• Tithi - Mar, 19 2024

    19.03.2024 మంగళవారం స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గుణ మాసం
    తిథి : తిధి:దశమి: తె.03.03 వరకు
    నక్షత్రం : నక్షత్రం: పునర్వాసు :రా. 10.57 వరకు
    వర్జ్యం : వర్జ్యం:ఉ.10.23-12.04వరకు
    దుర్ముహూర్తం : దుర్ముహూర్తం:ఉ 08.31-09.19 వరకు
    రాహుకాలం : రాహుకాలం: మ 03.00-04.30 వరకు

  • Mar, 2024 Important Days

    8. మహా శివరాత్రి
    11. చంద్రదర్శనం
    23. శనిత్రయోదశి
    24. హోళి
    29. గుడ్ ఫ్రైడే
    31. ఈస్టర్ సన్‌డే

Latest Articles

​రాధా కృష్ణుల గురించి ఎన్నెన్నో కథలు ఉన్నాయి. వీరి ప్రేమ అజరామం. ప్రేమకు అసలైన నిర్వచనంగా రాధాకృష్ణుల ప్రేమను అభివర్ణిస్తారు. సాధారణ జనుల పట్ల ఆ కృష్ణుడికి ఎనలేని ప్రేమ, ఆదరభావం ఉంటాయి. అలంటిది కృష్ణుడు కూడా ఎంతగానో ప్రేమించిన రాధ అంటే కృష్ణుడికి ఎంతో ప్రత్యేకం. రాధాదేవిని పరీక్షించాలన్న ఆలోచన ఒకసారి మాధవుడికి కలిగింది. వెంటనే ఆయన ఒక గోపస్త్రీ వేషం ధరించి రాధాదేవిని కలుసుకున్నాడు.

 More

పరబ్రహ్మమూ అతి సూక్ష్మము అంటే పరమాణుస్వరూపము. మామూలు కంటికి కనపడదు. అలాగే ఈ శరీరం కూడా స్థూల శరీరము, సూక్ష్మశరీరము అని రెండుగా ఉంటాయి. జాగ్రదావస్థలో స్థూల శరీరము, స్వప్పావస్థలో సూక్ష్మశరీరము ప్రవర్తిస్తుంటాయి. ఈ సూక్ష్మశరీరము నుండి వాసనలను పూర్తిగా నాశనం చేస్తే అదే పరమాత్మ అవుతుంది. దీనిని అనుభవించవలసినదే కాని కనపడదు. ఈ రెండింటిలోనూ పరబ్రహ్మ స్వరూపము నిక్షిప్తమై ఉంది.

 More

Videos

  • Enduku - Emiti

    ​శ్రీ విష్ణు సహస్రనామం విష్ణువు యొక్క వేయి నామాల వర్ణన. విష్ణుసహస్రనామాన్ని స్త్రీలు పారాయణం చేయకూడదని కొందరు పండితులు అంటున్నారు. దీనికి కారణం ఏమిటి? స్త్రీలు విష్ణు సహస్రనామం ఎందుకు పఠించకూడదు....

     More

    మన చుట్టూ అనేక శివాలయాలు ఉన్నప్పటికీ..కొన్ని ఆలయాలు ప్రత్యేక రహస్యాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ఈ 5 శివాలయాలు ఉన్నాయి. సైంటిస్టులకు సవాల్ విసురుతున్న ఈ 5 శివాలయాల రహస్యం ఏంటో తెలుసుకుందాం.

     More
  • Vaastu

    దేవాలయాల్లోని విగ్రహాల పరిమాణం, ఇంట్లోని విగ్రహాలు వేర్వేరుగా ఉంటాయి. దేవాలయాలలో.. దేవుని గదిలో దేవుని విగ్రహాలను ప్రతిష్టించడానికి దాని స్వంత నియమాలు ఉన్నాయి. దేవుడి గదిలో పెట్టే విగ్రహాల సైజు పెద్దగా ఉండకూడదని చెబుతారు. వాటిని చాలా సింపుల్ గా పూజించడానికి దేవుడి గదిలో చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే ఉంచుతారు.

     More

    సనాతన ధర్మంలో నెమలి ఈకను చాలా పవిత్రంగా భావిస్తారు. నెమలి ఈకలను చూడగానే మనసులో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. శ్రీకృష్ణుడు నెమలి ఈకలను తలపై ధరిస్తాడంటే దీనికి ఎంత ప్రాదాన్యత, పవిత్రత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నెమలి ఈక ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది.  కష్టాలు తీరిపోతాయని చెబుతారు. నిజంగానే నెమలి ఈక సమస్యలను పరిష్కరిస్తుందా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుంటే..

