చిన్న చిన్న మార్పులతో అందం.. ఆరోగ్యం ఓరీ మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయిర్రా నాకు అన్నట్టుగా నాగ మణికంఠ భావిస్తున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్-8 మొదలైనప్పటి నుండి‌ మణికంఠ సింపథీ గేమ్ ప్లే చేస్తున్నాడు. అయితే టాస్క్ లో క్లియర్ గా సంఛాలక్ గా చేసే మణికంఠ.. కాస్త వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు.‌ అదే విషయాన్ని చెప్తూ గంగవ్వ ఓ ఆట ఆడుకుంది. యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.. ఆరు పదుల వయస్సులో సెలబ్రిటీగా మారిన గంగవ్వకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తన కల నెరవేర్చుకుంది. అయితే ఈ ఇంటి నిర్మాణం కోసం నాగార్జున సాయం చేసినట్లు స్టేజ్ మీదే వెల్లడించింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ, మెహబూబ్, మణికంఠ, టేస్టీ తేజ గార్టెన్ ఏరియాలో ఉన్నారు. ఇక గంగవ్వ తన మాటలతో , పంచులతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది.  ఓ పిలగా.. నా భార్య కావాలి.. నా పాప కావాలని ఏడ్చింది నువ్వే నాకు తెలుసు అని‌ గంగవ్వ అనగానే.. అవును కావాలని మణికంఠ అంటాడు. అయితే నామినేషన్ వేస్తా వెళ్ళని అనగానే.. మరి పైసల్ కావాలి కదా.. హౌస్ లోకి వచ్చింది పైసల కోసం కాదా అని గంగవ్వ అంది. అయిన గట్ల ఏడుస్తున్నాడేంది ఈ మగ బాయ్ అని అనుకున్నానంటూ గంగవ్వ అనగానే.. టేస్టీ తేజ, మెహబూబ్ నవ్వుకున్నారు. ఇక అంతకముందు నబీల్, నిఖిల్, రోహిణి, పృథ్వీ, విష్ణుప్రియ అందరు గార్డెన్ ఏరియా దగ్గరలోని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటన్నారు. కాస్త ఆ పాలు ఇస్తే మేం ఛాయ్ చేసుకుంటామని గంగవ్వ అనగానే.. మిల్క్ లగ్జరీ అని నబీల్ అన్నాడు. మరి అలా చెప్తే మేం పాల ప్యాకెట్లు తెచ్చుకునేవాళ్ళ‌ం కదా అని గంగవ్వ అంది. అయిన మా సీజన్ లో ఫుల్ పాలు.. పెద్దదాన్ని కదా నాకు ఇవ్వమని గంగవ్వ అనగానే.. నేను కూడా పెద్దదాన్నే అని అక్కడే ఉన్న రోహిణి అనగానే.. నీకెంత మంది పిల్లలు అని గంగవ్వ అంది. ఇక రోహిణితో పాటు అక్కడివారంతా ఫల్లుమని నవ్వేశారు.  ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు గడియారంలో ముల్లుతో సమానంగా పరుగులు పెట్టే మహిళలతో కాస్త మీ గురించి మీరు పట్టించుకోండని ఎవరైనా చెబితే, ఆ చెప్పినవాళ్ళ మీద బోలెడంత కోపం వస్తుంది. ఉరుకులు, పరుగులు పెడుతూ, అటు ఆఫీసులోనూ, ఇటు ఇంట్లోనూ అన్ని పనులు సమర్థవంతంగా చేయాలనీ, అందరినీ తృప్తిపరచాలనీ హైరానా పడిపోతూ, ఈ హైరానాలో మనకోసం మనం ఆలోచించుకునే తీరిక, కోరిక కూడా వుండదు. కానీ మనకోసం మనం శ్రద్ధ చూపకపోతే ఎలా? అందం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆరోగ్యం చురుకుదనాన్ని అందిస్తుంది. సో... అందంగా, ఆరోగ్యంగా వుంటే ఆత్మవిశ్వాసం నిండుగా, మెండుగా వుండి, అది మన ప్రవర్తన తీరులో బయటపడుతుంది. అందుకు పెద్దగా సమయం కూడా అక్కర్లేదు. రోజు మొత్తంలో మన రొటీన్‌కి చిన్నచిన్న మార్పులు, చేర్పులు చేస్తే సరిపోతుంది. * మొట్టమొదటగా తప్పనిసరిగా చేయాల్సింది... ఉదయం నిద్ర లేస్తూనే హడావిడిగా మంచం దిగి పని ప్రారంభించకుండా ఓ 2 నిమిషాలు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలి. ఎక్సర్‌సైజులు వంటివి చేయడానికి టైమ్ వుంటే సరే, లేకపోతే కనీసం శ్వాస ప్రక్రియ పైన దృష్టి పెట్టినా చాలు. ఇక మరో ముఖ్య విషయం... పరగడుపునే రెండు మూడు గ్లాసుల నీటిని తాగడం ద్వారా శరీరం మరింత కాంతిని సంతరించుకుంటుంది. అలాగే రోజులో వీలు చిక్కినప్పుడల్లా మంచి నీటిని తాగటానికి ప్రయత్నించండి. ఇది పెద్ద విషయమా అనుకోకండి. రోజు మొత్తంలో ఎంత మంచినీరు తాగుతున్నారో ఒక్కసారి గమనించి చూడండి. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల కూడా కొంచెం శ్రద్ధ పెడితే అందానికి, ఆరోగ్యానికి కూడా మంచింది. * చాలామంది బ్యూటీ పార్లర్లకి వెళ్ళడానికి ఇష్టపడరు. అంతమాత్రాన మనపై మనం శ్రద్ధ పెట్టకుండా ఉంటే ఎలా? చిన్న చిన్నవే... ఉదాహరణకి స్నానం చేసే గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల ఆయిల్ వేసుకోవడం, మంచి బాడీ లోషన్ అప్లయ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెడితే చాలు... వయసు ప్రభావం కనిపించకుండా చూసుకోవచ్చు. మరో విషయం... ఎండలోకి వెళ్ళేముందు నన్‌స్క్రీన్ లోషన్ వంటివి అప్లయ్ చేసుకోవడం, చలువ అద్దాలు వాడటం వంటివి చాలా చిన్న విషయాలే. కానీ, చాలామంది శ్రద్ధ పెట్టని విషయాలు కూడా. * సాధారణంగా బయటి నుంచి ఇంట్లోకి అడుగు పెడుతూనే చేయాల్సిన పనులని తలుచుకుంటూ పనిలో పడతాం. కానీ, ఇంటికి రాగానే చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కుని, పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవడానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. బయట పొల్యూషన్ ప్రభావం మన ముఖంపైనుంచి పోవడానికి. ఇక వారానికి ఒక్కసారైనా ఒక చెంచా తేనెలో కొంచెం వెనిగర్ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచుకుని చల్లటి నీటితో కడిగి చూసుకోండి. అట్టే సమయం పట్టదు సరికదా, మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. ఇక ఆడవారిలో ఒత్తిడిని, వయసుని బయటపెట్టేవి కళ్ళకింద నల్లటి చారలు. రోజూ పడుకునే ముందు రెండు కీరా ముక్కల్ని కళ్ళపై పెట్టుకునే అలవాటు చేసుకుంటే చాలు నల్లటి వలయాలు కొన్నాళ్ళలో మాయమవటానికి. * రోజువారీ కార్యక్రమాలను పూర్తి చేశాక నిద్రకి ఉపక్రమించే ముందు మీకోసం మీరు ఓ 5 నిమిషాలు ఇచ్చుకోగలిగితే చాలు. గోరువెచ్చని నీటిలో పాదాలని ఉంచి, మీకు ఇష్టమైన పుస్తకాన్ని తిరగేయండి. రోజంతటి శ్రమని మర్చిపోవచ్చు. ఇక ఆఖరిది, ముఖ్యమైనది... తప్పనిసరిగా ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఏ ఫేస్‌ప్యాక్‌లూ, మేకప్‌లూ అది ఇచ్చే ఆరోగ్యాన్ని, అందాన్ని అందించలేవు నిజానికి.  ఈరోజు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ చాలా చిన్న చిన్నవే. కానీ, మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టనివి కూడా. ఈ చిన్న జాగ్రత్తలతో మన అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. రోజూ చేయగలిగితే అలవాటుగా కూడా మారుతుంది.. ఏమంటారు? -రమ

  వాటర్ బాటిల్స్ తో కలర్ ఫుల్ లైట్స్     మనం వాడేసిన వాటర్ బాటేల్స్ డస్ట్ బిన్ లో పడేయకుండా అందమైన కలర్ ఫుల్ లైట్స్ ఎలా చేసుకోవాలో క్రింద ఇచ్చిన 6 స్టెప్స్ తో చూపించాం..   కావలసినవి :                  వాటర్ బాటేల్స్                   అక్రోలిక్ పైంట్స్                    కత్తెర                    సిరియల్ లైట్స్ ·      1. కాళీ వాటర్ బాటేల్స్ తీసుకుని మూత తీయకుండా ఫోటోలో చూపించినట్టు కొంత పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. 2. ఆ కట్ చేసుకున్న పార్ట్ ని నిలువుగా ఫ్లవర్ కి ఎన్ని పెటెల్స్ కావాలో అన్నింటిని సమానంగా కోలుచుకుని కత్తెరతో కట్ చేసుకోవాలి.    3. అలా కట్ చేసుకున్న పార్ట్స్ ని వెనక్కి  బెండ్ చేసుకోవాలి. ఫోటో లో  చూపించినట్టుగా అన్ని ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు అది చూడడానికి ఫ్లవర్ లా వుంటుంది.   4. ఇలా కట్ చేసుకున్న వాటికి  మనకు నచ్చిన కలర్ వేసుకోవాలి. ఏ కలర్ అయితే మనం వేస్తామో అదే కలర్ మనం  లైట్ వేసినపుడు వెలిగుతుంది. పెటల్స్ కి కలర్ వేసిన తరువాత రెండు గంటలు డ్రై అవ్వనివ్వాలి.   5. ఇప్పుడు వాటికున్న బాటిల్ మూతకూ రంధ్రం చేసి లైట్స్ ని మూతలో  సెట్ చేసుకోవాలి.   6. ఇప్పుడు సిరియల్ లైట్స్ ని మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకుని పండగలకి,పార్టీలకి  డెకరేట్ చేసుకోవచ్చు       మీరు కూడా ట్రై చేస్తారు గా మరీ                  

