political-news-img

తరగతి గదిలో విద్యార్థికి పాముకాటు.. చికిత్స పొందుతూ మృతి..!

ప్రభుత్వ పాఠశాలలో విషసర్పం కాటుకు ఎనిమిదేళ్ల విద్యార్థి బలి..! నారాయణపేట జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జ్ఞానాన్ని ప్రసాదించాల్సిన ప్రభుత్వ పాఠశాల ప్రాంగణమే ఒక చిన్నారికి నూరేళ్ల ఆయువును తీసేసింది. పాఠశాల తరగతి గదిలో కూర్చుని చదువుకుంటున్న మూడో తరగతి బాలుడిని విషసర్పం కాటువేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన నారాయణపేట జిల్లా పరిధిలోని ఎక్లాస్‌పూర్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు రంజిత్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి అభ్యసిస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలుడు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. తరగతి గదిలోకి ఊహించని విధంగా ప్రవేశించిన ఒక విషసర్పం బాలుడిపై దాడి చేసి కాటువేసింది. విషయం గమనించిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయ బృందం రంజిత్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో వైద్యులు చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, శరీరంలోకి విషం తీవ్రంగా పాకడంతో ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూనే బాలుడు రంజిత్ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. చేతికందివచ్చే వయసులో కళ్లముందే కుమారుడు అనంత లోకాలకు వెళ్లడంతో రంజిత్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆస్పత్రి ప్రాంగణంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఎక్లాస్‌పూర్ గ్రామం మొత్తంగా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు దట్టంగా పెరిగిపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణాల పారిశుధ్యంపై అధికారులు సరైన పర్యవేక్షణ వహించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర పాముకాటు మందులు (ఆంటీ వెనమ్) ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాఠశాలల ఆవరణలను శుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ అధికారులు కఠిన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపై ఏ పాఠశాలలోనూ ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. Narayanapet Snakebite Incident, Telangana School Student Death,Eklaspur Government School, Snake Bite In Classroom, Telangana Student Safety, CM Revanth reddy

Publish Date: Aug 6, 2026 9:18PM

political-news-img

చెరువుల పునరుజ్జీవనానికి హైడ్రా ముందడుగు..!

హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా మరో కీలక అడుగు వేస్తోంది. పునరుద్ధరిస్తున్న చెరువుల్లోకి స్వచ్ఛమైన నీరు చేరేలా చర్యలు చేపడుతోంది. మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా అడ్డుకోవడంతో పాటు, వర్షాకాలంలో వరదనీరు చెరువుల్లోకి చేరేలా ఇన్‌లెట్ల అభివృద్ధి పనులు చేపడుతోంది. అలాగే తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసి చెరువులకు అందించే విధానాలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే బిట్స్ పిలానీ కేకే బిర్లా గోవా క్యాంపస్‌లో అభివృద్ధి చేసిన **'వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ టెక్నాలజీ'**ని హైడ్రా పరిశీలించింది. స్థిరమైన మురుగునీటి నిర్వహణ, పట్టణ సరస్సుల పునరుద్ధరణ లక్ష్యంగా బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ ఆహ్వానం మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్యాంపస్‌ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను పరిశీలించిన ఆయన, SBR, MBR టెక్నాలజీలతో పాటు వెట్‌ల్యాండ్ ట్రీట్‌మెంట్ వంటి ఆధునిక విధానాలపై నిపుణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా, ఈ సాంకేతిక పరిజ్ఞానాలతో క్షేత్రస్థాయిలో మురుగునీటిని ఎలా శుద్ధి చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తక్కువ విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం, దీర్ఘకాలిక సామర్థ్యం వంటి అంశాలను అధ్యయనం చేశారు. ప్రకృతి ఆధారిత నీటి శుద్ధి విధానమైన వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ టెక్నాలజీ నీటి నాణ్యతను మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పునరుద్ధరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు కూడా సమర్థవంతంగా దోహదపడుతుందని బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ ప్రొఫెసర్లు కమిషనర్‌కు వివరించారు. నగరంలోని చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాఫ్ట్స్ అధినేత యూనస్ కూడా కమిషనర్ వెంట ఉన్నారు. తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసి చెరువులకు అందించే ఈ విధానాన్ని హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని హైడ్రా నిర్ణయించింది. తొలి దశలో పాతబస్తీలోని బమ్రకున్-ఉద్-దౌలా చెరువులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి దాని పనితీరును పరిశీలించనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. పర్యావరణహితమైన, తక్కువ విద్యుత్ వినియోగం మరియు నిర్వహణ వ్యయంతో కూడిన ఈ సాంకేతికతను వినియోగించడం ద్వారా నగరంలోని చెరువులకు శుద్ధి చేసిన నీటిని అందించడంతో పాటు, చెరువుల పునరుద్ధరణకు మరింత ఊతం లభిస్తుందని హైడ్రా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. HYDRA, BITS Pilani, KK Birla Goa Campus, SBR, MBR, Wetland Treatment, Sewage Treatment, Wastewater Management, Urban Lake Restoration