     More
  • Aacharaalu

    మాఘమాసంలోని అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ రోజున త్రివేణి సంగమం, గంగా లేదా ఇతర పుణ్యనదులలో స్నానమాచరించి దానధర్మాలు చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈ సంవత్సరం మౌని అమావాస్య ఫిబ్రవరి 9 న వస్తుంది. హిందూ విశ్వాసాల ప్రకారం, అమావాస్య రోజున ఉపవాసం పాటించడం వల్ల పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు.  ఇది మాత్రమే కాకుండా ఉపవాసం ఉండే వారి  లక్ష్యాలన్నీ నెరవేరాలని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు.  మరొక విశేషం ఏమిటంటే.. ఈ మౌని అమావాస్య  70ఏళ్ల తరువాత వస్తోంది. ఈ కారణంగా  అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయని  జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  మౌని అమావాస్యరోజున  స్నానం,  దానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని ఫలితాలు ఏంటి? తెలుసుకుంటే..

     More

      సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. సంక్రాంతి రోజు సూర్యుడు మఖర రాశిలోకి మారతాడు. ఈ కారణంగా దీన్ని మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు. సూర్యుడిని ప్రత్యక్ష దైవం అంటారు. సంక్రాంతి రోజు సూర్యుడి ఆరాధన గురించి, ఆ సూర్య భగవానుడి గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కింది విధంగా ప్రవచించారు..

     More

​జ్యోతిషశాస్త్ర విశ్వాసాల ప్రకారం శనిని కర్మ ప్రదాత అంటారు.  వ్యక్తులు  చేసే పనులను బట్టి శని దేవుడు ఫలితాలు ఇస్తాడు. అందుకే శనిదేవుడు  న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఎక్కడ చూసినా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనె దీపారాధన చేయడం చూస్తుంటాం. ఇక శని దోషం, జీవితంలో సమస్యలు ఉన్న వారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడంలో ముందుంటారు.  అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన, అభిషేకం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? హిందూ మత పురాణాలలో దీని గురించి ఏముంది తెలుసుకుంటే..

 More

​సనాతన ధర్మంలో దేవతల ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన కూడా ముఖ్యమైనది. ప్రకృతిలో అనేక మొక్కలు,  చెట్లు ఉన్నాయి. వాటిని భగవంతుని రూపాలుగా పూజిస్తారు. అలాంటి పవిత్ర వృక్షాలలో రావిచెట్టు కూడా ఒకటిగా చెప్పవచ్చు. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు రావి ఆకుల్లో కాస్మిక్ శక్తి ఉంటుందని సైన్స్ కూడా చెబుతోంది....

 More

​గ్రుడ్డివాని వెంట వెళ్ళే గ్రుడ్డివారివలె ప్రజలందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారములలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే ప్రజలు వ్యవహరిస్తున్నారు. ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి, తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభిస్తుందనే పేరాశతో, శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా - ఎరను చూసి దానికొరకు గాలములో చిక్కుకొంటున్న చేపలాగా ఉంది. అలాగాక ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖం ఏముంది..

 More

​సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు  "దుర్మార్గ దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అవహరించాడు. రాముడి కోదండ  పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు" అన్నాడు...

 More

​ఐదు మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము), అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియములు, మనస్సు, ఐదు తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము), కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, అందులో ఉన్న చేతనా శక్తి, ధైర్యము, ఇవన్నీ కలిస్తే దానిని క్షేత్రము అని అంటారు.

 More

​హిందూ పురాణాలలో విష్ణుమూర్తికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. విష్ణుమూర్తికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి. వాటినే కేశవనామాలు అని అంటారు. అయితే విష్ణు సహస్ర నామాల్లా, లలితా సహస్రనామాల్లా ఈ కేశవనామాలు పెద్దగా లేకుండా కేవలం ఇరవై నాలుగు మాత్రమే ఎందుకు ఉన్నాయి?? కాలచక్రంలో రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా!! ఈ కాలచక్రానికి, అన్నింటిలోనూ ఒక భాగంగా ఉండే గణితానికి ఏదైనా సంబంధం ఉందా??.

 More