  బొప్పాయి బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుందా   ‘నేను పుష్టిగా భోజనం చేసినా మా బాబుకి పాలు సరిపోవట్లేదు’ అని కొత్తగా తల్లయిన వాళ్ళు అనటం మనం వింటూనే ఉంటాం. అన్నం ఎక్కువగా తినేస్తే పాలు సమృద్దిగా పడతాయి అనుకోవటం పొరపాటే. మనం తీసుకునే ఆహారంలో పాలను ఉత్పత్తి చేసే పదార్థాలు అదిక శాతం ఉండేలా చూసుకోవాలి. మనకి అందుబాటులో ఉండే కొన్ని రకాల కూరగాయల్లో, మెంతులు, వెల్లుల్లి, తులసి, వాము, కాకరకాయి, బొప్పాయి మొదలైన వాటిలో పాలను ఉత్పత్తి చేసే గుణం అధికంగా ఉంటుంది. వీటిని మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలు ఇక ఏ దిగులు ఉండదు. మెంతులు ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారం. బాలింతకు ఎక్కువగా మెంతిపొడి, మెంతికూర మొదలైనవి పెట్టాలి. నార్త్ ఇండియన్స్ అయితే మెంతులతో చేసిన హల్వా తినిపిస్తూ ఉంటారు. మెంతులను నేతిలో వేయించి, పోసి చేసి వంతులు గోధుమ పిండిని కలిపి వాటిలో పంచదారపొడి వేసి హల్వా లా తయారు చేస్తారు.     సోంఫు కూడా బాలింతలకు మంచిది. పాలు తాగే పిల్లలకి కడుపులో నొప్పి లేదా గ్యాస్ కు సంబందించిన సమస్యలు దీని వల్ల బాగా తగ్గుముఖం పడతాయి. తల్లి ఈ సోంఫుని ఎంత తింటే పిల్లలకి అంత మంచిది. దీనిని పొడిగా చేసుకుని కూరల్లో తినచ్చు లేదా నీళ్ళల్లో వేసి కాచుకుని కషాయంలా కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లి పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకే కాదు పాలకు మంచి రుచిని కూడా తెచ్చిపెడుతుందని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది. వెల్లుల్లి తిన్న తల్లుల పిల్లలు తల్లి దగ్గర ఎక్కువ పాలు తాగారట. ఈ వెల్లుల్లిని బాలింత తినే అన్ని వంటకాల్లో కలుపుకోవచ్చు. అలాగే వాము కూడా పాలు పడటంలో ఎక్కువ సహాయం చేస్తుంది. వాము పొడిలో కాని కషాయంలో కాని తేనె కలిపి తినిపిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.యుటరస్ కి సంబంధించి  ఏదైనా సమస్య ఉన్నా అది కూడా తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైనడి బొప్పాయి పండు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దీన్ని అస్సలు తినకూడదని చెప్తారు అదే పండు డెలివరీ అయ్యాకా మాత్రం ఎక్కువగా తినాలి. ఇందులో తగినన్ని ప్రోటీన్స్, విటమిన్స్ ఉండటమే కాకుండా పాలు సమృద్దిగా తయారుకావటానికి దోహదం చేస్తాయి. బాలింతలు దీన్ని ఎంత తింటే అంత మంచిది. ఓట్స్ లో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇంకా విటమిన్ బి ఎక్కువగా ఉండటంవల్ల దీనిని తీసుకుంటే డిప్రెషన్ కూడా తగ్గుతుందిట. కొత్తగా తల్లి అయిన వాళ్ళలో తెలియని భయం ఉంటుంది. అలాంటి సమస్యలన్నీ ఓట్స్ తినటం వల్ల పోతాయని తేల్చి చెప్పాయి కొన్ని అధ్యయనాలు. వీటితో పాటు బ్రెడ్ తింటే కూడా మంచిది. తల్లులు తీసుకునే ఆహారంలోనే ఏది పాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందో తెలుసుకుని తీసుకుంటే చాలు, పిల్లలకి పోత పాలు పట్టాల్సిన పని ఉండదు. ..కళ్యాణి

  ఇంట్లోనే బుల్లి బొజ్జగణపతి వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఓ బుల్లి వినాయకుడు ఉండాల్సిందే. ఇంకా వారం రోజుల టైం ఉంది కాబట్టి మనం ఇంట్లో పెట్టుకునే వినాయకుడిని బయట కెమికల్స్ వేసి తయారు చేసే వినాయకుడిని పెట్టుకోవడం కన్నా మట్టితో చేసే వినాయకుడిని పెట్టుకుంటే ఎంతో మంచిది. ఈ బుల్లి వినాయకుడిని మన ఇంట్లో ఉండే పిల్లలతోనే తయారు చేయిస్తే వారు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. మరి తయారుచేయడం ఏలాగో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతోంది.    

తొడల కొవ్వు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారా.. ఈ అయిదు టిప్స్ ఫాలో అయిపోండి! శరీర సౌష్టవం బాగుంటే ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వస్తుంది. శరీర సౌష్టవం సరిగా లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. బాడీ షేమింగ్ పట్టించుకోనక్కర్లేదు.. అని  చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అసలు శరీర సౌష్టవం దెబ్బతింటే దాన్నలాగే ఎందుకు వదిలేయాలి. నిజానికి శరీరాకృతి మారిపోయిన శరీరంలో ఏదో ఒక అసౌకర్యం, ఏదో ఒక సమస్య ఉండనే ఉంటాయి. అందుకే శరీరాన్ని చక్కని రూపానికి తెచ్చుకోవడం మంచిది. మహిళలలో ఎక్కువగా తుంటి భాగంలో కొవ్వు పేరుకుని పోతుంటుంది. దాన్ని వదిలించుకోవడానికి కష్టపడుతుంటారు. అయితే తుంటి కొవ్వు తగ్గించుకోవడానికి ఐదెంటే ఐదే టిప్స్ ఫాలో అయితే చాలు.. లోయర్ బాడీ వ్యాయామాలు.. తుంటి కొవ్వు తగ్గాలంటే లోయర్ బాడీ అంటే దిగువ శరీరం వ్యాయామాలు ఫాలో కావాలి. హిప్స్, గ్లుట్ లను చక్కని ఆకృతిలోకి తీసుకురావడానికి లంగ్స్, స్క్వాట్ ల, లెగ్ రైజ్ లు వంటి దిగువ శరీర వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. వీటిని రోజూ ప్రాక్టీస్ చేయాలి. కౌంట్ పెంచాలి.. వ్యాయామంలో భాగంగా చాలామంది నడవడం, జాగింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం మొదలైనవి ఫాలో అవుతారు. వీటిని సాధారణంగా చేయడం కంటే మరికాస్త ఎక్కువ సమయం పొడిగించి చేయాలి. ఇవి హిప్ కండరాలను బిగించి చక్కని ఆకృతి రావడంలో సహాయపడతాయి. కార్డియోవాస్కులర్ వ్యాయామాలు అదనపు కేలరీలు వదిలించుకోవడానికి సహాయపడతాయి. ఈ ఫుడ్ కు దూరం.. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో అసంతృప్త కొవ్వులు, అదనపు చక్కెరలు ఉంటాయి. ఇవి తుంటి భాగంలో పేరుకుని పోతాయి. వీటని తింటూ ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం శూన్యం. వీటికి బదులుగా బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాలు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పైబర్ ఆహారానికి పెద్ద పీట వేయాలి. నీరు.. నీరు శరీరానికి ఇంధనం వంటిది. ప్రతిరోజూ శరీరానికి తగిన మోతాదులో నీటిని తాగడం వల్ల శరీరంలో టాక్సిన్ లు బయటకు పోతాయి. శరీరంలో అన్ని అవయవాల పనితీరు బాగుంటుంది.   బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. నిద్ర.. శరీరంలో కణాల మరమ్మత్తు జరగడానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. శరీరంలో పేరుకున్న కొవ్వు కోల్పోవడానికి నిద్ర ప్రముఖ పాత్ర వహిస్తుంది. నిద్ర శరీరానికి ఊరటనిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి శరీరం  చురుగ్గా ఉంటుంది.                                                          *నిశ్శబ్ద