Publish Date: Aug 6, 2026 9:03PM

political-news-img

బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందా.. భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణ..!

గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తర భారతంలో స్పష్టమైన ప్రజాధారణ ఉన్నప్పటికీ, ఎన్నికల ఫలితాలు రాజకీయ స్థిరత్వం విషయంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి సాంప్రదాయ కోటలలో అధికారాన్ని నిలబెట్టుకుంటున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల గెలుపోటముల నిర్వహణ ప్రాంతీయ భాగస్వామ్యాల నియంత్రణ సవాలుగా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృత ప్రచారాలు, రాజకీయ సమీకరణాలు ప్రజల మనోభావాలు పార్టీ గ్రాఫ్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి. కేవలం సంపూర్ణ మెజారిటీ సాధించడమే కాకుండా, అధికారాన్ని సమర్థవంతంగా నిలబెట్టుకోవడానికి నిరంతరం కొత్త వ్యూహాలను రచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగువన్‌ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు. బీజేపీ ప్రధాన వ్యూహం ఉత్తర భారతదేశంలో తన బలాన్ని గరిష్ఠ స్థాయిలో నిలబెట్టుకుంటూ, రాజ్యాంగపరమైన ఆదర్శపరమైన చర్చలలో పైచేయి సాధించడం. అయితే, ఈ వ్యూహంలో కొన్ని కీలకమైన అంశాలు ప్రతిబింబిస్తున్నాయి. ఉత్తర-దక్షిణ రాజకీయ వ్యత్యాసాలు.. దక్షిణ భారతదేశంలో స్పష్టమైన ఆధిక్యం లేకపోయినా, ఉత్తర భారత స్థానాలతోనే కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించడం. రాజ్యాంగ వేదికలపై జరుగుతున్న చర్చలు, భావజాల పోరాటాలు సామాజిక సమీకరణాలు ఓటర్లపై బలమైన ప్రభావం చూపుతున్నాయి. విమర్శకులు బాహ్యంగా రాజ్యాంగేతర అంశాలను ముందుకు తెస్తున్నారని ఆరోపిస్తున్నప్పటికీ, పార్టీ తన సాంప్రదాయ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడంలో విజయం సాధిస్తోంది. జాతీయ నాయకత్వ పరిధి, విస్తృత ప్రచార శైలి మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఓటర్లను ఆకట్టుకోవడం ప్రధాన వ్యూహంగా ఉంది.ఈ వ్యూహాల వల్ల ప్రాంతీయ పార్టీలలో ఆందోళన పెరగడమే కాకుండా, కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో నూతన రకమైన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో భారత రాజకీయాలపై ఈ పరిణామాలు గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి..ప్రాంతీయ కూటముల పునరేకీకరణ.. బీజేపీని నిరోధించేందుకు ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలు మరింత సమర్థవంతమైన వ్యూహాలతో ముందుకు రాక తప్పనిసరి అవుతుంది. రాజ్యాంగ సామాజిక చర్చల విస్తరణ.. రాబోయే ఎన్నికలలో కేవలం సంక్షేమ పథకాలే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ విలువలు సామాజిక సమతుల్యత ప్రధాన ఎన్నికల అంశాలుగా మారనున్నాయి. దక్షిణ భారతదేశ ప్రాముఖ్యత..ఉత్తర భారతంలో సీట్ల పరిమితి ఏర్పడితే, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దక్షిణ రాష్ట్రాలలో బీజేపీ మరింత తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. సారాంశంగా, భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల గ్రాఫ్‌ను నిలబెట్టుకోవడానికి అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి సాంప్రదాయ భావజాలాన్ని, ఆధునిక ప్రచార వ్యూహాలను మేళవిస్తోంది. రాబోయే కాలంలో ఇరు పక్షాల మధ్య జరగబోయే సిద్ధాంత ఎన్నికల పోరాటాలు భారత ప్రజాస్వామ్య రూపురేఖలను నిర్దేశించనున్నాయి. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. Telugu One Vasthava Vedika, Prime Minister Modi, North India Politics, South India Politics, Kanthamneni Ravi Shankar, Dolendra Prasad

