political-news-img

అజినమోటో ఆరోగ్యానికి మంచిదేనా

అజినమోటో ఆరోగ్యానికి మంచిదేనా? చౌ మెయిన్, మోమోస్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్, పిజ్జా.. ఇవి మాత్రమే కాకుండా అనేక ఇతర చైనీస్ స్ట్రీట్ ఫుడ్స్ లో ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమోటోను తరచుగా ఉపయోగిస్తారు. దీని అసలు పేరు మోనోసోడియం గ్లుటామేట్ (MSG), ఇది కూడా ఒక రుచిని పెంచే పదార్థమే. అయితే దీని గురించి చాలా కాలంగా చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. పరిశోధన ప్రకారం, చాలా మంది ఆరోగ్యవంతులకు అజినమోటో మితమైన మోతాదులో తీసుకోవడం మంచిదే, కానీ కొంతమందిలో, దీన్ని తీసుకోవడం వల్ల తలనొప్పి, దాహం, వేడి ఆవిర్లు, వికారం లేదా అసౌకర్యం వంటి లక్షణాలను కలుగుతాయి. అసలు అజినోమోటో అంటే ఏమిటి, దాని వినియోగం ఎప్పుడు హానికరంగా మారుతుంది? ఎవరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి వైద్యులు చెప్పిన నిజాలేంటో తెలుసుకుంటే.. అజినమోటో.. అజినోమోటో రసాయన నామం మోనోసోడియం గ్లుటామేట్ (MSG). ఇది ఆహార రుచిని మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక ఫ్లేవర్ ఎన్‌హాన్సర్. ఇది గ్లుటామేట్ యొక్క ఒక రూపం, ఇది టమోటాలు, చీజ్ , పుట్టగొడుగులు వంటి కొన్ని ఆహారాలలో సహజంగా కూడా లభిస్తుంది. అజినమోటో ఎక్కువ వాడితే కలిగే సమస్యలు.. తలనొప్పి , అసౌకర్యం.. అజినమోటో అధికంగా ఉండే ఆహారాలు తిన్న తర్వాత కొంతమందికి తలనొప్పి, ముఖం ఎర్రబడటం, చెమట పట్టడం లేదా అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఇది అందరిలోనూ జరగదు. సోడియం.. అజినోమోటోలో సోడియం ఉంటుంది. దీనిని అధిక ఉప్పు ఉన్న ఆహారాలతో తరచుగా తీసుకుంటే, మొత్తం సోడియం తీసుకోవడం పెరుగుతుంది, ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిది కాదు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం.. ప్రాసెస్ చేసిన , ఫాస్ట్ ఫుడ్స్‌లో తరచుగా అజినమోటో ను ఉపయోగిస్తారు. అలాంటి ఆహారాలలో ఉప్పు, నూనె , కేలరీలు కూడా అధికంగా ఉంటాయి, దీనివల్ల బరువు పెరగడం , ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చు. సెన్సిటివిటీ ఉన్నవారికి అసౌకర్యం.. కొంతమందికి అజినమోటో తీసుకుంటే సెన్సిటివిటీ రియాక్షన్ ఉంటుంది అలాంటి వ్యక్తులు అధిక మొత్తంలో తీసుకున్న తర్వాత వికారం, నీరసం, దాహం లేదా తేలికపాటి అసౌకర్యం కలుగుతుంది. ఇలా పదేపదే జరిగితే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. అజినమోటో విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అధిక రక్తపోటు ఉన్న రోగులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారు, రక్తపోటు అధికంగా ఉండే వ్యక్తులు, చిన్న పిల్లలు మొదలైనవారు అజినమోటో విషయంలో జాగ్రత్తగా ఉండాలి. *రూపశ్రీ.

