రామీణ స్థాయిలో కూడా మద్దతు కరవైందని తేటతెల్లమైంది.  అన్నిటికీ మించి పంచయతీ ఎన్నికలలో పెరిగిన ఓటింగ్ కాంగ్రెస్ కే అనుకూలమని తేలిపోవడంతో  బీఆర్ఎస్ పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు సంవత్సరాల తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమైందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలంటే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నడుంబిగించి రాజకీయ రణక్షేత్రంలో దిగక తప్పదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. రాష్ట్రంలో ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం నుంచి బీఆర్ఎస్ బయటపడాలంటే కేసీఆర్ మళ్లీ క్రియాశీలంగా ప్రజా క్షేత్రంలోకి రావలసిన అవసరం ఉందని అంటున్నాయి.  ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అడుగులు ఆ దిశగా పడుతున్నా యనడానికి సంకేతంగా  కేసీఆర్ ఈనెల 19న తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. గోదావరి, కృష్ణా జలాల వాటాల విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎల్ పి నేతలతో చర్చించనున్నారు. అలాగే  తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాలు, పార్టీ సంస్థాగత విధానాలపై నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

క‌మ‌లానికి కిష‌న్ మార్క్.. చీడ ప‌ట్టిందా?

  తెలంగాణ బీజేపీలో అస‌లేం  జ‌రుగుతోంది? మ‌నం నానాటికీ ఇక్క‌డ  ఎందుకు దిగ‌జారిపోతున్నాం? అంటూ ప్ర‌ధాని మోదీ వాక‌బు చేశారంటే ఇక్క‌డి  పార్టీ ప‌రిస్థితి  ఏంటో ఊహించుకోవ‌చ్చు. ఇంత‌కీ  తెలంగాణ బీజేపీ ప్ర‌స్తుతం ఎలా ఉంది? అంటే రాజాసింగ్ ఉదంత‌మే అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. రాజాసింగ్ పార్టీలోని  ప్ర‌తి అంశాన్ని బ‌య‌ట  పెడుతూనే వ‌చ్చారు. ఇంకా అదే ప‌ని మీదున్నారాయ‌న‌.  రాజాసింగ్ మాట‌ల‌ ప్ర‌కారం చూస్తే, పార్టీ వ్య‌క్తి కోసం  న‌డుస్తోన్న వ్య‌వ‌స్థ కాదు అవ‌స్థ‌గా  తయారైన‌ట్టు తెలుస్తోంది. ఆ వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు కిష‌న్ రెడ్డిగా చెబుతారు రాజాసింగ్. కిష‌న్ ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నా.. ఆయ‌న ఆడింది ఆట  పాడింది పాటగా పార్టీలో చ‌లామ‌ణీ అవుతున్న‌ట్టు కొడుతోంద‌ని అంటారు రాజాసింగ్. ఒక‌ప్పుడు తెలంగాణ బీజేపీకి  ఇటు కిష‌న్ తో పాటు ద‌త్త‌న్న‌, ల‌క్ష్మ‌న్న అనే ఇద్ద‌రు సీనియ‌ర్లు త్రిమూర్తుల్లా  క‌నిపించేవారు. ద‌త్త‌న్న దాదాపు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ బీజేపీ అంత‌ర్గ‌త  రాజ‌కీయాల‌కు బాగా దూరంగా ఉన్నారు.  కిష‌న్ ఒక్క‌డే ప్ర‌స్తుతం దిక్కు మొక్కుగా  ఉన్నారు. ప్రెజంట్ కిష‌న్ కి బండి సంజ‌య్ రూపంలో మ‌రో నాయ‌క‌త్వం తోడున్న‌ట్టే క‌నిపించినా.. అందులోనూ ఏమంత  బండి మార్క్ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఇక్క‌డ  కిష‌న్ మార్క్ ప‌రిపాల‌నే అధికంగా  కొన‌సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. పేరుకు రామ‌చంద్ర‌రావు పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్నా.. ఆల్ ఇన్ వ‌న్ గా కిష‌న్ త‌న‌దైన క‌మ‌ల  చ‌క్ర వ్యూహం ర‌చిస్తూనే  ఉన్నార‌ట‌. కిష‌న్  కేంద్ర మంత్రి కావ‌డంతో కొంత  బిజీ బిజీగా ఉన్నమాట వాస్త‌వ‌మే  అయినా... పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో మాత్రం త‌న ప‌ట్టు కోల్పోకుండా జాగ్ర‌త్త  వ‌హించ‌డంతోనే అస‌లు ముప్పు త‌లెత్తిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇక్క‌డ ఎవ‌రికి వారే యుమ‌నా తీరే  అన్న‌ట్టుగా  త‌యారైందట‌. అంత‌ర్గ‌త  ప్ర‌జాస్వామ్యం అనే  విష‌యంలో ఈ 40 ఏళ్ల పార్టీ ఏకంగా 140 ఏళ్ల‌ కాంగ్రెస్ తో పోటీ  ప‌డుతోందంటున్నారు కొంద‌రు క‌మ‌ల‌నాథులు. మోడీ అడుగుతున్న‌ట్టు.. బీజేపీ ప‌త‌నం ఎలా ప్రారంభ‌మ‌య్యిందో చూస్తే.. నాడు బీఆర్ఎస్ అధికార పార్టీగా ఫ‌స్ట్ ప్లేస్ లో ఉండ‌గా.. ఆ త‌ర్వాతి స్థానంలో ప్ర‌జ‌ల దృష్టిలో నిలిచిన పార్టీ బీజేపీనే. కాంగ్రెస్ ఎక్క‌డో మూడో స్థానంలో ఉన్న‌ట్టు క‌నిపించింది. అయితే ఇటు క‌ర్ణాట‌క ఫ‌లితాలు రావ‌డంతో కాంగ్రెస్ లో ఒక ర‌క‌మైన జోష్ మొద‌లైంది.  