political-news-img

ఇవి కూడా రంగుల పండుగలే!

హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని ఏ అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది... టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది. ఒకటే రంగు నెదర్లాండ్‌ రాజుగారైనా విలియం అలగ్జాండర్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేశంలో జరుపుకొనే సంబరాలే ‘Koningsdag’. ఈ రోజున నెదర్లాండ్స్ యావత్తూ ఆ దేశపు రంగైన నారింజరంగుతో నిండిపోతుంది. గోడల మీద నారింజ రంగు కనిపిస్తుంది. జనమంతా నారింజరంగు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఆఖరికి జుట్టుకి కూడా నారింజ రంగు వేసుకుంటారు. ద్రాక్ష ఎరుపులో మందుప్రియులందరి నోరూరేలాంటి ఓ పండుగ ఉంది. అదే స్పెయిన్‌లో జరిగే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’. ఏటా జూన్‌ 29న ఆ దేశంలోని క్రైస్తవ సన్యాసి ‘శాన్‌ పెడ్రో’ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుగుతుంది. హారో అనే ఊరిలో జరిగే ఈ పండుగలో ఊరి జనమంతా ఉదయం నుంచే ద్రాక్షసారాయి నిండిన పాత్రలతో బయల్దేరతారు. దారిలో తమకు ఎదురుపడినవారందరి మీదా ఈ సారాయిని ఒంపుతూ ముందకుసాగుతారు. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ద్రాక్షమయంగా మారిపోతుందన్నమాట. ఇక ద్రాక్షసారాని ఒంపుకోవడమే కాదు... దానిని తాగడంలో కూడా బోలెడు పోటీలు జరుగుతాయి. నారింజ యుద్ధం ఇటలీలోని ఇవ్రియా అనే పట్నంలో జరిగే పండుగ ఇది. దీని మూలాలు ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్నాయని చెబతారు. అప్పట్లో రాజవంశానికి చెందిన వ్యక్తి, ఓ పల్లెటూరి పిల్లని బలాత్కారం చేయబోయాడట. దానికి తిప్పికొట్టిన ఆ అమ్మాయి, ఏకంగా ఆ వ్యక్తి తలని నరికేసిందని చెబుతారు. అంతేకాదు! విషయం తెలుసుకున్న పౌరులంతా కలిసి రాజవంశం మీద తిరగబడ్డారట. ఆనాటి ప్రతిఘటనకు గుర్తుగా ఇవ్రియావాసులు నారింజపండ్లని ఒకరిమీద ఒకరికి విసురుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హోళీని తలపిస్తూ రంగులతో నిండే ఇలాంటి పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం పైన పేర్కొన్నవే! - నిర్జర.

Publish Date: Mar 3, 2026 4:25PM

political-news-img

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ

రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. కమలం పార్టీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేశ్ కుమార్, బిహార్ నుంచి ఎంపిక కానున్నారు. అస్సాం నుంచి తెరాశ్ గోవల్ల, జోగెన్ మోహన్, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్శ, హరియాణా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సమాల్, సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను కాషాయ పార్టీ ఎంపిక చేసింది. ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవీ కాలం ముగియనుంది. వీరి పదవి కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుండటంతో రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది. కాగా రాజ్యసభ ఎన్నికకు సంబంధంచి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 5న నామినేషన్లకు చివరి తేదీ కావడంతో రెండు రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. కాగా రాజ్యసభ సభ్యుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి రాకపోయినప్పటికీ పార్టీ గెలుపుకు కృషి చేసిన నేతలకు ఈ సీట్లు కేటాయించాలనే అంశంపై పార్టీ నాయకుల మధ్య చర్చ జరిగింది. కాగా, రాజ్యసభ ఎంపీల రేసులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Publish Date: Mar 3, 2026 3:58PM

political-news-img

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు పర్యాటకులు...సహాయం కోసం ఆర్తనాదం

మధ్యప్రాచ్య దేశం బెహరన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు చిక్కుకుపోయి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టూరిస్ట్ వీసాపై నాలుగు రోజులపాటు పర్యటించేందుకు వెళ్లిన వారు అనూహ్య పరిస్థితుల కారణంగా అక్కడే ఇరుక్కుపోయినట్లు సమాచారం. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఉండటంతో పరిస్థితి మరింత విషమంగా మారిందని తెలుస్తోంది. పర్యాటకుల వాంగ్మూలాల ప్రకారం, తమ వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చైపోయాయని, కనీసం మందులు కొనుగోలు చేసుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ సరైన వైద్య సదుపాయాలు పొందలేకపోతున్నామని చెబుతున్నారు. “ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నాం” అంటూ వారు భావోద్వేగంతో వెల్లడించారు. తమను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేం దుకు తక్షణ చర్యలు తీసుకోవాలని దేశ ప్రధాని నరేందర్ మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయం చేసి ప్రత్యేక విమాన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా Embassy of India, Manama నుంచి తగిన సహాయం అందడం లేదని పర్యాటకులు ఆరోపి స్తున్నారు. తమ సమస్య లను వివరించినప్పటికీ స్పష్టమైన హామీ లభించ లేదని తెలిపారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి బాధితులను సురక్షితంగా స్వదేశానికి తరలించే చర్యలు చేపట్టా లని వారి కుటుంబసభ్యులు కూడా కోరుతున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది.