Publish Date: Jul 14, 2026 10:41AM

political-news-img

కడపలో గ్రీన్ సిమెంట్ ప్రాజెక్ట్.. నారా లోకేష్.!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో చారిత్రాత్మక అధ్యాయం మొదలు కానుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కడప జిల్లాలో త్వరలోనే గ్రీన్ సిమెంట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా హింట్ ఇచ్చారు. రాయలసీమ ముఖద్వారమైన కడప జిల్లాలో గ్రీన్ సిమెంట్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆయన సూచన ప్రాయంగా చెప్పారు. కడప అనగానే మైనింగ్, సిమెంట్ పరిశ్రమలు గుర్తుకు వస్తాయి. అయితే లోకేష్ చెప్పన దానిని బట్టి.. ఈ సారి కడపలో సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టని సరికొత్త గ్రీన్ టెక్నాలజీతో సిమెంట్‌ను తయారీకి శ్రీకారం చుట్టబోతున్నారు. సాధారణ సిమెంట్ తయారీ ప్రక్రియతో పోలిస్తే గ్రీన్ సిమెంట్ ఉత్పత్తి వల్ల కార్బన్ ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. భూగోళాన్ని వేడెక్కిస్తున్న గ్లోబల్ వార్మింగ్ సమస్యకు చెక్ పెట్టేలా, పర్యావరణ పరిరక్షణ జరిగేలా.. కడపలో గ్రీన్ సిమెంట్ ప్రాజెక్టును ఆరంభించనున్నారు. ఈ గ్రీన్ సిమెంట్ పర్యావరణ పరిరక్షణతో పాటు, సీమ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. Nara Lokesh, Green Cement AP, Kadapa Green Cement, Andhra Pradesh Industries, Green Technology India, Nara Lokesh X Post

Publish Date: Jul 14, 2026 10:24AM

political-news-img

పవన్ కల్యాణ్ కు మహా సీఎం పరామర్శ.!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌లో భుజానికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. సర్జరీ పూర్తయిన అనంతరం ఆస్పత్రిలో కోలుకుంటున్న పవన్ కల్యాణ్ ను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు కోకిలాబెన్ ఆస్పత్రికి క్యూకడుతున్నారు. అలా జగన్ పరామర్శకు వచ్చిన వారిలో జాతీయ స్థాయి నేతలు కూడా ఉండటం.. దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు దర్పణం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబై వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కోకిలాబెన్ హాస్పిటల్‌కు విచ్చేసి ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. హాస్పిటల్‌కు చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పవన్ కళ్యాణ్‌తో చాలా సేపు భేటీ అయ్యారు. సర్జరీ తర్వాత పవన్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో కూడా మాట్లాడి ఆయన ఆరోగ్యపరిస్థితిని ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య సుహృద్భావ పూరిత వాతావరణంలొ చర్చలు జరిగాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించి రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ చేసిన ఆనాటి ఎన్నికల ప్రచారం, చూపి ప్రభావానికి కృతజ్ఞతగా, ఆయనపై ఉన్న అపారమైన గౌరవంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా హాస్పిటల్‌కు వచ్చి పరామర్శించారు. సర్జరీ నిమిత్తం ముంబై హాస్పిటల్లో చేరిన ఆయనను కలవడానికి కాగా తనను పరామర్శించడానికి వచ్చిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. Pawan Kalyan, Devendra Fadnavis, Pawan Kalyan Surgery, Mumbai Kokilaben Hospital, Chandrababu Naidu, Maharashtra CM Meets Pawan Kalyan

Publish Date: Jul 14, 2026 10:10AM

political-news-img

తమిళనాడు డీవీఏసీ డైరక్టర్ పై బదలీ వేటు.!

తమిళనాడు అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ) డైరెక్టర్‌ అరుణ్ పై విజయ్ సర్కార్ వేటు వేసింది. డీవీఏసీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ. అరుణ్‌పై కే బదిలీ వేటు పడింది. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో టీవీకే విజయం సాధించి విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఎ. అరుణ్‌ను డీవీఏసీ చీఫ్‌గా నియమితులయ్యారు. అయితే.. ఏడీజీపీ ర్యాంక్ అధికారి అయిన అరుణ్ నియామకం తొలి నుంచీ వివాదంగానే మారింది. గతంలో ఆయన చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో అప్పటి అధికార పక్షమైన డీఎంకేకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో టీవీకే సహా పలు ఇతర రాజకీయ పార్టీలు ఆయన వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కూడా అరుణ్ పరిపాలనాపరమైన వివక్ష చూపించారనే ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను పక్కన పెట్టింది. అలాంటి వివాదాస్పద అధికారిని ఏకంగా అవినీతి నిరోధక శాఖాధిపతిగా అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడంపై విజయ్ సర్కార్ పై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అరుణ్ నియామకంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అరుణ్ నియమకంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మద్రాస్ హఐకోర్టు.. అవినీతిని నిరోధించే ఒక కీలక వ్యవస్థకు అధిపతిగా ఉండే వ్యక్తికి సచ్ఛీలమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలని వ్యాఖ్యానించింది. కోర్టు ఇచ్చిన ఈ తీవ్రమైన మొట్టికాయలు, చుట్టుముట్టిన న్యాయపరమైన ఒత్తిళ్లు మరియు ప్రతిపక్షాల నుండి వస్తున్న తీవ్రమైన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి విజయ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీ కె. మణివాసన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎ. అరుణ్‌ను డీవీఏసీ చీఫ్ బాధ్యతల నుండి బదిలీ చేసి, చెన్నైలోని తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పంపించారు. ఆయన స్థానంలో ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ర్యాంక్ అధికారిణి సి. మహేశ్వరి ఐపీఎస్‌ను డీవీఏసీ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో నూతన చీఫ్‌గా నియమించారు. కేవలం 60 రోజుల్లోనే ఒక పవర్‌ఫుల్ విభాగం హెడ్ బదిలీ కావడం విజయ్ ప్రభుత్వ పాలనా శైలికి, కోర్టుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Vijay Government Tamil Nadu, C Maheswari IPS, Madras High Court Verdict, Tamil Nadu Bureaucracy, IPS Transfer News