మ‌న పొలంలోనూ మొల‌కలొస్తాయ్ అన్న ఆశ ఇక్క‌డి హ‌స్తంపార్టీ  నేత‌ల్లో చిగురించ‌డం మొద‌లైంది. దీంతో అప్ప‌టి  వ‌ర‌కూ అసంఘటితంగా  ఉన్న  కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కులంతా ఒక్కసారిగా చేయి చేయి క‌లిపారు. ఫ‌లితంగా 2023 అసెంబ్లీ  ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ బీజేపీ మూడో స్థానానికి ప‌డిపోయి.. అక్క‌డే స్థిర‌ప‌డిపోయింది. ఇక్క‌డ బీజేపీ ప‌త‌నానికి మ‌రో కీల‌క‌మైన  కార‌ణం  క‌విత  వ్య‌వ‌హారంగానూ  చెబుతారు. క‌విత‌ను అరెస్టు చేయ‌కుంటే బీఆర్ఎస్, బీజేపీ  కూడ‌బ‌లుక్కుంటున్నాయిన  జ‌నం అనుకుంటున్న‌ట్టు ఒకానొక‌ అనుమానం వ్య‌క్తం చేశారు కొండా  విశ్వేశ్వ‌ర్ రెడ్డి అప్ప‌ట్లో. దీనికి తోడు ఆనాడు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడిగా  బండి సంజ‌య్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు. నాలుగు సీట్ల గ్రేట‌ర్ ని 48 సీట్ల వ‌ర‌కూ లాగారు. దీంతో బీజేపీలో కొత్త  ర‌క్తం వ‌చ్చింద‌ని  పాత ర‌క్తం క‌నుమ‌రుగ‌య్యింద‌నే అనుకున్నారంతా. ఇలాగైతే  త‌న బండార‌మంతా బ‌ట్ట‌బ‌య‌లై  పోతుంద‌ని భావించిన కిష‌న్, మోడీతో త‌న‌కున్న సాన్నిహిత్యాన్ని వాడి.. ఎలాగోలా రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. కిష‌న్ పై రాజాసింగ్ చేసే ఆరోప‌ణ‌ల‌ను బ‌ట్టీ చూస్తే ఆయ‌న  ఎన్న‌టికీ  పార్టీ అధికారంలోకి రావాల‌ని కోరుకోరు. ఎవ‌రు అధికారంలో ఉంటే వారితో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని.. వ్య‌క్తిగ‌త ల‌బ్ధి పొంద‌డానికే ఎక్కువ ప్ర‌యారిటీ  ఇస్తార‌ని అంటారు. దీంతో కేసీఆర్ కి అనుకూల కిష‌న్ రెడ్డి రావ‌డంతో అప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్ర క‌మ‌ల‌ద‌ళంలో ఉన్న జోష్ మొత్తం నీరుగారిపోయిన‌ట్టు అంచ‌నా. అప్ప‌టికీ.. రాష్ట్రంలో బీజేపీకి అంతో ఇంతో ఉన్న ఆద‌ర‌ణ కొద్దీ ఇటు ఇద్ద‌రు సీఎం అభ్య‌ర్ధులు పోటీ చేసిన కామారెడ్డిలో ఢంకా  బ‌జాయించ‌డంతో పాటు మొత్తం ఎనిమిది చోట్ల అసెంబ్లీ  స్థానాలు కైవ‌సం చేసుకుంది. ఆపై 2024 లోక్ స‌భ  ఎన్నిక‌ల్లోనూ స‌త్తా  చాట‌డంతో 8 ఎంపీల‌ను గెల‌వ‌గ‌లిగింది. ఇక  ఎమ్మెల్సీల ప‌రంగానూ  గెలుపు బావుటా ఎగుర‌వేయ‌గ‌లిగింది. స్థానిక సంస్థ‌ల్లోనూ  ప్ర‌భావం చూపించాల్సిన క‌మ‌లం పార్టీ చ‌తికిల ప‌డింది. కిష‌న్ రెడ్డి పుణ్య‌మాని.. పార్టీలో ఎక్క‌డిక్క‌డ బ్యాచ్ లు గా విడిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇటు ఎంపీలు ఒక గ్రూప్, ఎమ్మెల్యేలు మ‌రో గ్రూప్, ఆపై సీనియ‌ర్లు ఒక గ్రూప్, కొత్త‌గా  వ‌చ్చిన వారు ఇంకో గ్రూప్ లుగా విడిపోయి.. ప్ర‌స్తుతం ద‌శ- దిశ..  క‌ర‌వై నానా  అగ‌చాట్లు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం గుర్తించిన ప్ర‌ధాని మోడీ రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం  చేయ‌డం ఒక స్వ‌యంకృతాప‌రాధం.  ఎందుకంటే  కిష‌న్ రెడ్డి స్వ‌భావం గురించి తెలిసి కూడా  పార్టీలోని  ప్ర‌తి ఎంపిక క‌ద‌లిక‌ల‌ను ఆయ‌న ప‌ర్య‌వేక్షించేలా చేయ‌డంతోనే అస‌లుకే మోసం వ‌చ్చేలా  క‌నిపిస్తోంద‌ని వాపోతున్నారు రాజాసింగ్ వంటి వారు. అస‌ల‌క్క‌డ ఉన్న‌ది భార‌తీయ  జ‌న‌తాపార్టీ కాదు.. కిష‌న్ రెడ్డి  జ‌న‌తా పార్టీ అంటారు రాజాసింగ్. మ‌రి  ఈ విష‌యాలేవీ మోడీకి తెలీద‌నుకోవాలా? ఏంట‌న్న‌ది  పార్టీ  అంత‌ర్గ‌త వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ట్టు తెలుస్తోంది.  

