హుస్సేన్ సాగర్‌ జోలికెళ్తే కొంప మునిగినట్టే...

Publish Date:Feb 19, 2015

Advertisement

 

అదేమీ విచిత్రమో కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపని మొదలుపెట్టాలనుకొన్నా వెంటనే ఎవరో ఒకరు అభ్యంతరాలు లేవనెత్తుతుంటారు. ఒకప్పుడు స్వచ్చమయిన మంచినీళ్ళతో నిండి ఉండే హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఒక పెద్ద మురికి చెరువుగా మారిపోయింది. దానిలో నీటిని, వ్యర్ధ పదార్ధాలను పూర్తిగా తొలగించి మళ్ళీ స్వచ్చమయిన నీళ్ళు నింపుతామని ఆయన ప్రకటించినప్పుడు ప్రజలందరూ హర్షించారు. కానీ ఇప్పుడు దానిపై కూడా కొందరు పర్యావరణవేత్తలు,నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.

 

“సేవ్ అవర్ అర్బన్ లేక్స్” అనే హైదరాబాద్ కి చెందిన సంస్థ ప్రతినిధి యల్. శర్వాత్ మీడియాతో మాట్లాడుతూ “ముందు హుస్సేన్ సాగర్ లోకి చుట్టుపక్కల కర్మాగారాల నుండి ప్రమాదకర రసాయనాలతో కూడిన నీటి విడుదల ఆపకుండా చెరువులో నీళ్ళు తోడి బయట పోయడం వలన ఏమి ప్రయోజనం ఉంటుంది? మంచి నీటి వనరులను కలుషితం చేసేవారికి చట్టంలో చాలా కటినమయిన శిక్షలు పేర్కొనబడ్డాయి. అనేక దశాబ్దాలుగా చుట్టుపక్కల పరిశ్రమలు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ హుస్సేన్ సాగర్ నీటిని కలుషితం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కూడా పట్టించుకొంటున్నట్లు లేదు. ముందు అటువంటి వారిపై చర్యలు తీసుకొని మళ్ళీ హుస్సేన్ సాగర్ లోకి రసాయన వ్యర్ధాలు విడుదల చేయకుండా నిరోధించిన తరువాతనే ఈ శుద్ధి కార్యక్రమం చేపడితే ఏమయినా ఫలితం ఉంటుంది. లేకుంటే అది ఏట్లో చింతపండు పిసికినట్లే అవుతుంది. మేము త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ఒక విజ్ఞప్తి పత్రం ఇవ్వబోతున్నాము. హుస్సేన్ సాగర్ ని కలుషితం చేస్తున్న వారిని ఇక ఎంతమాత్రం ఉపేక్షించ రాదని మేము కోరుతాము.” అని అన్నారు.

 

ఆయన మరొక అంశం కూడా ప్రస్తావిస్తున్నారు. “అనేక దశాబ్దాలుగా ప్రక్షాళనకు నోచుకోని కారణంగా హుస్సేన్ సాగర్ గర్భంలో కొన్ని వేల క్యూబిక్ మీటర్ల ఘన రసాయనిక వ్యర్థ పదార్ధాలు పోగుపడి ఉన్నాయి. కొన్ని లక్షల గ్యాలన్ల ప్రమాదకర రసాయనిక నీళ్ళు బయటకు తోడిపోయవలసి ఉంటుంది. ఘన వ్యర్ధ పదార్ధాలను మూసీ నది సమీపంలో పడేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దానివలన అక్కడ వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దానివలన ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉంది. ఇక హుస్సేన్ సాగర్ నుండి తోడి బయటపోసే ప్రమాదకరమయిన నీళ్ళు ఎటు పోతాయి? ఎందులో కలుస్తాయి? అవి ఎందులో కలిసినా ఎక్కడ నిలిచినా ఆ ప్రాంతంలో ఉండే జలవనరులన్నీ కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అంటే ఒక సమస్యను పరిష్కరించబోయి ఇంకో సమస్యను సృష్టించుకొన్నట్లే అవుతుంది,” అని అన్నారు.

 

నిజమే కదా! వారి వాదనలో కూడా అర్ధం ఉంది. మరి వారు లేవనెత్తిన ఈ సమస్యలను ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరిస్తుందో తెలియదు. కానీ నగరానికే చెందిన బీవీ. సుబ్బారావు అనే జలవనరుల నిర్వహణ నిపుణుడు దీనిలో మరో కోణం కూడా ఎత్తి చూపుతున్నారు.

 

“ఇంతవరకు హుస్సేన్ సాగర్ గర్భంలో ఉన్న రసాయన వ్యర్ధాలు నీళ్ళతో కలిసి మెదేయిన్ అనే విషయవాయువు తయారవుతోంది. కానీ హుస్సేన్ సాగర్ లో ఉన్న నీళ్ళు ఆ విష వాయువుని ఒక ఫిల్టర్ మాదిరిగా పట్టి ఉంచి గాలిలో కలవకుండా నిరోధిస్తోంది. ఇప్పుడు ఆ నీళ్ళనన్నిటినీ ఒక్కసారిగా తోడేస్తే ఆ విష వాయువులు గాలిలోకి వ్యాపించడం మొదలవుతుంది. దాని వలన చుట్టుపక్కల నివసించే ప్రజలు, ట్యాంక్ బండ్ మీదుగా నిత్యం రాకపోకలు సాగించేవారు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కనుక హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను ఆషామాషీగా కాకుండా శాస్త్రీయ పద్దతుల ప్రకారమే చేయవలసి ఉంటుంది. లేకుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది,” అని హెచ్చరించారు.

 

హుస్సేన్ సాగర్ లో నుండి నీళ్ళు తోడితేనే ఇంత ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పుడు, ఆ ఘన వ్యర్ధాలను మూసీ నది ఒడ్డునో మరొక నిర్జన ప్రాంతంలోనో పోగుపెడితే ఏమవుతుందో ఎవరయినా ఊహించగలరు. కనుక ఈ అంశాలన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.