Publish Date: Aug 6, 2026 8:44PM

political-news-img

ప్రొఫెసర్‌ జయశంకర్‌ను కేసీఆర్‌ అవమానించారు : వీహెచ్

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ బతికున్న సమయంలో ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు. ప్రస్తుతం ఆయన జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రొఫెసర్‌ జయశంకర్‌ను ఎంతో గొప్పగా కీర్తిస్తుండటం తనకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఒక సందర్భంలో తాను, అప్పటి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ ముగ్గురమే కలిసి ఉన్నామని హనుమంతరావు గుర్తుచేశారు. ఆ సమయంలో కేసీఆర్‌ జయశంకర్‌ను అవమానించే విధంగా మాట్లాడారని తెలిపారు. ఆ మాటలు విని తాను తీవ్రంగా బాధపడ్డానని చెప్పారు. ఆ తర్వాత జయశంకర్‌ను తాను ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. "ఈ రోజు మాట్లాడిన మాటలు చాలా తక్కువ. ఇలాంటి మాటలు ఆయన తరచూ అంటుంటారు. కానీ నేను ఏమీ చేయలేను హనుమంతన్నా. నాకు ఆలోచన ఉంది.. దాన్ని అమలు చేసే శక్తి నాకు లేదు" అని చెప్పారని హనుమంతరావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ఎలాంటి మాటలు మాట్లాడినా భరిస్తున్నానని ఆ సమయంలో జయశంకర్‌ తనతో చెప్పారని ఆయన తెలిపారు. మంచి అయినా, చెడు అయినా తెలంగాణ కోసం భరిస్తున్నాననే భావనతో జయశంకర్‌ వ్యవహరించారని పేర్కొన్నారు. జయశంకర్‌ బతికున్న సమయంలో ఆయనను అవమానించిన నాయకులే ఇప్పుడు ఆయన జయంతి సందర్భంగా ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారని హనుమంతరావు విమర్శించారు. బతికున్నప్పుడు గౌరవం ఇవ్వకుండా, మరణించిన తర్వాత దేవుడిలా కొలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంతకాలం తాను ఈ విషయాలపై మాట్లాడలేదని, అయితే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నాయకులు జయశంకర్‌ గురించి మాట్లాడుతున్న తీరును చూసి ఈ వీడియో చేయాల్సి వచ్చిందని వి. హనుమంతరావు తెలిపారు. Acharya Jayashankars birth anniversary, Telangana ideologue, CM Revanth Reddys tribute, KTRs memorial, Telangana movement, KTR BRS, Bandi Sanjay

Publish Date: Aug 6, 2026 8:15PM

political-news-img

జూనియర్‌ కాలేజీల పేరుతో ‘అగ్ని’ ఆట..!