గ్లోబంత సంబ‌ురం.. పెట్టుబ‌డుల స్వ‌ర్గ‌ధామం

రెండు రోజుల పాటు జ‌రిగిన  తెలంగాణ రైజింగ్- గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో  5. 75 ల‌క్ష‌ల కోట్ల మేర పెట్టుబ‌డుల‌కు ఎంఓయూలు కుదిరాయి. ఈ కార్య‌క్ర‌మానికి దేశ విదేశాల నుంచి పలువురు వ్యాపార‌, రాజ‌కీయ‌, సినీ, కార్పొరేట్, ఆర్ధిక రంగ అతిర‌థ మ‌హార‌థులు ఏతెంచ‌గా.. అంగ‌రంగ వైభ‌వంగా  న‌భూతో ..   అన్న స్థాయిలో జ‌రిగిందీ గ్లోబల్ సంబురం.   ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో  కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌  రెండో విజ‌య‌వంత‌మైన  ఏడాది  ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక  గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది.  తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది. ఇది రాజ‌కీయాల‌కు అతీతంగా కేవ‌లం అభివృద్ధీకి మాత్ర‌మే పెద్ద పీట వేయడంతో ప్ర‌పంచ వ్యాప్తంగా   ఫోక‌స్ అంతా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వైపు చూసింది.  అధికారిక కార్య‌క్ర‌మాల్లోనూ రాజ‌కీయ ఆరోప‌ణ‌లు వినీవినీ విసిగి వేసారిన జ‌నాన్ని ఫ‌క్తు ప్రొఫెష‌న‌ల్ గా సాగిన ఈ స‌మ్మిట్ విపరీతంగా ఆకర్షించింది. రాజ‌కీయాల‌కు అతీతంగా సినీ, క్రీడా, వ్యాపార, ఆర్ధిక రంగ ప్ర‌ముఖుల‌తో కూడిన‌ మేథో మ‌థ‌నం జ‌ర‌గ‌డంతో తెలంగాణ భ‌విష్య‌త్ బంగారమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ప్ర‌పంచంలోనే భార‌త్ యువ‌ర‌క్తంతో కూడున్న దేశ‌మైతే.. అందులో తెలంగాణ మ‌రింత యువ రాష్ట్ర‌మ‌ంటూ  శంత‌ను నారాయ‌ణ్ వంటి ప్ర‌ముఖ  కార్పొరేట్ దిగ్గ‌జాలు పేర్కొన్నారు. ఇక 2047 నాటికి  తెలంగాణ మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్ధిక శ‌క్తిగా ఎద‌గాల‌న్న ల‌క్ష్యం  అతిశ‌యం ఏమీ కాద‌నీ,  ఈ విష‌యంలో తెలంగాణ ఇత‌ర రాష్ట్రాల‌తో పోటీ ప‌డ్డం చాలా గొప్ప విషయమనీ ప్ర‌ముఖ ఆర్ధిక  వేత్త‌ అర్వింద్ సుబ్ర‌హ్మ‌ణియ‌న్ అన్నారు. కేవ‌లం  రాష్ట్రాలే  కాదు న‌గ‌రాల మ‌ధ్య కూడా పోటీ ఉండాల‌నీ, ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో బెంగ‌ళూరు అర్బన్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే,  హైద‌రాబాద్ ఫ్యూచ‌ర్ సిటీ  వంటి  విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌పంచ దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తోంద‌న్నారాయన. తెలంగాణ   గొప్ప‌గా ట్రాన్స్ ఫార్మింగ్ జ‌రుగుతోందనీ, ఇటీవలి కాలంలో  విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోందన్నారు ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ దువ్వూరి సుబ్బారావు. ఇక మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా తెలంగాణ ఎద‌గ‌డానికి మూడంచ‌ల వ్యూహం అనుస‌రిస్తున్న‌ట్టు త‌న  విజ‌న్ డాక్యుమెంట్ లో  ఆవిష్క‌రించింది రేవంత్ సర్కార్.  అందులో భాగంగా భావిత‌రాల కోసం తెలంగాణ‌ను తీర్చిదిద్ద‌డంతో పాటు, ఆర్ధిక స‌మ్మిళిత‌, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర వార‌స‌త్వ‌, సాంస్కృతిక క‌ళా వైభ‌వాల‌కు పెద్ద పీట వేసేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు.  5 వేల కోట్ల‌తో సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల రంగంలో తాము పెట్టుబడులు పెట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు యూపీసీ సీఈవో అలోక్ కుమార్. 1100 కోట్ల‌తో వింటేజ్ కాఫీ ప్లాంట్ తెలంగాణ‌లో ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారుఆ సంస్థ ఎండీ బాల‌కృఫ్ణ‌న్.  