political-news-img

అంబులెన్స్ జాడ లేదు.. ఎద్దుల బండిలోనే రోగి తరలింపు!

అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నామని మురిసిపోతున్నామే కానీ, అత్యవసర సమయాల్లో సామాన్యుడికి కనీస వైద్య సాయం మాత్రం అందడం లేదు. కనీసం అనారోగ్యంతో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్సు కూడా అందుబాటులోకి రాని దుస్థితి ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి ఓ భర్త చేసిన పోరాటం మన వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ​అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితి విషమిస్తుండటంతో, కుటుంబ సభ్యులు ఆందోళనతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, "అంబులెన్స్ అందుబాటులో లేదు అన్న సమాధానం వచ్చింది. ప్రైవేటు వాహనాన్ని పిలిపించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ మహిళ భర్త భర్త తన వద్ద ఉన్న ఎద్దుల బండినే అంబులెన్స్‌గా మార్చుకున్నాడు. ఎండను సైతం లెక్కచేయకుండా, తన భార్య ప్రాణాలను కాపాడుకోవడమే లక్ష్యంగా మైళ్ల దూరం ఎద్దుల బండిపై ఆసుపత్రికి తరలించాడు.

Publish Date: Feb 26, 2026 11:44PM

political-news-img

కన్నుల పండువగా బ్రహ్మంగారి మఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం

శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి 12వ మఠాధిపతిగా శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ పట్టాభిషేక మమోత్సవం మంగళవారం (ఫిబ్రవరి 24) నుంచి గురువారం (ఫిబ్రవరి 26) వరకూ నభూతో న భవిష్యత్తు అన్నరీతిలో వేలాదిమంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ప్రస్తుత మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ,మఠాధిపతి సోదరులు నొస్సం దత్తాత్రేయస్వామి, వీరభట్లయ్య స్వామి, మఠాధిపతి బావమరిది, భవిష్యత్ మేనేజర్ పి.పి.ఎన్. ప్రసాద్ పర్యవేక్షణలో కన్నులపండువగా నిర్వహించారు. గురువారం (ఫిబ్రవరి 26) సాయంత్రం మఠాధిపతి వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారికి తులాభారం కార్యక్రమం నిర్వహించారు. ఈ పట్టాభిషేక మహో త్సవాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులుపెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పూర్వపు మఠాధిపతి శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామిజ్యేష్ట కుమారుడు వెంకటాద్రి స్వామికి మఠాధిపతి బాధ్యతలు అప్పగించారు. . తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూద నాచారి, హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ కే.యం. కిరణ్ కుమార్ తోపాటు మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, వైసీపీ నాయకులు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ వీరనారాయణ రెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, సహకార పరపతి బ్యాంకు చైర్మన్ యల్లటూరి సాంబశివరెడ్డి, టిడిపి మండల నాయకులు ఎస్సార్ శ్రీనివాసులు రెడ్డి, ఎం పోలిరెడ్డి, పూజా శివ యాదవ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ యం. రామ గోవిందరెడ్డి, డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ ఈ.తిరుపాల్రెడ్డి తోపాటు కందిమల్లయ్యపల్లె పుర సంస్థాన ప్రజలు, వివిధ రాష్ట్రాల నుండి స్వామి శిష్యులు భక్తులు పాల్గొని పట్టాభిషేక మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి సౌకర్యం, భోజనం సౌకర్యం ఏర్పాటు చేశారు .జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వివిధ మండలాల నుండి పోలీస్ సిబ్బంది ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. మఠం పురవీధుల గుండా, ప్రాంగణమంతా చలువ పందిళ్ళు విద్యుద్దీపాలంక రణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

Publish Date: Feb 26, 2026 11:11PM

political-news-img

జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్ ఇండియా.. సెమీస్ ఆశలు సజీవం

టి 20 వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. జింబాబ్వేతో గురువారం (ఫిబ్రవరి 26) జరిగిన కీలక మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. 237 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 184 పరుగులు మాత్రమే చేసి 72 పరుగుల తేడాతో చిత్తైంది. జింబాబ్వే బ్యాటర్లలో బెనెట్ 97 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ సత్తా చాటారు. సంజూ శాంసన్24 పరుగులు, అభిషేక్ శర్మ55 పరుగులు చేశారు. ఇరువురూ టీమ్ ఇండియాకు అదిరే ఆరంభాన్ని అందించారు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు కూడా మెరుపు ఇన్నింగ్స్ తో స్కోరింగ్ రేట్ ఎక్కడా తగ్గకుండా వేగంగా పరుగులు సాధించారు. ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశారు. ఇక చివరిలో హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 సిక్సర్లతో చెలరేగడంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ విజయంతో టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా కు ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ దక్కింది. ఇక టీమ్ ఇండియా సెమీస్ కు చేరాలంటే ఆదివారం (మార్చి 1) విండీస్ తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించాలి.

Publish Date: Feb 26, 2026 10:55PM

political-news-img

నెల్లూరుగా మేయర్‌గా దేవరకొండ సుజాత ఎన్నిక

నెల్లూరు నగరంలో మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. జేసీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రారంభమైన ప్రత్యేక సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైసీపీ కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరుకాలేదు. టీడీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా దేవరకొండ సుజాత పేరును ఇంచార్జ్ మేయర్ రూప్ ప్రతిపాదించగా, ఇతరుల నుంచి ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో పోటీ లేకుండా ఆమెను మేయర్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా జేసీ వెంకటేశ్వర్లు అధికారికంగా ఫలితాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, “నూతన మేయర్‌గా దేవరకొండ సుజాతను ఎన్నుకున్నాం. నగర కార్పొరేషన్‌పై టీడీపీ జెండాను ఎగురవేశామని. మంత్రి పీ. నారాయణ సూచనల మేరకు సుజాతకు ఈ అవకాశం కల్పించాం” అని తెలిపారు. మేయర్‌గా ఎన్నికైన దేవరకొండ సుజాత స్పందిస్తూ, “ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాల మేరకు నగర కార్పొరేషన్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తాను. ఎస్టీ మహిళకు మేయర్ పదవి కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.ఈ ప్రక్రియతో నెల్లూరు నగరానికి నూతన మేయర్ బాధ్యతలు స్వీకరించగా, నగర అభివృద్ధిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

Publish Date: Feb 26, 2026 7:10PM

political-news-img

రాయలసీమ ఎత్తిపోతల దుష్ప్రచారంపై శివమెత్తిన మంత్రి నిమ్మల

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి పూర్తిగా మాజీ సీఎం జగన్‌నే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. శాసనమండలిలో మాట్లాడిన ఆయన, అవసరమైన అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించి, ఎన్జీటీ ఉత్తర్వులను పట్టించుకోలేదని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు లేక జరిమానాలు కూడా విధించబడ్డాయని తెలిపారు.రాయలసీమ ప్రజలకు నీరు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.

Publish Date: Feb 26, 2026 6:50PM

political-news-img

అనిల్ అంబానీ ఇల్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నివాసం, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసులో భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న సుమారు రూ.2,200 కోట్ల రుణానికి సంబంధించిన పత్రాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాల డాక్యుమెంట్లను తారుమారు చేసి వాస్తవాలను దాచిపెట్టినట్లు విచారణలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో భాగంగా బ్యాంకు రుణాలకు సంబంధించిన కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులను తప్పుదోవ పట్టించడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా, ఆర్థిక లావాదేవీలపై మరింత లోతైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం.

Publish Date: Feb 26, 2026 6:01PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img