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన జూనియర్‌ కాలేజీలు.. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు.హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అగ్గిపెట్టెలను తలపించే ఇరుకైన భవనాల్లో జూనియర్‌ కాలేజీల నిర్వహణపై తాజాగా అనేక ప్రశ్నలు తలెత్తు తున్నాయి. ఐదు అంత స్తుల భవనాల్లో కాలేజీల ను నిర్వహిస్తూ.. కనీస భద్రతా ప్రమాణాలను కూడా పాటించని పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని భవనాలకు ఒకే ఒక్క ప్రవేశ ద్వారం ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో వందలాది మంది విద్యార్థులు బయటకు రావడం కష్టంగా మారే ప్రమాదం ఉంది. కొన్ని జూనియర్‌ కాలేజీలు అత్యంత ఇరుకైన సందుల్లో కొనసాగు తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్‌ ఇంజన్‌ ఘటనాస్థలికి చేరుకోవడానికి కూడా అవకాశం లేని ప్రదేశాల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అగ్ని ప్రమాదం జరిగితే విద్యార్థులు సురక్షితంగా బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, మెట్లు, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం అవసరమైన ఫైర్‌ ఎన్వోసీ పొందాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కాలేజీలకు సంబంధిత అనుమతులు నిరాకరించబడ్డాయి. అయినప్పటికీ ఆయా కాలేజీలు యథావిధిగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, సంబంధిత అనుమతులు లేకుండానే నకిలీ పత్రాలను సృష్టించి బోర్డు అనుమతుల కోసం సమర్పించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో మరో సంచలన ఆరోపణ తెరపైకి వస్తోంది. సంబంధిత అధికారిక ప్రక్రియను పూర్తి చేయకుండానే 6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెల్లిస్తే ఫైర్‌ ఎన్వోసీ ఇప్పిస్తామంటూ కొందరు మధ్యవర్తులు, దళారులు కాలేజీ యాజమాన్యాలను సంప్రదిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఒక్క కాలేజీకి, ఇద్దరు వ్యక్తులకు పరిమితం కాకుండా పెద్ద నెట్‌వర్క్‌ వెనుక ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ ఫైర్‌ ఎన్వోసీలు తయారు చేసి ఇస్తున్న ముఠా కోసం ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. నకిలీ పత్రాలు ఎక్కడ తయారవుతున్నా యి? వాటిని ఎవరు సృష్టిస్తున్నారు? కాలేజీ యాజమాన్యాలకు వాటిని ఎవరు సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలోని జూనియర్‌ కాలేజీల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలపై జరుగుతున్న తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 142 కాలేజీలను పరిశీలించగా.. 52 కాలేజీలు నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీలు సమర్పించి నట్లు గుర్తించారు. నకిలీ ఎన్‌ఓసీలు సమర్పించి నట్లు గుర్తించిన కాలేజీల జాబితాను హైడ్రా పోలీసు లకు అందజేశారు. ఈ వ్యవహారంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఫైర్‌ శాఖ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాలతో పాటు హైడ్రా కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సంతకాలను సైతం ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీలు గా సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పత్రాలపై ఉన్న సంతకాలు, ఎన్‌ఓసీల వివరాలను సంబంధిత శాఖల రికార్డు లతో పోలీసులు సరిపో ల్చుతున్నట్లు సమాచారం. నకిలీ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు పేర్కొన్న కాలేజీలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్‌ఓసీలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎవరు తయారు చేశారు? సంబంధిత పత్రాలపై ఉన్న సంతకాలు నిజమైనవేనా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు Hyderabad Inter College Forgery Case, Nagi Reddy, Fire Department NOC Scam, HYDRA Commissioner Ranganath, Telangana Inter Board Affiliation,Fake NOC Certificates, GHMC, Forgery

Publish Date: Aug 6, 2026 7:54PM

political-news-img

వాడేసి వదిలేశారు.. బోరుగడ్డ దుస్థితిపై జడ్జి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం..!