  మహిళలలో వెజినల్ యాక్నే ఎందుకొస్తుంది?  దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే! చాలామంది మహిళలు బయటకు మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడే అంశం ప్రైవేట్ పార్ట్స్ గురించి.  ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉన్నా,  ఏవైనా ఇబ్బందులు తలెత్తినా చాలావరకు మౌనంగా భరించడానికే మొగ్గుచూపుతారు. సాధారణంగా చాలామంది మహిళలలో యోనికి సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో యోని ప్రాంతంలో మొటిమల్లాంటివి రావడం కూడా ఒకటి. అసలు యోని ప్రాంతంలో ఇలా యాక్నే లేదా మొటిమలు ఎందుకొస్తాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి?  తెలుసుకుంటే.. వెజినల్ యాక్నే కు కారణాలు.. యోని ప్రాంతంలో కూడా సహంజంగానే వెంట్రుకల పెరుగుదల ఉంటుంది. ఈ వెంట్రుకల కుదుళ్లు ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియా తో నిండినప్పుడు సాధారణంగా ముఖం మీద వచ్చే ఎరుపు, వాపును పోలిన మొటిమల్లాంటి గడ్డలు వస్తాయి. ప్రైవేట్ పార్స్ట్ లో గాలి చాలా పరిమితంగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో అధిక తేమ కారణంగా ఆ ప్రాంతంలో వచ్చే మొటిమలు కూడా అంత తొందరగా తగ్గవు. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంటువ్యాధులు, వాపులు మొదలైన సమస్యలకు కారణం అవుతాయి. దీనికి మరొక కారణం. ఆ ప్రాంతంలో చెమట గ్రంధుల నుండి అధికంగా చెమట విడుదల కావడం. ఆ ప్రాంతంలో అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి  వ్యాక్సింగ్, షేవింగ్ వంటి ప్రక్రియలు ఎక్కువగా చేయడం కూడా దీనికి కారణం అవుతుంది. ట్రీట్మెంట్ ఏంటంటే.. వెజినల్ ప్రాంతంలో మొటిమలు రావడం అనేది అమ్మాయిలను చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఎక్కువ శాతం మంది ఈ సమస్య వచ్చినా బయటకు చెప్పుకోలేరు. కొన్ని రోజుల్లో అవే తగ్గిపోతాయని అనుకుంటూ వాటిని అలాగే భరిస్తారు.  అయితే ఇవి తగ్గించుకోవడానికి, ఇకమీదట రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. యోని ప్రాంతంలో తగినంత గాలి ఆడేలా కాస్త వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి. బిగుతుగా ఉన్నవాటిని నివారించాలి. కాటన్ దుస్తులు అయితే మంచిది. ఆ ప్రాంతంలో ఎక్కువ తేమ ఉండకుండా జాగ్రత్త పడాలి. మొటిమలు వచ్చినప్పుడు వాటిని తగ్గించుకునే క్రమంలో సున్నితంగా వ్యవహరించాలి. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు,  మొటిమల నొప్పి నివారణకు వెచ్చని కంప్రెసర్ లు ఉపయోగించవచ్చు. ఈ మొటిమల ప్రభావం చాలా ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటే మాత్రం చర్మ సంబంధ నిపుణులను కలవడం మంచిది. ఇక అమ్మాయిలు ఆ ప్రాంతంలో అవాంచిత రోమాల తొలగించుకోవడానికి సేఫ్టీ పద్దతులు ఫాలో అవ్వాలి. ఆహారం విషయంలోనూ, అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొటిమలు వచ్చినప్పుడు అతి జాగ్రత్తతో మొటిమలను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. శరీరంలో వేడి పెరగడం వల్ల కూడా ఆ ప్రాంతంలో మొటిమలు వస్తుంటాయి. కాబట్టి దీన్ని నిర్మూలించడానికి  ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత లేకుండా జాగ్రత్త పడాలి.                                              *నిశ్శబ్ద.  

స్త్రీలు తెలుసుకోవలసిన  జనన నియంత్రణ మార్గాలు..! సెక్స్, అబార్షన్,  గర్భనిరోధకం, ఈ మూడు అంశాలు నేటికీ వివాదాస్పదంగా ఉన్నాయి. గర్భాన్ని నిరోధించడానికి గర్భనిరోధకాలు వాడతారన్నది నిజం. కానీ వాటి ఉపయోగం ఒకే ప్రయోజనానికి పరిమితం కాదు. వారి స్వంత ప్రాణశక్తి ప్రకారం అనుసరించడానికి ఏ మార్గం అనుకూలంగా ఉంటుంది? లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను ఎలా నివారించాలి? వాటిని ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా? అవి ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి?సురక్షితమైన సెక్స్ కోసం గర్భనిరోధక పద్ధతులను ఎంచుకునే ముందు పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి. బాహ్య కండోమ్: కండోమ్ అంటే సాధారణంగా బాహ్య కండోమ్ అని అర్థం. ఇది మగ జననేంద్రియాల పైన అమర్చబడుతుంది. ఈ కండోమ్ రబ్బరుతో తయారు చేయబడింది. వీటి వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి గర్భధారణను నివారించడమే కాకుండా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కూడా నిరోధిస్తాయి. వీటి వల్ల అలర్జీలు రావచ్చు. అంతర్గత కండోమ్: ఇది మహిళల కోసం తయారు చేయబడింది. చాలా బాహ్య కండోమ్‌లు రబ్బరు పాలుతో తయారు చేస్తారు. అంతర్గత కండోమ్‌లలో రబ్బరు పాలు ఉండవు. వీటిని మహిళలు తమ ప్రైవేట్ పార్ట్‌లలో ధరిస్తారు. కాపర్టీ: IUD అనేది స్వచ్ఛమైన రాగి లోహంతో తయారు చేయబడిన పరికరం. దీనికి ప్లాస్టిక్ పూత ఉంటుంది. ఇది గర్భాశయం లోపల అమర్చబడుతుంది. ఈ సాధనం నైలాన్ థ్రెడ్‌ను కలిగి ఉంది. ఒకసారి ఇన్‌స్టాల్ చేస్తే 10 సంవత్సరాల వరకు సరిగ్గా పని చేస్తుంది. ఇవి 99% గర్భాన్ని నివారిస్తాయి. గర్భనిరోధక మాత్ర: ఇవి అత్యంత ప్రాచుర్యం పొందిన జనన నియంత్రణ పద్ధతుల్లో ఒకటి. ఇది రోజుకు ఒకసారి తీసుకోవలసిన చిన్న మాత్ర. ఈ మాత్ర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ మాత్రను సమయానికి తినడం మర్చిపోకుండా తీసుకోవడం చాలా అవసరం. చాలా ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది సెక్స్ చర్యతో జోక్యం చేసుకోదు.  ఈ మాత్రను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే తీసుకోవాలి. అందువల్ల, వైద్యుడిని చూడటం చాలా అవసరం.ఇవి సురక్షితమైనవి అయినప్పటికీ, దుష్ప్రభావాలు కలిగిస్తాయి.  

కాబోయే భర్తతో అమ్మాయిలు తప్పక మాట్లాడాల్సిన విషయాలివి! పెళ్లిళ్లు.. నిశ్చితార్థాల సందడి మొదలైపోయింది. పెళ్లిళ్లు అంటే ఇక ఎలాగూ పెద్దవాళ్ళు ప్లాన్ చేసినట్టు జరుగుతాయి. కానీ ముడిపడిన తరువాత జీవితాన్ని డీల్ చేసుకోవాల్సింది అమ్మాయి, అబ్బాయే..  అయితే పెళ్లి తరువాత ఇలా జరగాల్సింది, ఇలా జరుగుతుందని అనుకున్నాను, ఇలా ఉండాల్సింది  కానీ అలా లేదు, అంతా నీ ఇష్టమేనా?? నాకు విలువ లేదు, నువ్వు చెప్పినట్టే వినాలా?? బాద్యతలన్నీ ఒక్కరే మోయాలా?? నేను విసిగిపోయాను.. నీతో వేగలేను.. లాంటి మాటలతో ఒకరినొకరు బాధపెట్టుకుని బంధాన్ని తెంచుకునే వరకు వెళతారు చాలామంది. మరీ ముఖ్యంగా పెళ్లి తరువాత అమ్మాయిలే ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. బాధ్యతల దగ్గర నుండి కెరీర్ వరకు ఎన్నో విషయాలు కాబోయే జీవితభాగస్వామితో చర్చించడం ఎంతో అవసరం. చాలా వరకు విషయాలను లైఫ్ పార్టనర్ తోనే చెప్పగలరు. కాబట్టి అమ్మాయిలు  కాబోయే భర్తతో ఈ కింది విషయాలను తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది. నిశ్చితార్థం, పెళ్లికి మధ్య సమయంలో భాగస్వామితో మాట్లాడటం ద్వారా వారి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు పెళ్లి తర్వాత ఒకరినొకరు నిందించుకోకుండా ఉండొచ్చు. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే బాధ్యతల గురించి మాట్లాడాలి.. నిశ్చితార్థం తర్వాత, భాగస్వామితో కుటుంబం మరియు సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడాలి. భవిష్యత్తులో ఎవరు ఏ బాధ్యతను నిర్వర్తించాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. పెళ్లి తర్వాత ఇది చాలా సులభం అవుతుంది. ఈ విషయం మాట్లాకపోతే పెళ్లి తరువాత ఒకరిమీధ ఒకరు నిందలేసుకునేదాకా సమస్య వెళుతుంది. అడ్జెస్మెంట్ గూర్చి మాట్లాడకపోతే అట్టర్ ప్లాప్ అవుతారు..  పెళ్లికి ముందు అడ్జస్ట్‌మెంట్‌ గురించి మాట్లాడాలి . మీ సమస్యలతో పాటు, మీ భాగస్వామికి మీ మనసును  విప్పి చెప్పాలి. ఇష్టాఇష్టాలు, ఇష్టం లేని విషయాలు మాట్లాడటం చాలా ముఖ్యం. అవతలి వారి ఇష్టాలు తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం.  కెరీర్ చాలా ముఖ్యం.. ఈ అంశం అమ్మాయిలకు చాలా ముఖ్యమైనది. అసలే నేటికీ చాలా చోట్ల అమ్మాయిలు పెళ్లి తర్వాత ఉద్యోగాలు చేయడం లేదు. అబ్బాయిలు కూడా మొదట ఒకే చెప్పి ఆ తరువాత వొద్దు నాటారు.  దానివల్ల చాలా ఇబ్బందులు మొదలవుతాయి. ఇలా జరగకూడదు అంటే ముందుగానే కెరీర్ గురించి ఫైనల్ చేయాలి. ఉద్యోగం గురించి, ఆర్థిక అవసరాల గురించి ధైర్యంగా చెప్పాలి. కుటుంబ నియంత్రణ.. పెళ్లయిన కొద్ది రోజుల వరకు పిల్లలు వొద్దని ప్రఝీ జంట అనుకుంటారు. కానీ పెద్దలు మాత్రం పెళ్లయ్యక అమ్మాయి ఎప్పుడెప్పుడు శుభవార్త చెబుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ విషయం గురించి గురించి కాబోయే భార్యాభర్తలు ముందుగానే మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది. దీనివల్ల పిల్లల చదువులు, వారికి మంచి కెరీర్ ఇవ్వవడానికి ఆర్థిక భరోసా ఏర్పాటుచేసుకోవడం బాగుంటుంది.   తల్లిదండ్రుల బాధ్యత  నేటి కాలంలో అమ్మాయిలు కూడా వారి తల్లిదండ్రులకు సహాయం చేస్తారు. అటువంటి పరిస్థితిలో, వారు తమ భాగస్వామితో ముందుగానే దాని గురించి మాట్లాడాలి. తద్వారా తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే అమ్మాయిలకు తమ తల్లిందండ్రుల విషయంలో  చేదు అనుభవాలు ఎదురవుతాయి.                                      ◆నిశ్శబ్ద.