Publish Date: Jul 14, 2026 9:59AM

political-news-img

తండ్రిలో ఉండే ఈ అలవాట్లు  పిల్లలను బలహీనులను చేస్తాయ్

తండ్రిలో ఉండే ఈ అలవాట్లు పిల్లలను బలహీనులను చేస్తాయ్ పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు, జీవనశైలి వంటివి పిల్లలపై చాలా గట్టి ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు కేవలం వినడం ద్వారానే కాకుండా, తమ చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను గమనించడం ద్వారా కూడా నేర్చుకుంటారు. తండ్రి రోజువారీ అలవాట్లే అతని పిల్లల భవిష్యత్తును పాజిటివ్ గా ఉండాలా లేదా నెగిటివ్ గా ఉండాలా అనే విషయం డిసైడ్ చేస్తాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.. తండ్రి అలవాట్లు పిల్లలను బలహీనంగా కూడా మారుస్తాయి. తండ్రిలో ఉండే ఏ అలవాట్లు పిల్లలను బలహీనులను చేస్తాయో తెలుసుకుంటే.. ప్రతి చిన్న విషయానికి తిట్టడం లేదా కోపగించుకోవడం... ఎప్పుడూ తిట్టడం లేదా గట్టిగా మాట్లాడటం వల్ల పిల్లలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సంకోచించవచ్చు. తండ్రి ఇలా ఉండే పిల్లలు తండ్రికి భయపడతారు, చాలామంది తండ్రి అంటే పిల్లలకు భయం ఉండాలని అనుకుంటారు, కానీ పిల్లలు మనసు విప్పి ఏదైనా మాట్లాడగలిగినప్పుడు, చెప్పగలిగినప్పుడు వారి మనసులో ఉండే ఎన్నో సందేహాలు, దిగులు భయాలు తొలగిపోతాయి. ఏం చేయాలి? పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు ముందు మొత్తం వినాలి, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాని గురించి చెప్పేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి, పిల్లల వ్యక్తిత్వం గురించి కాకుండా, వారి ప్రవర్తన గురించి మాట్లాడాలి. పోలిక.. "చూడు, నీ స్నేహితుడు నీకంటే గొప్పవాడు" చుట్టాలబ్బాయికి నీ కంటే మంచి మార్కులు వచ్చాయి, ఆ పిల్లాడు నీ కంటే చాలా బెటర్.. ఇలాంటి మాటలు చెప్పడం పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఏం చేయాలి? పిల్లలను పోల్చకూడదు, ప్రతి పిల్లవాడిలో విబిన్న ప్రతిభ ఉంటుంది, పిల్లలలో ఉన్న ప్రతిభ ఏంటో గుర్తించి ప్రోత్సహించాలి. చిన్న ప్రయత్నాలను సైతం అభినందించాలి, పోల్చకుండా స్ఫూర్తినివ్వాలి. సమయం కేటాయించకపోవడం.. తీరికలేని కారణంగా, కొన్నిసార్లు పిల్లలతో గడిపే నాణ్యమైన సమయం చాలామంది తండ్రులకు తగ్గిపోతుంది. ఇది ఎంత మాత్రం పిల్లలు భరించలేని విషయం. ఏం చేయాలి? ప్రతిరోజూ మొబైల్ కాకుండా పిల్లలతో కొంత సమయం గడపాలి, కలిసి ఆడుకోవడం, చదవడం లేదా కబుర్లు చెప్పుకోవడం చేయాలి. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉంటుందో వాటిలో పార్టిసిపేట్ చేయాలి. మాట తప్పడం.. తండ్రి పదేపదే తన పిల్లలకు ఇచ్చిన మాటను నెరవేర్చడంలో విఫలమైతే, పిల్లల నమ్మకం బలహీనపడుతుంది. ఏం చేయాలి? తండ్రి నెరవేర్చగల ప్రామిస్ లను మాత్రమే పిల్లలకు చేయాలి. . ప్రణాళికలు మారితే, కారణం వివరించాలి. నిజాయితీకి, నమ్మకానికి ఆదర్శంగా ఉండాలి. పిల్లల ఎమోషన్స్ పట్టించుకోకపోవడం.. పిల్లలు ఏడుస్తున్నప్పుడు, బాధపడినప్పుడు, అలిగినప్పుడు వారిని పట్టించుకోవాలి. . లేకపోతే వారు మానసికంగా చాలా దెబ్బతింటారు. తమకు ప్రాముఖ్యత లేదని అనుకుంటారు. ఏం చేయాలి? పిల్లల ఎమోషన్స్ ను గుర్తించాలి, వారి బాధను, వారు చెప్పే విషయాలను ఓపికగా వినాలి. సమస్యకు కలిసి పరిష్కారం కనుగొందామని వారిని ఊరడించాలి. చెడు ప్రవర్తన.. పిల్లలు తరచుగా ఇంట్లో చూసే వాటి నుండే నేర్చుకుంటారు. ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? ఏవి మరచిపోవాలి, ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు.. అందరితో మర్యాదగా ఎలా ఉండాలి? ఇలాంటి విషయాలు పిల్లలకు వివరించాలి. సామాజికంగా ఎలా ఉండాలో తెలియజెప్పాలి. నిర్ణయాలు.. పిల్లలకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం ఎప్పుడూ లభించకపోతే, వారి ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడానికి ఆటంకం కలగుతుంది. ఏం చేయాలి? వయసుకు తగిన చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి, నిర్ణయాలు తీసుకునే ముందు ఏం ఆలోచించాలో పిల్లలకు వివరించాలి. చదువు మాత్రమే కాదు.. మంచి మార్కులు ముఖ్యమే కావచ్చు, కానీ పిల్లల పూర్తిగా అభివృద్ధి చెందడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. ఏం చేయాలి? క్రీడలు, కళలు , సృజనాత్మక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫలితాన్ని మాత్రమే కాకుండా, చేసిన ప్రయత్నాన్ని కూడా అభినందించాలి. నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని పిల్లలకు తెలిజెప్పాలి. *రూపశ్రీ.