ఇక మహీంద్రా అండ్ మహీంద్రా  చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్ర  అయితే స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కాలేజీకి త‌న‌ను బాధ్య‌త వ‌హించ‌మ‌ని  కోర‌డంతో కాద‌న‌లేక పోయాన‌ని, అందుకు కార‌ణం సీఎం రేవంత్ విజన్, సునిశిత ఆలోచ‌నా స‌ర‌ళి, ఆపై పేద‌రిక నిర్మూల‌న‌పై ఆయ‌న‌కున్న నిబ‌ద్ధ‌త అంటూ పొగడ్తలు గుప్పించారు. తెలంగాణ నిజంగానే ఒక రోల్ మోడ‌ల్ అన్నారు బ్రిట‌న్ మాజీ  ప్ర‌ధాని  టోనీ బ్లేయ‌ర్.  మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యం సాధ్య‌మేన‌ని ప్ర‌పంచ‌మంతా చెప్పింద‌ని ప్ర‌క‌టించారు తెలంగాణ రాష్ట్ర సీఎస్ రామ‌కృష్ణారావు. ఈ ఫ్యూచ‌ర్ సిటీ  కోసం  2027 వ‌ర‌కూ ఎదురు చూడ‌క్క‌ర్లేదు.. అంత‌క‌న్నా ముందే సాకార‌మ‌వుతుంద‌న్నారు ప్రముఖ  నిర్మాత అల్లు అర‌వింద్. ఇక ఇదే ఫ్యూచ‌ర్ సిటీ ద్వారా  ఏకంగా 13 ల‌క్ష‌ల ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు రానున్న‌ట్టు తెలుస్తోంది. 13, 500 ఎక‌రాల్లో నిర్మిత‌మ‌య్యే ఈ న‌గ‌రం ఒక ఆర్కిటెక్ అద్బుతం కానుంద‌ని, ఏకంగా 9 ల‌క్ష‌ల మందికి ఆవాస యోగ్యం కానుంద‌ని ప్ర‌క‌టించారు స‌మ్మిట్ నిర్వాహ‌కులు. మూసీ పున‌రుజ్జీవం ప్రాజెక్టు పూర్తైతే.. ప్ర‌పంచ‌మే హైద‌రాబాద్ కి త‌ర‌లి వ‌స్తుంద‌ని అన్నారు వాట‌ర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్ర సింగ్.   ప‌ర్యాట‌కంగా మాత్ర‌మే  కాకుండా సినిమా ప‌రంగా కూడా తెలంగాణ‌ను అద్భుతంగా తీర్చిదిద్దే  బాధ్య‌త‌ల‌ను తీసుకుంటున్న‌ట్టు ఈ స‌ద‌స్సు ద్వారా  ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ప్ర‌స్తుతం తెలుగు వారికి ఉన్న స్టూడియోలే కాక స‌ల్మాన్, అజ‌య్ దేవ‌గ‌న్ వంటి బాలీవుడ్ తార‌లు సైతం ఇక్క‌డ స్టూడియోలు పెట్ట‌డానికి ముందుకొచ్చారు. భార‌త‌దేశంలోనే స‌మ వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉన్న హైద‌రాబాద్ దేశంలోని అన్ని సినిమా రంగాల వారికి భూత‌ల స్వ‌ర్గంతో స‌మానం కావ‌డంతో  అందరినీ ఇక్క‌డికి ఆక‌ర్షించి వ‌ర‌ల్డ్ మూవీ హ‌బ్ గానూ తీర్చిదిద్దేందుకు త‌మ వంతు య‌త్నం  చేస్తామ‌ని ప్రకటించింది ప్ర‌భుత్వం. ఐటీ విప్ల‌వానికి తెలంగాణ పుట్టినిల్లు లాంటిద‌ని, స్టార్ట‌ప్ హ‌బ్ గానూ హైద‌రాబాద్ కు ఎన్నో పేరు ప్ర‌ఖ్యాత‌లున్నాయ‌నీ ప్ర‌శంసించారు ప‌లువురు ఆర్ధిక నిపుణులు. ఇక దువ్వూరి అయితే తెలంగాణ అన్ బీట‌బుల్ గ్రోత్ సాధిస్తోంన్నారు. ఏటా 6-9 శాతం స్థిర‌మైన వృద్ధి రేటు సాధిస్తోందని గుర్తు చేశారు.  మొత్తంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి  రెండో ఏడాది దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్న  శుభ సంద‌ర్భంలో  5 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు వ‌చ్చేలా  ఎంఓయూలు జ‌ర‌గ‌డం ఏమంత సాధార‌ణ విష‌యం కాదు. అయితే ఈ ఎంఓయూల‌ను పెట్టుబ‌డులుగా మ‌ల‌చ‌డంలో ప్ర‌భుత్వం త‌గిన బాధ్య‌త తీసుకోవ‌ల్సిన అవ‌స‌ర‌ముంది. ఆ మాట‌కొస్తే ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను నిర్వ‌హిస్తున్న దుద్దిళ్ల  శ్రీధ‌ర్ బాబు ఇందుకోసం ప్ర‌త్యేక రూట్ మ్యాప్ ని త‌యారు చేయాల్సి ఉంది. ఒక స్పెష‌ల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా ఒప్పందం కుదుర్చుకున్న  సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా ఇవ్వాల్సిన రాయితీలు, ఇత‌ర‌త్రా సౌల‌భ్యాల‌ను వారికి అందేలా  సింగిల్ విండో ఏర్పాటు చేయాల్సి ఉంది.   వ‌చ్చాం- ఒప్పందాలు చేసేశాం- వెళ్లామ‌ని కాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలో అప్ ల‌తో ఈ పెట్టుబ‌డుల‌ను తెలంగాణ‌లో గ్రౌండ్ అయ్యేలా చేడాల్సి ఉంది.  