Publish Date: Mar 3, 2026 3:17PM

political-news-img

సేఫ్ జోన్ మిడిల్ ఈస్ట్‌లో భయనక వాతావరణం

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు తయారైంది ఇప్పుడు మిడిల్‌ ఈస్ట్‌లోని పలు దేశాల పరిస్థితి. ఇప్పటి వరకు చాలా సేఫ్ అనుకున్న మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో ఇప్పుడు పరిస్థితి భయానకంగా మారింది. సంపన్న దేశాల్లో ఇప్పుడు బాంబుల మోతలు కామన్‌గా మారాయి. దీంతో ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాలన్ని మూతపడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై చేసిన దాడుల్లో ఆ దేశ సుప్రీంలీడర్ అయెతుల్లా ఖమేనీ హతం కావడంతో ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్‌తో పాటు.. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, కార్యాలయాలను టార్గెట్ గా బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ దేశాల్లోని ప్రజలు, ఆయా దేశాలకు వచ్చిన అతిథులు వణికిపోతున్నారు. దుబాయ్, ఖతార్, బహ్రెయిన్‌, సౌదీ అరేబియాలో పరిస్థితి భీతావహంగా మారింది. ముఖ్యంగా దుబాయ్‌ను టార్గెట్ చేసింది ఇరాన్. ఈ దాడుల్లో ఎవరూ మరణించకపోయినా.. ఆస్తి నష్టం భారీగా జరిగింది. నిజానికి ఆస్తి నష్టం కంటే.. మిడిల్ ఈస్ట్ దేశాలు ఎంత మాత్రం సేఫ్ కాదనే భావన ఏర్పడింది. నిజానికి మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ మధ్య కాలంలో పెట్టుబడులు పెరిగాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్నులంతా ఇప్పుడు ఈ దేశాలకు క్యూ కడుతున్నారు. అక్కడే తమ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. బిలియన్ డాలర్ల కొద్ది సొమ్మును కుమ్మరిస్తున్నారు. కానీ వీటన్నింటిపై పునరాలోచించేలా చేసింది ఇరాన్. దుబాయి ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ నిరవధికంగా మూతపడింది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో ఒకటి దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అలాంటి ఎయిర్‌పోర్ట్‌పై కూడా ఇరాన్‌ దాడి చేసింది. దీంతో ప్రయాణీకులందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిల్డింగైన బుర్జ్ ఖలీఫాను దుబాయ్ పోలీసులు ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అందులో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. బుర్జ్ ఖలీఫా టార్గెట్ గా ఇరాన్ దాడులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. బుర్జ్ ఖలీఫా వద్ద దట్టమైన పొగ కమ్ముకోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. దుబాయ్‌లోని ప్రఖ్యాత బుర్జ్ అల్ అరబ్ హోటల్‌పై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. దీంతో హోటల్ బయటి భాగంలో మంటలు చెలరేగాయి. గాలిలోనే డ్రోన్‌ను అడ్డుకున్న సమయంలో దాని అవశేషాలు హోటల్ పై పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఇక్కడ ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఖతార్, బహ్రెయిన్‌లో కూడా ఈ దాడులు కొనసాగాయి. ఈ రెండు దేశాల్లోనూ అమెరికాకు కీలక స్థావరాలు ఉన్నాయి. ఖతార్‌లో అయితే యూఎస్ సెంటర్‌కామ్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఉంది. దీనిని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది ఇరాన్. బహ్రెయిన్‌లోని అమెరికన్ నేవీ బేస్‌పై ఇప్పటికే దాడి చేసింది ఇరాన్. కువైట్‌లో కూడా ఇదే సిట్యూవేషన్ నెలకొంది. ప్రస్తుతం మిడిల్‌ ఈస్ట్‌లోని ఎయిర్‌స్పేస్‌ మూతపడింది. ఎక్కడి నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Publish Date: Mar 3, 2026 2:57PM

political-news-img

యుద్ధం వేళ షాపింగ్ మాల్‌కు యూఏఈ ప్రెసిడెంట్.. ఎందుకో తెలుసా?

ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ సాహసోపేతమైన అడుగు వేశారు. యుధభయంతో వణికిపోతున్న ప్రజల్లో భయం పోగొట్టడానికి ఆయన సోమవారం (మార్చి 2)సాయంత్రం దుబాయ్‌లోని షాపింగ్ మాల్‌కు వెళ్లారు. ప్రజలలో భయం పోగొట్టి ధైర్యం నింపేందుకు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు 1,240పైగా స్థావరాలపై దాడులు చేశాయి. ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్‌తో పాటు యూఏఈలోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అరబ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు పేలుళ్లతో అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సైరన్ లేని సమయంలో కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ షాపింగ్ మాల్‌కు వెళ్లి జనంలో ధైర్యాన్ని నింపారు. ఆయనతో పాటు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా వెళ్లారు. షాపింగ్‌ మా‌ల్‌లోని ప్రజలను పలకరించి, వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను దుబాయ్ మీడియా ఆఫీస్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

Publish Date: Mar 3, 2026 2:43PM

political-news-img

ప్రేమ విఫలమై యువ నర్సు ఆత్మహత్య

మియాపూర్ పరిధిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం విఫలమవడంతో యువ నర్సు ఆత్మహత్య కు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన మేఘావతు సోను భాయ్ (20) అనే యువతి హైదరాబాద్ నగరానికి వచ్చి మియాపూర్ మక్తలోని ఓ హాస్టల్‌లో ఉంటూ, స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు విధులు నిర్వహిస్తోంది. గత సంవత్సరం కాలంగా ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. అయితే ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఈ ప్రేమ జంట మధ్య విభేదాలు తలెత్తింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సోను భాయ్ హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఆ ఘటనను గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరి కి తరలించారు. ప్రేమ వ్యవహారం కారణం గానే ఈ ఘటన జరిగిందా? లేక ఇతర కారణాలున్నా యా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Publish Date: Mar 3, 2026 2:39PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img