సైనికుల‌కు స‌లాం చేస్తున్న జ‌య `జై- హింద్‌`! వాళ్లు ఎండావాన‌ల‌కి చ‌లించ‌రు, కొండాకోన‌ల‌కి త‌ల‌వంచ‌రు. ప‌చ్చ‌ద‌న‌మే ఎరుగ‌ని ఎడారిలో ఉన్నా, నేల‌నేది క‌నిపించ‌ని న‌డిసంద్రంలో ఉన్నా... వాళ్ల మ‌న‌సుల్లో ఒకటే ఆలోచ‌న‌, వాళ్ల జీవితాల్లో ఒక‌టే ల‌క్ష్యం, వాళ్ల చేత‌ల్లో ఒక‌టే త‌ప‌న‌ - అదే దేశ ర‌క్ష‌ణ‌! మ‌న భ‌ద్ర‌తా ద‌ళాల గురించి ఇలా ఎన్ని విష‌యాలు చెప్పుకున్నా, చెప్పాల్సింది ఇంకా మిగిలిపోయిన‌ట్లే తోస్తుంది. వారికి ఎన్ని వేల కృత‌జ్ఞ‌త‌లు అందించినా, మిగిలిపోయే రుణం ఏదో ఉంది. అందుకే వారి ఔన్న‌త్యం గురించి ప్ర‌జ‌ల‌కు తెలిపేందుకు, వారి మ‌న‌సులోని మాట‌ల‌ను మ‌న‌కి చేర‌వేసేందుకు ఒక కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు `జ‌యపీస‌పాటి`. అదే జై - హింద్‌!!! హాంగ్‌కాంగ్ నుంచీ తెలుగువారందికీ ఆత్మీయ‌వార‌థిగా నిలిచేందుకు `టోరీ` అనే ఇంట‌ర్నెట్ రేడియోని మొద‌లుపెట్టింది `తెలుగువ‌న్` సంస్థ‌. అందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఉన్న‌చోట నుంచే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ టోరీని విజ‌య‌వంతం చేశారు. హాంగ్‌కాంగ్ నుంచి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించే జ‌య‌పీస‌పాటి వారిలో ఒక్క‌రు. అప్ప‌టికే జ‌య హాంగ్‌కాంగ్‌లో ఉంటున్న తెలుగువారికోసం కె.పి.రావు దంప‌తుల‌తో క‌లిసి `హాంక్‌కాంగ్ తెలుగు స‌మాఖ్య‌` అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. వంద‌కు పైగా తెలుగు కుటుంబాల‌కు ఆ స‌మాఖ్య ఒక వేదిక‌గా ఉంది. సైనికుల కోసం ఏద‌న్నా మొద‌ట్లో జ‌యపీస‌పాటి శ‌ని, ఆదివారాల్లో రెండేసి గంట‌ల పాటు రేడియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేవారు. ఇవ‌న్నీ స‌ర‌దాస‌ర‌దాగా సాగిపోయేవి. కానీ దాంతో ఆమెకు ఎందుకో తృప్తి క‌ల‌గ‌లేదు. జ‌య‌కు చిన్న‌ప్ప‌టి నుంచి సాయుధ‌ద‌ళాల‌కు అనుబంధంగా ప‌నిచేయాల‌నే కోరిక తీవ్రంగా ఉండేది. అదెలాగూ సాధ్య‌ప‌డ‌లేదు. క‌నీసం మ‌న చీక‌టి రాత్రులు సుర‌క్షితంగా ఉండేందుకు త‌మ జీవితాల‌ను వెలిగిస్తున్న సైనికుల కోసం ఏద‌న్నా చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉండేవారు. సైనికుల గురించి ఎక్క‌డో స్కూళ్ల‌లోనో, కాలేజీల్లోనో చెప్ప‌డం త‌ప్ప మిగ‌తా మాధ్య‌మాలు అంత శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేద‌ని గ్ర‌హించారు జ‌య‌. దేశం కోసం త‌మ ఆశ‌ల‌ను ప‌ణంగా పెట్టిన వారి మ‌న‌సులో ఏముంటుంది! ఆ ఉన్న‌త భావాలు మిగ‌తా ప్ర‌జ‌ల‌కు చేరితే అవెంత ప్ర‌భావ‌వంతంగా ఉంటాయో క‌దా అనిపించింది ఆమెకు! అలా రూపుదిద్దుకున్న‌దే `జై- హింద్` కార్య‌క్ర‌మం! సైనికులు మాట్లాడితే `జై-హింద్‌` కార్య‌క్ర‌మం గురించిన ఆలోచ‌న‌ను చెప్ప‌గానే చాలా ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. ఒక చిన్న‌పాటి కార్య‌క్ర‌మంలో మాట్లాడేందుకు సైనికులు ఒప్ప‌కుంటారా! ఒక‌వేళ వాళ్లు ఒప్పుకుని ఏద‌న్నా మాట్లాడినా అది చ‌ట్టాన్ని ఉల్లంఘంచిన‌ట్లు కాదా! సెల‌బ్రిటీలు కాకుండా ఎవ‌రో సైనికులు మాట్లాడితే వినేది ఎవ‌రు!... లాంటి స‌వాల‌క్ష స‌వాళ్ల‌ను జ‌య ఎదుర్కొన్నారు. కానీ జ‌య వాట‌న్నింటినీ దాటి విజ‌యం సాధించారు. సెల‌బ్రిటీలు మాట్లాడితే ఆస‌క్తితో వింటార‌నీ, సైనికులు మాట్లాడితే అభిమానంతో వింటార‌నీ నిరూపించారు.  మూడేళ్ల విజ‌యం 2012 మ‌ధ్య‌కాలంలో మొద‌లైన జైహింద్ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికి మూడు సంవ‌త్స‌రాల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసుకుంది. ఈ మూడు సంవ‌త్స‌రాల ప్ర‌యాణం ఏమంత తేలిక‌గా సాగ‌లేదు. మొద‌ట్లో...  సైనికుల‌ను ఎలా సంప్ర‌దించాలి. మాట‌ల సంద‌ర్భంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఎలా మెల‌గాలిలాంటి స‌మస్య‌లెన్నో ఆమె ఎదుర్కొన్నారు. పైగా జ‌య‌కు ఇంట్లో ఇద్ద‌రు చిన్న‌పిల్ల‌లు ఉన్నారు. భ‌ర్త ఉద్యోగ‌రీత్యా త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి రావ‌డంతో, ఆ ఇద్ద‌రి పిల్ల‌ల బాధ్య‌త‌నీ పూర్తిగా చూసుకోవాల్సి వ‌చ్చేంది. పైగా తాను ఒక పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్నారు. ఇన్ని బాధ్య‌త‌ల మధ్య కూడా, ఆమెకు దేశం ప‌ట్ల ఉన్న నిబ‌ద్ధ‌తే `జై-హింద్‌` కార్య‌క్ర‌మాన్ని ముందుకు న‌డిపించింది. నొప్పించ‌క తానొవ్వ‌క‌ `జై-హింద్‌` కార్య‌క్ర‌మం కేవ‌లం సైనికుల‌తో స‌ర‌దాగా సాగిపోయే సంభాష‌ణ‌లా ఉండ‌దు. వారి నేప‌థ్యం ఏమిటి, సైనిక‌ద‌ళాల‌లో చేరేందుకు వారిని పురికొల్పిన ప‌రిస్థితులు ఏంటి, వారి అభిరుచులు, కుటుంబం... వంటి విష‌యాల‌ను చ‌ర్చిస్తూనే వాటిని తిరిగి శ్రోత‌ల‌కు తెలుగులో చెబుతారు జ‌య‌. ఒక‌వైపు సైన్యంలో ఉండే ద‌ళాలు ఎంత‌టి క‌ష్ట‌న‌ష్టాల‌ను ఎదుర్కొంటాయో తెలియ‌చేస్తూనే,  సైన్యంలో ఉండేవారికి ప్ర‌భుత్వం క‌ల్పించే స‌దుపాయాలను సంద‌ర్భానుసారంగా వివ‌రిస్తుంటారు. సైనికుల‌తో ఒకో ముఖాముఖి సాగే కొద్దీ `నొప్పించ‌క తానొవ్వ‌క‌` రీతిలో సంభాష‌ణ‌ను సాగించే నేర్పు జ‌య‌కు పూర్తిగా అల‌వ‌డిపోయిన‌ట్లే తోస్తుంది. సైనికుల బాధ్య‌త ఒక్క స‌రిహ‌ద్దుల‌కే ప‌రిమితం అనుకునే సామాన్య‌ల‌కు, సైన్యం అందించే సేవ‌లు విని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఉదా|| ప్ర‌భుత్వ రంగ ఉద్యోగులు ఏద‌న్నా స‌మ్మెను చేప‌డితే, దానివ‌ల్ల ర‌వాణా ఆగిపోకుండా ఉండేంద‌కు `రైల్వే టెరిటోరియ‌ల్ ఆర్మీ` స‌దా సిద్ధంగా ఉంటుంద‌న్న విష‌యం చాలామందికి తెలియ‌దు. సైన్యానికి చేతులెక్కి మొక్కాల‌నిపించే ఇలాంటి విష‌యాలు కోకొల్ల‌లుగా `జై-హింద్‌`లో వినిపిస్తాయి. కార్య‌క్ర‌మం తీరుతెన్న‌లు: సైనికుల కోసం జరిగే `జై-హింద్‌` జాతీయ గేయంతో మొద‌లై, జాతీయ గీతంతో ముగియ‌డం స‌ముచితంగా తోస్తుంది. మ‌న కోసం ప్రాణాలు అర్పించ‌డానికి కూడా వెనుకాడ‌రు సైనికులు. అందుకే వారు నిండునూరేళ్లూ జీవించాలంటూ, ఈ కార్య‌క్ర‌మం ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను అంద‌చేస్తారు. ఆ త‌రువాత ప్రోగ్రాంలోకి విచ్చేసే విశిష్ట అతిథులు చెప్పే విష‌యాల‌కు మ‌న‌సంతా దేశ‌భ‌క్తితో నిండిపోతుంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మంచిమంచి పాట‌లూ విన‌వ‌స్తాయి, శ్రోత‌ల‌ ప్ర‌శ్న‌లూ కార్య‌క్ర‌మానికి మ‌రింత వ‌న్నె తెస్తాయి. ఇందులో పాల్గొనే ప్ర‌తి ఒక్క సైనికుడూ ప్ర‌త్యేక‌మే! మ‌న సికింద‌రాబాదులోనే ప‌నిచేస్తున్న మేజ‌ర్ నిషాసింగ్ చిన్న‌నాటి క‌బుర్లు; కార్గిల్ పోరులో కాలు పోగొట్టుకుని, రెండు సంవ‌త్స‌రాలు ఆసుప‌త్రిలో గ‌డిపినా కూడా మార‌థాన్లో పాల్గొంటున్న మేజ‌ర్ డి.పి.సింగ్ పోరాటం;  కార్గిల్ యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన కేప్ట‌న్ సౌర‌భ్ కాలియా గురించి ఆయ‌న తండ్రి ఎన్‌.కె.కాలియా పంచుకున్న జ్ఞాప‌కాలు... ఇలా ఒక్కో కార్య‌క్ర‌మం ఒక్కో స్ఫూర్తిచిహ్నంగా మిగిలిపోతుంది. జ‌య‌పీస‌పాటి నిర్వ‌హించే ఈ కార్యక్ర‌మం గురించి జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. `జై-హింద్‌` అనే కార్య‌క్ర‌మం ఒక‌టి న‌డుస్తోంద‌ని అంద‌రికీ తెలిసింది. కానీ ఎవ్వ‌రికీ తెలియ‌కుండా... జ‌రుగుతున్న ఓ నిశ్శ‌బ్ద విప్ల‌వం కూడా ఉంది. బ‌తికితే రాజాలాగానే బ‌త‌కాలి, సంపాదిస్తే ల‌క్ష‌ల్లోనే సంపాదించాలి అనుకునే యువ‌త దీని నుంచి ప్ర‌భావితం అవుతోంది. ఏదో ఒక రోజున ఒక సైనికుడిని `మీరు సైనికుడిగా ప్రేర‌ణ క‌లిగించిన సంద‌ర్భం ఏంటి?` అని జ‌య‌పీస‌పాటి అడిగితే `మీ కార్య‌క్ర‌మాన్ని వినే సైనికుడిగా మారాల‌నుకున్నాను` అని ఎవ‌ర‌న్నా చెప్పే రోజు కూడా వ‌స్తుందేమో! - జై - హింద్‌!!! - నిర్జ‌ర‌.