అలా జరిగితే..  ఫ్యూచ‌ర్ సిటీ ద్వారా 13 ల‌క్ష‌లేం ఖ‌ర్మ అంత‌క‌న్నా మించి  ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు తెలంగాణ‌ను వెతుక్కుంటూ రావ‌డం  ఖాయం అంటున్నారు పరిశీలకులు. ఎనీ హౌ ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్. ఇలాగే మ‌రిన్ని వ‌సంతాలు మ‌రిన్ని  స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ‌తో ల‌క్ష‌ల  కోట్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేలా  ఎద‌గాల‌ని.. కోరుకుందాం. సీఎం రేవంత్ క‌ల‌లు గ‌న్నట్లుగా దావోస్ త‌ర‌హాలో ప్ర‌పంచ పెట్టుబ‌డులను ఆక‌ర్షించే వేదిక‌గా ఫ్యూచ‌ర్ సిటీ రూపుదిద్దుకోవాల‌ని ఆశిద్దాం.  మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్యానాదెళ్ల సైతం హైద‌రాబాద్ కేంద్రంగా ఏఐ ఇన్వెస్ట్ మెంట్ చేస్తామన్నారు. సుమారు ల‌క్ష‌న్న‌ర కోట్ల  పెట్ట‌బడులు భార‌త్ లో పెట్ట‌నుండ‌గా వీటిలో అత్య‌ధిక శాతం హైద‌రాబాద్ లోనే అని సంకేతాలిచ్చారు. 

జాతీయ మీడియా టార్గెట్ కేంద్ర కేబినెట్ లోని దక్షిణాది మంత్రులేనా?

కేంద్ర మంత్రత్వ శాఖలన్నిటిలోనూ అత్యంత రిస్కీ శాఖ అంటూ ఏదైనా ఉందంటే అది పౌర విమానయాన శాఖ మాత్రమే. ఇటీవలి కాలంలో ఈ శాఖను కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కార్ తెలుగువారికే అప్పగిస్తోంది. అది కూడా భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం కే ఈ శాఖ కేటాయిస్తోంది. గతంలో అంటే 2014-19లో ఎన్డీయే కూటమి తన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఎంపీ అయిన అశోక గజపతి రాజుకు ఈ శాఖ కట్టబెట్టింది. ఇప్పుడు 2024లో మళ్లీ ఈ శాఖను తెలుగుదేశం యువ ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడికి అప్పగించింది. వాస్తవానికి పౌర విమానయాన శాఖ అత్యంత క్లిష్టమైనది, అత్యంత కీలకమైనదీ కూడా.  ప్ర‌మాదాలు, వివాదాలు సాంకేతిక లోపాలు వంటివి విమనాయానాల్లో సహజం.  దేశంలో ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా, సాంకేతిక లోపంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా, విమానంలో సాంకేతిక లోపం తలెత్తి సర్వీసు రద్దైనా పౌర విమానయాన శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.     ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.  విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. శాఖాపరమైన పనులు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా జరిగేలా చూస్తున్నారు. అందరూ ఆయన పని తీరును భేష్ అంటూ ప్రశంసిస్తున్నారు.  అదలా ఉంటే.. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు, విమానాలలో సాంకేతిక లోపాల వంటి కారణాలు పౌరవిమానయాన శాఖకు తలనొప్పిగా పరిణమించాయి.  తాజాగా ఇండిగో వ్య‌వ‌హారం మరొ పెద్ద సమస్యగా పరిణమించింది. డీజీసీఏ నిబంధ‌న‌లు పైలట్లకు విశ్రాంతి కోసం ఏర్పాటు చేస్తే.. అవి కాస్తా ఆ శాఖా మంత్రి అయిన రామ్మోహ‌న్ నాయుడుకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెండ్ చయడం కోసం జాతీయ మీడియా పౌర విమానయాన సంస్థ మంత్రిని స్కేప్ గోట్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నది.  