తాడేపల్లి ప్యాలెస్ ముందు, కాలిపోయే ఎండలో, రోడ్డు పక్కన ప్లాట్‌ఫారమ్‌పై కట్టుకున్న పెళ్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయకుల దర్శనం కోసం దేహి అని వేడుకుంటున్న ఆ దృశ్యం... ఏ ఒక్కరి గుండెనైనా పిండేసేలా ఉంది. నిన్నటిదాకా అధికార పార్టీ ప్రాపకం చూసుకుని విర్రవీగిన ఒక వ్యక్తి, ఈరోజు అదే నాయకుల ఇంటి ముందర నిలబడేందుకు నీడ కూడా లేక అల్లాడిపోతున్న తీరు రాజకీయాల్లోని క్రూరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఉదంతంపై జడ్జి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పలు అంశాలపై టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిన్నటివరకు పార్టీ కోసం, అగ్రనాయకుల మెప్పు కోసం ప్రత్యర్థులపై బూతుల వర్షం కురిపించి, ప్రతిపక్ష నాయకుల కుటుంబాలను సైతం నీచంగా దూషించిన అనిల్... నేడు అదే పార్టీ నాయకుల కంటికి కనీసం మనిషిలా కూడా కనిపించకపోవడం రాజకీయాల్లో ఉన్న 'యూజ్ అండ్ త్రో' సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యం.వాడుకోవడం ముగిసింది... మురికి కాలవలే గతి..ప్రభుత్వం ఇచ్చిన విదేశీ విద్యా దీవెన స్కాలర్‌షిప్‌తో లండన్ వెళ్ళి ఎల్‌ఎల్‌ఎమ్‌ చదివిన ఒక విద్యావంతుడు, సమాజానికి, తన కమ్యూనిటీకి ఆదర్శంగా నిలబడాల్సింది పోయి, రాజకీయ నాయకుల పెంపుడు కూలీగా మారడం ఎంతటి విషాదం.. నాయకుల ఆజ్ఞల మేరకు ఆవేశంతో ఊగిపోతూ, కేసులు మెడకు చుట్టుకుని, ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపి, వ్యాపారాలన్నీ కోల్పోయిన తర్వాత... అదే నాయకుడి తలుపు తడితే లభించిన సమాధానం.. "ఎవరు నువ్వు?"నాలుగున్నర గంటల పాటు తాడేపల్లి వీధిలో వేచి చూసినా కనీసం లోపలికి రానివ్వకుండా, "నువ్వెవరివి?" అని విసిరేసిన ఒకే ఒక్క ప్రశ్నతో అనిల్ జీవితంలోని భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. కష్టకాలంలో అండగా ఉంటారనుకున్న నాయకులు ముఖం చాటేయడమే కాకుండా, కనీసం పరిచయం లేనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అసలు నైజం బయటపడింది.సామాజిక ఆవేదన – కుటుంబాల రోదనఈ ఉదంతం కేవలం ఒక్క బోరుగడ్డ అనిల్ సమస్య మాత్రమే కాదు. రాజకీయ నాయకుల అబద్ధపు మాటలు, తాత్కాలిక ప్రయోజనాలు నమ్మి తమ జీవితాలను, కుటుంబ గౌరవాన్ని పణంగా పెడుతున్న వేలాది మంది కార్యకర్తల భవిష్యత్తుకు ఇదొక హెచ్చరిక.కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై ఎండలో కూర్చోబెట్టి, ఆత్మగౌరవాన్ని చంపుకుని అడుక్కునే దుస్థితికి రావడం కంటే ఒక కుటుంబానికి అంతకంటే పెద్ద అవమానం ఇంకేముంటుంది? అధికారంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి బూతులు తిట్టించిన నాయకులు, కేసులు పడి రోడ్డున పడ్డప్పుడు ముఖం చాటేయడం ఎంతోమంది సామాన్యుల జీవితాలను నాశనం చేస్తోంది. ఆత్మగౌరవమే అసలైన ఆయుధంనాయకుల మెప్పు కోసం సొంత జాతినీ, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టే వారికి ఈ ఘటన ఒక కనువిప్పు కావాలి. అధికారంలో ఉన్నంత కాలం వాడుకుని, అవసరం తీరాక కరివేపాకులా తీసిపారేసే రాజకీయ వ్యాపారంలో నలిగిపోతున్నది సామాన్యులే. ఆత్మగౌరవాన్ని చంపుకుని ప్యాలెస్ గడపల ముందు కుక్కల్లా పేచీలు పడటం కంటే, స్వశక్తితో, నేరుగా కష్టపడి బతకడమే మిన్న అని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. Borugadda Anil Kumar, Judge Ramakrishna comments, Tadepalli Palace Borugadda Anil, Sajjala Ramakrishna Reddy, Borugadda Anil, YSRCP Dalit politics, AP Political, CM Chandrababu, Naralokesh

Publish Date: Aug 6, 2026 7:25PM

MOVIE NEWS