ఇంట్లోనే నూనెను ఇలా  తయారుచేసి వాడితే పొడవాటి జుట్టు మీ సొంతం!   జుట్టు పొడవుగా, మందంగా,  ఆరోగ్యంగా పెరగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఇప్పటి జీవనశైలి వల్ల పొడవాటి జుట్టు చాలామందికి కలగానే మిగిలిపోతోంది. చిన్నతనంలో ఒత్తుగా, పొడవుగా జుట్టు ఉన్నవాళ్లు పెద్దయ్యాక తమ జుట్టు ఎందుకు అంత పలుచగా, ఎదుగుదల లేకుండా మారిపోతోందో తెలియక తికమక పడుతుంటారు. జుట్టు పెరుగుదల కోసం బోలెడు రకాల నూనెలు కూడా వాడుతుంటారు. కానీ జుట్టు పెరుగుదలకు ఇంట్లోనే ఈజీగా నూనె తయారుచేసుకుని వాడచ్చు. ఈ నూనెను వాడితే జుట్టు నల్లగా,  ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడం ఖాయం. నువ్వుల నూనె ఆయుర్వేదంలో చాలా విధాలుగా ఉపయోగిస్తారు.  చాలా రకాల ఆయుర్వేద నూనెల తయారీలో నువ్వుల నూనెకు ప్రాధాన్యత ఉంది.  నువ్వుల నూనె, మెంతి గింజలు కలిపి వాడటం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది.  దీని కోసం నూనెను ఎలా తయారుచేయాలంటే.. నువ్వుల నూనెను,  మెంతి గింజలను సమాన పరిమాణంలో తీసుకోవాలి.  ఈ రెండింటిని ఒక ఇనుప కడాయిలో వేసి సన్నని మంట మీద ఉడికించాలి.  దీన్ని కనీసం 5 నుండి 10 నిమిషాలు ఉడికిన తరువాత  స్టౌ ఆఫ్ చేయాలి.  నూనె చల్లబడిన తరువాత  వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.  ఈ నూనెను తలస్నానం చెయ్యడానికి గంట ముందు తలకు అప్లై చెయ్యాలి.  గంట తరువాత గాఢత లేని షాంపూ లేదా కుంకుడు కాయ రసంతో స్నానం చెయ్యాలి.  ఇది జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.  తెల్లజుట్టు రాకుండా చేస్తుంది.  జుట్టు పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది.  దీన్ని వారంలో 2 నుండి 3 సార్లు అప్లై చేయవచ్చు. నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, కాల్షియం,  ప్రొటీన్లు మంచి మొత్తంలో ఉంటాయి. ఈ నూనె నుండి అమైనో ఆమ్లాలు, విటమిన్లు B, E, K కూడా లభిస్తాయి. నువ్వుల నూనెను ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను ఉపయోగించడం వల్ల సెల్ డ్యామేజ్ తగ్గుతుంది, జుట్టు రాలడం ఆగిపోతుంది, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, స్కాల్ప్‌కు హైడ్రేషన్ అందిస్తుంది, ఈ నూనె ప్రభావం సూర్యుడి హానికరమైన కిరణాల నుండి జుట్టును రక్షించడంలో పనిచేస్తుంది.  ఇది చుండ్రు సమస్యను తొలగిస్తుంది. మెంతి గింజలు జుట్టుకు  అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మెంతి గింజలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి,  జుట్టు  మందాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ గింజల్లో ప్రొటీన్,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి. జుట్టుకు  మేలు చేసే అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. హెయిర్ ఫాల్ అరికట్టడం,  జుట్టు పెరుగుదలను పెంచడమే కాకుండా, మెంతి గింజలను తలపై అప్లై చేయడం వల్ల జుట్టు తొందరగా  నెరసిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. మెంతి గింజలు స్కాల్ప్ నుండి చుండ్రును తొలగించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.                                                  *రూపశ్రీ.  

  వర్షాకాలంలో వేధించే చుండ్రుకు ఇలా చెక్ పెట్టవచ్చు..!   చుండ్రు జుట్టుకు సంబంధించి చాలామంది ఎదుర్కునే సమస్యలలో ప్రదానమైనది. స్కాల్ప్ పై చర్మం విపరీతంగా పొడిబారినప్పుడు చుండ్రు సమస్య మొదలవుతుంది. చుండ్రు ఉన్నప్పుడు   తలను దువ్వినా, తలను గోక్కున్నా తెల్లని పొడిలాగా రాలుతూ ఉంటుంది. దీని కారణంగా చాలామంది ఇబ్బందికి గురవుతారు. చుండ్రు కారణంగా  తలలో వివిధ ప్రదేశాలలో దురద కూడా ఉంటుంది. ఇది మెల్లగా ముఖం మీద కూడా దురద, ఇతర చర్మపు చికాకులు రావడానికి కారణం అవుతుంది.  ఈ చుండ్రును వదిలించుకోవడానికి ఇంట్లోనే కొన్ని ఈజీ టిప్స్ తెలుసుకుంటే.. బేకింగ్ సోడా.. జుట్టును తేలికగా తడిపి బేకింగ్ సోడాను తలకు పట్టించాలి. దీన్ని  వేళ్లతో రుద్దాలి.  సుమారు 5 నిమిషాలు ఉంచి ఆపై దానిని కడగాలి. బేకింగ్ సోడా చుండ్రును తొలగిస్తుంది. అయితే జుట్టు పాడవకుండా ఉండాలంటే పరిమిత పరిమాణంలో మాత్రమే దీన్ని వాడాలి.   నిమ్మరసం.. 2 చెంచాల నిమ్మరసాన్ని తలకు పట్టించి కొన్ని నిమిషాలు ఉంచడం వల్ల అద్భుతమైన ప్రభావాలు కనిపిస్తాయి. ఒక కప్పు నీటిలో అర నిమ్మకాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. చుండ్రును తొలగించడానికి, ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు అలాగే ఉంచి ఆపై  జుట్టును కడగాలి. ఆస్పిరిన్ .. ఆస్పిరిన్ మాత్రలు చుండ్రును తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. 2 ఆస్పిరిన్ మాత్రలను గ్రైండ్ చేసి  షాంపూలో కలపాలి.  ఈ షాంపూతో మీ జుట్టును కడగాలి. 2 నుండి 3 నిమిషాలు జుట్టు మీద షాంపూ ఉంచుకోవాలి. తద్వారా ఆస్పిరిన్  ప్రభావం కనిపిస్తుంది. ఆస్పిరిన్‌లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది.  ఇది చుండ్రు షాంపూలలో కనిపించే ఒక పదార్ధం. అలోవెరా.. తాజా కలబంద గుజ్జును జుట్టు  మూలాలపై రుద్దాలి. కలబందను కొంత సేపు అలాగే ఉంచిన తర్వాత  జుట్టును కడిగి శుభ్రం చేసుకోవాలి. జుట్టు నుండి చుండ్రు తొలగిపోవడమే కాదు దురద సమస్య కూడా పోతుంది. జుట్టు మృదువుగా మారుతుంది. కొబ్బరి నూనె.. కొబ్బరి నూనె కూడా చుండ్రును తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. 3 నుంచి 4 చెంచాల కొబ్బరి నూనెలో నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. చుండ్రును తొలగించడంలో ప్రభావం చూపిస్తుందిది. ఆపిల్ సైడర్ వెనిగర్.. ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రభావం జుట్టును శుభ్రపరచడంలో కూడా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి తలకు పట్టించాలి. యాపిల్ సైడర్ వెనిగర్ నీళ్లను జుట్టుకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. చుండ్రు తొలగిపోతుంది.                                         *రూపశ్రీ.

  ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ ఇంత ఈజీగా చేసుకోవచ్చా?   ప్రతిరోజూ టీవీ  లోనూ సోషల్ మీడియాలోనూ అందానికి సంబంధించి  బోలెడు యాడ్స్ చూస్తుంటాం.  ఈ యాడ్స్ లో ఎక్కువగా ముఖం బంగారంలా మెరిసిపోవడానికి గోల్డ్ ఫేషియల్ గురించి చెబుతుంటారు.  గోల్డ్ మాస్క్ గురించి కూడా యాడ్స్ ఎడాపెడా కనిపిస్తుంటాయి. అయితే అందరికీ బ్యూటీ పార్లర్ కు వెళ్లి గోల్డ్ ఫేషియల్ చేయించుకునే స్థోమత ఉండదు. అలాగని మార్కెట్లో ఉత్పత్తులు వాడితే చర్మానికి మరింత హాని జరిగే అవకాశం కూడా ఉంటుంది.  అందుకే కేవలం నాలుగు స్టెప్స్  ఫాలో అవ్వడం ద్వారా ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ చేసుకోవచ్చు.  అదెలాగో తెలుసుకుంటే... క్లెన్సింగ్.. ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మొదటిదశ. మురికి,  మృత కణాలు,  జిడ్డు మొదలైన వాటిపైన ఏదైనా అప్లై చేస్తే అది చర్మాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ముఖాన్ని పచ్చిపాలతో శుభ్రం చేసుకోవాలి.  పచ్చిపాలలో కాటన్ బాల్  ముంచి దాంతో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.  తరువాత మంచినీటితో ముఖం కడుక్కోవాలి.  దీనివల్ల మురికి తొలగిపోతుంది. ముఖం మీద మచ్చలు కూడా తగ్గుతాయి. స్కబ్బింగ్.. గోల్డెన్ గ్లో పొందడానికి రెండవ దశ స్క్రబ్బింగ్. ఇది  ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్,  వైట్ హెడ్స్ ను శుభ్రం చేయడానికి పని చేస్తుంది. దీనికోసం ఒక గిన్నెలో చక్కెర, తేనె,  నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖంపై 5-6 నిమిషాల పాటు స్క్రబ్ చేసి తర్వాత ముఖం కడుక్కోవాలి. స్టీమింగ్.. స్టీమింగ్  చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను తెరుస్తుంది,  మురికిని లోతుగా శుభ్రపరుస్తుంది. అందువల్ల   ఆవిరి పట్టుకోవడం చాలా ముఖ్యం. కావాలంటే లవంగం, నిమ్మరసం, వేప ఆకులను ఆవిరి పట్టే నీటిలో వేసుకోవచ్చు. ఇవన్నీ చర్మానికి మేలు చేస్తాయి. గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్.. పార్లర్ లో చేసే ఫేషియల్ లాంటి గోల్డెన్ గ్లో  కావాలి అంటే ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు.  ఇందుకోసం ఒక గిన్నెలో 1 టీస్పూన్ కొబ్బరి నూనె, 1 టీస్పూన్ తేనె, 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ నిమ్మరసం,  ఒక టీస్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి.  దీన్ని  ముఖానికి అప్లై చేసి 5 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత ముఖం కడగాలి.  ఇలా చేసిన తరువాత ముఖానికి  గోల్డెన్ గ్లో  సొంతమవుతుంది.  చివరగా మాయిశ్చరైజర్ రాయాలి.                                           *రూపశ్రీ.

  ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగా రాదు ఎందుకని...నిద్ర బాగా పట్టాలంటే ఏం చెయ్యాలి? మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ తగినంత నిద్ర అవసరం. కానీ గర్భధారణ సమయంలో తగినంత నిద్రపోవడం మహిళలకు పెద్ద సవాలుగా మారుతుంది.  అయితే గర్భం దాల్చిన తొమ్మిది నెలల కాలం చాలా విలువైనది. నిద్రలేమి సమస్య ఈ 9నెలల కాలాన్ని చాలా క్లిష్టతరంగా మారుస్తుంది. సాధారణంగా అలసటగా ఉన్నప్పుడు చాలామంది హాయిగా నిద్రపోతారు. కానీ   అలసటగా అనిపించినా సరైన నిద్ర పట్టడం లేదని చాలామంది మహిళలు వాపోతుంటారు. మహిళలకు నిద్రలేమి  వెనుక హార్మోన్లలో మార్పులు, వెన్నునొప్పి, కడుపులో బిడ్డ   చురుకుగా మారడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడానికి లేవడం  వల్ల చాలాసార్లు నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీని కారణంగా మరుసటి రోజు అలసటగా,  నీరసంగా అనిపిస్తుంది. గర్భిణీ స్త్రీ రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోవాలని, పగటిపూట కనీసం రెండు గంటలు నిద్రపోవాలని,  ఇది తల్లి,  బిడ్డ ఇద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మహిళా వైద్యులు చెబుతున్నారు.  గర్భవతులు హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే.. ప్రెగ్నెన్సీ సమయంలో రోజంతా యాక్టివ్ గా ఉండటం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది. చురుగ్గా ఉండటం అంటే భారీ పని కాదు. పగటిపూట లైట్ యోగా,  వ్యాయామం చేయడం వల్ల  రాత్రి బాగా నిద్ర పడుతుంది. డిజిటల్ గాడ్జెట్లు  మనస్సును  చురుకుగా ఉంచుతాయి. పదే పదే మొబైల్ చూడటం,  ఏదో  ఒకటి ఆపరేట్ చేయడం చేస్తుంటారు.  ఇవి  నిద్రపై అత్యధిక ప్రభావం చూపుతాయి. పడుకునే రెండు గంటల ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపై దృష్టి పెట్టడం మంచిది. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇలా చేయడం వల్ల రోజంతా అలసట, టెన్షన్ తొలగిపోయి స్నానం చేసి పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకుంటారు. రాత్రి పడుకునే ముందు వేడి లేదా చల్లని కాఫీ వంటి కెఫిన్ ఉన్న పానీయాలను తాగడం మానుకోవాలి. నిద్రవేళకు రెండు మూడు గంటల ముందు వీటిని తీసుకోవడం మానేస్తే,  ఆహ్లాదకరమైన నిద్రను సొంతం అవుతుంది. పడుకునే ముందు చాలా తక్కువ మొత్తంలో నీరు త్రాగాలి. దీనితో  తరచుగా మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉండదు .  నిద్రకు కూడా ఆటంకం కలగదు. నిద్రవేళకు ముందు ఒకసారి మూత్ర విసర్జనకు వెళ్లి రావాలి. ఇలా చేయడం వల్ల గాఢ నిద్ర నుండి మళ్లీ మళ్లీ మేల్కొనే అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడూ వీపుపై నేరుగా పడుకోకూడదు.  కుడి లేదా ఎడమ వైపున నిద్రించడానికి ప్రయత్నించాలి.  మనకు వెన్నుపాము పైన రక్త నాళాలు ఉంటాయి.  దానిపై కడుపులో శిశువు నెమ్మదిగా  పెరుగుతుంటాడు. వెల్లికిలా పడుకోవడం వల్ల నాళాలపై ఒత్తిడి ఏర్పడుతుంది.  దీని కారణంగా శిశువుకు రక్త సరఫరా ఆగిపోతుంది. అంతేకాదు గర్భవతుల కాళ్లు  గుండెకు రక్త సరఫరా కూడా ఆగిపోతుంది. అదే ఒకవైపుకు తిరిగి పడుకోవడం ద్వారా పిల్లల మొత్తం బరువు రక్తనాళాలపై పడదు. దాని కారణంగా కడుపులో బిడ్డ పెరుగుదల బాగుంటుంది.                                             *రూపశ్రీ.