జాతీయ మీడియా ఉద్దేశ పూర్వకంగా దక్షిణాది మంత్రులపై దాడి చేస్తున్నదా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు విశ్లేషకులు. ఇండిగో సంస్థ ప్రణాళికా లోపం, నిర్వహణ వైఫల్యం కారణంగా ఆ సంస్థకు చెందిన విమాన సర్వీసులు పెద్ద సంఖ్యలో రద్దై ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ఇందుకు బాధ్యత వహించాల్సింది పూర్తిగా ఇండిగో సంస్థ. ఇప్పటికే ఆ సంస్థపై చర్యలకు మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉపక్రమించారు. సుప్రీం కోర్టు కూడా కేంద్రం తీసుకుంటున్న చర్యలను సమర్థించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయినా జాతీయ మీడియా మాత్రం ఇండిగో సంక్షోభాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి వైఫల్యంగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నిస్తున్నది.  ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే జాతీయ మీడియావాటికి ఆ శాఖ మంత్రిని బాధ్యుడిని చేస్తూ కథనాలు వండి వార్చలేదు. ఇప్పుడు ఇండిగో వ్యవహారంలో మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యత వహించాలంటూ గగ్గోలు పెడుతోంది. అంటే జాతీయ మీడియా ఉత్తరాది, దక్షిణాది వివక్ష చూపుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

కేసీఆర్ భోజనాలు.. జగన్ గాలి తిరుగుళ్లు.. ప్రజాధనం దుబారాలో ఇద్దరూ ఇద్దరే!

ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే. ముందుగా తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయానికి వస్తే.. ఆయన అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో అంటే 2014 నుంచి 2023 వరకూ  ప్రగతి భవన్ లో భోజనాలు, తినుబండారాల కోసం చేసిన ఖర్చు వెయ్యి కోట్లు. ఔను అక్షరాలా వెయ్యి కోట్లు. ఇది ఏదో కాకిలెక్క కాదు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ లో నిత్య సంతర్పణ అన్నట్లుగా ఉండేది పరిస్థితి అని దీని ద్వారా తెలుస్తోంది. నిత్యం మటన్, చికెన్, కౌజు పిట్టలు, కుందేలు మాంసం కూరలతో పాటు కోడి గుడ్లతో వైరైటీ వంటలతో విందులు చేసుకున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక  విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న ఖరీదైన స్కాచ్ విస్కీ బాటిళ్లు కూడా ఇందులోకే వస్తాయి. విషయానికి వస్తే ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నిత్యం దాదాపు 50 మంది నిత్యం ఈ విందు భోజనాలకు హాజరయ్యేవారట. పెట్టేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లు ఇక్కడ వంట, వడ్డన సాగేదట.   ఏ ఫైవ్ స్టార్ హోట‌ల్ కీ తీసి పోని విధంగా ఇక్క‌డి  వంట‌లు ఎంతో రుచిక‌రంగా ఉండేవ‌ట‌.కేసీఆర్ తనతో ఉన్న అందరికీ ప్రతి రోజూ, ప్రతిపూటా రకరకాల నాన్ వెజ్ లతో ఇచ్చే ఈ విందు పెళ్లి దావత్ ను మించి ఉండేదంట. అంటే జనం సొమ్ముతో కేసీఆర్ తన, తన కుటుంబ సభ్యుల జిహ్వచాపల్యాన్ని తీర్చడమే కాకుండా, తనతో ఉన్న వారికీ విందు భోజనాలు పెట్టేవారన్న మాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమేంటంటే.. ఈ గ్రాండ్ విందు భోజనం కొందరికే.. ఇక సీఎం భద్రతా సింబ్బంది, పనివాళ్లకు మాత్రం శాఖాహార వంటలే వడ్డించేవారట. ఇది కూడా పెద్ద సారు ఆర్డర్ ప్రకారమేజరిగేదంట.  కేసీఆర్ కుటుంబసభ్యులతో పాటు బంధువులందరికి ప్రతిరోజు మాంసాహారం వంటలు తప్పనిసరి అన్న  ఆదేశాలుండేవ‌ట‌. కేవలం భోజనాల కోసమే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక‌ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించారంటున్నారు పరిశీలకులు. మరో విషయం ఇప్పుడు చెప్పిన వెయ్యి కోట్ల లెక్క కేవలం ప్రగతి భవన్ విందు భోజనాలకిసంబంధించినది మాత్రమే. ఇది కాకుండా   ఎర్రవల్లి ఫాంహౌజ్ లెక్కలు ఇంకా బయటకు రావాల్సి ఉందని అంటున్నారు. ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో కేవలం ప్రయాణాలకే 222.85 కోట్ల ప్రజాధనం వెచ్చించారని ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. జ‌గ‌న్హయాంలో  విమాన ప్రయాణాల కోసం పెట్టిన ఖర్చు సైతం చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్- ఏపీఏసీఎల్  ద్వారా ఏకంగా రూ.222.85 కోట్లు వెచ్చించారని తాజాగా వెల్లడైన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ ఈ వ్యయం తగ్గకపోవడం గమనార్హం.