Publish Date: Jul 14, 2026 9:53AM

political-news-img

హర్మూజ్ లో ఇరాన్ దాడులు.. ఇండియన్ మృతి.!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ముఖ్యంగా హర్మూజ్ ఒక యుద్ధ భూమిగా మారింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. యూఏఈ కి చెందిన రెండు చమురు నౌకలపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఆరుగురు ఇండియన్స్ కాగా, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. కాగా ఈ దాడి పట్ల ప్రపంచ దేశాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఒమన్ ప్రాంతీయ జలాల పరిధిలో మొంబాసా , అల్ బహియా అనే రెండు యూఏఈ చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను, నౌకాయాన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ దాడికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది.ఈ క్షిపణి దాడి జరిగిన కొద్దిసేపటికే రంగంలోకి దిగిన అమెరికా సేనలు ఇరాన్‌పై వైమానిక దాడులను ఉధృతం చేశాయి. ఇరాన్ దాడుల సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా దెబ్బతీసేందుకు తాము సరికొత్త ఆపరేషన్ ప్రారంభించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకుని, దిగ్బంధాన్ని కఠినతరం చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణ బాధ్యతను అమెరికా చూసుకుంటున్నందున, దానికి ప్రతిఫలంగా ఆయా నౌకల నుంచి ప్రొటెక్షన్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు ట్రంప్ చెప్పారు.ఈ ఉద్రిక్తతల ప్రభావం గ్లోబల్ మార్కెట్‌పై చూపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర7.8శాతం పెరిగి.. బ్యారెల్‌కు 81.92 డాలర్లకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరింత పెరిగి ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. Iran missile attack Hormuz, UAE oil tankers attacked, Indian crew member killed, US Iran tensions 2026, Brent crude oil price hike, Strait of Hormuz blockade

Publish Date: Jul 14, 2026 9:39AM

MOVIE NEWS