డెలివరీ తరువాత బరువు తగ్గాలంటే ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి..!   గర్భధారణ సమయంలో మహిళలు చాలా బరువు పెరుగుతారు. డెలివరీ తర్వాత   అంత ఈజీగా బరువు తగ్గరు.  ఇలాంటి మహిళలు బరువు తగ్గే విషయంలో చాలా కష్టపడుతుంటారు. కొంతమంది మహిళలు లావుగా ఉన్నామని చాలా ఫీలవుతారు. తల్లి అయిన తర్వాత  శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు కూడా  బరువు పెరగడానికి,   ఆ తరువాత బరువు అంత సులువుగా తగ్గలేకపోవడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా సిజేరియన్  ద్వారా పిల్లలను కన్న వారికి బరువు తగ్గడంలో సమస్యలు ఎక్కువ. దాదాపు 6 నెలల పాటు ఎటువంటి తీవ్రమైన వ్యాయామం చేయకూడదని వైద్యులు చెబుతుంటారు కాబట్టి ఇలాంటి వారు బరువు తగ్గడానికి సాహసం చేయరు. అంతే కాదు సిజేరియన్ కారణంగా పొట్ట భాగంలో కొవ్వు  పెరగడం కూడా వేగంగానే ఉంటుంది.  అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల, కొన్ని ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల డెలివరీ తరువాత బరువు తగ్గడం సులువుగా ఉంటుంది.  అదెలాగో ఓ లుక్కేస్తే.. వాము నీరు.. ప్రసవం తర్వాత తల్లికి వాము నీరు త్రాగడానికి ఇస్తారు.  ఈ నీటి రుచిని మహిళలు ఇష్టపడనప్పటికీ  క్రమం తప్పకుండా తాగడం వల్ల కడుపులో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం  నీటిలో వాము గింజలు వేసి నీటిని మరిగించాలి.  చల్లగా అయిన తరువాత  రోజంతా ఈ నీటిని త్రాగాలి. 1-2 నెలల తర్వాత ఉదయం 1 గ్లాసు వాము నీరు తాగడం మొదలు పెట్టాలి. ఇందుకోసం రాత్రంతా వాము గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి అలాగే ఉంచాలి.  ఉదయాన్నే ఈ నీటిని వడగట్టి తాగాలి.  బరువు, పొట్ట భాగంలో కొవ్వు కూడా తగ్గుతాయి. గ్రీన్ టీ.. డెలివరీ  తర్వాత బరువు తగ్గడానికి  గ్రీన్ టీని చేర్చుకోండి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంలో సహాయపడతాయి. తినడానికి ముందు లేదా తర్వాత 1 కప్పు గ్రీన్ టీ త్రాగాలి. మిల్క్ టీ తాగే అలవాటు ఉంటే దాని  బదులుగా గ్రీన్ టీ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఊబకాయం తగ్గి చర్మం కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది. అయితే గ్రీన్ టీకి చక్కెర జోడించకూడదు. దాల్చిన చెక్క,  లవంగాలు.. దాల్చిన చెక్క,  లవంగాలు పొట్టలోని కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దాల్చినచెక్క,  లవంగాల వినియోగం గర్భధారణ తర్వాత బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా  ఉంటుంది. 1 గ్లాసు నీటిలో 2 నుండి 3 లవంగాలు,  దాల్చిన చెక్క ముక్కను ఉడకబెట్టాలి. ఈ నీటిని వడగట్టి ఉదయాన్నే తాగాలి. కావాలంటే ఈ నీటిని రోజంతా గోరువెచ్చగా తాగవచ్చు. జాజికాయ పాలు.. స్థూలకాయం తగ్గాలంటే పాలలో జాజికాయ కలుపుకుని తాగాలి. ఇది బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రాత్రి పడుకునే ముందు జాజికాయ పాలు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీని కోసం 1 కప్పు పాలలో 1/4 టీస్పూన్ జాజికాయ పొడిని కలపాలి. ఈ  పాలు గోరువెచ్చగా త్రాగాలి. బాదం,  ఎండుద్రాక్ష.. బాదం,  ఎండుద్రాక్షలను రోజూ తినడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గుతారు. బాదంపప్పు పూర్తి ఫైబర్ మూలం.  ఎండుద్రాక్ష కడుపుని శుభ్రంగా ఉంచుతుంది. డెలివరీ సాధారణమైతే  కొన్ని రోజుల తర్వాత బాదం,  ఎండుద్రాక్ష తినవచ్చు. ఆపరేషన్ ద్వారా బిడ్డ పుడితే వైద్యుల సలహా మేరకు బాదం, ఎండు ద్రాక్ష తినవచ్చు. రోజుకు 10 ఎండుద్రాక్ష,  4 నుండి 8 వరకు బాదంపప్పులు తినడం వల్ల బరువు తగ్గుతారు.                                         *రూపశ్రీ.

  అమ్మాయిలు చర్మ సంరక్షణ విషయంలో అస్సలు రాజీ పడరు. అందుకే వాణిజ్య ఉత్పత్తుల నుండి ఇంటి చిట్కాల వరకు ప్రతి ఒక్కటి ఫాలో అవుతారు.   వాణిజ్య ఉత్పత్తులలో ఎక్కువ శాతం రసాయనాలుండటం వల్ల చాలామంది సహజంగా చర్మాన్ని మెరిపించుకోవడం కోసం ట్రై చేస్తారు.  అలాంటి వారికి ఓట్మీల్ చక్కని ఆప్షన్. సాధారణంగా ఆరోగ్య స్పృహ ఉన్నవారు  ఓట్మీల్ ను ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటారు. దీంతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలుంటాయి. కానీ దీన్ని పేస్ కు మాస్క్ లాగా వేసుకుంటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయి. ఇంతకీ ఓట్మీల్ అంటే ఏంటి?దీన్నెలా తయారుచేసుకోవాలి?  ఎలా అప్లై చేసుకోవాలి? తెలుసుకుంటే.. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు,  మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి  ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. కానీ వీటితో పేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం నుండి మురికి,  నూనెను తొలగించడంలో, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో, చర్మానికి  తేమను అందించడంలో, అకాల వృద్ధాప్యానికి గురికాకుండా చేయడంలో.. ఇలా చాలా రకాలుగా సహాయపడుతుంది. ఓట్ మీల్ తేనె ఫేస్ మాస్క్.. పొడి చర్మం,  సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ మాస్క్ మంచిది. కావలసినవి: 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ వోట్మీల్ 1 టేబుల్ స్పూన్ తేనె 1 టీస్పూన్ వెచ్చని నీరు. విదానం.. ఒక చిన్న గిన్నెలో, గ్రైండ్ చేసిన ఓట్ మీల్, తేనెను కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.  ఈ మిశ్రమానికి గోరువెచ్చని నీరు వేసి బాగా కలపాలి.  ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి.  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుని,  ఇష్టమైన మాయిశ్చరైజర్‌ని ముఖానికి రాసుకోవాలి. ఓట్ మీల్ పెరుగు ఫేస్ మాస్క్.. ఈ ఫేస్ మాస్క్ అన్ని చర్మ రకాల వారికి, ముఖ్యంగా జిడ్డుగల లేదా మొటిమల బారిన పడే చర్మం ఉన్నవారికి సరిపోతుంది. కావలసినవి.. 2 టేబుల్ స్పూన్లు గ్రౌండ్ వోట్మీల్ 2 టేబుల్ స్పూన్లు సాదా పెరుగు 1 టీస్పూన్ తేనె విధానం.. ఒక చిన్న గిన్నెలో, గ్రౌండ్ వోట్మీల్,  పెరుగు కలపాలి. ఇందులోనే  తేనె జోడించాలి.  ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసి  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖం పొడిగా మారిన తరువాత తేలికపాటి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఓట్ మీల్,  అరటిపండు ఫేస్ మాస్క్: ముడుతల చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ మాస్క్ సరైనది. కావలసినవి: 1/2 పండిన అరటి 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ వోట్మీల్ 1 టీస్పూన్ తేనె విధానం.. ఒక చిన్న గిన్నెలో, అరటిపండును మెత్తని పేస్ట్‌గా  చెయ్యాలి.  అరటిపండు గుజ్జులో గ్రైండ్ చేసిన   ఓట్ మీల్,  తేనె వేసి బాగా కలపాలి. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుని  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ముడుతలు ఉన్న చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి.                                                      *రూపశ్రీ.

ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్ది. ట్యాలెంట్ ఉండాలే కానీ తళుక్కున మెరవచ్చు. చాలామంది ఏ రంగం అయినా బ్యాక్గౌండ్ లేకపోతే ముందుకు సాగలేరని అంటుంటారు. ముఖ్యంగా మహిళలు ఎదగాలంటే చాలా సవాళ్లు ఎదుర్కోవాలని కూడా అంటుంటారు. దీనికి ఉదాహరణగా చాలామంది మహిళలు తమకు ఎదురైన అనుభవాలు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం అన్నింటిని తట్టుకుని నిలబడి విజయ కేతనం ఎగురవేస్తారు. ఆ కోవలోకి చెందినదే నాన్సీ త్యాగి. ఈమె ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లూమెన్సర్. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఈమె తన ఫ్యాషన్ ప్రతిభతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తళుక్కున మెరిసింది. ఇలాంటి  విజయాలు ఎంతో మంది మహిళలను, యువతులను ఇన్పైర్ చేస్తాయి.  విజయం వైపు నాన్సీ త్యాగి  ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుంటే.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ బచ్చన్,  కియారా అద్వానీ వంటి  సెలబ్రిటీలు సాధారణంగా తమ ఫ్యాషన్ తో హోయలు పోయి ప్రశంసలు కొట్టేసేవారు. కానీ  దానికంటే ఎక్కువ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికి  ప్రశంసలు లభిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన నాన్సీ త్యాగి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తను సొంతంగా డిజైన్ చేసిన గౌనుతో ఈవెంట్ కు అట్రాక్షన్ గా నిలిచి ప్రశంసలు కొట్టేసింది. ఈమె ధరించిన  గౌను ఫ్యాషన్ ప్రపంచంలో  ఈమెకు గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. నాన్సీ త్యాగి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో  పింక్ రఫుల్ గౌను ధరించింది. దీన్ని తయారు చేసేందుకు ఆమెకు  1000 మీటర్ల క్లాత్ అవసరమైంది. దీన్ని నెల రోజుల్లో సిద్ధం చేసినట్టు పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వీడియోలు పోస్ట్ చేస్తుండేది. అవి కాస్తా  వైరల్ కావడంతో  నాన్సీ త్యాగికి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు వచ్చింది. నాన్సీ స్వయంగా డ్రెస్ కుట్టించి తన అకౌంట్ లో  పోస్ట్ చేసేది. మొదట్లో నాన్సీ తన డిఫరెంట్  శైలి ప్రెజెంట్ చేసే క్రమంలో చాలా ట్రోల్స్ కు గురైంది.  దీంతో ఆమె పోస్టింగ్ శైలిని మార్చుకుంది. అంతే..  నెటిజన్లు ఆమె ట్యాలెంట్ ను గుర్తించడం  మొదలుపెట్టారు.  ప్రస్తుతం  ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మంది నాన్సీని ఫాలో అవుతున్నారు.   ఆమె ఇయర్ పోస్ట్‌కు 1.9 మిలియన్ లైక్‌లు ఉన్నాయి. నాన్సీ ప్రతిభ ఆమెను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లింది. నాన్సీ స్వయంగా కుట్టిన దుస్తులను సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, ఈషా గుప్తా, దేవోలీనా భట్టాచార్జీ వంటి పలువురు ప్రముఖులు..  సోషల్ మీడియా ప్రభావశీలులు ప్రశంసించారు.  అంతేనా నాన్సీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్లడం మాత్రమే కాకుండా గుర్తింపు తెచ్చుకున్నందుకు నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రత్యేక ఈవెంట్ కోసం నాన్సీ మూడు లుక్స్ లో కనిపించింది.  తన ఫస్ట్ లుక్‌లో నాన్సీ పింక్ రఫిల్డ్ గౌనులో  కనిపించగా, సెకండ్ లుక్‌లో ఆమె హెడ్ ఎంబ్రాయిడరీ చీరను ధరించింది.  ఈ చీరను స్వయంగా తనే సిద్ధం చేసింది. తన మూడవ లుక్ లో  నాన్సీ నల్లటి దుస్తులను ధరించింది. ఇది కూడా ఆమె స్వయంగా   స్టైల్ చేసింది. నాన్సీ స్వయంగా ఈ  దుస్తులను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.                         *నిశ్శబ్ద.

గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? ఏం చెయ్యాలి, ఏం  చేయకూడదు..!   ప్రతి ఆడపిల్ల జీవితంలో  గర్భధారణ చాలా కీలకమైన, ముఖ్యమైన దశ. ఈ దశలో మహిళల జీవనశైలి, ఆహారపు అలవాట్లు అన్నీ పూర్తీగా మార్పుకు లోనవుతాయి. ఇక శరీరంలో మార్పులు సరే సరి.. ఈ దశల గర్భవతులు, కడుపులో పెరుగుతున్న వారి బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం అనుసరించాల్సిన విషయాలు.. అనుసరించకూడని విషయాలను ICMR పేర్కొంది. వీటి గురించి తెలుసుకుంటే.. గర్భిణీ తల్లులు సరైన నిష్పత్తిలో అన్ని ఆహార సమూహాలను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే మీ భోజనంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సన్న మాంసాలు, గుడ్లు, చిక్కుళ్ళు మరియు పాల ఉత్పత్తులు వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. శిశువు  పెరుగుదల,  అభివృద్ధికి కీలకమైన ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం,  ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలు తినాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12, అయోడిన్ మరియు n-3 పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొన్ని పోషకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఐరన్,  ఫోలిక్ సప్లిమెంట్స్ తీసుకోవాలి.  అయోడిన్ కూడా తప్పనిసరి.  B12 పెరుగు లేదా మాంసం  నుండి లభిస్తుంది. మాంసాహారులైతే ఒమేగా-3 కోసం  కొవ్వు చేపలు.. శాఖాహారులైతే   విత్తనాలు, ఆకు కూరలు,  గింజల తీసుకోవచ్చు. 1000రోజుల పోషకాహారం.. స్త్రీ గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు (270 రోజులు). బిడ్డ  పుట్టినప్పటి నుండి ఆమె బిడ్డ 2వ పుట్టినరోజు (365+365 రోజులు) వరకు 1000రోజులు ఉంటాయి. ఈ  మొదటి 1000 రోజులు పిల్లల భవిష్యత్తును రూపొందించే కీలకమైన కాలం. ఈ కాలంలో, తల్లి కడుపులోని పిండం చాలా వేగంగా పెరుగుతుంది.  తల్లి నుండి పోషకాహారాన్ని తీసుకుంటుంది. దీని కోసం, గర్భం ప్రారంభంలో తల్లికి అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు,  శక్తిని అందించాలి. కనీసం 10-12 కిలోల బరువు పెరగాలి. తక్కువ బరువు ఉన్న మహిళలు తమ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.   బరువు పెరుగుటను నిశితంగా పరిశీలించాలి. అధిక బరువు ఉన్నవారు 5g-9kg కంటే ఎక్కువ బరువు పెరగకూడదు. చేయాల్సివి.. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి, జామ,  నారింజ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. మొక్కల ఆహారాలు ఐరన్  శోషణను మెరుగుపరుస్తాయి.  ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. వికారం,  వాంతులు ఉన్నట్లయితే రోజుకు 4 నుండి 6 సార్లు చిన్న మొత్తంలో ఎక్కువ సార్లు   భోజనం చేయాలి. తగినంత విటమిన్ డి పొందడానికి కనీసం 15 నిమిషాల పాటు ప్రత్యక్ష సూర్యకాంతిలో గడపాలి. చేయకూడనివి.. కార్బోనేటేడ్ డ్రింక్స్ మానుకోవాలి. ధూమపానం చేయకూడదు.  పొగాకు తీసుకోకూడదు. మద్యం సేవించకూడదు. కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోకూడదు.   హైడ్రోజనేటెడ్ కొవ్వుతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. భారీ వస్తువులను ఎత్తకూడదు. లేదా కఠినమైన శారీరక శ్రమ చేయకూడదు.                                              *రూపశ్రీ.  

  మేరీ కాం- బాక్సింగ్ చేసే అమ్మ! ఆడది అమ్మయితే ఇక ఆమె వ్యక్తిగత జీవితం ఆఖరు అనుకుంటారు చాలామంది. కానీ జీవితంలో ఎదగాలన్న తపనే ఉంటే అటు కుటుంబ జీవితంలోను, ఇటు లక్ష్య సాధనలోనూ అద్భుతాలు సాధించవచ్చని నిరూపించిన మనిషి మేరీ కాం. మహిళలకు అనువుగాని ఆటలనీ, అందులోనూ తల్లి అయ్యాక దూరంగా ఉండాల్సిన పోటీలని భయపడిపోయే బాక్సింగ్‌లో పతకాల పంటని పండిస్తున్న మేరీ కాం గురించి మరికొంత... పేదరికం... మేరీ కాం మణిపూర్‌లోని కన్‌గెతే అనే మారుమూల గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పొలం పనులు చేసుకునే కూలీలు. మేరీ కాం కూడా పూట గడిచేందుకు తరచూ ఆ పొలం పనులకు వెళ్లి తల్లిదండ్రులకు సాయపడాల్సి వచ్చేది. లక్ష్యం... మేరీ కాంకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టంగానే ఉండేది. కానీ తన రాష్ట్రానికే చెందిన డింగ్‌కో సింగ్‌ ఎప్పుడైతే ఆసియా క్రీడలలో బాక్సింగ్‌లో బంగారు పతకాన్ని తీసుకువచ్చాడో, అప్పటి నుంచి తాను కూడా బాక్సింగ్‌లో రాణించాలని నిర్ణయించేసుకుంది. పోరాటం... మేరీ ఆశయాన్ని ప్రపంచమంతా ఎగతాళి చేసింది. బాక్సింగ్‌ అనేది పురుషుల ఆటనీ, ఆడవాళ్లకు తగిన సున్నితమైన ఆటని వెతుక్కోమని హెచ్చరించింది. ఆఖరికి మేరీ తల్లిదండ్రులు కూడా ఆమె ఆసక్తిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా మేరీ తన పట్టు వీడలేదు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు చేరుకుంది. అక్కడ నర్జిత్‌ సింగ్‌ అనే బాక్సింగ్‌ శిక్షకుడి వద్దకు తనకు బాక్సింగ్‌ నేర్పమంటూ ప్రాథేయపడింది. శిక్షణ... తొలుత నర్జిత్‌ సింగ్‌ మేరీని తేలికగా తీసుకున్నాడు. కానీ ఇతరులకంటే తీవ్రమైన ఆమె సంకల్పాన్ని గ్రహించిన తరువాత తన శిక్షణపటిమనంతా ఆమెకు అందించాడు. నర్జిత్‌ ఆశలకు అనుగుణంగా మేరీ కాం రాష్ట్ర స్థాయి నుంచి ఒకో పోటీలో గెలుస్తూ 2001 నాటికి ప్రపంచ బాక్సింగ్‌ పోటీలలో రజతాన్ని సాధించింది. ఆ తరువాత మరో ఐదు సార్లు ప్రపంచ బాక్సింగ్‌ పోటీలలో బంగారు పతకాన్ని గెల్చుకుని, ఆ పోటీలలో ఆరు పతకాలను గెల్చుకున్న ఏకైక మహిళగా రికార్డు సాధించింది. పెళ్లి... 2001లో మేరీ, ఆన్లర్‌ కామ్‌ను కలుసుకుంది. మేరీ ప్రతిభతో ముగ్ధుడైన ఆన్లర్‌ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. 2005లో ఆ జంట వివాహం చేసుకుంది. మేరీ వివాహం చేసుకుంటే ఆమె కెరీర్‌ నాశనం అయిపోతుందని నర్జిత్‌ సింగ్‌ వంటి పెద్దలంతా భయపడ్డారు. వారు ఊహించినట్లుగానే మేరీ 2006-08 కెరీర్‌కు దూరమయ్యింది. ఈ మధ్యలో ఆమెకు కవల పిల్లలు కూడా జన్మించారు. కుటుంబం అడ్డుకాలేదు... అందరి భయాలనూ తిప్పికొడుతూ మేరీ 2008లో తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించింది. మళ్లీ ఒకదాని తరువాత ఒక పోటీని నెగ్గుకుంటూ పతకాల పంటని ప్రారంభించింది. ఒక పక్క గుండెజబ్బుతో బాధపడుతున్న పిల్లవాడిని గమనించుకుంటూ, ఆ బాధని దిగమింకుకుంటూనే రికార్డుల మోత మోగించింది. ఈ సందర్భంగా ఆమె భర్త ఆన్లర్‌ కామ్‌ అందించిన ప్రోత్సాహం కూడా అసామాన్యం. 2011 ఆమె ఆసియా కప్‌లో స్వర్ణాన్ని సాధించి వచ్చేనాటికి ఆమె పిల్లవాడికి ఆపరేషన్‌ కూడా విజయవంతంగా పూర్తయ్యింది. చరిత్ర ముగిసిపోలేదు... 2012లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పడమే కాదు, ఆ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి తన పతకాల రికార్డుని మరింత పదిలం చేసింది. మేరీ కామ్‌ ప్రతిభను గమనించిన కీర్తి ఆమె వెంటపడింది. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో ఆమెను వరించాయి. మేరీ కాం జీవిత చరిత్ర ఆధారంగా 2013లో ‘అన్‌బ్రేకబుల్‌’ అనే పుస్తకాన్నీ, ఆ పుస్తకం ఆధారంగా ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రతో చలనచిత్రాన్ని రూపొందించారు. మేరీకాం ప్రతిభను, పోరాటపటిమను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను రాజ్యసభకు ఎంపికచేసింది. అయినా మేరీ కాం ప్రస్థానం ఇక్కడితో ఆగేట్లు లేదు. ఈ ఏడాది బ్రెజిల్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో అర్హత సాధించడం మీదే ఆమె దృష్టంతా! - నిర్జర.