జగన్ విమానయానం ఖర్చులు 2019-20- రూ.31.43 కోట్లుకాగా.. 2020-21- రూ.44 కోట్లు, 2021-22- రూ.49.45 కోట్లు, 2022-23- రూ.47.18 కోట్లు, 2023-24- రూ.50.81 కోట్లుగా చెబుతున్నాయి లెక్క‌లు. ఈ ఐదేళ్లలో జగన్ విమానాల చార్జీలు రూ.112.50 కోట్లు, హెలికాప్టర్ చార్జీలకు రూ.87.02 కోట్లు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద రూ.23.31 కోట్లు చెల్లించిన‌ట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్ చార్జీల మొత్తాన్ని జీఎంఆర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించినట్లు వెల్ల‌డిస్తున్నాయి రికార్డులు. జ‌గ‌న్ ఐదేళ్ల కాలంలో గాలి మోటారు ఖ‌ర్చుల‌ను ఏకంగా 220 కోట్ల మేర పెట్ట‌గా ఈ ప‌ద్దెనిమిది  నెల‌ల కాలంలో లోకేష్ పెట్టిన ఖ‌ర్చు జీరో అంటూ తెలుగుదేశం  సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.   అంతే కాదు.. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా మంత్రి నారా లోకేష్ 77 సార్లు హైద‌రాబాద్ ప్ర‌యా ణించ‌గా.. ఆ విమాన ఖ‌ర్చులు పూర్తి సొంతంగానే పెట్టార‌ని ప్ర‌భుత్వ ఖ‌జానాపై ఎలాంటి భారం ప‌డ‌లే ద‌ని తేలింది.ఇటు తెలంగాణ‌లో కేసీఆర్, అటు ఏపీలో జ‌గ‌న్ ఇరువురూ వారి వారి హ‌యాంలో ప్ర‌జ‌ల సొమ్ము ఎంత‌గా వృధా ఖ‌ర్చు రూపంలో వెచ్చిస్తున్నారో ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మేనంటున్నారు ఆర్టీఐ కార్య‌క‌ర్త‌లు. కేసీఆర్, జగన్ లు ప్రజాధనాన్ని దుబారా చేసిన తీరు చూస్తుంటే, తన సొమ్ము సోమవారం ముప్పొద్దుల తింటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అంటూ ఏదో సినిమాలో ఆరుద్ర రాసిన పాటలో పంక్తులు గుర్తుకు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. 

చెక్కు చెదరని స్నేహ బంధం!

పదవిలో ఉన్నవాళ్లు, మరీ ముఖ్యంగా దేశాధిపతులు ఏదైనా చేయగలరన డానికి తాజా ఉదాహరణ శుక్రవారం (డిసెంబర్ 5) భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన. సాక్షాత్తు రష్యా అధినేత బయలుదేరాడంటే "రాజు వెడలె,రవితేజములరరగా" అన్నట్లు వందిమాగధులు, రక్షకసముదాయం బయలుదేరుతారు ఆయన రక్షణకు ఐదంచల వ్యవస్థ ఉంటుంది.ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది  తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు. ఆయన పండ్ల రసాలు,మాంసాహారం తీసుకుంటారు. భద్రతకు సంబంధించి ఇంతటి జాగ్రత్తలు అగ్రరాజ్యాధినేత తరువాత రష్యా అధ్యక్షుడి విషయంలోనే ఉంటాయి.   రష్యా నుంచి భారత్  చమురు  కొనుగోలు చేస్తున్నందున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై టారిఫ్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  .భారత్ వచ్చిన పుతిన్ భారత్,రష్యా మధ్య చమురు ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలగదని హామీ ఇచ్చారు.అలాగే మరో ఐదేళ్లపాటు అమలులో ఉండే ఆర్ధిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా 11 ఒప్పందాలు జరిగాయి.  అలాగే రష్యా,భారత్ ఒప్పందాలపై చైనా హర్షం వ్యక్తం చేసింది. ఏకధృవ ప్రపంచంలో భారత్, రష్యా,చైనాల మైత్రి నిస్పందేహంగా అమెరికాకు కంటగింపే. .భారత్, చైనా,రష్యా ఒకటిగా ఉంటే అమెరికా జీరో అంటూ ఇప్పటికే చైనా వ్యాఖ్యానించింది కూడా.  .గతంలో కూడా ఈ మూడు దేశాలు ఇదే మాట ట్రంప్ కు పరోక్షంగా ఎరుకపరిచిన విషయం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి.  1992 లో సోవియట్ యూనియన్ పతనం అయ్యేవరకూ అమెరికాకు దీటుగా అన్ని విషయాల్లో రష్యా పోటీగా ఉండేది.  ప్రచ్ఛన్న యుద్ద కాలంలో  భారత్, రష్యాల మధ్య సహకారం తెలిసిందే.  సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత కూడా భారత్, రష్యాల మధ్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.  ప్రధానంగా యుద్ధ పరికరాల సరఫరా  విషయంలో ఇరు దేశాల మధ్యా బంధం చెక్కు చెదరలేదు. . ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పీచమణచడంలో రష్యా ఆయుధాలు కీలక పాత్రపోషించాయి. రష్యా అధినేతగా  వాద్లిమిర్ పుతిన్ పాతికేళ్లకు పైగా అప్రతిహతంగా కొనసా గుతున్నారు. సోవియట్ పతనం తదననంతరం..  ప్రపంచ దేశాలలో రష్యా ప్రాధాన్యత, ప్రాముఖ్యతను  కొనసాగించడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు.   అన్ని రంగాల్లో అమెరికాకు దీటుగా రష్యాను నిలపడంలో కీలకంగా వ్యవహరించారు. దౌత్య వ్యవహారాలలో కూడా   కీలకంగా వ్యవహరిస్తున్నారు.  భారత్ కు చిరకాల,సాంప్రదాయ మిత్రుడు గా దాదాపు ఏడు దశాబ్దాలుగా రష్యా ఉంది.  పుతిన్,మోదీ భేటీ ఇదే తొలిసారి కాదు.   వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న   మోదీ అప్పట్లో పుతిన్ తో భేటీ అయ్యారు.అప్పటి నుంచి వారి మైత్రి కొనసాగుతునే ఉంది.  భారత్, రష్యాల స్నేహ బంధం కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. 

మోడీ దౌత్య రీతి.. ట్రంప్ ఉక్కిరి బిక్కిరి!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన నిస్సందేహంగా మోడీ దౌత్య విజయంలో ఒకటిగా చెప్పవచ్చు. రష్యా అధ్యక్షుడి భారత పర్యటన అనగానే ఉక్రోషంతోనో, ఆందోళన వల్లో తెలియదు కానీ.. అమెరికా అధ్యక్షుడు కంగారు పడుతున్నారు.  పుతిన్ భారత పర్యటన ఈ సమయంలో అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  రష్యా నుంచి భారత్‌  తన అభీష్ఠానికీ, ఆదేశాలకూ విరుద్ధంగా చమురు దిగుమతి చేసుకుంటున్నదన్న ఒకే ఒక్క కారణంతో ట్రంప్ భారత్ పై టాక్స్ వార్.. సుంకాల యుద్ధానికి దిగారు. అయితే అది బూమరాంగ్ అయ్యింది.   భారతీయులను అమెరికాకు రాకుండా చేసేందుకు వీసా నిబంధనలు కఠినతరం చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని కంపెనీలను ఆదేశించారు. వీసా ఫీజును భారీగా పెంచారు. ఇవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా.. అమెరికా పెద్దన్న పాత్రకే ఎసరు పెట్టేలా మారాయి. రష్యా, చైనాలతో భారత దోస్తీ గట్టిపడింది.     పుతిన్‌ భారత పర్యటనలో భాగంగా  కుదిరే అవకాశం ఉన్న ఒప్పందాల కారణంగా అమెరికా మరిన్ని ఆర్థిక చిక్కుల్లో పడే అవాకశం ఉంది.   ట్రంప్‌ రష్యా చమురు దిగుమతిని ఆపమని భారత్ ను ఆదేశిస్తే.. అది కొనసాగిస్తూనే ఇప్పుడు తాజాగా రష్యాతో  ఆయుధ కొనుగోళ్లఒప్పందానికి రెడీ అయ్యింది.   ఇది కచ్చితంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడంగానే భావించాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా మళ్లీ సుంకాలతో, విసాలపై మరిన్ని కఠిన ఆంక్షలతో ట్రంప్ విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే వాటిని లెక్కచేయడానికీ, అమెరికా హెచ్చరికలు, ఆంక్షలకుభయపడే పరిస్థితి నుంచి భారత్ ఎప్పుడో బయటపడింది. ఇదంతా మోడీ దౌత్య  విధానాల కారణంగానే సాధ్యమైందన్నది అంతర్జాతీయ సమాజం చెబుతున్నమాట.  మొత్తంగా ట్రంప్ అరాచక, అహేతుక విధానాలనుంచి భారత్ ను బయటపడేయడమే కాకుండా.. ఏక ధృవ ప్రపంచం అన్న భ్రాంతి నుంచి ట్రంప్ బయటపడక తప్పని పరిస్థితిని క్రియోట్ చేసే దిశగా ప్రధాని మోడీ దౌత్యపరంగా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.